17 డిసెం, 2011


ఏ పరిమేష్ఠి కుంచె.., రచియించును..
లోక మనూహ్య సుందరం..
బా  పరమేష్ఠి  సర్వనిగమౌఘ  విధిజ్ఞుడు..
నీదు  పాల  ని..
ర్వా  సిత  పాప..!  తాపృధుక  భావము వాడట..!
యెవ్వరింక.., దే..
వా ..! పరిపక్వ బుధ్ధులు..!  ఖగాంగ
జగజ్జన  జన్మ  తారణా..!
"శ్రీనివాస ప్రబంధము" నుండీ..
 
ఇటీవల ఎక్కడో చదివాను..విశ్వనాధవారిని కలవడానికి ఎవరో వచ్చారట..

విశ్వనాధ వారిని కలవాలి అన్నారట..
కూర్చోండి .. అనేసి ఎవరో స్త్రీ లోపలికెళ్ళి పోయిందట..


కాసేపు ఎదురుచూసినా..  లోపలినుంచీ అలికిడి లేకపోయేసరికి ఆవిడ నెమ్మదిగా లోనకు నాలుగడుగులేసిందట..

అక్కడ ఓ యన మామిడి ముక్కలు ఊరగాయకు రెడీ చేస్తున్నారట..
ఆయన ఏం కావాలి అన్నట్లు చూసారు..

గుంటూరు శేషేంద్ర శర్మ
ఆమె మళ్ళీ విశ్వనాధవారిని కలవాలి అని సంశయిస్తూ అడిగింది..

నేనే విశ్వనాధను చెప్పండి అన్నారట..
ఇవన్నీ వాళ్ళ నిజజీవితంలోని విషయాలు..

గొప్పవారైనవారు నిజజీవితంలో ఎలా వుంటారు అని అందరికీ చిన్న కుతూహలం..

నాగేశ్వరరా రావ్ సూరిబాబు రామతిలకం..
విశ్వనాధవారు మా ఇంటికి వచ్చి అయ్యతో రామాయణ చర్చలు చేసేవారట..

అమ్మతో వంటింట్లో పీటవేసుకుని కూర్చుని కబుర్లు చెప్పేవారట..

 
అమ్మ చెప్పేది.. 


సూరిబాబు ..,జమ్మల మడక మాధవరాయ శర్మ.., గుంటూరు శేషేంద్ర శర్మ..,గడియారం శేషశర్మ.. మల్లంపల్లి సోమశేఖర శర్మ..


మూర్తీభవించిన ఆంధ్రతేజం శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఆంధ్ర చారిత్రక పరిశోధకులలో, తొలితరం వారిలో అగ్రగణ్యులు,పూజనీయులు.

గడియారం ఆయనకూ అయ్యకు   యేవో వివాదాలున్నా అవి అక్కడి వరకే..
 
పువ్వుల సూరిబాబు ఆయనను కంచుకంఠం సూరిబాబు అనేవారుట..ఆయన సింగరూ డ్రామా ఆర్టిస్టు కూడా..1946 లో మైసూర్ మహరాజా వారి దర్బారులో ఆయన నాటకం వేసారుట కూడా.. 

ఆయన ఆహ్వానించగా అయ్య మా రెండవ అక్కయ్య తరులత (అప్పటికి ఏడెనిమిదేళ్ళ పిల్ల..) శ్రీ కృష్ణ తులాభారం నారద సంసారము అనే నాటకాకి వెళ్ళారు.
కర్నాటకలోని గదగ్ సంస్ఠానానికి వెళ్ళి పండిత గోష్టిలో అయ్య పాల్గొన్నారు..
 
సూరిబాబు బెజవాడ రాజరత్నం బలిజేపల్లి..
అప్పుడు బంగారు వెల చాలా తక్కువ..అయిదో పదో బంగారు కాసులు ఇచ్చి శాలువా కప్పే వారుట..

అయ్య నిజ జీవితంలో కూడా ఎప్పుడూ కావ్యలోకంలో విహరిస్తున్నట్లు ఉండేవారు..

అమ్మ అయ్యకు అన్నం వడ్డించి విసనకర్రతో అయ్యకు విసురుతూ కూర్చునేది..

అయ్యకోసం గడ్డపెరుగు తీసిఉంచేది అమ్మ.
విశ్వనాధ

ఎక్కడికైనా సభకో సన్మానానికో వెళ్ళాలంటే కూడా.. అయ్యకు తలకు నూనె పెట్టాలి ఎవరో ఒకరు..

ఇస్త్రీ బట్టలు పంచె జుబ్బా తీసి రెడీగా పెట్టాలి..బయట చెప్పులు కూడా అయ్యకు సిధ్ధంగా వుంచాలి..

బయట కారు ఆగి వుంటుంది.. అయ్యను తీసుకు వెళ్ళడానికి వచ్చిన వారితో అయ్య ఏవో విషయాలు మాట్లాడుతూ ..పంచె జుబ్బా వేసుకుని ..తలకు నూనె పెట్తించుకుని ..తల దువ్వుకుని.. చెప్పులు వేసుకుని వెళ్ళేవారు..

ఇలాగే ప్రయాణాల్లో కూడా.. ఏదో పుస్తకం చదువుతూ ..డబ్బులు చాలాసార్లు అయ్య పోగొట్టుకున్నారట..

అందుకే అమ్మ అయ్యకు బనియను కుట్టించి దానికి ముందుకు జేబు వుండేవిధంగా ఏర్పాటుచేసింది..

అప్పటినుంచీ కొంత పర్లేదు..
ఆ బనియనుకు దొంగల బనియను అని పిలిచేవాళ్ళం తమాషాగా..