17 జులై, 2013

"రామ చరిత మానసామృతము" --పుట్టపర్తి మరో అద్భుత గ్రంధ సమీక్ష





నేల నూతల కృష్ణమూర్తి గారి భార్య యైన పార్వతమ్మ గారు వ్రాసిన 
"రామ చరిత మానసామృతము" 
అను గ్రంధమునకు ఆశీర్వచనము 
అను పేర వ్రాసిన పీఠిక ఇది

పుట్టపర్తి పీఠికలతో ఆయా గ్రంధములకు విలువ పెరిగేది
పార్వతమ్మ గారి భర్త అయిన 
నేల నూతల కృష్ణమూర్తి గారు 
శ్రీమద్రామాయణమును ఇంగ్లీషునకనువదించినారట

వారి సతీమణి తులసీదాసుని అర్చించినది
పుట్టపర్తి గారు నెల్లూరునకు
ఆ పరిసర ప్రాంతములకు సన్మానములకు వెళ్ళినప్పుడల్లా 
వారింటనే దిగేవారట..

అప్పుడు 
శ్రీ రామావఝుల శ్రీశైలం గారు 
నేలనూతల వారింటికి వెళ్ళి పుట్టపర్తిని దర్శించేవారట

"ఇది మూలమునకు 
యధాతధముగా సాగిన రచన కాదు
తనకింపుగ తోచినచోటనే అనువదించును
ఇట్టివచనములు 
పాఠకులలో మూలగ్రంధమును 
జదువవలెనను ఆశను రేకెత్తించును "
అంటారు పుట్టపర్తి 
పార్వతమ్మ గారి రచనను పరిచయం చేస్తూ

ఇంకా
వాల్మీకి రామ తత్త్వము పూర్తిగా అర్థమవలేదట
అందువలననే కలియుగమున తులసీ దాసుగా అవతరించెనట
ఉత్తర హిందూస్థానములో 
ప్రజల నమ్మకమిది
"అయోధ్య కాశీ మొదలైన ప్రదేశములలో 
దీని ప్రశస్తి అంతా ఇంతా గాదు
రెండు శాస్త్రములలో సమగ్ర పండితుడైననూ
ఆదేశమున తులసీదాసునే పారాయణమొనర్చును..

బైరాగులు వీధులలో 
వ్యాసపీఠముపై తులసీరామాయణముంచికొని 
దానిపై రెండుపువ్వులనుంచి కూర్చొనెదరు

వారి యెదుట కాసులు కుప్పలుగా పడియుండును అంటారు..
ఇది 1961 న వ్రాసిన పీఠిక 
శ్రీశైలం గారు నెల్లూరు వెళ్ళి
కష్టపడి సంపాదించినది..


పుట్టపర్తి జీవితానికి కొత్త దర్శకులు






పుట్టపర్తి చరిత్రను 

పలువురు పలు రకాలుగా వక్రీకరిస్తున్నారు అభిమానులు శిష్యులు అనేపేరుతో 
వారి నిజ జీవిత విశేషాలను కనీసం సరిగ్గా విచారించకుండానే 
పెద్ద పెద్ద పుస్తకాలు వ్రాసి 
పదుగురితో ప్రశంసలందుకుంటున్నారు  

ఇటీవల శశిశ్రీ వ్రాసిన 

 కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన 
మోనోగ్రా ఫ్ లో నూ  
భయంకరమైన 
క్షమించరాని తప్పులు దొర్లాయి 

విద్వాన్ పరీక్షకు పుట్టపర్తి తన పాఠ్యభాగాన్ని 

తానే పరీక్ష వ్రాయవలసి వచ్చింది 

ఇది యే కవి జీవితంలోనూ సంభవించని 

అరుదైన సంఘటన
 శశిశ్రీ విద్వాన్ ను ఇంటర్ మీడియట్ గా మార్చారు 

జిల్లెళ్ళమూడి అమ్మ తానే స్వయంగా 

ఒక ఇల్లు ఖరీదు చేసి పుట్టపర్తికి అందించినట్లు వ్రాసారు 
కానీ జరిగింది వేరొకటి 

ఇంకా పుట్టపర్తి 

ఆకాశవాణికోసమే కృతులను రచించినట్లు వ్రాసారు

 పై విషయాలకు స్పందించిన శ్రీ శ్రీశైలం గారు 

"సరస్వతీపుత్రుని శతజయంతికి నిజమైన నివాళి ఇదేనా..?"
 అని వ్రాసారు 

కేంద్ర సాహిత్య అకాడమీ 

 ఈ పుస్తకంలోని తప్పులను సరిదిద్దాలి 
లేకపోతే 
 ఈ పుస్తకం మిగతా ఇతర భాషలలోకి అనువదించబడి

 పుట్టపర్తి జీవితానికి వక్ర భాష్యంగా నిలచిపోతుంది