9 ఫిబ్ర, 2012


కేరళలో ఉన్నప్పుడు ..
శ్రీ బూర్గుల రామకృష్ణరావ్ గారి కోరికపై..
ఏకవీరను మళయాళం లోనికి అనువదించగా..
దానిని అక్కడి ఇంటర్మీడియట్ కోర్సులో పాఠ్యాంశం గా పెట్టారట..
తిరువాంకూర్ లోమళయాళ నిఘంటు నిర్మాణం..
1954-56 లలో ..
మళయాళ భాషా సౌందర్యానికి ఆకర్షింపబడి..
అలానే మళయాళ నాటకాలనూ తెనిగించారు.

స్వతంత్ర ప్రతిపత్తి ..
ఇతరులకు అణిగి వుండే నైజం కాకపోవటం వలన ..
సూరనాధ్ కుంజన్ పిళ్ళై
 అక్కడి రాజకీయాలు ..
అధికారుల వైఖరి నచ్చక ..
వెళ్ళి పోదామని అనుకుంటున్నవేళ..

యూనివర్సిటీ అధికారి సూరనాధ్ కుంజన్ పిళ్ళై ..
కేంద్ర సాహిత్య అకాడమీకి ..
తిరువాన్ కూరు విశ్వ విద్యాలయ ప్రతినిధిగా పంపారు.
1958 లో ఈ సంఘటన జరిగింది..
అక్కడ K P కృపలానీ..

మదన మోహన్ మాలవ్యా..
దినకర్..                                                  
మదన మోహన్ మాలవ్యా
పంత్..
మహాదేవీ వర్మ..
వంటి దిగ్గజాలతో పరిచయం..
వ్రజ అవధీ భాషలకు దగ్గర చేసింది..

ప్రాకృత భాషలతో మరింత స్నేహం పెరిగింది..
అకాడమీ లైబ్రేరియన్ గా..        
"ఆంధ్ర ప్రజ మిమ్మల్ని గుర్తించలేదు..
తిరువాన్ కూరు విశ్వ విద్యాలయ ప్రతినిధిగా ..
మేము మిమ్మల్ని ..
కేంద్ర సాహిత్య అకాడమీ కి పంపుతున్నాము" అన్నారు.
పుట్టపర్తి వారి శివ తాండవాన్నీ..
దానిలోని శబ్ద సౌందర్యాన్ని ..
పదే పదే పొగడుతూ ..
అందులోని సంస్కృత శ్లోకాలను అడిగి మరీ వినేవారంతా..
ప్రాకృత భాషలతో మరింత స్నేహం పెరిగింది..
అకాడమీ లైబ్రేరియన్ గా ..
కబీరు వచనావళిని తెనుగించారు.
అక్కడే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో సాన్ని హిత్యం పెరిగింది..
మరింత కృషి సాగేదే..
కానీ విధి విలాసం..
పచ్చ కామెర్ల వ్యాధిసోకింది..
నిరంతర అధ్యయనం ..
అన్న పానాలను పట్టించుకోకపోవటం వలన..
అది మరింతగా విజృంభించింది.

తిరిగి కడప పయనం ..
 అయ్య ఏమంటారూ..
ఏం చేయాలయ్యా..
దేవుడు ఈ ఊరిలో..
నాకు పడక ..భోజనం ..
ఏర్పాటు చేసినాడు అని చమత్కారంగా..


నన్ను జీవితంలో ఎక్కువగా ఆకర్షించినవారు..
ఇద్దరు ..
ఒకరు రాధా కృష్ణ పండితుడు..
రెండవ వ్యక్తి అరవిందఘోష్..
ఆయన రాష్ట్ర పతిగా ఉన్నప్పుడు తరచూ వెళ్ళే వాణ్ణి..
వెళ్ళినప్పుడంతా ..
ఒక గంటసేపైనా మాట్లాడే వాణ్ణి..
ఆయనలో ఒక గొప్ప సుగుణం ఉంది.
మన ప్రాంతాల్లోనే ఎక్కువ పని చేసిన వాడు కదా..
తాను చూసిన..
ప్రతి చిన్న వాని క్షేమమూ అడిగేవాడు..

భారత దేశానికి అధ్యక్షుడైనా..
ఆయనది అధ్యాపక మనస్తత్వమే..
నేనాయన దర్శనానినికి పోక పోయినప్పుడు..
కోపపడిన రోజులు కూడా ఉన్నాయి..
ఒకసారి ప్రపంచ శాంతి మహా సభలకు ఢిల్లీ వెళ్ళాను.  

అప్పుడాయన వైస్ ప్రెసిడెంట్ ..
కారులో ఆఫీసుకు పోతూ..
అదాటుగా చూచాడు.
పిలిపించి కోప పడినాడు..
క్షమాపణలు చెప్పుకున్నాను.
ఆయన పాండిత్యం పై నాకెంతో మోజు..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి