11 అక్టో, 2013

పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో

జ్యోతిషము జోస్యం , 
భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా 
అనేకమంది విశ్వసించే విధానం. 
ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. 
జీవి జీవితంలో జరిగినది, 
జరుగుతున్నది, 
జరగబోయేదీ  
జననకాల గ్రహస్థితి ప్రకారము, 
శరీర లక్షణాలు, అర చేతులు, 
మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. 

ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. 
ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో 
ఇది కూడా ఉంది. 

మొట్టమొదటిగా 
జ్యోతిష్య శాస్త్రాన్ని 
గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు.  
హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో 
జన్మ సిద్దాంతం ఒకటి. 

జన్మసిద్దాంతం ప్రకారము  
పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం 
ప్రస్తుత జన్మలో ఉంటుంది. 
దానికి తగిన విధంగా, 
తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. 
అనగా అటువంటి గ్రహస్థితి లో జీవి జననం జరుగుతుంది. 
ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. 
కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు 
జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. 

ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.
హస్తసాముద్రికము, గోచారము,  
నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది 
మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.
 అని వీకీ పీడియా చెప్పింది  

"ఈ నిను జూచునప్డు నిలువెల్లను గన్నులు, సేవలో సుఖం
బానెడు నపుడు నిలువంతయు చేతులు, పల్కు పల్కి నీ
యానతి గోరునపుడు నిలువంతయు నోరులు, నీ స్తవంబునం
దేను రమించు నప్డు నిలువెల్లను కంఠము లీయరా ప్రభూ.. "


 
నా గత జన్మ యేమిటి
ఈ జన్మలో నా స్థితి యేమి
కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..
ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది..
నీవిచ్చే వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ,
ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అంటుంది అక్కయ్య..
ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు  పుట్టపర్తి లో ఉన్నాయి
జ్యోతిష్య పండితులు
పుట్టపర్తి పాండిత్యానికీ
'సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళ
లో భినివేశానికీ
ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి
శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది
 

తప్పకుండా వారు వారి గమ్యాన్ని చేరారని 
మేము వారి ప్రియ శిష్యులూ భావిస్తున్నాము
వారి నిర్యాణ సమయంలో దగ్గరున్న గోవిందు అనే శిష్యుడు
అయ్య ఇచ్చామరణం పొందినట్లు మాకనిపించిందమ్మా
వారి సహస్రారం నుంచీ ఆత్మ నిర్గమించిందనిమేము 

కనుగొన్నాము అని
వివరించాడు..
ముఖ్యంగా ఇంకో విషయం
పుట్టపర్తి అంత్య సమయంలో వారి ఆధ్యాత్మ శిష్యులు మాత్రమే 

చుట్టూ వుండటం..
భాగవతం దశమ స్కందం తీయమని 

బాబయ్య తదితరులకు చెప్పి వ్యాఖ్యానిస్తూ 
దాదాపు అరగంట గంట పాటు తెల్లవారి నాలుగ్గంటల నుంచీ.. 
ఏకాదశీ తిధి నాడు
శ్రీనివాసా
ని పడకపై ఒరిగిపోవటం
యేవో రహస్యాలను విప్పీ విప్పక చెప్పటం లేదూ..




పుట్టపర్తికి కంచి పరమాచార్యతో సాన్నిహిత్యం చాలా లోతైనది..
సంప్రదాయానికి నిర్వచనం స్వామి
యే బంధాలకూ లొంగని పుట్టపర్తి
వీరి కలయికే విచిత్రంగా వుంది కాదూ
 

నిజమే ..
ఆరోజుల్లోనూ అలానే వుండేది
కంచి స్వామి ఒకప్పుడు పెనుగొండ వెళ్ళారు
అప్పుడు పుట్టపర్తి తొమ్మిదేళ్ళ పసివాడు
ఆ పసివానివంక చూసి వాని నొసటి గీతలను చదివిన స్వామివారు
వీడు గొప్ప కీర్తిమంతుడౌతాడని చెప్పారు

