7 అక్టో, 2011


మార్చిన వార్తా విశేషాలు - శని వారం అక్టోబర్    08th 2011 - 2:32 AMRSS  


నవ్యకవితకు నాంది
సొమ వారం, జనవరి 11, 2010 , 5:20 [IST]

venkata rao(గత సంచిక తరువాయి)
3. ధర్మవరము రామకష్ణమాచార్యులు- తమిళ నాటక చక్రవర్తి సంబంధమొదలియారునకు రామకష్ణమా చార్యులు గురుదేవులు. నేను మదరాసులోనున్నప్పుడు సంబంధమొదలియారు గారిని దర్శించి, వారిచేత- రామకష్ణమాచార్యుల  వారినిగూర్చి ''నాగురుదేవుడు అను వ్యాసము వ్రాయించి ప్రకటింపజేసినాను. సంబంధమొదలి యారు గారు తమిళులైననుతెలుగు భాషలో మంచి ప్రవేశముగలవారు. తెలుగుననే ఆ వ్యాసము వ్రాసినారు. వారు నన్నెంతయో అభిమానించెడి వారు. ఆంధ్రవిశ్వవిద్యాలయమున డాక్టరు దివాకర్ల వేంకటావధానిగారు ధర్మవరము వారిని గూర్చి పరిశోధన జరిపిరి.

4. కోలాచలము శ్రీనివాసరావు- శ్రీనివాసరావు గారి అన్నగారు - వెంకటరావు గారు- శాసన సభసభ్యులు- వారే, విశాఖపట్టణమున జగన్మిత్ర హాలు అను నాటకశాలకు శంఖుస్థాపన చేసిన వారు. శ్రీనివాసరావుగారు గొప్ప విద్వాంసులు.ఆంగ్లభాషలోనున్న వారి ప్రపంచనాటక చరిత్ర తిరిగి ముద్రితము కావలెను. ఆంగ్లభాషలో రచయితలయిన తెలుగు వారిలో వారికొక విశిష్ట స్థానమున్నది. డాక్టరు ఎన్‌. గంగప్ప - కోలాచలమువారి నాటకములను గూర్చి పరిశోధన చేసి పట్టమును పొందినారు.
5. కట్టమంచి రామలింగారెడ్డి -  రెడ్డిగారి ముసలమ్మ మరణము నవ్యకవిత్వమునకు నాంది. గురజాడ, రాయప్రోలు - ఆయన తరువాతివారు.

అర్థశాస్త్ర ప్రారంభమున - వారు వ్రాసిన
''అస్మత్ప్రియ సఖి....
సస్మేర ముఖేందుబింబ సమ్యక్తేజో
విస్మయ ముఖి...
అనుదానితో మొదలిడిన పద్యములు వారి నవ్యకవితా వైశద్యమును తెలుపును.

పింగళి సూరన కవితాకళా ప్రతిభ లోకమునకు మొదట చాటినది రెడ్డిగారే- కట్టమంచివారిని గూర్చి సి.ఆర్‌.రెడ్డి - అను గ్రంథమును - సుప్రసిద్ధాంగ్ల భాషారచయితలైన డి.ఆంజనేయులుగారు. ఇంగ్లీషులో రచించిరి. కేంద్రసాహిత్య అకాడమీవారు దానిని ప్రచురించిరి. 1992లో రాజరాజనరేంద్ర - నవశతాబ్ది సభకాయన అధ్యక్షత వహించినారు - ఆయన అధ్యక్షవచనము - నన్నయ భట్టారకుని రచనా విశిష్టతను గూర్చి.ఇంతవఱకు తెలుగున నన్నయగూర్చి ఎంతో మంది వ్రాసినారు కాని రెడ్డిగారి వ్యాసమునందున్న విషయములు వేరెచ్చటను కానబడవు.

