28 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల ఆధ్యాత్మికానుభవం







జుఱ్ఱెద మీ కథామృతము జుఱ్ఱెద మీ పదకంజ తోయమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుదారసంబ నే
జుఱ్ఱెద జుఱ్ఱు
జుఱ్ఱుగ రుచుల్ గనువారి పదంబుఁగూర్పవేతుఱ్ఱులతోడి పొత్తిడక.. దాశరథీ కరుణాపయోనిధీ... 






రామా!
దయాసముద్రా!
నేను మీ కథలనెడి అమృతమును జుఱ్ఱెదను.
మీ పాదపద్మములను గడిగిన 
నీటిని జుఱ్ఱెదను.
రామ యను పదమునుండి జాలువాఱు
 సుదారసమును జుఱ్ఱెదరు.
స్వామీ!
నాకు నీచులైన మనుజుల తోడి పొందును
 లభింపఁజేయక 
జుఱ్ఱూ జుఱ్ఱునను 
రుచులఁబొందువారి పాదములను
గూర్పవా?జుఱ్ఱెదను. 

చూశారా కథామృతాన్ని జుర్రుతాడట..
పాద పద్మాలను కడిగిన నీటిని జుర్రుతాడట..
రామ నామమనే పదమునుండీ జాలువారే సుధారసమును జుర్రుతాడట..
పైగా..
నీచుల పొందును ఇయ్యవద్దయ్యా..
జుర్రూ జుర్రు మని రుచులను పొందేవారి పాదములను లభించేటట్లు చేయి తండ్రీ..
అవి కూడా జుర్రుతాను..
అంటాడు.
అంటే భగవద్భక్తుల పాదపద్మాలు లభించేటట్లు చేయి..వారినీ సేవిస్తాను అని కదా అర్థం..
భగవద్భక్తులను సేవిస్తే భగవంతుని సేవించినట్లు కదా..
 






ఎవరు ఎంతెంత..
జ్ఞానం వేపు నడుస్తుంటే..
వాళ్ళతో ఆడుకోవటం పరమాత్మకు..
అంత సరదాగా ఉంటుంది....

పరతత్వ దర్శనం చేసిన వాడితో..
భగవంతుడు కూడా ..
పరాచికమాడతాడు..!!

మరీ బిర్ర బిగుసుకుపోయి..
అజ్ఞానంలో ఉన్నవాడిని చూసి..
వీడితో  నాకేంటి ఫో అంటాడు ..
ఆయన కూడా ..!!

లీలా శుకునికి ..
పరమాత్ముడు శ్రీరాముని రూపంలో కనిపించి..
తమాషా చేసాడు..





ఆయన మీరు భగవంతుడే ..
నేను మీకు నమస్కరించాలి..
లేకపోతే నా యందు దోషం ఉండి పోతుంది..
దోషం రాకుండా ..
మీరొక సర్దుబాటు చెయ్యండీ..
నేను నమస్కారం చేస్తానన్నాడు..

మీరు శ్రీ కృష్ణుడై..
నెమలి ఈక పెట్టుకుని..
వేణువు పట్టుకుని..
కనిపిస్తే నమస్కరిస్తానన్నాడు..
సాక్షాత్తూ..భగవంతుడే ..
అతని కృష్ణ భక్తిని చూసి ఆశ్చర్య పోయాడు..

ఆయనెలా ఆడాడో..
ఈయన అలానే ఆడాడు..

విహాయ కోదండ శరౌ ముహూర్తం ..
గృహాణ పాణౌ మణి చారు వేణుం..
మయూర వర్ధంచ నిజోత్తమాంగే ..
సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్..
అలా రండి ..
మీకు నమస్కారం చేస్తానని దానర్థం..

రామ కృష్ణులు ..
వీరిదొక అనుభవం..
 
అమ్మా ..
ఎంతకాలం ఇలా జపిస్తూ కూచోవటం..??
నా జప తపాలు శూన్యమేనా ..??
నేను నిన్నెందుకు దర్శించలేక పోతున్నాను..??

ఇక ఈ జన్మకు..
నీవు నాకు కనిపించవా అమ్మా..??
అని ఆవేదన చెంది..

అమ్మ చేతనమా..??
అచేతనమా..??

చేతనమైతే ..
నా బాధ ఆమెకు తెలియదా.. ??
నా ఏడుపు ఆమెకు వినిపించదా..??
అనుకుని దగ్గరికి వెళ్ళి ..
అమ్మ ముక్కు కింద వేలు పెట్టి చూసాడు.

ఆ మహాను భావునికి..
 కాళికా మాత ..
ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు గోచరించాయి..
ఉలిక్కి పడ్డాడు..

అంతే..

అమ్మా..
నన్ను క్షమించు ..
తల్లీ ..
నేను ఎంత పొరపాటు చేసానో చూడు..!!
నీవే లేనిచో నేనుండగలనా అమ్మా..??

ఏనాటికైనా ..
నీవు నాకు దర్శన మిస్తావు..
అని మురిసి పోయాడు..


ఇలాంటి సంఘటనలు ..
అయ్య అమ్మల జీవితంలో..
అడుగడుగునా వున్నాయి..


ఎందుకంటే ..
అయ్య పరుగెప్పుడూ..
పరతత్వం వేపే కాబట్టీ..


రామనవమికి 
భద్రాచలం వెళుతున్నారు..
అయ్యా ..
రఘూత్తమ రావ్..


భద్రాచలం ఇప్పట్లా డెవలప్ కాలేదు..
ఇసుకలో గుడారాలు..
కిలో మీటరు నడిస్తేనే మంచి నీళ్ళు..
అంత దూరమూ నడిచి ..
ఒక చిన్న కూజాతో నీళ్ళు పట్టుకొచ్చాడు..
మన రఘూత్తముడు.
 
