అయ్య చేతి వ్రాతను గురించి..
చెప్పాలనుకున్నాను..
చెప్పాలనుకున్నాను..
అయ్య మనలాగా..
బొటన వేలూ.. 
చూపుడు వేలూ.. 
మధ్య వేలూ ..
మూడింటితో ..
పెన్నుని పట్టుకుని వ్రాయలేరు..
చూపుడు వేలి పైకి లేపి ఉంచేవారు..
బొటన వేలూ ..
మధ్య వేలూ ..
క్రింది అనామిక..
చిటికెన వేలూ.. 
పెన్నుని పట్టుకొనేవి..
అలా ఎందుకో తెలియదు..
పెన్ను లంటే ..
మన పెన్నులు కాదు..
కలాలు..
ఇప్పుడు దొరుకుతాయో లేదో తెలియదు..
ఆ కలం పట్టుకుని..
సిరా బుడ్డీ కరణం బల్లపై పెట్టు కుని ..
ఆ బుడ్డీ కదలకుండా ..
అమ్మ అటొక చిన్న చెక్కా ..
ఇటొక చిన్న చెక్కా ..కొట్టించింది..
అలా..
బుడ్డీ లో కలాన్ని అద్దుకుంటూ..
 కలంతో వ్రాసే వారు..
రాసే టప్పుడు..
చేయి చిన్నగా వణుకుతూ ఉండేది..
తదేకంగా ..
అతి దగ్గరగా ..
పేపరును చూస్తూ వ్రాసేవారు అయ్య.
అయ్య తెల్ల కాగితాలను కూడా.. 
చాలా జాగ్రత్తగా ఉపయోగించే వారు..
ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు.. 
పేపరును నాలుగు భాగాలు చేసి ..
అందులో ముఖ్యాంశాలను నోట్ చేసుకొనేవారు..
దానిని ట్యాగుతో గట్టిగా ముడి వేసి..
అందులో ముఖ్యాంశాలను నోట్ చేసుకొనేవారు..
దానిని ట్యాగుతో గట్టిగా ముడి వేసి..
 జుబ్బా  జేబులో పెట్టుకొనేవారు..
అయ్య వ్రా త విధానం..గురించి 
వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు..
ఎంతో చక్కగా రాసారు..
ఆయన్ని..
మా ఇంటికి వస్తూ పోతూ ఉండగా చూస్తూ ఉంటిని ..
కానీ..
అయ్యకు వారికీ ఇంతటి అనుబంధం ఉందని..
వారి వ్యాసం చదివాకే అర్థమైంది..
ఇవన్నీ..
గతజన్మ ఋణానుబంధాలు అంటారు అయ్య.. 
రాధా.. 
పైకి పోయి ..
ఎర్ర రంగు బుక్కు పొడుగ్గ వుంటుంది..
తీసుకు రాపో..
అని చెప్పే వారు కింద కూచుని వున్నప్పుడు..
నేను రయ్యిన పరుగెత్తి..
గవాక్షి లోంచీ..
ఆ పుస్తకాన్ని అయ్యకు చూపించేదాన్ని..
అయ్యా ఇదేనా అని..
అది కాదు ..
ఇంకోటి దాని పక్కనే వుంటుంది చూడు..
వెంటనే దాన్ని తెచ్చి ఇవ్వడం ..
నేను పెరిగే కొద్దీ ..
అయ్య సుందరకాండ ..
నాకు పాఠం చెప్పినారు..
షేక్స్ పియర్..,
ఠాగూర్..
గీతాంజలి..,
సౌందర్య లహరి..
నెహ్రూ ఇందిరకు వ్రాసిన ఉత్తరాలు..
అరవిందో ఊర్వశి..
ఇంకా..
ఇంకా ..
ఎన్నో స్తోత్రాలు ..
శ్రీ సూక్తం.. పురుషసూక్తం చెప్పించారు..
బ్లూ ..రెడ్.. గ్రీన్..
ఇంకు బాటిల్సు తయారుగా ఉండేవి..
అమ్మ ..
అమ్మ ..
అయ్య ఇంకు బాటిల్సు ..
కలాలూ.. వానికి రక రకాల నిబ్బులూ..
మొదలుకొని ..
అయ్య తాజమహలు బీడీ కట్టలూ..
 అగ్గి పెట్టెలూ ..
తెల్ల కాగితాలూ..
ట్యాగులూ ..
మొదలైనవి తెప్పించి వుంచేది..
 
