25 ఫిబ్ర, 2014

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై.. అష్టాక్షరి నాధునిపై పుట్టపర్తి పద పల్లవాలు



పుట్టపర్తి కృతుల పని ఎలా జరుగుతుందో చూద్దామా
కొమండూరి శేషాద్రి గారు  సంభాషణ మీకోసం
ఇందులో కొమండూరి ప్రతికీర్తనను విశ్లేషిస్తూ సరిచూస్తున్నారు..
క్రింద వారు వ్యాఖ్యానించిన ఒక రెండు మూడు కీర్తనలనే ఇస్తున్నాను..
 

                  

ద్విజావంతి- అట తాళము
హిందుస్థానీ రాగం
సరిగమ పమదపా నిదనిసా
సనిదపామమగరిసమగస


మాటలలొ నేమిలేదే మనసా
మనసు రంగులు మటుమాయ చిత్రమ్ములు
 

సంస్తుతి నిందలు శబ్ద సంతతి సుమ్ము
శబ్ద సంతతి బట్టి బాధ జెందెదవే
 

ఉపకార మపకార మొక్కటే క్రియసుమ్ము
 ఉపకారమునబొంగి అపకారమునకేడ్తు
 

అష్టాక్షరీ రూపుడై కలియుగమున
నలరెడు దేవుని యడుగులు బట్టితె
 


                      శంకరాభరణము-అట తాళము
 ఆరోహణ  స రి గ మ ప ద ని స
అవరోహణ స ని ద ప మ గ రి స


పల్లవి.          ఎక్కడొచ్చినావూ తెరువరి       
అను పల్లవి.  దిక్కూమొక్కూలేని డొంకలలోని
 

చరణము.      వచ్చిన దెసబట్టి-వెనుకకు వోవోయి
                    అచ్చోటనే బ్రహ్మానంద శీతల జలమూ
 

చరణము.    పులుల మచ్చికజేసి- మలయ యోచించెడు
                   ఆరు కాచుకొన్న-వాఱ డిబెట్టూనే
 

చరణము.   అష్టాక్షరీస్వామి అది పండరినాథు                   డాతడు చూపిన అమృత సౌధమువీడి


              గౌళ రాగము-అట తాళము
ఆరోహణ .    సరిమ పనిస
అవరోహణ.  నిపమరిగమరీసా

 

చేదుకోవయ్యా నీ దరికీ రంగా
చేదుమేసీ  బ్రదుక బాధాయెనయ్యా
 

సుఖము సుఖంబని సోలి చచ్చుటె గాని
సుఖమంటె దుఃఖము శుధ్ధిగ జూచితె
 

నీ క్రీడ నా క్రీడ నీ జగతిలో జూచి
హర్షించి మెచ్చేటి ఆఢ్యులెవ్వరులేరు
 

అష్టాక్షరీదైవమా యెన్ని జన్మాల
నాడింతువయ్యా నా మెడకూ 

               నాటకురంజి రాగం -అట తాళం
ఆరోహణ       సరిగమ నిదని పదనిస
అవరోహణ    సనిదమగస
 
పల్లవి.          వజ్రఖచిత మకుటా విఠ్థలా
అను పల్లవి.    వాసుదేవా సర్వ భాసమానరూపా
 

చరణము.    మకుట కుండలములు మాటికి చలియింప
                  శిరసార్చి నాతోడ చెలువుగ మాటాడు
 

చరణము.   కడగన్నులా కాంతి కలువలు సృజియింప
                 కనకాంబరా నన్ను గారాముతో జూడు
 

చరణము. అష్టాక్షరీ మోహనా లోక సౌందర్య
               మధమము నీ చెన్నుటడుగులు జూచితె


                  చక్రవాక రాగం-అట తాళం
సరిగమపదనిస
సనిదపమగరిస
 

ఏమి చేసెదవూ ఇంకా స్వామీ
 

నీ లీల దలచితె నిలుచునయ్యా భయము

కలిపితి సంబంధ మలరులకునువోలె
కలగించుచుంటి ముఖంబు జూడగనీక
 

కరుణాకరుండన్న బిరుదు దాల్చుటెగాని
కరుణలేకా యెరుక కరణిని చరియింతు
 

అష్టాక్షరి సుందరా సర్వకాలంబు
లందు నీ పదముల నాలపించినదాని


24 ఫిబ్ర, 2014

20 ఫిబ్ర, 2014

ఒకసారి అమ్మతో గండికి పోదామా




మా ఇంట్లో కొన్ని డబ్బులు కూడాయి
అమ్మ అయ్యకు దిక్కు తోచలేదు
డబ్బులేకపోతే ఒకటే సమస్య
డబ్బుంటే చీంతే చింత
కవి వైసీవీ రెడ్డి ఒక దిక్కుమాలిన సలహా చెప్పాడు
 