ఒక గుడారంలో ..
అయ్య ..రఘూత్తముడు.
లోపల ..అయ్య ..
రామ చరిత మానస్.. పారాయణం
బయట స్టూలుపై ..
రఘూత్తముని కాపలా..
 
ఇంతలో ..
ఒక కాషాయాంబర ధారి..
ఒక పొడవు గడ్డము వాడు..
కడపనుంచీ వచ్చిన ..
పుట్టపర్తి నారాయణాచార్యులెక్కడా..?
అని అందరినీ విచారిస్తూ..
విచారిస్తూ..

వస్తున్నాడట..
 
ఇది సత్యం..
కల్పితం ఎంత మాత్రమూ కాదు..
 
వచ్చి.. వచ్చి ..
రఘూత్తముణ్ణి అడిగాడు..
అవును సరి అయిన ప్రదేశానికే వచ్చావు..
ఏమిటి పని..?
స్వామి వారు ..

లోపల పారాయణలో ఉన్నారు..
 

అవునా ..
చూద్దామని వచ్చానే..
కాసిని నీళ్ళియ్యవా..
ఎండనపడి వచ్చాను..
దాహంగా వుంది..
అడిగాడు అతను..
 
ఏమిటీ నీళ్ళే..?
కిలో మీటరు దూరం  ..
ఎండలో ఇసుకన నడిచి చూడు ..
రాముడు కనిపిస్తాడు..
కూజాడు నీళ్ళున్నాయ్ ..


ఆ నీళ్ళు నీకిస్తే ..
మేమేం తాగాలట..
స్వామికి డిస్టర్బ్ అవుతుంది.. 
వెళ్ళు..
అన్నాడట ..

ఇక్కడ రఘూత్తముని 
గురు భక్తి చూడండి..
 

మనకు ఓ శ్లోకం ఉంది.                             
నాస్తి గంగా సమం స్నానం ..
నాస్తి రూపం గురోః సమం..
నాస్తి గాయత్ర్యాః మంత్రం..
న మాతుః పర దైవతం..
 
ఈ లోకంలో గంగ కంటే పవిత్ర స్నానం ..
ఈ నదికీ వర్తించదు..
గందా నదిలో స్నానం చేస్తే..
ఇంక ఏ నదిలో ..
స్నానం చేయక పోయినా పరవాలేదు..


గురువు కంటే ..
ఈ లోకంలో ఎవరు గొప్ప వ్యక్తి కాదు...
గాయత్రి కంటే..
 గొప మంత్రం యేదీ లేదు..
తల్లికి మించిన దైవం లేదు..
అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
పేగు బంధం ..

ఎప్పుడు బాధ కలిగినా ..
"అమ్మా .."
అంటాం..
తల్లిని ప్రకృతి మనకు పరిచయం చసింది..
 

అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
యే ఒక్కటి పట్టుకున్నా..
పరమాత్మ వశుడవుతాడు.. .

 
కొంతసేపటి ..
అయ్య పారాయణ ముగిసింది..
ఎవరొచ్చారు..?
ఎవరో ..
మీ పేరు చెబుతూ ..
కడప నుంచీ పుట్టపర్తి నారాయణాచార్యులొచ్చారు..
ఎక్కడా ..
ఎక్కడా.. 
అని అందరినీ అడుగుతున్నాడు..స్వామీ
 
ఇక్కడ కొచ్చి..
దాహంగా వుంది ..
మంచినీళ్ళివ్వమన్నాడు..
నేను ఇవ్వలేదు..
 
ఇక్కడ నన్నెరిగిన వాళ్ళెవరున్నారు..?
ఏమో స్వామీ..
ఓరి దరిద్రుడా ..
ఎంత పని చేసావురా..
వచ్చిన వాడు శ్రీరామ చంద్రుడేరా..

అవునా..?
నా పేరు అడుగుతూ..
వెతుకుతున్న వాడు ..
ఆయన కాక ఇంకెవరు..?
మనం ఆయనను పారాయణతో పిలిస్తే..
ఆయన మన పేరు పిలుస్తూ వచ్చాడురా..
 
అని తిట్టుకుంటూ ..
ఆ ఎర్రటి ఎండలో ..
కణ కణలాడే ఇసుక లో వట్టి పాదాలతో పరిగెడుతూ
అరుస్తూ ..
పిలుస్తూ..
ముందు..
అయ్య ..


వెనక..రఘూత్తముడూ..
 


27 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు త్రిపుటి ఆవిష్కరణ సభ అందరూ ఆహ్వానితులే..



మా అక్కయ్య ..

అయ్య ..
వివిధ గ్రంధాలకు వ్రాసిన పీఠికలను ముద్రించింది..
 
ఎన్నో యేళ్ళనుంచీ ..
ప్రాణప్రదంగా ..
పట్టుచీరలకంటే ..
బంగారం కంటే ..
పదిలంగా ..
సం రక్షించిన..
విలువైన ..
అయ్య పీఠికలను ..
వెలుగులోకి తెస్తూంది..
 
అయ్య..
ఒక్కో పుస్తకముపై వ్రాసిన అభిప్రాయాలు 
ఎంత నిక్కచ్చిగా..
ని ర్ద్వంద్వంగా ..
నిష్కర్షగా వున్నాయోనే ..
అంటుంది అది...!!
 
కేవలం..
పీఠికలు చదివితేనే ..
మనం ఎంతో సంతృప్తిని పొందుతాం ..
 
ఆరుద్ర వంటి ..
ప్రతిభావంతుల పుస్తకాలలోనూ ..
అయ్య వ్రాసిన పీఠికలు..
వజ్రాల్లా మెరుస్తాయట..!!
 