బ్లూ ఇంకుతో..
వణుకుతున్న చేతులతో ..
వ్రాసుకుని ..
కొన్నింటిని ..రెడ్ అండర్ లైన్లూ..
గ్రీన్ అండర్ లైన్లూ..చేసుకొనేవారు..
ద్వైత పారిజాతాన్ని..
అయ్య వ్రాసుకున్న పధ్ధతిని..
వల్లంపాటిగారు వివరించిన పధ్ధతిని చదివి..
ఒడలు జలదరించింది..
లావుపాటి ..
దాదాపు ..
అయిదు వందల పేజీలు.. వెయ్యి పేజీలు..
ఎన్నో వుండేవి..
 ఆ  పుస్తకాలలో ..
అయ్య శారీరక.. మానసిక ..
తపన  ఎంత దాగి వుందో ..
ఇప్పుడు వాటిని ..
ఇప్పుడు వాటిని ..
ఒక్కసారి స్పృశించినా చాలు..
మనకు ..
అయ్య ఆశీర్వచనాలు అందుతాయని అనిపిస్తుంది..
 
ఆముక్త మాల్యదను గురించి మాట్లాడమని..
బళ్ళారి వాళ్ళు పిలిచారట..
అందులో ..
అందులో ..
వైష్ణవ తత్వాన్ని గురించి ..
అయ్య చక్కగా మాట్లాడారు..
 
అయితే ..
సభ తరువాత..
ఒకతను అయ్యను కలిసాడు..
మీ ఉపన్యాసం వింటే..
మీ ఉపన్యాసం వింటే..
మీరు అద్వైతమూ ..విశిష్టాద్వైతమూ  ..
బాగా చదువుకున్నారే కానీ ..
ద్వైతాన్ని ..
అంత శ్రధ్ధగా చదువుకోలేదని తెలిసింది..
 
మీరు ద్వైతాన్ని బాగా చదువుకొని వుంటే..
మీ ఉపన్యాసం ఇంకో విధంగా ఉండేది.. 
అన్నాడట..
 
అన్నాడట..
ఆయన ..
అయ్య కంటే వయసులో పెద్ద వాడు
అయ్యకు కోపం రాలేదు..
"నన్ను విమర్శిస్తావా..?"
అని చిరాకు పడలేదు.
సిగ్గు పడ్డారట..
 
అయ్యకు కోపం రాలేదు..
"నన్ను విమర్శిస్తావా..?"
అని చిరాకు పడలేదు.
సిగ్గు పడ్డారట..
నిజమే..
నేను ద్వైత సిధ్ధాంతాన్ని..
శ్రధ్ధగా అధ్యయనం చేయలేదు.. 
అని ..
కర్నాటక లోని ఒక మఠం నుంచీ ..
కర్నాటక లోని ఒక మఠం నుంచీ ..
ఆ ద్వైత పారిజాతాన్ని తెప్పించి చదవసాగారు..
ఈ అనుభవాన్ని..
వల్లంపాటి గారి మాటల్లోనే ..
చదవండి..  
వారికి ..
చదువు ఎంత తీవ్రమైన వ్యసనమో 
సూచించటం కోసం ఒక సంఘటన చెబుతాను.
వారికో చిత్రమైన అలవాటు ఉండేది.
ఇరవయ్యవ శతాబ్దపు కవుల్లో..
వారి చదువును గురించి.., 
పాండిత్యాన్ని గురించీ ..
చెప్పటానికి నా చదువూ.., 
పాండిత్యమూ ..సరిపోవు. 
వారి విజ్ఞాన దాహానికి హద్దు లేదు. 
ఏ భాషలో ఏముందో..??
అది రాకపోతే ..
మనకు ఏం తెలియకుండా పోతుందో ..??
అన్నట్టుగా ..
భాషలు నేర్చుకునేవారు,
భాషలు నేర్చుకునేవారు,
చదువుకునేవారు. 
వారికో చిత్రమైన అలవాటు ఉండేది.
అచ్చుపుస్తకాన్ని చూస్తే ..
వారికి ఆత్మీయత అంతగా కుదిరేది కాదు.
తాను  మళ్ళీ ..మళ్ళీ..
చదవాలనుకున్న పుస్తకాల్ని.. 
తానే స్వయంగా కాపీ చేసుకునేవారు. 
ఆ  పుస్తకం మీద ఎర్రసిరాతో ..
అర్థాలూ, వ్యాఖ్యలూ రాసుకునేవారు.
.
అలా వారు కాపీ చేసుకున్న..
అలా వారు కాపీ చేసుకున్న..
 కొన్ని షేక్స్పియర్ నాటకాలూ.., 
ఇతర గ్రంథాలూ..
ఇప్పుడు బ్రౌన్  మెమోరియల్ గ్రంథాలయం..
(కడప) లో ఉన్నాయి. 
వాటిని చూస్తే ..
పుట్టపర్తివారి  ..
పాండిత్యం వెనక ఉన్న శ్రమ ఎంతటిదో అర్థమవుతుంది. 
ఇరవయ్యవ శతాబ్దపు కవుల్లో..
 పుట్టపర్తివారిని ..
సుదూరంగా పోలిన పండితుడు కూడా లేడన్నది..
 నా దృఢవిశ్వాసం.
వై.సి.వి రెడ్డి వారిని గురించి..
 “కవిత్వం రాసేదానికి ..
ఇంత చదువుకోవాల్సిన అవసరం లేదప్పా..”
ఇంత చదువుకోవాల్సిన అవసరం లేదప్పా..”
అనేవారు.
1975-76 ప్రాంతంలో..
 ఒక రేడియో ప్రోగ్రాం రికార్డింగు ఉండి.. 
కడపకు వెళ్ళాను...
 ఆకాశవాణి కేంద్రంలో అనుకోకుండా.. 
శతావధాని నరాల రామారెడ్డి కలిశారు. 
కాస్సేపు  కబుర్లు చెప్పుకుని..,  
భోజనం చేసి,
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో.. 
 పుట్టపర్తివారింటికి వెళ్ళాం.. 
కనకమ్మ గారు ఎదురుపడి ..
ఆప్యాయంగా ఆహ్వానించి.., 
“అయ్యగారు మిద్దెమీదున్నారు, వెళ్ళండి” 
అన్నారు. 
ఇద్దరం మేడ మీదికి  వెళ్ళాం.., 
పుట్టపర్తి వారు..
తన మామూలు పద్ధతిలో..
కరణం డెస్కు ముందు కూచొని..
ఏదో  వల్లె వేస్తున్నట్లు కనిపించారు.
“ఒరే దొంగవెధవలిద్దరూ ఎక్కడ కలిసినార్రా?” 
అని ఆహ్వానించారు. 
చెప్పాం. 
క్షేమసమాచారాల పలకరింపులైపోయాక -
“ఇదేదో చాలా పెద్ద పుస్తకం పట్టారే..”
అన్నాను 
డెస్కు మీదున్న ..
బండ లాంటి ..
పాత సంస్కృత గ్రంథాన్ని చూపుతూ.
పుట్టపర్తివారు
 ఆ గ్రంథాన్ని ఆప్యాయంగా తాకుతూ అన్నారు.
“ఒరే ఈ మధ్య ఒక సంగతి జరిగిందిరా. 
బళ్ళారి వాళ్ళు పిలిచినారు... 
వెళ్ళినా... 
’ఆముక్తమాల్యద’ను  గురించి.., 
ముఖ్యంగా..
 అందులోని వైష్ణవ తత్వాన్ని గురించి, 
బాగానే మాట్లాడినా... 
సభ తరువాత..
ఒకతను కలిసినాడు.
ఒకతను కలిసినాడు.
అతడు నాకంటే పెద్దవాడు.. 
అతడు ..
“మీ ఉపన్యాసం  వింటే మీరు అద్వైతమూ,
 విశిష్టాద్వైతమూ.. 
బాగా చదువుకున్నారే కానీ.. 
ద్వైతాన్ని  అంత శ్రద్ధగా చదువుకోలేదని తెలిసింది. 
మీరు ద్వైతాన్ని బాగా చదువుకొని ఉంటే ..
మీ ఉపన్యాసం మరొక రకంగా ఉండేది.”, 
అన్నాడు. 
నిజమే... 
నేను ద్వైత వేదాంతాన్ని.. 
అంత శ్రద్ధగా అధ్యయనం చేయలేదు. ..
చాలా సిగ్గనిపించింది... 
ఈ పుస్తకం పేరు  “ద్వైత పారిజాతం”
 దీన్ని కర్ణాటకలో...
 ఒక మఠం నుంచి..
 తెప్పించి చదువుతూ ఉన్నా.
 మరో రెండు నెలల్లో పూర్తయిపోతుంది.”
పుట్టపర్తి వారి దృష్టిలో..
 “చదవటం”..
అంటే ఏమిటో..
చాలామందికి తెలియదు.. 
వారు  “ద్వైత పారిజాతం”ను ..
ఎలా చదువుతూ ఉన్నారో చూస్తే ..
వారి చదవటం కొద్దిగా  అర్థమౌతుంది. 
మొదట మూలంలో ..
నాగరలిపిలో ఉన్న శ్లోకాన్ని ..
తెలుగు లిపిలో కాపీ  చేసుకోవడం.., 
తరువాత సంస్కృత వ్యాఖ్యను చదివి.., 
అర్థం చేసుకొని.., 
అందులోని  ప్రధానాంశాలను.. 
తెలుగులో తన నోట్ బుక్ లో రాసుకోవటం, 
ఆ తరువాత ఆ శ్లోకాన్ని  కంఠస్థం చేయటం, 
అంతకు ముందు.. 
కంఠస్థం చేసుకున్న శ్లోకాలతో దాన్ని కలిపి 
మననం  చేసుకోవటం.., 
మరో శ్లోకానికి వెళ్ళటం... 
వారు సంస్కృత మహాకవుల్ని చదివినా.. 
షేక్స్పియర్ నాటకాలను చదివినా ..
“పారడైస్ లాస్ట్” ను చదివినా..
 ఇలాగే  “చదివారు”. 
చదవటమంటే.. 
ఆ గ్రంథాన్ని ఆమూలచూడంగా..
తన స్మృతిపేటికలో  భద్రపరచుకోవటం..
పిలిచినప్పుడు పలికేలా ఉంచుకోవటం.. 
“ఆయనెవరో..
 మీరు  ద్వైతవేదాంతం బాగా చదువుకోలేదంటే..
 దాని మీద పడిపోయారు...
 ఇలా మీ విలువైన  కాలాన్ని వృథా చేస్తున్నారు..
మీ సొంత సాహిత్య కృషిని కూడా మానేశారు...
ఇదేం  పద్ధతి..? 
నేను మీకింకేదో రాదంటాను...
మీ చదువూ.., రాతా ..,
మానేసి దాన్ని  నేర్చుకుంటూ కూర్చుంటారా?” 
అన్నాను.
“ఏం రాదంటావూ?” అన్నారు.
“న్యూక్లియర్ ఫిజిక్స్ రాదంటాను. 
దాన్ని నేర్చుకుంటారా?” అన్నాను.
రామారెడ్డి హాయిగా నవ్వారు.
పుట్టపర్తి వారు..
గంభీరంగా మారిపోయారు. 
ఒకటి ..
రెండు ..
నిముషాలు నిశ్శబ్దంగా ఉండిపోయి..
“నేను చేస్తున్న సాహిత్య కృషికి
 నువ్వు చెప్పిన న్యూక్లియర్ ఫిజిక్స్ 
 అవసరమని నిరూపించరా...
అది తెలిసినవాణ్ణి ఆశ్రయించి ..
దాన్ని నేర్చుకుంటాను.” 
అన్నారు. 
నేనూ.., 
రామారెడ్డి.. అవాక్కయిపోయాం.
గుండె ఝల్లు మంది కదూ..?? 
ఇవన్నీ 
గతజన్మ ఋణానుబంధాలు 
అంటారు అయ్య..
అయ్యను..
అయ్యను..
అంత ప్రాణప్రదంగా ప్రేమించడానికి 
గుర్రప్ప అని..
ఒక కాంపౌండెర్..
ఆయనే మాకు ఆస్థాన వైద్యుడు..
పొద్దునా ..సాయంత్రం..
ఆయనే మాకు ఆస్థాన వైద్యుడు..
పొద్దునా ..సాయంత్రం..
ఇంటికి వచ్చి.. 
అయ్య ఉంటే అయ్య కో..అమ్మ కో ..
నమస్కారం చేసుకొని పోయేవాడు..
 