ఒక పెంచలమ్మ
ఆమె మున్సిపాలిటీలో స్వీపరు
కానీ పెద్ద పెద్ద వారితో పరిచయాలు
వడ్డీ వ్యాపారం చేస్తుంది
పోలీసు అధికారులు ఎందరో పెద్దవాళ్ళు 

ఆమె దగ్గర తమ డబ్బు దాస్తుంటారు
ఆమె నెల నెలా వడ్డీ తెచ్చి ఇస్తుంది
 

అమ్మ అయ్య ఇద్దరూ బాగానే ట్రాప్ లో పడ్డారు
పెంచలమ్మ వచ్చింది
ఇంట్లో మూలన కూచుంది
అచ్చం బాపు బొమ్మలా వుంది 

ఇంకా మాట్లాడితే 
విష్ణువు ఎత్తిన మోహినీ అవతారంలా వుంది
పెద్ద కుంకుమ బొట్టూ నోట్లో తమల పాకులూ
 

మధ్య వర్తి యైసీవీ.. 
డబ్బు తెచ్చి ఆమె చేతిలో పోసారు  
ఒకానొక దుర్ముహూర్తంలో ఆమె  పరారైంది 


 అమ్మ అయ్యల వేదన కంతులేదు
ఇంట్లో ఇద్దరాడపిల్లల పెళ్ళి చేయాలి 

పెద్ద సంసారం
అయినా యీ మాయలో మనం పడటమేమిటి 

అన్న పశ్చాత్తాపం
అమ్మ అయ్య ఆజ్ఞ మేరకు వేంపల్లె ప్రయాణమైంది
అప్పట్లో ప్రయాణమంటే 

బియ్యం పప్పులూ చింతపండు మూటగట్టుకొని బస్సెక్కడమే
అమ్మ వెంటే నేనూ 

మొండిచేయటం ఒక బ్రహ్మాస్త్రం
సరే..
 

గండి ఆంజనేయ క్షేత్రం
చుట్టు కొండలు పారే నది పచ్చటి ప్రకృతి
 

బస్సు దిగినాక చాలా దూరం నడవాలి
అక్కడ యే వసతులూ లేవు
భక్తులు వస్తారు అంతే
రోగగ్రస్తులూ మానసిక రోగులూ ఎక్కువ
నదిలో స్నానం చేయడం గుడిలో కూచోవటం
నమ్మిన వారికి నమ్ముకున్నంత
 

ఒంటరిగా ఆడమనిషి ఎలా వెళుతుంది
ఎక్కడ వుంటుంది

భద్రత వుందా
ఇవేవీ అయ్యా ఆలోచించరూ
అమ్మా ఆలో చించదూ..
యేం మనుషులో కదూ
 

అయ్య ఆజ్ఞా
 వెంటనే  రామాయణం చంకలో పెట్టుకొని 

 అమ్మప్రయాణం
సరే కథ కొస్తా
అక్కడ ప్రకృతి ఎంత బాగుందనుకున్నారు
అబ్బ..
 నడక దారిలో చిన్న నీటిపాయ
అందులో చిన్న చిన్న చేపపిల్లలు
పెద్ద పెద్ద చామ ఆకులు   
నేను చిన్న పిల్లను కదా ఆటలే ఆటలు

 పాపఘ్ని నది అట
అమ్మ నదిలో స్నానం చేసి గుడిలో కూర్చొని 
పారాయణ చేస్తుంది
నలభై రోజులు
పారాయణ యే రెండుకో మూడుకో నాలుగుకో 

ఒక దరికి చేరుకుంటుంది
అప్పుడు సత్రానికి వచ్చి వంటచేస్తుంది
 

ఎట్లంటారా
మూడు రాళ్ళు పెట్టి కట్టెలతో వంట..
అన్నం పప్పు
నాకు అన్ని స్తోత్రాలు పాటలూ వచ్చేవి..
ఆడుతూ ఆడుతూ స్తోత్రాలు చెప్పేదాన్ని