ఆ పుస్తకం ఆవిష్కరణ ..
త్యాగరాయ గాన సభలో ..
మార్చి 26న జరిగింది.
చదవాలని పిస్తూందా..??
 
ఎప్పటివో అయిన కాగితాలను ..
పసిపాపల్లా పట్టుకుని..
ఫెయిర్ చేసి..
ముద్రణ కిచ్చి..
తప్పులు దిద్ది..
ముద్రణ జరిగి ..
ఫళ ఫళ లాడుతూ బయటికి వస్తే ..
కన్న బిడ్డల్ని చూసుకున్నంత ఆనందంగా..
ఉంటుంది కదూ..
 
ఊహూ..
మాకు..
మా అయ్యనే మళ్ళీ చూసుకున్నంత ఆనందం..
 
ఇరవై సంవత్సరాలనుంచీ..
మా అయ్య సేవను ..
ఓ తపస్సులా చేస్తూందది..!!
 
కాదు..
కన్న తండ్రి ఋణం తీర్చుకుంటూంది.. 

మార్చి 26 నాటి సాయంత్రం 
త్యాగరాయ గానసభలోని 
సుబ్బారావ్ కళావేదిక లో  

పుట్టపర్తి వారి 1930 ల నాటి ..
అపురూప వ్యాసాలు ..
వివిధ గ్రంధాలకు ..
వారు వ్రాసిన పీఠికలు ..
పుట్టపర్తి వారు నిర్వహించిన ..
"పద్యంబొక్కటి చెప్పి.."
 అన్న శీర్షికన వచ్చిన..
 పంచదార గుళికల వంటి పద్య వ్యాఖ్యానాలు..

కలగలిసిన కలబోత ..
నాలుగు నెలలలుగా శ్రమించి..
తీర్చి దిద్దిన  మా అక్కయ్య..
కలల కలహంస "త్రిపుటి"యై ..
వయ్యారంగా..
కె వి రమణ గారి చేతుల మీదుగా..
ఆవిష్కృతమైంది...

సభలో..
"రాధా మాధురి" గారలు..
 పుట్టపర్తి వారి కృతులను మధురంగా ఆలాపించారు. పుట్టపర్తి అనూరాధ వ్యాఖ్యానం..
 అందంగా వానికి  అమరింది..

సర్వశ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్
గారి అధ్యక్షతన .. 
కె వి రమణ గారు ..
రంగాచారి గారు ..
వాడ్రేవు చిన వీర భద్రుడు గారు ..
వక్తలుగా ప్రసంగించారు..
కె వి రమణ గారు మాట్లాడుతూ..
"విమర్శకులలో ..
ప్రమాణాలు ఉన్నాయో ..?లేదో..?
 ప్రశ్నార్థకమైందీనాడు..
అర్హత ఉన్నా ..
లేకపోయినా.. 
ఆకాశానికెత్తేయటం..
అంతవాడు ..
ఇంతవాడని ..
పొగిడేయటం..
విమర్శ ఎలా రాయాలి..?
మనం వ్రాసే విమర్శ ..
నిష్పక్ష పాతంగా నిష్కర్షగా ఉందా..?
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వ్రాసిన విమర్శలు..
అసలు విమర్శ ఎలా వ్రాయాలి ..?
ఎలా ఉండాలి..?
అన్న దానికి ప్రామాణికంగా నిలుస్తాయి.."
 
ఈ అభిప్రాయం కె.వి .రమణ గారిది..
ఈయన సీనియర్ ఐ ఏ యస్ ఆఫీసర్
 భక్తి చానల్   TTD కి EO గా వుండినారు 
రక రకాల ఉన్నత పదవులు నిర్వహించారు..
 
పుట్టపర్తి సాహితీ పీఠం పెట్టినప్పుడు.. 
నిధుల సేకరణలో ..
ఈయానా కొంత శ్రమించారట..
"నిధుల సేకరణ కోసం ..
బిక్షా పాత్ర పట్టుకొని..బయలుదేరాం ..
స్వీట్సపుల్లారెడ్డి ..
వద్దకెళ్ళాం 

ఆయన ..
అంత సంపాదించినా ..
ఒక ఇరుకైన చిన్న గదే ఆయన నివాసం. 
ఒక చెక్క బెంచీ పై ఆయన పడక ..
కుండలోని నీరే ఆయన తాగటం..
ఇంత నిరాడంబర సాధారణ జీవితాన్ని ..
అప్పటికీ ఆయన గడిపేవారట..
 
వీరు వెళుతూనే
ఆ గదిలోనికి తీసుకెళ్ళారు..
ఆ బెంచీ పై కూచో పెట్టారు.
ఆ కుండలోని నీరు వీరే ముచుకు తాగారు.
ఎంత సంపాదించానని కాదు..
నేను జీవితాన్ని ఎలా మొదలు పెట్టానో..
 అదే పరిస్థితుల్లో వుండటం నాకిష్టం..
అన్నారట..
ఇది చూచి 
నిరాడంబరతని అందరూ నేర్చుకో వాలని ఆయన చెప్పారు..
 
"శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ.."
దీంట్లో ఒక తప్పుంది..
పుట్టపర్తి వారు 
దీన్ని గురించి ఈ గ్రంధం లో వ్యాఖ్యానించారు..
కానీ ..
ఎన్నో వందల సంవత్సరాలుగా ..
దీన్ని ఇలానే  ..
మనం చెప్పుకుంటున్నాం..
అది యేమిటో.. నేను చెప్పను..
కావాలంటే పుస్తకం కొనండి..
కానీ..
యెలాగో సంపాదించవద్దండి..
అన్నారు వారు.
 
రాఘవన్ గారు మాట్లాడుతూ..
దీన్ని కొన్నా..
లేక.. గౌరవంగా పుచ్చుకున్నా..
బీరువాలకు అలంకార ప్రాయాలుగా..
 వీటిని పెట్టకండి.. 
వీలైతే రోజుకు కనీసం..
ఒక వ్యాసం చొప్పున చదవండి ..
ఎందరో గొప్ప వారి ఇళ్ళల్లో ..
అపురూపమైన పుస్తకాలు..
కనీసం..
 పేజీలు కూడా తిప్పకుండా ..
అలమారల్లో
అలంకార వస్తువులుగా ..
అలా పడున్నాయ్ ..
అని వారు విజ్ఞప్తి చేసారు.


దూరదర్శన్ డైరెక్టర్..
శ్రీమతి శైలజా సుమన్ గారు..
అచ్చం తెలిగింటి ఆడపడుచులా ఒద్దికగా ..
" మా అయ్య మా అయ్య 
అని ఎప్పుడు చెప్పినా 
ఆమె కళ్ళలో తిరిగే నీటిలో 
తండ్రిపై ఆమెకు కల మహత్తరమైన ప్రేమ 
నన్ను ఆమె తండ్రి గారి గురించి 
తెలుసుకొనేలా చేసింది..
 
అసలు "అయ్య" అనే పదమే
 ఎంతో గమ్మత్తుగా ..హాయిగా..
 ఉంటుంది ఆమె మాటల్లో..
ఈ పుస్తకాన్ని మా మామ గారికి ఇస్తాను..
అని ఆమె ముద్దు ముద్దుగ అందంగా చెప్పారు..
 
అక్కయ్య..
మైకు పట్టుకుంటూనే 

అయ్య ప్రపంచంలోకి వెళ్ళి పోయింది..
మా అయ్యండీ..

 ఒకటి కాదు ..రెండు కాదు..
 పధ్నాలుగు భాషలు..
బజార్లో కాళ్ళకు చెప్పులు ఉన్నాయా..? లేవా..?

 అని కూడా పట్టించుకోకుండా ..
భుజంపై ఒక టవలు వేసుకొని తిరిగే..
పధ్నాలుగు భాషలు ఔపోసన పట్టిన..
 ఆ శ్రీ వైష్ణవ బ్రాహ్మడు ..
పండిత ప్రకాండులకు చెమటలు పట్టించిన వాడు..
మా చెల్లెలు బ్లాగులో రాసింది..

 నిర్గంధ కుసుమం అని
 నిజానికి ..
మేమందరూ 
కాదు ..కాదు..
మనందరూ నిర్గంధ కుసుమాలమే..
 

అంతటి మనిషిని ..
సరిగా ఉపయోగించుకోలేదు..
అని ఒక్కసారిగా భావావేశానికి లోనై..
ఏడవటం మొదలు పెట్టింది..
అయ్య అముద్రిత పుస్తకాలను..
బయటికి తీసుకు రావటం..
 నా బాధ్యత ..
అని చిన్నప్పుడే నేను అనుకున్నాను..
 
ఇక్కడ ఒక్కరున్నారు..
ఆయన పేరు శ్రీ శైలం..
 అయ్యకు అపర భక్తుడు..
ఆయన ఏమి ఋణానుబంధమో ..?
మొదటినుంచీ ..
అంటే..గత నలభై.. యాభై ..
సంవత్సరాలనుంచీ.. 
అయ్య గురించి 
ఎక్కడ ఏ రచనలు ..వ్యాఖ్యలు.. సన్మానాలు..
పేపర్లలో వచ్చినా..
భగవంతుని ప్రసాదాల్లా 
వానిని అపురూపంగా దాచి వుంచాడు..
తమ స్వవిషయాలు కూడా
ఇంత పదిలంగా దాచుకోరు..
ఆయన నన్ను నమ్మి
తన ఆస్తిని నాకు ఇచ్చారు..
ఇంకా పోస్ట్ లోనూ..
 నాకు ఎంతో విలువైన సమాచారాన్ని పంపించారు..
శ్రీశైలం గారినుంచీ పోస్ట్ వచ్చిందంటే ..
నాకు నా బాధ్యత మరింత గుర్తు వచ్చేది..
అని చెప్పిందక్కయ్య..
 
శ్రీ శైలం గారు మాట్లాడుతూ..
"ఇంటికి సామాను తెస్తే ..
ఆ పొట్లాలో 
అయ్య సమాచారమేమైనా వుందా..?
 అని చూసేవాడిని..
ఒకసారి హోటలులో ..
కాఫీ తాగుతుంటే ..
ఎవరో చూచిన పేపరులో ..
పుట్టపర్తి వారి సమాచారం చూచాను.. 
వారిని అడిగి తీసుకున్నాను.. 

ఎన్నో లైబ్రరీలకు పోయి ..
ఆ గ్రంధ సంద్రంలో..
 పుట్టపర్తి వారిని గురించిన..
 పుస్తకాలకొరకు శోధించే వాడిని..
అంటూ చెప్పుకొచ్చారు..
 
"అవును లేవయ్యా ..
నీవు రెవెన్యూలో పని చేసావ్ గా ..
అన్నీ గుర్తున్నాయ్"
అని రమన గారు జోక్ చేసారు..


వీడు నా అపర భక్తుడు..
నేను తుమ్మినా రికార్డు చేస్తాడు..
అని పుట్టపర్తి వారు 

అనే వారట సరదాగా..
అక్కయ్య ..
తన కూతురు వంశీప్రియ పేరునా
 శ్రీశైలం గారి పేరునా 
పుస్తకాన్ని ముద్రించింది..

