12 ఏప్రి, 2014

యోగరతో వా భోగరతోవా




నారాయణాచార్యులు ఈ యుగానికి మహా భక్త కవి 
తాను భక్తి సాహిత్యంతో తరించి పఠితలను తరింపజేసాడు
నారాయణాచార్యులు మనసాటి మానవుడే
లోపాలు లేని వాడు కాడు..
 

కానీ..
ఆ లోపాలను అరసి..
ఎప్పటికప్పుడు భక్త్యావేదనలో తపించి.. లోపాలను దహించుకుంటూ..
శ్యామ శబలం చేసిన బంగారు లాగ పరిశుధ్ధుడైనాడు.
తన రచనలతో లక్షలాది ప్రజలను తరింపజేశారు కనుక
ఉత్తమగతులు పొంది ఉంటారు
సందేహం లేదు..
 

శ్రీనాధుడు
"దివిజ కవి వరుగుండియల్ దిగ్గురనగ నరుగుచున్నాడు శ్రీనాధుడమరపురికి ''

అని చెప్పుకున్నాడు అవసానకాలంలో..
 

''ఒకనాడు కృష్ణదేవరాయ సుమ శేఖ
రంబైన యభయహస్తంబు మాది
ఒకనాడు గీర్దేవతా కమ్ర కంకణ
స్వనమైన మాధురీ ప్రతిభమాది
ఒకనాడు రమానుజ కుశాగ్ర బుధ్ధికే
చదువు నేర్చినది వంశమ్ము మాది
ఒకనాటి సకల శోభకు తానకంబైన
దండిపురంబు పెను   గొండమాది
దల్లి దండ్రుల మేధ విద్యా నిషధ్య
పాండితీ శోభ పదునాల్గు భాషలందు
బ్రదుకునకు బడిపంతులు భాగ్యములకు
చీడబట్టిన రాయలసీమ మాది..''
అని చెప్పుకున్నాడు..
 

ఇది స్వాతిశయం కాదు..
యధార్థం..
ఇంతటి వానిని పరలోకంలోనూ 'శ్రియః పతి' 

కరుణా కటాక్షంతో అనుగ్రహిస్తాడు.
-తిరుమల రామచంద్ర.

మార్చ్ 28 న పుట్టపర్తి శతజయంతి సందర్భంగా HMTV లో ప్రసారమైన కార్యక్రమం

మార్చ్ 28 న పుట్టపర్తి శతజయంతి సందర్భంగా HMTV లో ప్రసారమైన కార్యక్రమం