25 సెప్టెం, 2012

పింగళి సూరన్న 'సభంగ శ్లేష'








పదహారవ శ తాబ్దానికి చెందిన సూరన
అష్టదిగ్గజాలలో ఒకడు
కృష్ణదేవరాయల 
భువనవిజయమనే మణిమాలలో 
ఒక అనర్ఘ రత్నమై భాసిల్లాడు.

రాఘవపాండవీయం  
శ్లేషకవిత్వంతో నిండి 
పదము పదము వెనకాపాఠకుడి ఆలోచనలకు పదును పెడుతూ పరుగెడుతుంది.
రామాయణ కధకూ 
భాగవత కథకూ ఒకేసారి అన్వయిస్తూ సాగుతుంది 

6వ శతాబ్దము మధ్యభాగములో 
పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము 
దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి 
నవలగా భావిస్తారు. 
కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు 
ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.







"సుబల తనయ, గుణమహిమన్
ప్రబలి తనకు దార ధర్మ పాలన లీలన్
సొబగొంది వన్నెదేగా
విబుధస్తుతుడవ్విభుండు వెలసెన్ ధరణిన్"
 
రెండర్థాలతో వుండే 
ఒక పద్యాన్ని చెప్పడమే చాల కష్టం 
అట్లా కావ్యమంతా నిర్మిస్తే 
కవులు ఓహో అనరా 
అంటాడు పింగళి సూరన్న
రామ కథలు జోడించి 
రాఘవ పాండవీయాన్ని రచించాడు 

ఆ కావ్యం చూస్తే 
సూరన అన్నమాట 
అక్షరాలా చెల్లించుకున్నాడా అనిపిస్తుంది 
తరువాత ఆయన పైన కసి పెట్టుకొని 
యెందరో ద్వర్థి కావ్యాలు వ్రాసినారు 

ముఖ్యంగా..
సమకాలికుడూ.. 
శ్లేషరచనా చక్రవర్తి..
 అయిన రామరాజ భూషణుడు 
"హరిశ్చంద్ర నలోపఖ్యానం" వ్రాసాడు 

అందులో అతడు పడిన పాట్లు చూస్తే 
"అయ్యో..
 ఎందుకింత శ్రమపడడం..!"
 అనిపిస్తుంది 
పింగళి సూరన్న కంటే 
శబ్ద భాండాగారం రామరాజ భూషణుడికి 
చాలా దండిగా ఉండేది 

వసుచరిత్రలో 
ఒక్కొక్క పద్యంలో రెండు మూడర్థాలు 
యెంతో రమణీయంగా చెబుతాడు 

ఆంధ్ర సంస్కృతాలేకాక 
ఆ శ్లేష రచనలో 
పింగళి సూరన్నతో సాటిరాలేక పోయినాడు 
ద్వర్థి కావ్య రచనలో 
పింగళి సూరన్నతో సాటి రాలేక పోయినాడు 

అతడు సర్వ సులభంగా 
ఊపిరి వదలినట్లుగా రెండర్థాలు చెబుతాడు 
దీనికిపై కందపద్యం ఒక ఉదాహరణం 

అందులో..
ధృతరాష్ట్రుణ్ణీ దశరధుణ్ణీ వర్ణిస్తున్నాడు 
'సుబలతనయ..'
 అంటే గాంధారి 
ఆమె 'నయగుణ మహిమతో ..'
అనగా పతివ్రతా ధర్మంతో 
దానధర్మ పాలన లీలను చెల్లిస్తూ వున్నదట 

'విబుధస్తుతుడు'
 అంటే పండితులచే పొగడబడినవాడని అర్థం 
 దీనితో భారతార్థం ముగుస్తుంది. 

ఇక రామాయణార్థం చూద్దాం ..
ఆయనకున్న 'సుబలత'
 అనగా బల ప్రకర్షణము 
'నయగుణ మహిమతో '
ప్రబలిందట ..
బలాన్ని ఇష్టమొచ్చినట్లు కాకుండా 
వివేచనతో వినియోగించే వాడని అర్థం. 

ఈ గుణము ఎందుకు ఉపయోగపడింది.. ??
ఉదారమైన ధర్మ పాలనకు ఉపయోగపడింది 
రాజ్జాన్ని ధర్మము తప్పకుండా 
పరిపాలించినాడన్న మాట. 
విబుధులంటే దేవతలు 
దశరధుడు వారి యుధ్ధాలలో 
సహాయకుడుగా వెళ్ళినవాడు 
ఇది రామాయణార్థం 

ఆయన వాడే పదాలు చిన్న చిన్న తునకలై 
రెండో అర్థాన్ని అతి సులభంగా చిత్రిస్తాయి. 
"సుబల తనయ గుణమహిమన్"
 అతి సూక్ష్మమైన మలుపు 
అలాగే దారధర్మము ఉదారధర్మము 
ఇలాగా ద్వర్థి కావ్యం చెప్పినవాడు 
పింగళి సూరన్న ఒక్కడే 
ఇట్టిదానినే 'సభంగ శ్లేష' అంటారు
 

15.10.1982 ఆంధ్రజ్యోతి వార పత్రిక