 
వాడ్రేవు చిన వీర భద్రుదు గారు ..
పుట్టపర్తి వారి గురించి..
ఎంతో ఉద్వేగ భరితంగా.. ప్రసంగించారు.
పుట్టపర్తి వారిని చూస్తే నాకు అభిమానం కాదు..
అసూయ..
ఆ అసూయ తోనే 
నేను వారి గ్రంధాలను ఒక్కొక్కటి పది సార్లకు పైగా చదివాను..
అన్నారు..
బుధ్ధ చరితమును చదివిన తరువాత..
అంతకు ముందు బుధ్ధుని గురించి ..
మన  అభిప్రాయాలు తుడుచుకు పోయి..
 ఒక కొత్త కోణంలో బుధ్ధుని మనం దర్శిస్తాం..
 
ఈ గ్రంధమునకు మూల లేఖకులు
 శ్రీ ధర్మానంద కోశాంబి గారు..
 పాళీ భాషలో వీరు గావించిన శ్రమ..
 అమోఘమైనది..
పాళీ గ్రంధములను..
త్రిపిటకములను..
నిష్కరుణగ నవలోకించి ..
ఋగ్వేదము..
మనుస్మృతి ..
విష్ణు శాస్త్రి చవళూణ్కర్ గారి బాణ భట్ట చరిత్ర ..
మొదలైన గ్రంధాలను అనుసరిస్తూ ..
మూలంలోని పరిమళాలను జారిపోనివ్వకుండా 
అంత తాజాదనంతోనే 
మనకందించారు పుట్టపర్తి వారు..
 
రుచీ పచీ లేని ఇంగ్లీషు అనువాదాలతో
 మనసు చెడిన .. .నన్ను
పుట్టపర్తి వారి అనువాద మధురిమ కట్టి పడేసింది..

వారి ఎన్నో కోట్లు జపం చేసారన్నారు..
 వారికి..
 పరమాత్మ సాక్షాత్కారం జరగక పోతే..
 సంతోషించే వారిలో నేనొకణ్ణి..
 
వారికి సాక్షాత్కారం కాలేదు కాబట్టే
 ఆ ఆవేదనా మధనం నుంచీ 
ఇలాంటి అమృత రాశులు పుట్టాయి..
అదే వారికి సాక్షాత్కారం జరిగుంటే
ఈ అమూల్య సంపద మనకందేది కాదు..
అన్నారు..
 
పుట్టపర్తి వారిని ..
ఎన్నో సంవత్సరాలుగా..
ప్రతి అడుగులోనూ...
పరిశీలించి.. పరిశోధించి..
ఆయన పై అభిమానాన్ని ..
పుట్టపర్తి నారాయణాచార్యులు..
 ప్రాంతీయకవి కాదు.. 
జాతీయ కవి కాదు 
విశ్వకవి..
కంప్యూటరు మెమొరీని తలదన్నే విధంగా
వారి మేధశ్శక్తి విరాజిల్లింది..
 దాన్ని అందుకోలేక పోవటం మన దురదృష్టం.. 
వారికి ఆ అవార్డు రాలేదు.. 
ఈ అవార్డు రాలేదు.. 
అని చింతిల్లనవసరం లేదు.. 
అవార్డులకు సైతం అందని ప్రతిభ ఆయనది.. 
అవ్వార్డు లన్నవి ..
ఆయన దృష్టిలో చాలా చిన్న విషయాలు  

అంటూ..
పుట్టపర్తి వారి గ్రంధాలను..
ఈ కాలంలో ఎవ్వరు చదువుతారు అనుకోకండి..
వాటిని మహా ప్రసాదాలుగా స్వీకరించి..
శిరస్సుపై పెట్టుకొనే ..
అభిమానులు ఎందరో ఉన్నారు..
అని ..
అక్కయ్యకు ..
ఎంతో మనోబలాన్ని వారు అందించారు..
పుట్టపర్తి వారికి ..
ఇటువంటి పుత్రిక ఉండటం ..
ఆయన అదృష్టం..
అంతటి తండ్రిని కలిగివుండటం..
ఈమె అదృష్టం ..
అని కె వి రమ గారు చత్కరించారు..
అయ్యకు జ్ఞానపీఠము రాలేదని ..
బాధపడిన అక్కయ్యను ఓదారుస్తూ..
రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారు
జాతిపితకూ నోబెల్ రాలేదమ్మా..
అనగానే ..
సభలో నవ్వుల పువ్వులు విరిసాయి..
అక్కయ్య తడికళ్ళతో హాయిగా నవ్వింది..
 
సభలో..
మొదట్లో..
అక్కడక్కడా ..
కనిపించిన జనం..
 నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ..
 చివరి వరకూ ఉండి..
 పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి ..
మహనీయుని గురించి మైమరిచి విన్నారు..
 
వయసు మళ్ళిన వారు..
 ఆనాటి మధుర జ్ఞాపకాలను ..
గుర్తుకు తెచ్చుకున్నారు..
 
అక్కడక్కడా ..
తమకు నచ్చిన ..
విషయ ప్రస్థావన జరిగినప్పుడల్లా..
కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని తెలిపారు.
 
చివరగా ..
కొసమెరుపు..
పక్కనే త్యాగరాయ గాన సభలో ..
డా సి నారాయణ రెడ్డి గారి సినీ గానం..
అక్కడికి డా సి నా రె వచ్చారట..
పక్కనే ధూం ధాం గా 
జరుగుతున్న సభను పరికించారు..
అయ్య పేరున కట్టిన బ్యానరును చూచారు..
ఏమిటీ సభ అన్నారు..
త్రిపుటి ఆవిష్కరణ..
లోనికి రాలేదు.. 

"త్రిపుటి"
ఒక పుస్తకం తెప్పించుకున్నారట..
ఎవరితోనో..






 

24 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల చేతి వ్రాత కథ..





