రామ రాజ భూషణుని అసలు పేరు..
 భట్టుమూర్తి..
ఈయన ..
పదహారవ శతాబ్దమునకు చెందిన కవి 
సంగీత విద్వాంసుడు.
శ్రీకృష్ణదేవరాయల అల్లుడు ..
అళియ రామరాయలు..
గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, 
చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో 
ప్రముఖ  పాత్ర పోషించినాడు. 
విజయనగర రాజ వంశములలో 
నాలుగవది, చివరిదీ ఐన 
అరవీటి  వంశమునకు ఆద్యుడు.
 శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున 
ఈయనను అళియ రామరాయలు 
(కన్నడములో అళియ అంటే అల్లుడు) 
అని కూడా వ్యవహరిస్తారు..
ఈతని ఆస్థానమునకు ..
ఆభరణము వలె ఉండటము వలన..
రామ రాజ భూషణుడని పేరు వచ్చింది..
 
అష్టదిగ్గజాలు 
ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు అని అర్థం .
హిందూ పురాణాలలో 
ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ
ఎనిమిది ఏనుగులు  ఉంటాయని ప్రతీతి.. 
అష్ట దిగ్గజముల పేర్లివీ.. ..
ఐరావతం.. పుండరీకం ..వామనం ..
కుముదం ..అంజనం పుష్పదంతం ..
సార్వభౌమం ..సుప్రతీకం..
 
కుముదం ..అంజనం పుష్పదంతం ..
సార్వభౌమం ..సుప్రతీకం..
అలాగే
కృష్ణదేవరాయల ఆస్థానంలోని 
ఎనిమిది మంది కవులనూ 
అష్టదిగ్గజములు అని అంటారు. 
1. అల్లసాని పెద్దన,
అష్టదిగ్గజములు
1. అల్లసాని పెద్దన,
2. నంది తిమ్మన,
3. ధూర్జటి,
4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),
5. అయ్యలరాజు రామభద్రుడు,
6. పింగళి సూరన,
7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),
8. తెనాలి రామకృష్ణుడు
పింగళి లక్ష్మీకాంతం గారు భట్టుమూర్తి ని గురించి ..
"ఈ కవి గాయకుడు. 
సంగీత కళానిధి. 
సంగీతమునకు, కవిత్వమునకు   గల పొత్తును
 ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. 
ఇతని పద్యములన్నియు లయ   గమకములు గలవి. 
కీర్తనలవలె పాడదగినవి. 
అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. 
నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. 
పద్య రామణీయకత, 
ప్రౌఢ సాహిత్యము, 
 విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. .... 
ఇతనికే శ్లేష సహజము. 
రామరాజభూషణునివలె 
పద్యము వ్రాయగలవారు లేరు.  
కవులలోనింతటి లాక్షణికుడు   లేడు."అన్నారు..
వసు చరిత్ర పంచకావ్యాలలో ఒకటి..
అన్నిటికంటే శ్రేష్టమైనది కూడా..
అన్నిటికంటే శ్రేష్టమైనది కూడా..
కథ మార్కాండేయ పురాణం నుంచీ తీసుకుని వ్రాయబడ్డది..
 
కేవలం ..
నాలుగైదు పద్యాలుగా ఉన్న కథని తీసుకుని 
887  పద్యాలుగా, 
6 అధ్యాయాలుగా
వ్రాయుట జరిగింది.
అటువంటి వసుచరిత్రని మెచ్చుకొని,
6 అధ్యాయాలుగా
వ్రాయుట జరిగింది.
అటువంటి వసుచరిత్రని మెచ్చుకొని,
తరువాత  తిరిగి సంస్కృతంలో కి అనువదించారు. 
ఇందులో కథేమిటంటే..
వసుదేవుడు గొప్పరాజు దేవేంద్రుడంతటి వాడు..
శుక్తి మతి అనే నదిని కోలాహలుడనే పర్వతుడు
కామించి అడ్డుపడ్డాడు. 
ఆమె వసుదేవుడిని శరణని 
కోలాహలుడి బారి నుంచీ కాపాడమని 
వేడుకొంటుంది..
వసురాజు కోలాహలుణ్ణి ఒక్క కాలి తన్నుతో
వసురాజు కోలాహలుణ్ణి ఒక్క కాలి తన్నుతో
విసరి వేస్తాడు..
కానీ
కానీ
కోలాహలుడితో సమాగమం వలన..
ఆమెకు గిరిక.. వసుపధుడు ..
అనే ఇద్దరు పిల్లలు కలుగుతారు..
 
అనే ఇద్దరు పిల్లలు కలుగుతారు..
ఇద్దరినీ ఆమె రాజుకు సమర్పిస్తుంది..
రాజు వసుపధుడిని సేనాపతి గానూ ..
గిరికను పత్నిగానూ స్వీకరిస్తాడు..
స్వతహాగా సంగీత విద్వాంసుడైనందున ..
సంగీత విశేషాలతో ..అధ్భుతమైన శ్లేషలతో ..
ఈ కావ్యం 
రామ రాజ భూషణుని చేతిలో 
అందాలను దిద్దుకొంది..
ఇందులో అందరికీ నచ్చే పద్యం..
 బాగా ప్రసిధ్ధి చెందిన పద్యం ఇది.
నానాసూనవితానవాసనలనానందించుసారంగ మే
లానన్నొల్లదటంచుగంధఫలిబల్కాఁకందపంబంది యోషానాకృతిఁబూనిసర్వసుమనస్సౌరభ్యసంవాసమై
పూనెంబ్రేక్షణమాలికామధుకరీపుంజంబునిర్వంకలన్!2.47
అన్ని పూల పరిమళాలూ ఆఘ్రాణించే తుమ్మెదలు సంపెంగ జోలికి పోవట.. 
అందుకని అది తపస్సు చేసి..
 అన్ని పూల సుగంధాలనూ పీల్చే ముక్కై ..
మగ తుమ్మెదలమీది కోపంతో ..
ఆడ తుమ్మెదలను ..
అటూ ఇటూ కనుబొమ్మలుగా కట్టేసుకుందట..
చాలా బావుంది కదూ..
ఇక..
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించిన
ఇక..
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించిన
సారస్వత వ్యాసాలలో 
"వసుచరిత్ర వైచిత్రి" అయ్య వ్యాసం దొరికింది..
ఆనందంగా తీసుకున్నాను..
ఇదిగో చూడండి..
ఆనందంగా తీసుకున్నాను..
ఇదిగో చూడండి..
















