![]()  | 
మా ఇంట మా అమ్మతో మూడు వందలకు పైగా పట్టాభిషేకాలు మహదానందంగా అందుకున్న రవివర్మ రామయ్య.  | 
మా ఇంటి వాకిళ్ళు 
ఎప్పుడూ మూసి వుండేవికావు..
ఎప్పుడూ మూసి వుండేవికావు..
ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చే వారే..
ఆడవాళ్ళు
ఇంట్లో పనీ పాటలు ముగించుకొని
మా ఇంటికి వచ్చి
ఏదో స్తోత్రాలు
చెప్పుకుంటూ
దేవుని రూము ఎదురుగా కూచునే వారు.
లోపల అమ్మ 
రామాయణ పారాయణ చేస్తూ వుంటుంది..
రామాయణ పారాయణ చేస్తూ వుంటుంది..
నిశ్శబ్దంగా అలా కూచునేవారు..
తలుపుకు ఇటువైపు జ్ఞానమ్మత్త..
 అటువైపు వార్తాంబ అత్త ..
 పైగా 
వాళ్ళిద్దరూ మడి కట్టుకుని వుండేవాళ్ళు.
వాళ్ళిద్దరూ మడి కట్టుకుని వుండేవాళ్ళు.
వాళ్ళని యెవరూ తాకకూడదు..
ఏయ్ మెల్లిగా రాలేవూ.. 
అని నన్ను గదిరే వాళ్ళు..
అని నన్ను గదిరే వాళ్ళు..
నాకవేవీ పట్టేవి కావు.. 
అమ్మా ..అమ్మా.. 
అని అమ్మను ఏదో..
అడగడానికో.. చెప్పడానికో ..
రావటమూ అంతే స్పీడుగా వెళ్ళడమూ..
అని అమ్మను ఏదో..
అడగడానికో.. చెప్పడానికో ..
రావటమూ అంతే స్పీడుగా వెళ్ళడమూ..
అమ్మ మెల్లగా నవ్వుకొనేది..
అయ్యకు అన్నం పెట్టడానికో ..
ఇంక దేనికో ..
అమ్మ బ్రేక్ ఇచ్చినప్పుడు..
అమ్మ కాళ్ళకు నమస్కరించుకొని వెళ్ళేవాళ్ళు. .
 
అమ్మ కాళ్ళకు నమస్కరించుకొని వెళ్ళేవాళ్ళు. .
అందరూ..
  అలా నమస్కరించడం ..
అమ్మకు ఇష్టం వుండేది కాదు..
అయ్యకు కూడా అంతే ..
అయ్యకు కూడా అంతే ..
కానీ ..
వాళ్ళు వినేవారు కారు.
ఇంక ..
ఊరికి వెళుతున్నప్పుడు ..
పనిపై వెళుతున్నప్పుడు ..
పరీక్షలకు వెళుతున్నప్పుడు.. 
మా ఇంటి చుట్టుపక్కలవారు ..
అందరూ వచ్చి ..
అయ్యకో అమ్మకో ..
నమస్కరించుకొని వెళ్ళేవారు..
 
అందరూ వట్టి చేతులతో వచ్చేవారు కారు..
పండో ఫలమో పట్టుకొచ్చేవారు. 
అమ్మ ..
అమ్మ ..
అదే విధంగా ..
దోసిళ్ళతో పండ్లూ ఫలాలూ ..
అందరికీ పంచేసేది..