అయ్య చేతి వ్రాతను గురించి..
చెప్పాలనుకున్నాను..
అయ్య మనలాగా..
బొటన వేలూ.. 
చూపుడు వేలూ.. 
మధ్య వేలూ ..
మూడింటితో ..
పెన్నుని పట్టుకుని వ్రాయలేరు..

చూపుడు వేలి పైకి లేపి ఉంచేవారు..
బొటన వేలూ ..
మధ్య వేలూ ..
క్రింది అనామిక..
చిటికెన వేలూ.. 
పెన్నుని పట్టుకొనేవి..
అలా ఎందుకో తెలియదు..

పెన్ను లంటే ..
మన పెన్నులు కాదు..
కలాలు..
ఇప్పుడు దొరుకుతాయో లేదో తెలియదు..
ఆ కలం పట్టుకుని..
సిరా బుడ్డీ కరణం బల్లపై పెట్టు కుని ..
ఆ బుడ్డీ కదలకుండా ..
అమ్మ అటొక చిన్న చెక్కా ..
ఇటొక చిన్న చెక్కా ..కొట్టించింది..

అలా..
బుడ్డీ లో కలాన్ని అద్దుకుంటూ..
 కలంతో వ్రాసే వారు..
రాసే టప్పుడు..
చేయి చిన్నగా వణుకుతూ ఉండేది..
తదేకంగా ..
అతి దగ్గరగా ..
పేపరును చూస్తూ వ్రాసేవారు అయ్య.

అయ్య తెల్ల కాగితాలను కూడా..
చాలా జాగ్రత్తగా ఉపయోగించే వారు..
ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు..
పేపరును నాలుగు భాగాలు చేసి ..
అందులో ముఖ్యాంశాలను నోట్ చేసుకొనేవారు..
దాని
ని ట్యాగుతో గట్టిగా ముడి వేసి..
 జుబ్బా  జేబులో పెట్టుకొనేవారు..

అయ్య వ్రా త విధానం..గురించి 
వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు..
ఎంతో చక్కగా రాసారు..
ఆయన్ని..
మా ఇంటికి వస్తూ పోతూ ఉండగా చూస్తూ ఉంటిని ..

కానీ..
అయ్యకు వారికీ ఇంతటి అనుబంధం ఉందని..
వారి వ్యాసం చదివాకే అర్థమైంది..
ఇవన్నీ..
గతజన్మ ఋణానుబంధాలు అంటారు అయ్య.. 

రాధా.. 
పైకి పోయి ..
ఎర్ర రంగు బుక్కు పొడుగ్గ వుంటుంది..
తీసుకు రాపో..
అని చెప్పే వారు కింద కూచుని వున్నప్పుడు..
నేను రయ్యిన పరుగెత్తి..
గవాక్షి లోంచీ..
ఆ పుస్తకాన్ని అయ్యకు చూపించేదాన్ని..
అయ్యా ఇదేనా అని..
అది కాదు ..
ఇంకోటి దాని పక్కనే వుంటుంది చూడు..

వెంటనే దాన్ని తెచ్చి ఇవ్వడం ..

నేను పెరిగే కొద్దీ ..
అయ్య సుందరకాండ ..
నాకు పాఠం చెప్పినారు..
షేక్స్ పియర్..,
ఠాగూర్..
గీతాంజలి..,
మిల్టన్..,                                  
సౌందర్య లహరి..
నెహ్రూ ఇందిరకు వ్రాసిన ఉత్తరాలు..
అరవిందో ఊర్వశి..
ఇంకా..
ఇంకా ..
ఎన్నో స్తోత్రాలు ..
శ్రీ సూక్తం.. పురుషసూక్తం చెప్పించారు..



బ్లూ ..రెడ్.. గ్రీన్..
ఇంకు బాటిల్సు తయారుగా ఉండేవి..
అమ్మ ..
అయ్య ఇంకు బాటిల్సు ..
కలాలూ.. వానికి రక రకాల నిబ్బులూ..
మొదలుకొని ..
అయ్య తాజమహలు బీడీ కట్టలూ..
 అగ్గి పెట్టెలూ ..
తెల్ల కాగితాలూ..
ట్యాగులూ ..
మొదలైనవి తెప్పించి వుంచేది..
 
బ్లూ ఇంకుతో..
వణుకుతున్న చేతులతో ..
వ్రాసుకుని ..
కొన్నింటిని ..రెడ్ అండర్ లైన్లూ..
గ్రీన్ అంర్ లైన్లూ..చేసుకొనేవారు..

ద్వైత పారిజాతాన్ని..
అయ్య వ్రాసుకున్న పధ్ధతిని..
వల్లంపాటిగారు వివరించిన పధ్ధతిని చదివి..
ఒడలు జలదరించింది..

లావుపాటి ..
దాదాపు ..
అయిదు వందల పేజీలు.. వెయ్యి పేజీలు..
ఎన్నో వుండేవి..
 ఆ  పుస్తకాలలో ..
అయ్య శారీరక.. మానసిక ..
తపన  ఎంత దాగి వుందో ..
ఇప్పుడు వాటిని ..
ఒక్కసారి స్పృశించినా చాలు..
మనకు ..
అయ్య ఆశీర్వచనాలు అందుతాయని అనిపిస్తుంది..
 
ఆముక్త మాల్యదను గురించి మాట్లాడమని..
బళ్ళారి వాళ్ళు పిలిచారట..
అందులో ..
వైష్ణవ తత్వాన్ని గురించి ..
అయ్య చక్కగా మాట్లాడారు..
 
అయితే ..
సభ తరువాత..
ఒకతను అయ్యను కలిసాడు..
మీ ఉపన్యాసం వింటే..
మీరు అద్వైతమూ ..విశిష్టాద్వైతమూ  ..
బాగా చదువుకున్నారే కానీ ..
ద్వైతాన్ని ..
అంత శ్రధ్ధగా చదువుకోలేదని తెలిసింది..
 
మీరు ద్వైతాన్ని బాగా చదువుకొని వుంటే..
మీ ఉపన్యాసం ఇంకో విధంగా ఉండేది..
అన్నాడట..
 
ఆయన ..
అయ్య కంటే వయసులో పెద్ద వాడు
అయ్యకు కోపం రాలేదు..
"నన్ను విమర్శిస్తావా..?" 

అని చిరాకు పడలేదు.
సిగ్గు పడ్డారట..
 
నిజమే..
నేను ద్వైత సిధ్ధాంతాన్ని..
శ్రధ్ధగా అధ్యయనం చేయలేదు.. 
అని ..
కర్నాటక లోని ఒక మఠం నుంచీ ..
ఆ ద్వైత పారిజాతాన్ని తెప్పించి చదవసాగారు..


ఈ అనుభవాన్ని..
వల్లంపాటి గారి మాటల్లోనే ..
చదవండి.. 
వారికి ..
చదువు ఎంత తీవ్రమైన వ్యసనమో 
సూచించటం కోసం ఒక సంఘటన చెబుతాను.
వారి చదువును గురించి.., 
పాండిత్యాన్ని గురించీ ..
చెప్పటానికి నా చదువూ.., 
పాండిత్యమూ ..సరిపోవు. 

వారి విజ్ఞాన దాహానికి హద్దు లేదు. 
ఏ భాషలో ఏముందో..??
అది రాకపోతే ..
మనకు ఏం తెలియకుండా పోతుందో ..??
అన్నట్టుగా ..
భాషలు నేర్చుకునేవారు, 
చదువుకునేవారు. 


వారికో చిత్రమైన అలవాటు ఉండేది. 
అచ్చుపుస్తకాన్ని చూస్తే ..
వారికి ఆత్మీయత అంతగా కుదిరేది కాదు.
తాను మళ్ళీ ..మళ్ళీ..
చదవాలనుకున్న పుస్తకాల్ని..
తానే స్వయంగా కాపీ చేసుకునేవారు. 
ఆ పుస్తకం మీద ఎర్రసిరాతో ..
అర్థాలూ, వ్యాఖ్యలూ రాసుకునేవారు.
.
 అలా వారు కాపీ చేసుకున్న..
 కొన్ని షేక్స్పియర్ నాటకాలూ.., 
ఇతర గ్రంథాలూ..
ఇప్పుడు బ్రౌన్ మెమోరియల్ గ్రంథాలయం..
(కడప) లో ఉన్నాయి. 
వాటిని చూస్తే ..
పుట్టపర్తివారి ..
పాండిత్యం వెనక ఉన్న శ్రమ ఎంతటిదో అర్థమవుతుంది. 


ఇరవయ్యవ శతాబ్దపు కవుల్లో..
 పుట్టపర్తివారిని ..
సుదూరంగా పోలిన పండితుడు కూడా లేడన్నది..
 నా దృఢవిశ్వాసం.

వై.సి.వి రెడ్డి వారిని గురించి..
 “కవిత్వం రాసేదానికి ..
ఇంత చదువుకోవాల్సిన అవసరం లేదప్పా..” 
అనేవారు.


1975-76 ప్రాంతంలో..
 ఒక రేడియో ప్రోగ్రాం రికార్డింగు ఉండి..
కడపకు వెళ్ళాను...
 ఆకాశవాణి కేంద్రంలో అనుకోకుండా..
శతావధాని నరాల రామారెడ్డి కలిశారు. 
కాస్సేపు కబుర్లు చెప్పుకుని..,  
భోజనం చేసి,
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..
 పుట్టపర్తివారింటికి వెళ్ళాం..
కనకమ్మ గారు ఎదురుపడి ..
ఆప్యాయంగా ఆహ్వానించి.., 
“అయ్యగారు మిద్దెమీదున్నారు, వెళ్ళండి” 
అన్నారు. 

ఇద్దరం మేడ మీదికి వెళ్ళాం.., 
పుట్టపర్తి వారు..
తన మామూలు పద్ధతిలో..
కరణం డెస్కు ముందు కూచొని..
ఏదో వల్లె వేస్తున్నట్లు కనిపించారు.
“ఒరే దొంగవెధవలిద్దరూ ఎక్కడ కలిసినార్రా?” 
అని ఆహ్వానించారు. 
చెప్పాం. 
క్షేమసమాచారాల పలకరింపులైపోయాక -


“ఇదేదో చాలా పెద్ద పుస్తకం పట్టారే..” 
అన్నాను 
డెస్కు మీదున్న ..
బండ లాంటి ..
పాత సంస్కృత గ్రంథాన్ని చూపుతూ.



పుట్టపర్తివారు
 ఆ గ్రంథాన్ని ఆప్యాయంగా తాకుతూ అన్నారు.
“ఒరే ఈ మధ్య ఒక సంగతి జరిగిందిరా. 
బళ్ళారి వాళ్ళు పిలిచినారు... 

వెళ్ళినా...
’ఆముక్తమాల్యద’ను గురించి.., 
ముఖ్యంగా..
 అందులోని వైష్ణవ తత్వాన్ని గురించి, 
బాగానే మాట్లాడినా...
సభ తరువాత..
ఒకతను కలిసినాడు. 
అతడు నాకంటే పెద్దవాడు..
అతడు ..
“మీ ఉపన్యాసం వింటే మీరు అద్వైతమూ,
 విశిష్టాద్వైతమూ..
బాగా చదువుకున్నారే కానీ..
ద్వైతాన్ని అంత శ్రద్ధగా చదువుకోలేదని తెలిసింది. 
మీరు ద్వైతాన్ని బాగా చదువుకొని ఉంటే ..
మీ ఉపన్యాసం మరొక రకంగా ఉండేది.”, 
అన్నాడు. 

