28 మే, 2015

గురు స్మరణ

పుట్టపర్తి శతజయంతి వేడుకలలో నరాల అన్నను మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత కలిశాను
దూరదర్శన్ లో.
ఎంత ఆనందమైందో..
చిన్నప్పుడు చూశేదాన్ని..
ప్రతి సభలో రాజన్న కవి నరాల రామారెడ్డి గురు స్తోత్రం చేసేవారు
ఇద్దరూ పుట్టపర్తిని గురువుగా నమ్మి ఈనాటికీ అదే గురు స్తోత్రాన్ని గావిస్తున్నారు
కానీ రాజన్న మన మధ్య లేడు..
దూరదర్శన్ లో అన్నా బాగున్నారా..
అంటే ప్రెమగా తలనిమిరాడు రామారెడ్డి
బయటకు చెప్పనంటే ఒక సంగతి చెబుతా అన్నారు
చెప్పనన్నా . చెప్పండి.. అని బ్రతిమలాడాను..
ముందు నీవు నీ కెమెరా ఆఫ్ చెయ్..
అన్నాడు
చేయక తప్పలేదు..
ఒకసారి పుట్టపర్తి వారు.. ఒరే.. నీ కవిత్వ కళనంతా ప్రయోగించి పద్యాలు రాసుకురారా.. అన్నారు..
గురువు అలా అనే సరికి కొండంత ఉత్సాహం వచ్చింది..
వెంటనే రెండు మూడు రోజులలో మాంచి పద్యాలు రాసుకుని
అయ్యముందు ఉద్విగ్నంగా వినిపించాను..
ప్రశంసిస్తే పొంగిపోదామని ఆశగా చూశాను

భలే బాగా రాసినావురా ..
నీలో గొప్ప అభివ్యక్తి వుందిరా..
ఆ పేపరీ అన్నారు..
నా ఎదుటనే ఆ పద్యాలను రాజన్నకు ఇచ్చేశారు..
నేను అవాక్కయ్యాను..
యేమి స్వామీ ఇది..
నన్ను రాయమని ..
మీరిట్ల చేయడం యేమన్నా బాగుందా.. అని చిన్నబుచ్చుకున్నాను.

అప్పుడు పుట్టపర్తి పోనీలేరా..
నీవిలాంటివి వంద రాస్తావు
వాడు సభల్లో పాడుతాడుగదా..
అన్నారు..
అంటూ ఈ విషయం రాయొద్దు అనూరాధా..
అన్నారు
రాయను రాయను..అన్నా

అన్నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తున్నా..
అనూరా ధ 

నీ వదనంబునన్ మనసు నిల్పిన..