ఆంధ్ర మహాభారతము వారు  చదివినట్లు మరియొకరు చదవలేదనుట సత్యోక్తి.రెడ్డిగారిని గూర్చి ఇదివఱకెవ్వరు వ్రాయని వారి ఛలోక్తి నొకదానిని తెలుపుచున్నాను.వారాంధ్ర విశ్వవిద్యాలయోపాధ్యక్షులుగా రెండవ సారి ఉన్నప్పుడు విశ్వవిద్యాలయమున-విద్యార్థినీ వసతి గహము (గరల్స్‌ హాస్టల్‌) విద్యార్థుల వసతిగహమునకు (బాయస్‌ హాస్టల్‌) ఎదురుగా కట్టబడినది- కట్టమంచివారు దానిని తెఱచుచూ ఇట్లు చెప్పినారు.''ఐ ప్రెజ్యూమ్‌, వు§్‌ు హావ్‌టు ఓపెన్‌ ఎ మెటర్నిటీ హోమ్‌ నెక్ట్స్‌ యియర్‌.''వచ్చేయేడు మనమిచ్చట ఒక ప్రసూతి గహము కట్టించవలెనేమో తరువాత కొలది కాలమునకే అది మరియొక చోటికి దూరముగా తరలింపబడినది.

6. గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు- గాడిచెర్ల వారిని గూర్చి సమగ్రముగా వ్రాసినందులకు ఎంతో సంతోషించినాను. దర్శి చెంచయ్యగారి వాక్యముల నుదాహరించినందులకు  మరీ సంతోషము - ఈ తరము వారికెవ్వరికి నీవిషయములు తెలియవు.
పుట 43.
''వారు క్రిస్టియన్‌ కళాశాలలో చేరి ఎం.ఏ. పట్టము పొంది ఇదిసరికాదు. ఆ కాలమున ఎంఎ పట్టము తెలుగులో పొందుటకు, ప్రత్యేకముగా బి.ఏ. పట్టమును పొందిన తరువాత- ప్రయివేటుగా  ఎం.ఏ.కు వెళ్ళవలెను. హరిసర్వోత్తమ రావుగారు అట్లే చేసినారు. వారు మదరాసు విశ్వవిద్యాలయమున తెలుగు ఎం.ఏ. లలో ప్రాథమిక వర్గములోనివారు.

7.రాళ్ళపల్లి అనంతకష్ణ శర్మగారు - తమ వైదుష్యమునకు విమర్శనాపాటవమునకు, రసగ్రహణపారీణతకు స్థానీభూతమైన ఒక ప్రత్యేక గ్రంథమునందింపలేదు - శర్మగారు సాహిత్యము ననే గాక సంగీతమున నిష్ణాతులు. గాయక మహాసభకధ్యక్షత వహించినారు - తెలుగు భాష సంగీతప్రధానమైనది. వాస్తవముగా తెలుగున సంగీతసాహిత్యముల అవినాభావసంబంధమును గూర్చి సాధికారముగా చెప్పవలసినవారు వారొక్కరే - అయినను వారి కలమునుండి అట్టి గ్రంథము వెలువడుటకు మనము నోచుకొనలేదు. అట్లే వారు తెలుగు కన్నడముల పరస్పర ప్రభావమును గూర్చి ప్రామాణికముగా తెలుపగలవారు. అయినను వారు వ్యాసముల మూలముగానైనా తెలిపిన మన ప్రాచీన వాంగ్మయ చరిత్రకెంతో యుపయోగకరముగా నుండెడిది కాని ఆ భాగ్యము మనకు కలుగలేదు.

8. దుర్భాక రాజశేఖర శతావధాని:- రాజశేఖర శతావధాని గారి పేరునకు, వారి కతియగు రాణాప్రతాప చరిత్రకు యతిమైత్రి గలుగుటచేనది యజరామరమైనది-  తెలుగున దిట్టకవి నారాయణ కవి రంగరాయ చరిత్ర తరువాత, రాణాప్రతాప చరిత్రవంటి వీరరసోద్దీపక కావ్యము తిరిగి అవతరింపలేదు. వారి ''పుష్పావతి  కావ్యమును నేను సమీక్షించినాను. అదియు ప్రశస్తమైన కతి - శతావధాన చరిత్రయందు వారికి స్థానమున్నది.9. గడియారము శేషశాస్త్రి- శేషశాస్త్రి గారి శివభారతమును గూర్చి 'శివభారతోదయము అను విమర్శక గ్రంథము పద్యకావ్యము వెలువడినది- అదిచెఱుకు పల్లి సుందర రామయ్య గారు రచించినది.