నిజమే...
నేను ద్వైత వేదాంతాన్ని..
అంత శ్రద్ధగా అధ్యయనం చేయలేదు. ..
చాలా సిగ్గనిపించింది... 

ఈ పుస్తకం పేరు “ద్వైత పారిజాతం”
 దీన్ని కర్ణాటకలో...
 ఒక మఠం నుంచి..
 తెప్పించి చదువుతూ ఉన్నా.
 మరో రెండు నెలల్లో పూర్తయిపోతుంది.”

పుట్టపర్తి వారి దృష్టిలో..
 “చదవటం”..
అంటే ఏమిటో..
చాలామందికి తెలియదు.. 
వారు “ద్వైత పారిజాతం”ను ..
ఎలా చదువుతూ ఉన్నారో చూస్తే ..
వారి చదవటం కొద్దిగా అర్థమౌతుంది. 

మొదట మూలంలో ..
నాగరలిపిలో ఉన్న శ్లోకాన్ని ..
తెలుగు లిపిలో కాపీ చేసుకోవడం.., 
తరువాత సంస్కృత వ్యాఖ్యను చదివి.., 
అర్థం చేసుకొని.., 
అందులోని ప్రధానాంశాలను..
తెలుగులో తన నోట్ బుక్ లో రాసుకోవటం, 
ఆ తరువాత ఆ శ్లోకాన్ని కంఠస్థం చేయటం, 

అంతకు ముందు..
కంఠస్థం చేసుకున్న శ్లోకాలతో దాన్ని కలిపి 
మననం చేసుకోవటం.., 
మరో శ్లోకానికి వెళ్ళటం...
వారు సంస్కృత మహాకవుల్ని చదివినా..
షేక్స్పియర్ నాటకాలను చదివినా ..
“పారడైస్ లాస్ట్” ను చదివినా..
 ఇలాగే “చదివారు”. 

చదవటమంటే..
ఆ గ్రంథాన్ని ఆమూలచూడంగా..
తన స్మృతిపేటికలో భద్రపరచుకోవటం..
పిలిచినప్పుడు పలికేలా ఉంచుకోవటం..

“ఆయనెవరో..
 మీరు ద్వైతవేదాంతం బాగా చదువుకోలేదంటే..
 దాని మీద పడిపోయారు...
 ఇలా మీ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు..



మీ సొంత సాహిత్య కృషిని కూడా మానేశారు... 
ఇదేం పద్ధతి..? 
నేను మీకింకేదో రాదంటాను...
మీ చదువూ.., రాతా ..,
మానేసి దాన్ని నేర్చుకుంటూ కూర్చుంటారా?” 
అన్నాను.
“ఏం రాదంటావూ?” అన్నారు.
“న్యూక్లియర్ ఫిజిక్స్ రాదంటాను. 
దాన్ని నేర్చుకుంటారా?” అన్నాను.
రామారెడ్డి హాయిగా నవ్వారు.



పుట్టపర్తి వారు..
గంభీరంగా మారిపోయారు. 
ఒకటి ..
రెండు ..
నిముషాలు నిశ్శబ్దంగా ఉండిపోయి..
“నేను చేస్తున్న సాహిత్య కృషికి
 నువ్వు చెప్పిన న్యూక్లియర్ ఫిజిక్స్ 
 అవసరమని నిరూపించరా...
అది తెలిసినవాణ్ణి ఆశ్రయించి ..
దాన్ని నేర్చుకుంటాను.” 
అన్నారు. 
నేనూ.., 
రామారెడ్డి.. అవాక్కయిపోయాం.
గుండె ఝల్లు మంది కదూ..??

ఇవన్నీ 
గతజన్మ ఋణానుబంధాలు 
అంటారు అయ్య..
అయ్యను..
అంత ప్రాణప్రదంగా ప్రేమించడానికి 
అయ్య వారికేం ఇచ్చే వారు..??
 
గుర్రప్ప అని..

ఒక కాంపౌండెర్..
ఆయనే మాకు ఆస్థాన వైద్యుడు..
పొద్దునా ..సాయంత్రం..
ఇంటికి వచ్చి..
అయ్య ఉంటే అయ్య కో..అమ్మ కో ..
నమస్కారం చేసుకొని పోయేవాడు..
 
ఇంట్లో ఎవరికి యే జబ్బు వచ్చినా 
గుర్రప్ప రావలసిందే..
చేతిలో కాసులు పడంది
 ఎవరైనా ఏ పనైనా చేస్తారా..??
అమ్మ ఆయన కేం ఇచ్చేది..??
పండో ఫలమో..
అంతే..
అర్థరాత్రీ ..
అపరాత్రీ.. 
ఎప్పుడు పిలిస్తే అప్పుడు..
అతని కిట్టేసుకుని ..
తన సైకిలులో సొంత కొడుకులా పరుగెత్తి వచ్చేవాడు..
ముఖాన ఇంత విసుగు గానీ ..
చిరాకు గానీ..
అబ్బే..
లేనే లేదు..
వీరికి సేవ చేయటం నా ధర్మం అన్నట్లు..
యేదో మంత్ర బధ్ధుడిలా..


అమ్మ చనిపోయే వరకూ..
అతను పక్కనే వున్నాడు.
అతను దగ్గరే ఉన్నాడు..
ఎందుకు..??
ఈ జన్మకు సంబంధించి నంత వరకూ ఆలో చిస్తే ..
యేదో గురుత్వం..
కాస్త విశాలంగా ఆలోచిస్తే..
గత జన్మ ఋణానుబంధం..
కాదంటారా..?