తరువాత తల్లి వియోగాంలో మసలే పుట్టపర్తికి కుటుంబమ్నుంచీ నిరాదరణ.. కుంగదీసింది..
రెండవపెళ్ళి చేసుకున్న తండ్రి..
ఆమెకు పిల్లలు
మరలిన తండ్రి దృష్టి
పుట్టపర్తిని తీవ్ర నిరాశకు గురిచేశాయి

తిరుపతిలో విద్వాన్ చదువుతున్నరోజుల్లో
కంచి స్వామి తిరిగి మళ్ళీ పుట్టపర్తి ని పలకరించారు
పుట్టపర్తి చదివే 

సంస్కృత విద్యాలయానికి వెళ్ళారు స్వామి
అప్పుడు సంస్కృతంలో అష్టావధానం జరిగింది..
అప్పుడూ పుట్టపర్తి పాండిత్యం స్వామివారిని మురిపించింది..

తర్వాత సీను ప్రొద్దుటూరుకు చేరింది..
అప్పుడు పుట్టపర్తి వివాహితుడు
అక్కడి ఒక పాఠశాలలో పనిచేస్తున్నారు
అక్కడి పండితుల మధ్యా విపరీతమైన పోటీలు
కక్ష్యలు ఘర్షణ వాతావరణం..

ప్రొద్దుటూరుకీ పరమాచార్య విచ్చేశారు
స్వామివారికి ఆహ్వానం పలకడానికి ఎవరు అర్హులు..??
అందరూ వెనుకంజ వేశారు..
పుట్టపర్తి పొలిమేరలనుంచీ సంస్కృతంలో భహ్మాండమైన శ్లోకాలతో
స్వామివారిని ఆహ్వానించి కన్యకాపరమేశ్వరీ ఆలయానికి తీసుకురావటం జరిగింది..

అక్కడ కొద్ది రోజులు స్వామి బస చేశారు..
మన తెలుగు పండితులకు సంస్కృతమే అరకొరా తప్ప అన్య భాషా పరిచయమే లేకపాయె
కానీ నిజమైన శక్తి గలవారిని కిందకి లాగటం లోనూ
కుయుక్తులను ప్రదర్శించి తరిమేయడంలోనూ పాండిత్యమెక్కువ..

తమిళ సాహిత్యమూ
భక్తుల సాన్నిహిత్యమూ గల పుట్టపర్తి స్వఛ్చత స్వామిని తిరిగి దగ్గర చేసింది..
అప్పుడు పుట్టపర్తి అక్షర లక్షల గాయత్రి కొన్ని కోట్ల అష్టాక్షరీ చేసి వున్నారు..
అంతే కాదు..

ఇంకో ముఖ్య విషయం
అందరూ స్వామివారి ముందు సాగిల పడేవారు
కోర్కెలు విన్నవించే వారు..
తాము చాలా సంప్రదాయబధ్ధులమని ప్రదర్శనకు దిగేవారు ఎక్కువ

కానీ
నేనిన్ని కోట్ల సాధన చేసాను నాకు ఎందుకు ఏ ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు..
అని పదే పదే అడిగే శిష్యులు ఎవరుంటారు..
నాకు కృష్ణ దర్శనమెప్పుడవుతుందని సర్వమూ ఒడ్డి హిమాలయాలకు పరిగెత్తే వారు ఎవరుంటారు..

అందుకే ప్రతిష్టాత్మక  కంచి పీఠాధిపతి..
నడిచేదైవమని ప్రపంచమంతా పిలిచిన సన్యాసి..
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్య
పుట్టపర్తికి వాగ్దానం చేసారు..
నీకు అంత్య దశలో కృష్ణ దర్శనమౌతుంది..
అని..



 

 

 

 పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో

సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ : పుట్టపర్తి అనూరాధ 
 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి