27 జులై, 2013

తాన్‌సేన్




మియాఁ తాన్‌సేన్

హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో 

ఘనమైన చరిత గలవాడు. 

ప్రముఖ వాగ్గేయకారుడు. 

మధ్య ఆసియా కు చెందిన 

రబాబ్ 

అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. 

మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. 

బాల్యం పేరు 'రమ్తాను పాండే',

అక్బర్ ఇతన్ని 


మియాఁ (మహా పండితుడు) 


అనే బిరుదునిచ్చి గౌరవించాడు


తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే 


వర్షం పడేదని  చెపుతారు.

 సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది. 

ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్ లలో 

ఇక్కడ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. 

ఇండియా లోని గొప్ప సంగీతకారులు


 దీనిలో పాల్గొంటారు.


1955 లో పుట్టపర్తి వ్రాసిన రాయల నీతి కథలలోని 

మరొక వ్యాసమిది


ఇది తాన్ సేన్ సమాధి. 

ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు. 




















25 జులై, 2013

పుట్టపర్తి వర్ణించిన విశ్వనాధ





ఇరవై తొమ్మిదేళ్ళ వ్యక్తి
విశ్వనాధ పై అద్భుత వ్యాసం వ్రాసాడు
అప్పటికి విశ్వనాధ నలభై తొమ్మిదేళ్ళ వారు..
విశ్వనాధ ఎంతగా ఆనందపడ్డారంటే
అతన్ని అభినందించడానికి స్వయంగా కదలి వచ్చారు
ఆనాటి నుంచీ ఈనాటి వరకూ
విశ్వనాధ పాండితిని వినిపించే 
ఇంకొక పదునైన వాణి వినరాలేదు
అది విశ్వనాధ వారే స్వయంగా చెప్పిన మాట
ఆయనే మన పుట్టపర్తి .. 

తన్ను తాను నిరూపించుకోవటానికి 
పెద్దలచే వీడు మా సరి వాడు
లేదా మాకంటే అధికుడు అనిపించుకోవటానికి 
కొంత యుధ్ధం తప్పదు మరి..


విశ్వనాధ పుట్టపర్తి గురించి 

ఏవో చెబుతుంటారు కానీ. 


తరువాత దాన్ని ఇద్దరూ పట్టించుకోలేదు.. 
పైగా పుట్టపర్తి విశ్వనాధ మూర్తిమత్వం గురించి 
పరమాద్భుతంగా భారతికి వ్రాసారు

సాహితీ ప్రపంచంలో ఈనాటికీ 
ఈ వ్యాసం ఎంతో విలువ గలిగిందని అంటారు..

ఇందులో విశ్వనాధ వారి గురించి పుట్టపర్తి 
ఇతడాంధ్ర మందమాపోశనమే పట్టినాడు
నన్నయ నుపాసించినాడు
తిక్కనను సేమమడిగినాడు
శ్రీనాధునితో చేయి కలిపినాడు
పోతనను మ్రొక్కికొన్నాడు
రాయలనాటి వాఙ్మయము చదివినాడు
ఆముక్త మాల్యదనామోదించి తెనాలిరాముని వియ్యమందినాడు

అంటారు..

అంతేనా విశ్వనాధను విమర్శించినవారికి
అరివీరభయంకరుడై బదులొసగినాడు పుట్టపర్తి..


ఇంకొక సంఘటన.. 
1953 లో ఆలంపురం లో జరిగిన తెలుగు సభలలో 
"తెలుగు కన్నడముల చుట్టరికము "
పంపని భారతం ఛాయలు 
నన్నయ్య భారతం లో వున్నాయని 
పుట్టపర్తి వ్యాసంతో వెళ్ళారు..

పెద్ద గొడవ జరిగింది
అందరూ విరుచుకు పడ్డారు 
పుట్టపర్తిని 
మారువేషంలో వున్న కన్నడవాడని 
కూడా దూషించారట

సర్వేపల్లి రాధకృష్ణన్ గారు
అందరినీ సావధానంగా కూర్చుని ప్రశాంతంగా 

వినమని సభికులను అర్థించారట.. 


ఆనాటి సభకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులు
ఆ సన్నివేశంలో విశ్వనాధ
నేను కన్నడము నేర్చుకొని పంప భారతం చదివి 
నీ వాదానికి జవాబు చెబుతాను అన్నారట.. 


సేకరణ పుట్టపర్తి అభిమాని శ్రీ రామావఝుల శ్రీశైలం 

చిన్న చిన్న అక్షరాలు ఇబ్బంది పెడితే
క్రింద zoom చేసిన వ్యాసభాగలు తేలికగా చదవవచ్చు























































































































17 జులై, 2013

"రామ చరిత మానసామృతము" --పుట్టపర్తి మరో అద్భుత గ్రంధ సమీక్ష





నేల నూతల కృష్ణమూర్తి గారి భార్య యైన పార్వతమ్మ గారు వ్రాసిన 
"రామ చరిత మానసామృతము" 
అను గ్రంధమునకు ఆశీర్వచనము 
అను పేర వ్రాసిన పీఠిక ఇది

పుట్టపర్తి పీఠికలతో ఆయా గ్రంధములకు విలువ పెరిగేది
పార్వతమ్మ గారి భర్త అయిన 
నేల నూతల కృష్ణమూర్తి గారు 
శ్రీమద్రామాయణమును ఇంగ్లీషునకనువదించినారట

వారి సతీమణి తులసీదాసుని అర్చించినది
పుట్టపర్తి గారు నెల్లూరునకు
ఆ పరిసర ప్రాంతములకు సన్మానములకు వెళ్ళినప్పుడల్లా 
వారింటనే దిగేవారట..

అప్పుడు 
శ్రీ రామావఝుల శ్రీశైలం గారు 
నేలనూతల వారింటికి వెళ్ళి పుట్టపర్తిని దర్శించేవారట

"ఇది మూలమునకు 
యధాతధముగా సాగిన రచన కాదు
తనకింపుగ తోచినచోటనే అనువదించును
ఇట్టివచనములు 
పాఠకులలో మూలగ్రంధమును 
జదువవలెనను ఆశను రేకెత్తించును "
అంటారు పుట్టపర్తి 
పార్వతమ్మ గారి రచనను పరిచయం చేస్తూ

ఇంకా
వాల్మీకి రామ తత్త్వము పూర్తిగా అర్థమవలేదట
అందువలననే కలియుగమున తులసీ దాసుగా అవతరించెనట
ఉత్తర హిందూస్థానములో 
ప్రజల నమ్మకమిది
"అయోధ్య కాశీ మొదలైన ప్రదేశములలో 
దీని ప్రశస్తి అంతా ఇంతా గాదు
రెండు శాస్త్రములలో సమగ్ర పండితుడైననూ
ఆదేశమున తులసీదాసునే పారాయణమొనర్చును..

బైరాగులు వీధులలో 
వ్యాసపీఠముపై తులసీరామాయణముంచికొని 
దానిపై రెండుపువ్వులనుంచి కూర్చొనెదరు

వారి యెదుట కాసులు కుప్పలుగా పడియుండును అంటారు..
ఇది 1961 న వ్రాసిన పీఠిక 
శ్రీశైలం గారు నెల్లూరు వెళ్ళి
కష్టపడి సంపాదించినది..


పుట్టపర్తి జీవితానికి కొత్త దర్శకులు






పుట్టపర్తి చరిత్రను 

పలువురు పలు రకాలుగా వక్రీకరిస్తున్నారు అభిమానులు శిష్యులు అనేపేరుతో 
వారి నిజ జీవిత విశేషాలను కనీసం సరిగ్గా విచారించకుండానే 
పెద్ద పెద్ద పుస్తకాలు వ్రాసి 
పదుగురితో ప్రశంసలందుకుంటున్నారు  

ఇటీవల శశిశ్రీ వ్రాసిన 

 కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన 
మోనోగ్రా ఫ్ లో నూ  
భయంకరమైన 
క్షమించరాని తప్పులు దొర్లాయి 

