29 జులై, 2013

విఠల్ భాయ్ పటేల్ విందు కి పిలచిన వేళ ..


విఠల్ భాయ్ పటేల్
మన భారతీయ శాఖాహార వంటలలో
ఆంధ్ర,కేరళ,తమిళనాడు,కర్ణాటక
రాష్ట్రాలలోనే భిన్న భిన్న రుచులు

కేరళీయులు కొబ్బెరతోనే వంటలను మొంచెత్తుతారు
కన్నడిగులు తీపిని ప్రతి పదార్థంలో చేరుస్తారు
తమిళులకు సాంబార్ తోటే దినం గడుస్తుంది

ఇక ఉత్తర దేశం మనకు పూర్తి వ్యతిరేకం
పూరీలు రొట్టెలు వాళ్ళకు ప్రధానం
అన్నం అంతగా ఇష్టపడరు

ఇక స్వీట్లు రకరకాలు
పెరుగు పాలు నిత్యజీవితంలో భాగం
పచ్చి కూరగాయల సలాడ్ లేకుండా 
వారి భోజనం ముగియదు..

మనం బియ్యం పప్పులకోసం పెట్టినంత డబ్బు వాళ్ళు
స్వఛ్చమైన నీళ్ళు కలపని పాలకోసం పెడతారు
చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకూ 
రోజూ ఒక పెద్ద గ్లాసెడు పాలు తాగటం వారికిష్టం


ఉక్కు మనిషి 
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సోదరుడు
విఠల్ భాయ్ పటేల్
పుట్టపర్తి నైనిటాల్ సభకు వెళ్ళినప్పుడు 
పుట్టపర్తి తదితరులను తన ఇంటికి విందు కి పిలిచాడట.

పుట్టపర్తి ఏనాడూ రుచులకు ప్రాధాన్య మివ్వలేదు
ఆకలి వేళకు ఏదో ఒకటి
అయితే వైష్ణవులకు పరమ ప్రీతి పాత్రమైన పులిహోరపై కొంత మక్కువ చూపేవారు అదీ వయసైన తరువాత 


యవ్వనంలో అంతా 
ఎన్నో కోట్ల జపం చేసాను 
నాకు ఆధ్యాత్మిక పరమైన అనుభూతులు 
ఎందుకు కలగటం లేదు..?
అని తపించి..

 నిస్సంగులైన సాధువులకు ఆలవాలమైన 
హిమాలయ పర్వత సానువులపై 
తనకు దారి చూపే  వారి కోసం వెదకిన మనిషి 
రుచులకోసం అర్రులు చాస్తాడా..?

అక్కడి సాధువులకు దొరికితే భోజనం 
లేకపోతే గాలే తిండి

చాలామంది దిగంబరులుగానే వుంటారు.. 


ఆనాటి పుట్టపర్తి వ్యక్తిత్వమూ
దృష్టీ
అతను నడచిన దారీ
ఎంతో మంది గొప్పవాళ్ళను ఆకర్షించింది
అందుకే వల్లభ భాయి పటేల్
నెహ్రూ
గాంధీజి
ఇంకా ఎంతో మంది పుట్టపర్తిని హిమాలయ శిఖరం అన్నారు
సరే
సర్దార్ వల్లభ భాయ్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ వారింటికి భోజనానికి పిలిచారు
అక్కడేం జరిగింది
పుట్టపర్తి మాటల్లోనే వినండి.. 
ఈ సంఘటన 
నైనిటాల్ లో మన పుట్టపర్తి శివతాండవ గానం చేయడానికి వెళ్ళినప్పుడు జరిగింది.. 
నెహ్రూ గారు పుట్టపర్తి గురించి ఏమన్నారో 
మరోసారి మాట్లాడుకుందాం.. 

"ఈ పటేల్ అన్న
విఠల్ భాయ్ పటేల్ వైస్రాయ్ గా ఉన్నప్పుడు 
రాజీనామా చేసినాడు కదా..
ఆయన అసెంబ్లీ నుంచీ..
నైనిటాల్ కు పోయినప్పుడు ఆయనింటికి భోజనానికి పిలిచినాడు
తిన్న పదార్థాలలో ఒక్క పదార్థం అర్థమైవుంటే ఒట్టు
ఇంత పెద్ద ప్లేటు పెట్టినారు
చుట్టూరా గిన్నెలు పెట్టినారు
కొన్ని పుల్లవి,తీపివి,..
ఒక్కటిమాత్రం నాకర్థమైంది
పచ్చి ఎర్రగడ్డలు తరిగి ఉప్పేసి పెట్టినారు
తరువాత ముంత మామిడి పప్పు..
ఆయన మీమాంసా శాస్త్రంలో చాలా గొప్పవాడు

భోజనం ఏమోగానీ ఆయన చదువుకు దండంపెట్టి వచ్చా.. "


27 జులై, 2013

తాన్‌సేన్




మియాఁ తాన్‌సేన్

హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో 

ఘనమైన చరిత గలవాడు. 

ప్రముఖ వాగ్గేయకారుడు. 

మధ్య ఆసియా కు చెందిన 

రబాబ్ 

అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. 

మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. 

బాల్యం పేరు 'రమ్తాను పాండే',

అక్బర్ ఇతన్ని 


మియాఁ (మహా పండితుడు) 


అనే బిరుదునిచ్చి గౌరవించాడు


తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే 


వర్షం పడేదని  చెపుతారు.

 సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది. 

ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్ లలో 

ఇక్కడ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. 

ఇండియా లోని గొప్ప సంగీతకారులు


 దీనిలో పాల్గొంటారు.


1955 లో పుట్టపర్తి వ్రాసిన రాయల నీతి కథలలోని 

మరొక వ్యాసమిది


ఇది తాన్ సేన్ సమాధి. 

ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు. 




















25 జులై, 2013

పుట్టపర్తి వర్ణించిన విశ్వనాధ





ఇరవై తొమ్మిదేళ్ళ వ్యక్తి
విశ్వనాధ పై అద్భుత వ్యాసం వ్రాసాడు
అప్పటికి విశ్వనాధ నలభై తొమ్మిదేళ్ళ వారు..
విశ్వనాధ ఎంతగా ఆనందపడ్డారంటే
అతన్ని అభినందించడానికి స్వయంగా కదలి వచ్చారు
ఆనాటి నుంచీ ఈనాటి వరకూ
విశ్వనాధ పాండితిని వినిపించే 
ఇంకొక పదునైన వాణి వినరాలేదు
అది విశ్వనాధ వారే స్వయంగా చెప్పిన మాట
ఆయనే మన పుట్టపర్తి .. 

తన్ను తాను నిరూపించుకోవటానికి 
పెద్దలచే వీడు మా సరి వాడు
లేదా మాకంటే అధికుడు అనిపించుకోవటానికి 
కొంత యుధ్ధం తప్పదు మరి..


విశ్వనాధ పుట్టపర్తి గురించి 

ఏవో చెబుతుంటారు కానీ. 


తరువాత దాన్ని ఇద్దరూ పట్టించుకోలేదు.. 
పైగా పుట్టపర్తి విశ్వనాధ మూర్తిమత్వం గురించి 
పరమాద్భుతంగా భారతికి వ్రాసారు

సాహితీ ప్రపంచంలో ఈనాటికీ 
ఈ వ్యాసం ఎంతో విలువ గలిగిందని అంటారు..

ఇందులో విశ్వనాధ వారి గురించి పుట్టపర్తి 
ఇతడాంధ్ర మందమాపోశనమే పట్టినాడు
నన్నయ నుపాసించినాడు
తిక్కనను సేమమడిగినాడు
శ్రీనాధునితో చేయి కలిపినాడు
పోతనను మ్రొక్కికొన్నాడు
రాయలనాటి వాఙ్మయము చదివినాడు
ఆముక్త మాల్యదనామోదించి తెనాలిరాముని వియ్యమందినాడు

అంటారు..

అంతేనా విశ్వనాధను విమర్శించినవారికి
అరివీరభయంకరుడై బదులొసగినాడు పుట్టపర్తి..


ఇంకొక సంఘటన.. 
1953 లో ఆలంపురం లో జరిగిన తెలుగు సభలలో 
"తెలుగు కన్నడముల చుట్టరికము "
పంపని భారతం ఛాయలు 
నన్నయ్య భారతం లో వున్నాయని 
పుట్టపర్తి వ్యాసంతో వెళ్ళారు..

పెద్ద గొడవ జరిగింది
అందరూ విరుచుకు పడ్డారు 
పుట్టపర్తిని 
మారువేషంలో వున్న కన్నడవాడని 
కూడా దూషించారట

సర్వేపల్లి రాధకృష్ణన్ గారు
అందరినీ సావధానంగా కూర్చుని ప్రశాంతంగా 

వినమని సభికులను అర్థించారట.. 


ఆనాటి సభకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులు
ఆ సన్నివేశంలో విశ్వనాధ
నేను కన్నడము నేర్చుకొని పంప భారతం చదివి 
నీ వాదానికి జవాబు చెబుతాను అన్నారట.. 


సేకరణ పుట్టపర్తి అభిమాని శ్రీ రామావఝుల శ్రీశైలం 

చిన్న చిన్న అక్షరాలు ఇబ్బంది పెడితే
క్రింద zoom చేసిన వ్యాసభాగలు తేలికగా చదవవచ్చు