ఇంట్లో ఎవరికి యే జబ్బు వచ్చినా 
గుర్రప్ప రావలసిందే..
చేతిలో కాసులు పడంది
చేతిలో కాసులు పడంది
 ఎవరైనా ఏ పనైనా చేస్తారా..??
అమ్మ ఆయన కేం ఇచ్చేది..??
పండో ఫలమో..
అమ్మ ఆయన కేం ఇచ్చేది..??
పండో ఫలమో..
 అంతే..
అర్థరాత్రీ ..
అపరాత్రీ.. 
ఎప్పుడు పిలిస్తే అప్పుడు..
అతని కిట్టేసుకుని ..
తన సైకిలులో సొంత కొడుకులా పరుగెత్తి వచ్చేవాడు..
ముఖాన ఇంత విసుగు గానీ ..
చిరాకు గానీ..
అబ్బే..
లేనే లేదు..
వీరికి సేవ చేయటం నా ధర్మం అన్నట్లు..
యేదో మంత్ర బధ్ధుడిలా..
ముఖాన ఇంత విసుగు గానీ ..
చిరాకు గానీ..
అబ్బే..
లేనే లేదు..
వీరికి సేవ చేయటం నా ధర్మం అన్నట్లు..
యేదో మంత్ర బధ్ధుడిలా..
అమ్మ చనిపోయే వరకూ..
అతను పక్కనే వున్నాడు.
అతను దగ్గరే ఉన్నాడు..
ఎందుకు..??
ఈ జన్మకు సంబంధించి నంత వరకూ ఆలో చిస్తే ..యేదో గురుత్వం..
కాస్త విశాలంగా ఆలోచిస్తే..
గత జన్మ ఋణానుబంధం..
కాదంటారా..?