విద్వాన్ పరీక్షకు పుట్టపర్తి తన పాఠ్యభాగాన్ని 

తానే పరీక్ష వ్రాయవలసి వచ్చింది 

ఇది యే కవి జీవితంలోనూ సంభవించని 

అరుదైన సంఘటన
 శశిశ్రీ విద్వాన్ ను ఇంటర్ మీడియట్ గా మార్చారు 

జిల్లెళ్ళమూడి అమ్మ తానే స్వయంగా 

ఒక ఇల్లు ఖరీదు చేసి పుట్టపర్తికి అందించినట్లు వ్రాసారు 
కానీ జరిగింది వేరొకటి 

ఇంకా పుట్టపర్తి 

ఆకాశవాణికోసమే కృతులను రచించినట్లు వ్రాసారు

 పై విషయాలకు స్పందించిన శ్రీ శ్రీశైలం గారు 

"సరస్వతీపుత్రుని శతజయంతికి నిజమైన నివాళి ఇదేనా..?"
 అని వ్రాసారు 

కేంద్ర సాహిత్య అకాడమీ 

 ఈ పుస్తకంలోని తప్పులను సరిదిద్దాలి 
లేకపోతే 
 ఈ పుస్తకం మిగతా ఇతర భాషలలోకి అనువదించబడి

 పుట్టపర్తి జీవితానికి వక్ర భాష్యంగా నిలచిపోతుంది 






14 జులై, 2013

13 జులై, 2013

"తీరని బాకీ " ప్రసిద్ధ మళయాళ నాటకములకు పుట్టపర్తి అనువాదం


పుట్టపర్తి కేరళలో మళయాళ డిక్ష్నరీ రూపొందించడానికి 
ఆనాటి మళయాళ పండితుల ఎంపికతో 
అప్పటి కేరళ ప్రభుత్వముచే పిలువబడి
తిరువాన్కూరులో పనిచేస్తున్న కాలంలో 
మళయాళ ప్రసిధ్ధ నాటకాలను తెలుగుకు అనువదించారు. 
అదే యీ "తీరని బాకీ"

అలానే మన విశ్వనాధ సత్యనారాయణగారి ఏకవీరనూ  
మళయాళ భాషలో అనువదించి 
వారికి మన తేటతెనుగు కమ్మదనాన్ని రుచి చూపించారు

కేరళ ప్రభుత్వమూ

మీ తెలుగువారు మీ ప్రతిభను గుర్తించలేదు 
మేము మిమ్మల్ని మా కేరళ ప్రభుత్వము తరఫున 
ఢిల్లీ కేంద్ర గ్రంధాలయానికి మా ప్రతినిధిగా పంపుతున్నాము 
అని ప్రకటించింది


వీనిని అనువదించిన కాలంలోని పరిస్తితులూ
నాటి సంఘటనలను తెలుసుకొనే ప్రయత్నం చేసాను
కానీ
పుట్టపర్తిని తను సంపాదిస్తేనే కానీ గడవని 
కుటుంబ పరిస్థితులూ కానీ
ఆర్థిక పరిస్థితులు కానీ
కేరళ వాతావరణము కానీ
అక్కడ స్థిరంగా నిలుపలేక పోయింది
వారి ఆదరణ
అందివస్తున్న అవకాశాలకంటే
సాధనా మార్గమే ఆయనకు అమూల్యమైనదిగ తోచింది
అందుకే బ్రతుకునకు బడిపంతులు ఉద్యోగమే తనకు సరైనదిగా ఎంచి
తిరిగి కడప గడప తొక్కి
జీవితంలోని ప్రతిక్షణాన్నీ అటు సాహిత్యానికీ

ఇటు ఆధ్యాత్మికానికీ పంచి పెట్టారు.

భగవంతుడు నాకీ అవకాశాన్నిచ్చి 
నన్ను తరింపజేసినందుకు
మా అయ్య నా గురువు 
శ్రీమాన్ పుట్టపర్తి వారి ఆశీస్సులు నాకు లభిస్తాయని 
నా విశ్వాసము.

పుట్టపర్తి అనూరాధ