10 డిసెం, 2013

'భారతదేశం పట్టనంతటి కవి '

ప్రదేశం ఆలంపూర్..
జరుగుతున్నది మహామహులు పాల్గొనే సభ..
అధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్ణన్..
 

ఆ సభలో పుట్టపర్తి ఒక వాణి వినిపించారు
విషయం తెలుగు కన్నడముల చుట్టరికము
పంపని భారతన్నీ నన్నయ భారతాన్నీ పోల్చే ప్రయత్నం
 

చాళుక్యులు పంపనిచే భారతము ననువదింపజేసి 
తమ కీర్తికాయమున కాయువు పోసుకొన్నారు
మరి రాజనరేంద్రుని ప్రోద్బలంతో నన్నయ 

యీ కార్యానికుపక్రమించాడు
 

చాళుక్య వంశాన్ని గొప్పగా వర్ణించే పంపడు
భారతం లో తనకాశ్రయమిచ్చిన అరికేసరినే 

అర్జునునిగా ధ్వనింపజేస్తూ రచన సాగించాడు
మొన్నటికి మొన్న 

మన యన్ టీ ఆర్ 
ట్యాంక్ బండ్ పై పలు విగ్రహాలు ప్రతిష్టింపజేస్తే 
అందులో ప్రతి ముఖములోనూ 
ఆ యన్ టీ ఆర్ కవళికలే పలికినట్లు

పంప భారతాన్ని పలుమార్లు 
తన కార్యనిర్వహణలో భాగంగా చదివిన నన్నయ్య
తానూ అతనికన్న మెరుగుగా ధ్వని మార్గమున 

యీ పని చేయాలనుకున్నాడు
ధర్మరాజుతో రాజరాజును పోల్చే ప్రయత్నం చేశాడు
 

పంపని భారతాన్ని 
అతడేవిధంగా చేసాడనే పరిశీలనలో 
కొన్ని చోట్ల అనుసరించి 
మరికొన్ని చోట్ల తన పంధాననుసరించి 
నన్నయ్య పనిచేసాడు
 

ఇలా నన్నయపై పంపభారతం ప్రభావముందన్నది నిరూపించే ప్రయత్నం
యీ వాదం తెలుగు వారైన కవులకు నచ్చలేదు
వారు మారువేషం వేసుకున్న కన్నడిగుడని 

పుట్టపర్తిని నిందించారు
విశ్వనాధ కన్నడం నేర్చుకొని పరిశీలించి 
సమాధానం చెబుతానన్నారు
 

కానీ సాహిత్యానికి భాషాభేదం లేదు
తెలుగు సరస్వతి ..కన్నడ సరస్వతి ..వుంటుందా..
కేవలం తెలుగులోనే కూపస్తమండూకాలవడం సబబా..
ఇంతకూ అందరిలో తనదే పైచేయిగా మెలగడం 

పుట్టపర్తి లక్షణం..
 

దానికి ఎంతమంది ఉడుక్కున్నా.. అసూయ పడినా.. సరే
కాదంటే చర్చకు రావలసివుంటుంది

కేవలం తెలుగులో తేలడానికే 
ముష్టియుధ్ధాలూ 
దిక్కుమాలిన రాజకీయాలనాశ్రయించే సాహిత్యకారులు ఇతరభాషలవేపు తొంగిచూచే ప్రయత్నమైనా చేస్తారా.. ?
దానికి తగ్గ సత్తా యెవ్వరిదగ్గరా లేకపోవటం 

పుట్టపర్తి తప్పుకాదు కదా ..!

మన పక్కనున్న కన్నడానికే అదిరి పడితే
మళమాళమేమిటి
తమిళమేమిటి
అసలు మరాఠీ వ్యాకరణమే క్లిష్టం లిపి మరింత క్లిష్టం
ఇక మాగధి అర్ధ మాగధి పైశాచీ
అందుకే పుట్టపర్తిని 'భారతదేశం పట్టనంతటి కవి 'అన్నారు


మరాఠీ  ప్రసిధ్ధ నాటకాలను పుట్టపర్తితో అనువదింపజేసారు అక్కడివారు
 

నిన్ను తెలుగు ప్రజలు గుర్తించకపోతే పోనీ 
మా కేరళ ప్రభుత్వం తరఫున నిన్ను మా ప్రతినిధిగా పంపిస్తాం అంటూ
కేంద్ర సాహిత్య అకాడమీకి తమ ప్రభుత్వం తరఫున పుట్టపర్తిని పంపారు మళయాళీలు
అంతెందుకు..
 వారి మళయాళ నిఘంటు నిర్మాణంలో..

 పుట్టపర్తి కీలక పాత్ర వహించారు వారి అభ్యర్థనపై

 

 

















శ్రీనివాస ప్రబంధ రచనకు తిరుమలేశుని ఆనతి



తిరుమలేశుని మూర్తిలో 
ఎక్కడా మరెక్కడా కానరాని కానగలేని 
అద్భుత సౌందర్యతేజో విశేషం కేంద్రీకృతమైవుంది
 అనంత తేజః పుంజమని చెప్పబడే యీ మూర్తిని 
ఒక్కక్షణం చూచినా తనివి తీరదు
గంటల తరబడి చూచినా తనివి తీరదు
 

ఆయనను దర్శించి వచ్చిన భక్తులందరికీ 
ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా దివ్యానుభూతిని ప్రసాదిస్తాడు
కొందరికి ఆలయమంతా తానై
కొందరికి ఆనందంగా  అప్పుడే విచ్చుకున్న మల్లెమొగ్గ చందాన
ఇంకొందరికి 'ఖబడ్దార్' అని హెచ్చరిస్తూ
ఆత్మీయునిగా చేయందిస్తూ మరికొందరికి
 

అది ప్రతి వ్యక్తీ స్వయంగా అనుభవించాలే తప్ప 
చెప్పటానికి వీలుకాదు.
ఇలా భక్తులకే కాదు
నిత్యమూ శ్రీవారి అర్చన నైవేద్యాలలో సన్నిహితంగా పాల్గొనే 

అర్చక స్వాములకు కూడా 
ఆ మూర్తి 
పరమానందాన్ని పరమాద్భుతాన్ని పరమాశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది
ఆభరణాల సమర్పణవేళల్లో
పుష్పాలంకరణ వేళల్లో
స్వామివారి పాదాలు చేతులూ మెత్తగా సుతిమెత్తగా 

స్పర్శకు తగులుతూ
గగుర్పాటును కలిగిస్తుందట..
వారి నిత్యానుభవంలో 

శ్రీ స్వామి విగ్రహం శిలగా తోచనే తోచదట..
పుట్టపర్తి శతజయంతి కార్యక్రమం దూరదర్శన్ లో జరిగినప్పుడు
నరాల రామారెడ్డి కామిశెట్టి శ్రీనివాసులు పొత్తూరి చాలామంది వచ్చారు
అప్పుడు కామిసెట్టి ఒక విషయం చెప్పారు
కానీ దాన్ని ఎలా ప్రజంట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండినాను
ఇంతలో అక్కయ్య హరికొలువు అనే ఒక పుస్తకం ఇచ్చింది
అందులో అంతా తిరుమలేశుని విశేషాలే
 

అందులోని కొన్ని పంక్తులద్వారా 
కామిశెట్టి చెప్పిన విషయాన్ని మీకు చేరవేస్తున్నాను
అది ఇది


ఒకసారి పుట్టపర్తి కామిశెట్టి తదితరులు 
శ్రీనివాసుని సన్నిఢిలో వున్నారు
స్వామికి దగ్గరగా అతిదగ్గరగా..
పుట్టపర్తికి అర్చకులు హారతి చూపిస్తూ ఒకమాటచెప్పారు
అది యేమంటే..
''స్వామివారు మిమ్మల్ని తన గ్రంధాన్ని పూర్తి చేయమని సెలవిచ్చారు..''
అని
అయ్యకు కాస్త చెవులు వినబడవు
''యేమిరా.. యేమంటున్నారు వారు..''
అని కామిశెట్టినడిగారు
ఆయన వివరించారు
అంతే..
పుట్టపర్తి కన్నీరు మున్నీరయ్యారు
అప్పటికి శ్రీనివాస ప్రబంధం సగం పూర్తయి నిలిచిపోయివుంది
పుట్టపర్తి ఆనందాన్ని పట్టలేక పోయారు
అదే ఊపులో తిరిగివచ్చి ప్రబంధాన్ని పూర్తిచేసారు 

ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో 

అన్న కామిశెట్టి ఇచ్చిన సమాచారం తో ..