దానిని మీరు చూచియే యుందురను కొందును - ఈ సుందరరామయ్యగారు శేషశాస్త్రి గారితో సహోధ్యాపకులు -మంచి కవులు - వారు శివభారత రచనకు తోడ్పడిరి. 1943వ  ప్రథమ ముద్రణములో సుందరరామయ్యగారిన గూర్చి ప్రస్తావనలో నెంతగానో వ్రాయబడినది. తరువాత నాల్గవ ముద్రణలో - ఆ సుందరరామయ్య గారి ప్రసక్తియే లేదు - అందుపై సుందరరామయ్యగారు, తాము శివభారత రచనకు తోడ్పడదగిన- కవితాశక్తి యున్నదని చూపుటకు నీ గ్రంథము పద్యములతోనే రచించినారు. తెలుగుదేశమున ప్రసిద్ధికెక్కిన సాహిత్య విద్వాంసుల కందఱకు పంపినారు - శేషశాస్త్రి గారు, తమ జననము 1901 అని స్కూలురికార్డులో వేయించుకొనగా - సుందర రామయ్యగారు - వారి జాతకమును బట్టి 6-4-1894 అని ప్రకటించిరి.

మీరు వారి జననతిధి- 7-4-1894 అని వ్రాసినారు. శేషశాస్త్రిి గారి కతులలో మురారి, పుష్పబాణవిలాసము,  వాస్తుజంత్రి- అముద్రిత ములని (అనర్ఘరాఘవము) మల్లికా మారుతము, వాల్మీకి అసమగ్రములని, కష్ణదేవరాయ చరిత్రము రచనలోనున్నదని ఆంధ్రరచయితల (మ.స.శాస్త్రి) యందుగలదు. ఇవి ఆకాశకుసుమములని శివ భారతోదయము - దీనిపై పరాస్త ''శివభారతో దయమని శ్రీ సి.వి.సుబ్బన్న శతావధానిగారు ప్రకటించినారు. అందు వీనిని గురించిన వివర ములేలేవు. ఈ గ్రంథమును శ్రీ సుబ్బన్న శతావధానిగారు నాకుపంపిరి. శేషశాస్త్రిగారి రచనల విషయమై ఇంకను వివరములు కావలసి యున్నవి. వారి ''రఘునాధీయము అను చారిత్రక ప్రబంధ మునుగూర్చి యా గ్రంథము పుట 65లో నిట్లుగలదు.

''రఘునాథనాయకుని ఆస్థానము ఇందిరా మందిరము అందు శారదా ధ్వజము చిందులు ద్రొక్కి నర్తించినది - కాని అవి రఘునాథ నాయకునికి సంబంధించినవి కావు. అవి ఆతని కుమారుడగు విజయరాఘవ నాయకుని కాలమునాటివి. ఈ రెండింటి ప్రతిష్ఠాపకుడు విజయరాఘవనాయకుడే.చూడుడు. నా దక్షిణ దేశీయాంధ్ర వాంగ్మయము- (రాజగోపాల విలాసమును గూర్చిన విషయము) 

10. పుట్టపర్తి నారాయణాచార్యులు: ఈనాటి తెలుగు కవులలో - విద్వాంసులలో బహుభాషా విశారదులు పుట్టపర్తి వారే అనుటలో అతిశయోక్తి ఎంతమాత్రమును లేదు. సత్యోక్తియే - మీరు ''పదికి మించిన భాషలలో పసిడినిగ్గు లేరుకొన్న పుట్టపర్తి ధిషణ అమోఘము అని వ్రాసినారు. (పుట74) వివరములనిచ్చిన బాగుగానుండెడిది.మీ గ్రంథమునుబట్టి వారు ఏడు భాషలలో ప్రవీణులని తెలియుచున్నది. అధునాతనకాలమున ద్విపద రచయితలలో వారగ్రగణ్యులు. కొడవలూరి రామచంద్రరాజు: వీరి మహాసేనో దయము- ఆంధ్రశైవ వాంగ్మయముననొక విశిష్టకతి.



కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి