13 జన, 2012

బాగా చదువు కోవటం ..

                     


బాగా చదువు కోవటం గొప్ప విషయమైతే ..
ఆ గొప్పను గొప్పవారు ఒప్పుకొనేలా చేయటం 
ఇంకా గొప్ప విషయం
అందరూ పండితులే 
అందరూ శాస్త్ర కోవిదులే..
ఒక పసివాడు 
నేను మీ అందరితో సమానుణ్ణి 
లేదా మీ కంటే గొప్ప వాణ్ణి ..
కావాలంటే పరీక్షించుకోండి..
సంగీతమా..
సాహిత్యమా..

నాట్యమా..
సంస్కృతమా..
వ్యాకరణమా..
రామాయణ మహాభారత భాగవత గ్రంధాలా..

ఇతరభాషలంటారా..
మళయాళం.. తమిళం.. కన్నడమూ..
తెలుగూ ..సంస్కృతం ..
ఉత్తర హిందుస్థానీ భాషలు ..అవధీ ..వ్రజభాష..
ప్రాకృత భాషలు..
అర్థ మాగధి ..మాగధి..పైశాచీ..
లాటిన్ ..గ్రీకు ..రష్యన్..

అని బరిలోకి దిగితే మిగుడు పడటానికి అది మందు బిళ్ళా..
మీరే చెప్పండి..??
అందులోనూ ప్రాంతీయ భేదాలూ..మత భేదాలూ..
అహంభావ సమస్యలు..
వీటన్నిటినీ ఆ చిన్నవాడు..
ఎలా ఎదిరించాడు..?
వారు అతనికి నీరాజనాలిచ్చేలా ఎలా ఎదిగాడు..?
ఇదిగో  చదవండి..
 
మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు ఉంటే చెప్పండి..                 
                         
ఎన్నో ఉన్నాయ్..
మరపురాని సంఘటనలు...
చెళ్ళపిళ్ళ
అహమేవ పండితాహ ..
అనే భావనతో మొదలు పెట్టినవాణ్ణి ..
ఇప్పుడు నా అహం పండితాఅనే స్థితికి వచ్చినాను. 

ఈ స్థితికి రావటానికి ..
కొన్ని నూర్ల సన్నివేశాలు జరిగివుంటాయి..
వయసు ..
దానితో బాటు పరిపక్వత చెందుతుండే మనసు..
నన్ను మార్చివేశాయ్ ..
నా కాలంలో ..
పెద్దవాళ్ళనిపించుకున్న ఎందరితోనో.. 
 పేచీలు పడ్డాను. 
మల్లంపల్లి

ఈనాటికీ నా భావాలట్లే ఉన్నాయ్...
కానీ ..
వానిని వెల్లడించే పధ్ధతిలో మార్పు వచ్చిందంతే.
చెళ్ళపిళ్ళవారూ ..
శ్రీ పాద వారూ ..
వీరితో పెద్ద రగడలే జరిగిపోయాయ్..
చిన్న వయసున ..
పెద్ద పరిశ్రమ కావడంతో..
చాలా మందితో పోట్లాడవలసింది. 

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను..
నేను నా 19 వ  సంవత్సరంలో ..

శ్రీ పాద 
భారతిలో ప్రాకృత కావ్యాల్ని గూర్చి కొన్ని వ్యాసాల్ని వ్రాశాను. 
అప్పుడు మల్లంపల్లి వారు భారతి ఎడిటర్గా ఉండేవారు. నేనొకసారి భారతి ఆఫీసుకు పోయినాను. 
మల్లంపల్లి వారు అఫీసులో ఉన్నారు.
నన్నెవరో చిన్న పిల్లవాడనుకున్నారు.
నేనే పుట్టపర్తి నారాయణాచర్యులంటే ఆయన నా వైపు ఆశ్చర్యంగా చూశారు. 
ఆయన అన్నారు ..
నీ వయస్సేదో అరవయ్యో.. డెభ్భ్య్యో .. 
పెద్ద నామాలు ఇట్లా ఊహించానండీ..
అన్నాడు..

ఆయన మరణించేవరకూ నన్నెంతో గౌరవంగా చూసేవారు..
ఆయన చారిత్రికుడిగా నన్ను చూసేవారు.
శ్రీపాద వారితో నేను కలిసినప్పుడు పెద్ద రంధే అయిపోయింది.

చెళ్ళపిళ్ళ వారు..
విశ్వనాధ
నీ తెలుగు కవిత్వం కంటే నీ సంస్కృత కవిత్వమే నాకు బావుంది నాయనా అన్నారు.
ఎన్నో ఇలాంటివి..
నేనేమని చెప్పేది.. 
విశ్వనాధ వారితో సవాలక్ష సార్లు కొట్లాట.

కానీ ఆయన మహా రసికుడు...
మహా మనస్వి...
బెజవాడలో ..
ఒకసారి నా శివతాండవం విని..
నన్ను భుజాలపై వేసుకుని ఎగిరాడు. 
అంతటి రసలుబ్ధుడాయన. 
ఇలాంటి సందర్భాలు ఇంకా నూర్లకు వున్నాయి..