11 జులై, 2014

ఉలిచే రాలకు..

పుట్టపర్తి మొదటి కావ్యం పెనుగొండలక్ష్మి మద్రాసు యూనివర్సిటీ పాఠ్యగ్రంధంగా..


తనపదహారవయేట 
ఒక బాలుడు ఒక రచన చేసాడు
అది పేపరుపై పెట్టాడేమో కానీ..
తరువాత అది ప్రచురింపబడుతుందని..ఊహించలేదు 

అది రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వంటి పెద్దలు.. మెచ్చుకొ ని వుండవచ్చు
యేదో చిన్న పిల్లవాడు .. 
బాగానే రాశాడు..
పాపం తల్లిలేదు.. పోనీలే కొంచెం ప్రోత్సహిస్తాం
అనుకొని వుండవచ్చు..
నిజంగానే అందులో చిక్కని కవిత్వం ఉండివుండవచ్చు.

అది అతని ముఫ్ఫై రెండవయేట
 యెవరో ముద్రించారు..
అంతకుముందే పలువురి ప్రశంసలందుకున్న ఆకావ్యం ..
మద్రాసు వారు విద్వాన్ కు పెట్టారు..

సాధారణంగా అన్ని కాలాల్లోనూ
యెవరికి తోచిన విధంగా వారు 
రకరకాల రచనలు చేస్తారు.. 
ముద్రిస్తారు.. 

కానీ కొన్నిటికే రాజయోగం పడుతుంది.. కదూ..

పుట్టపర్తి వ్రాసిన రచనల్లా సంవత్సరాల దశాబ్దాల తరబడి
అందమైన రూపం పొందేందుకు

 శప్త కన్యల్లా ఎదురు చూశేవి
 

ఈలోగానే వాటి కీర్తి దశదిశలా గుబాళించిపోయేది
తరువాతెప్పుడో తీరిగ్గా
ఎవరి దయతోనో అవి ముద్రణపొంది వెలుగు చూశేవి..

ఇంకో విచిత్ర విషయం యేంటంటే
విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంధంగా ఆ కావ్యం పెట్టారు
కానీ రచయిత విద్వాన్ కూడా కాదు..
తానూ విద్వాన్ చేయాలంటే అదే చదవాలి .. 

తెలుగు పండితునిగా ఉద్యోగం పొందాలంటే 
విద్వాన్ ఉండాలి కదా..
కాలక్రమాన ఆయన విద్వాన్ పరీక్షకు 
అప్పియర్ అయ్యాడు..
అందులో తన పుస్తకమే పాఠ్యగ్రంధం..
ఇక ఆ  పరిస్థితి ఊహించుకోండి..

ఆ ఘడియ రానే వచ్చింది..
పరీక్ష హాలులో ఉలిచేరాళ్ళకు.. చక్కిలింతలిడి..
అన్న ప్రశ్న నిలబడింది
అంతే..
విద్యార్థి.. కవి అయిపొయ్యాడు..

పైన ఎర్రటి ఎండ..
కారిపోతున్న చెమటలు..
అప్పుడప్పుడు అటుగా వస్తున్న జనం అలికిడి..
కానీ శిల్పి యేకాగ్రత ఆ రాయిపైనే..

చెక్కగా చెక్కగా..
అది చక్కని అతివ రూపుదాల్చింది..
అందమైన కళ్ళూ .. 
చక్కని నాసిక.. 
చిన్న చుబుకం..
అద్దాల్లాంటి చెక్కులు..
దోబూచులాడుతున్న సన్నని నవ్వు..


ప్రేమ విభ్రాంతుడై పోయ్యాడు..
అతని కన్నులనుంచీ కన్నీళ్ళుధారలు కట్టాయి 
అరచేతులూ చెమర్చాయి..
అతను ఆ బొమ్మను ముద్దుపెట్టుకున్నాడు 

ఇది ఎవరికైనా అనుభవమే..
తాను రాస్తున్న కథో కవితో 
పాటో పద్యమో ..
అందులో లీనమైపోతే అప్రయత్నంగా కన్నీళ్ళు పొంగుకొస్తాయ్..
గుండె మూగవోతుంది..
ఎందుకూ..
ఆ సృష్టి పై  తనలో పొంగిన ప్రేమ..

ఆ కొండలలో చింత వెక్కసమై యేడ్చుకొనే 
 భావుకుని గా 
విద్వాన్ పరీక్ష రాస్తున్న పుట్టపర్తి 
ఒకే ప్రశ్నకు అదీ ఒక బిట్ కు
సుమారు నలభై పేజీల వివరణ ఇస్తూ పోయారు..
పరీక్ష సమయం అయిపొయ్యింది..
అందరూ వెళ్ళిపోతున్నారు..
తానూ పేపర్ ఇచ్చి..
భారమైన హృదయంతో బయటికి నడిచాడు 

చివరికి ఒకనాడు ఫలితాలు రానే  వచ్చాయి..
తాను రాసిన నలభై పేజీల జవాబుకు..
ప్రశంస వస్తుందా .. ?
పాసుచేస్తారా..?
ఫెయిలా..??

ఫెయిల్..??
ఉత్తీర్ణుడు కాలేదు..
ఒక్కో ప్రశ్నకూ ఇంతా అని మార్కులు 
పాసవడానికి ఇన్ని 
మరి ఒక్క బిట్ కెన్ని ..?? 
రెండు .. 
రెండే వచ్చాయి .. 

పుట్టపర్తి అహం దెబ్బతింది..


కారణం
పుట్టపర్తికి క్వశ్చన్ పేపర్ మార్కుల విధానం తెలియవు..
ఎన్నడూ సీరియస్ గా బడి చదువులు చదవలేదు..

బాధవేసింది..

తను వ్రాసిన పేపర్ తానే నెగ్గక పోతే..
ప్రపంచం నవ్వదా..?

పోయిన చోటంతా..సన్మానాలు.. పూలదండలు
బిరుదులూ సత్కారాలు..
యెవ్వరు సవాల్ చేసినా .. ఓడిపోవలసిందే..


మరి ఇలా జరిగిందేమిటీ..?

కొన్ని రోజుల తరువాత..
మద్రాసు యూనివర్సిటీ వారికి సంస్కృతంలో 
ఒక పెద్ద లేఖ వ్రాసారు పుట్టపర్తి..


జగమంతా నీవు కవివి.. 
నీవు పండితుడివి..
నీవు విమర్శకుడివి..
నీవు చక్కని ఉపన్యాసకుడివి..
చరిత్రకారుడివి..
అంటూ గొంతెత్తి అరుస్తుంటే..

తనను అనర్హుడని ప్రకటించడం 
యేరకంగా న్యాయం
అంటూ ఆవేశంగా..ప్రశ్నించారు

ఆ ఉత్తరాన్ని యూనివర్సిటీలోని పెద్దలెవరో అందుకున్నారు..
జరిగిన తప్పుకు బాధపడ్డారు.
యెవరో పుట్టపర్తి నారాయణాచార్యులు..
ఒక విద్యార్థి ..
అంతే..

అతడే.. ఇతడని వారికేం తెలుసు..
కానీ తిరిగి పుట్టపర్తి ఉత్తీర్ణులవడం జరిగింది..

ఈ విషయాన్ని
నరాల రామారెడ్డి గారు అక్కయ్య నాగపద్మినితో పంచుకున్నారు..