ఇంకో విషయం
అక్కడ దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు స్వామి దగ్గరికి
 

నర సిం హస్వామి ఆంజనేయ స్వామి
దగ్గరికి వీళ్ళు ఎక్కువగా తీసుకొస్తారు
వీళ్ళు ఫేమస్  దయ్యాల డాక్టర్లు..
నలభై రోజుల సేవ చేయించి తీసుకెళ్తారు
తగ్గుతుందేమో
తగ్గకపోతే ఎందుకు వస్తారు 


వాళ్ళు మనపక్కనే కూచుని ఊగుతుంటారు
మా అమ్మ అయ్యలతో నేను ఘటికాచలామో 

మరి తులజాపూరో పోయినప్పుడు
అక్కడా ఇదే
యీ దయ్యం పట్టిన వాళ్ళని  ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళు
 

భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు దండం పెట్టుకొని
 వీరి మధ్యనుంచే వెళుతుంటారు
వీళ్ళు ఎవరినీ యేమీ చేయరు
 

ఆఖరికి పన్నెండు గంటల వేళ గంటలు పెద్దగా మోగిస్తూ హారతి ఇస్తూ పాటలు పాడుతూంటారు
అప్పుడు యీ పూనకమొచ్చిన వళ్ళని చూడాలి రెచ్చిపోతారు
 

ఒకామె రాతి స్థంభాన్ని సర సరా యెక్కింది
ఆ స్థంభానికి పట్టు యేమాత్రం దొరకదు 

యేవో బొమ్మలు చెక్కివున్నాయి
ఆమె ఆ స్థంభాన్ని యెక్కి వూగుతున్న పేద్ద గంటని అందిపుచ్చుకుంది
స్థంభాన్ని వదిలేసి గంటని పట్టుకొని వెళ్ళాడుతూంది
ఉల్టా కాలి వేళ్ళతో ఆ స్థంభం గొలుసులని పట్టుకొని
ఆ గంటమీదినుంచీ కిందికి వేళ్ళాడుతూంది
తన శరీరంతో ఆ గంటని పెద్ద పెద్దగా వూపుతోంది
ఎంత వేగంగా  అంటె నేను చెప్పలేను
 

భక్తులు భయంగా ఆమెను చూస్తూ దేవుణ్ణి చూస్తూ హారతిలో పాల్గొంటున్నారు
ఆమెకు ఆ కాలి వేళ్ళతో ఆ గంట గొలుసులలో 

ఎట్లా గ్రిప్ దొరికిందో
కిందపడకుండా అంత వేగంగా ఎలా ఊగిందో నాకే తెలీదు అసలా స్థంభం ఎలా సర సరా యెక్కిందో కూడ ఆశ్చర్యమే..

వాళ్ళ దీక్ష అయిపోతూనే  

వారి ఉన్మాదం నెమ్మదిస్తుండవచ్చు
 

అంతెందుకండీ
ఒకసారి ఒక ప్రఖ్యాత వైద్యుడు అతి కష్టమైన కీలకమైన ఆపరేషను చేస్తున్నాడట
దాన్ని వైద్య విద్యార్థులు చూస్తున్నారు
రోగి బంధువులు వున్నారు
టీవీల గుండ అది ప్రసార మవుతూంది
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది 

విలేకరులడిగారు అంత పెద్ద ఆపరేషను అంతమంది చూస్తుండగా ఎంతో నిబ్బరంగా ఎలా చేసారు అని
 

దానికి అతనేం చెప్పాడో తెలుసా..
అక్కడ ఎవరున్నారు ముగ్గురమే.
నేను రోగి ఆ భగవంతుడు అన్నాడట..


ఎంత డాక్టరైనా 
తాను ఒక పనిముట్టును మాత్రమే నని 
అతనికి తెలుసు

సరే..
నలభై రోజులు ముగిసాయి
చివరిరోజు అక్కడ అమ్మ పూజముగుస్తుందని తెలియగానే
అయ్య శిష్యులు మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు 

మా నాగక్కయ్య స్నేహితుల కుటుంబాలు
అందరూ గండికి ప్రయాణమై వచ్చారు
అమ్మ అయ్య యేం చేసినా వారికి అపురూపమే
 

చివరికి యేం జరిగింది ..
ఆ పెంచలమ్మ ఊరికి తిరిగి వచ్చింది 

మాఇంట్లో అదే మూలన వచ్చి కూచుంది
 ఆ హనుమంతుడు తన తోకతో పట్టి తీసుకు వచ్చాడని మురిసిపోయారందరూ

శత వసంత సాహితీ కీర్తి పుట్టపర్తి


"శత వసంత సాహితీ కీర్తి పుట్టపర్తి "

ద్రవిడ విశ్వ విద్యాలయం తెలుగు శాఖ వారు 
పుట్టపర్తి శతజయంతి సందర్భంగా 

3 నుంచీ 5 వ తారీకు కుప్పం లో వరకు మూడు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు

వారు సూచించిన వివిధ అంశాలు 
చాలా కొత్తగా వైవిధ్య భరితంగా ఉన్నాయి
ఔత్సాహికులు పాల్గొనవచ్చు








 



18 ఫిబ్ర, 2014

స్పర్శవేది

       తలగవు కొండలకైనను
        మలగవు సింగములకైన! మార్కొను గడిమిన్
        గలగవు పిదుగులకైనను
        నిల బల సంపన్నవ్రుత్తి! నేనుగ గున్నల్
        
       నీరాట వనాటములకు
        బోరటం బెట్లు గలిగె! బురుషోత్తముచే
        నారాట మెట్లు మానెను
       ఘోరాటవిలోన భద్ర: కుంజరమునకున్

 యీ పద్యాలు చదువుతుంటే

భావం  అది వ్యక్త పరిచే పధ్ధతి
ఆ పదాలు దానిలో దాగున్న లయ
అవి మనల్ని వెంటాడతాయి


కానీ విమర్శకులు మాత్రం
 భూతద్దాలతో తయారై
మంచివని మనమనుకున్న వాటిల్లోంచీ కూడా లోపాలు వెదికి  చూపిస్తుంటారు
 

ఆరంధ్రాన్వేషణ వలన వారికీ మనకూ కూడా ఒరిగేదేమీలేదు
కాగా
కొంతకాలానికి మనకూ ఆజాడ్యం అంటుకోగలదు
 

మనకెందుకీ రభసలు 
హాయిగా నచ్చిన కవిత్వం చదువుకోక అనుకుంటాం మనం

మరి పోతన్నకు యెదురైన విమర్శలేమిటి
చూద్దామా


గజెంద్రమోక్షంలో అడవిని వర్ణిస్తూ 
పోతన్న వ్రాసిన వచనం వారి కాహారమైంది.
 

ఆధునికులు 
తండ్రితాతల అన్వేషణలో ముందుకు సాగితే
సంప్రదాయవాదులు గ్రామరునే ప్రామాణికంగా పెట్టుకున్నారు


అయినా ఉత్తమ గ్రంధాలను వ్రాసేవారు 
జనాలకోసం రాయనే రాయరు
తనకోసం తన ఆత్మానందం కోసం రాసుకున్నవి మనకు అమృతాలవుతాయి
జనాలను మెప్పించడానికి రాసేవానిలో ఆత్మ ఎక్కడుంటుందీ..


పోతన వ్రాసిన వర్ణన ఇదే
ఒకసారీ అడవిగుండా ప్రయాణించి అందాలు వీక్షించి పుట్టపర్తి వారేం చెప్పారో చూద్దాం సరేనా..


 అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు న్నివహా లంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధకోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును, తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరితట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీతప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమరసన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై యొప్పు నప్పర్వత సమీపంబునందు.


                                                                       *** 




 
ప్రాచీనులలో అప్పకవి మొదలైన మహామహులకు పోతన్న కవిత్వము లాక్షణికముగ గనుపింపలేదు
అతడొనర్చిన పాపమేమనగా 
లఘ్వులఘురేఫములకు బ్రాస గూర్చుట..

ఇట్టి పనికిమాలిన యెత్తిపొడుపే పాలకురికి సోమనాధునిపైగూడ గలదు

యీ జాతి వారందరును 
కల్ప వృక్షములను దెగనరికి వంటకట్టెలు 
దయారు చెయుదమను రకము.

అప్పకవి వంటి వారికే గాదు కవుల మనుకొన్నవరిలోను చాలమందికి
పోతనామాత్యుల పై యనుగ్రహము మట్టమే

అందుకే 
ప్రాచీన కవి ప్రశంసల చిట్టాలలో నెక్కడో దప్ప
పోతన పేరు గనుపింపదు
యీ నడుమ
 పోతన్నను గురించి సాగిన విమర్శలు 
ఆయన యూరేది తండ్రి తాత లెవ్వరు
మొదలగు విషయములపైననే 
కొందరు విద్యాధికులాతని 
కవిగా తూచిన వ్రాతలును గలవు

కాని వీరిలో జాలమంది యాంగ్ల విద్యాభక్తులు
వారి సులోచనములు ధరించియే 
ప్రతి విషయమును జూతురు

ప్రాచీనులది అదొక గొడవ
కలమందికొన్నంతనే వారి కంటబడునది
మమ్మటుడు రుయ్యటుడు
తప్పులు బట్టుటలో నున్నంత చొరవ యొప్పులను గ్రహించుటలో లేదు

ఇంతకును 
నీ యిరుదెగల విమర్శనములతోను 
మనకు జరిగిన న్యాయము సున్న

గజేంద్ర మోక్ష కథలో నడవిని వర్ణించుచు 
పోతన్న యొక దీర్ఘ వచనమును వ్రాసినాడు 
దీనినొక ప్రసిధ్ధ విమర్శకుడు వెక్కిరించెను

అమర కోశమును దగ్గరుంచుకుని పోతన్న 
వనోషధి వర్గలోని చెట్ల పేర్లన్నియునిందు జేర్చినాడట
నిఘంటువును దగ్గర బెట్టుకుని 
పదములకు వెదుకవలసిన దురవస్థ 
ప్రాచీనకవులకు లేదు

వారు బాల్యముననే వానినెల్ల వల్లించెడు వారు
పూర్వకవులలో 
గొందరు సంస్కార హీనులైన నుండవచ్చును గాని యవ్యుత్పన్నులు లేరు

అట్టి ప్రబుధ్ధులున్నది మనలోనే..
ఆంగ్ల భాషాభ్యాసము మనకు గొంత 
స్వతంత్ర భావముల నొసగినది
అట్టివారును దక్కువయే

మనపూర్వులు ప్రాచీన సంప్రదాయములకు బానిసలని మనము వారిని నిందింతుము
కాని మనకథ యేమైనది ?
మనమంగ్ల సంప్రదాయములకు దాసులము

ప్రాచీనుల దాస్యములో 
మా యనుకొని సంతోషపడు నాత్మతృప్తియైన నున్నది
మనకదియులేదు..

14 ఫిబ్ర, 2014

యజ్ఞ వేదిక



తస్మాత్ జాగ్రత జాగ్రత.



''కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః  
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత.. ''
  
జీవితం ఒక కల వంటిది.. 
జీవి కనే కల 
షడూర్ములు కలలోని సన్నివేశాలను 
నిజమని భ్రమింపజేస్తాయి..
 

ఆ సన్నివేశాలతో మమేకమై 
జీవి  తప్పటడుగులు వేసేలా 
 పురికొల్పుతాయి

 ప్రయాణాన్ని నాలుగడుగులు ముందుకూ 
మూడడుగులు వెనక్కు పడేలా చేస్తాయి..

జ్ఞానమనే రత్నాన్ని అపహరించే దొంగలు  
కామ క్రోధ లోభాలు
జీవుని యాత్రలో వెనక్కి పోయేటట్లు..  

భయంకరమైన యాతన వేపుకు తోసివేయగల 
నైపుణి వాని సొత్తు
వానికి జీవితోటే కానీ 
అతను వేసుకున్న బట్టలతో పనిలేదు
రాజైనా పేదైనా సాధువైనా సన్యాసైనా..
ఒకటే



క్షణంలో రాజును పేదలా..
సన్యాసిని సంసారిలా..
మార్చేస్తాయి
 

గీతాచార్యుడందుకే వీనిని 
'నరక ద్వారములు' అన్నాడు..


ఈ నడుమ ఒక రోజు నాకో ఫోన్ వచ్చింది..
ఒక పీఠాధిపతి కార్యాలయం నుంచీ

ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు 
పీఠాధిపత్యం పొందాడు

 జీవితంలో కొన్ని అయాచితంగా లభిస్తాయి 

వానిలో మన ప్రమేయమేం వుండదు..
పాపం పసివాడు 

సన్యాసదీక్ష అవలంబించాడు..
 అనుకొని..

పుట్టపర్తి ప్రతిదినమూ వారింటికెళ్ళి 
భగవద్గీత చెప్పేవారట..
వానికి సన్యాసి ధర్మం గురించి 
యేదో నేర్పించాలని తపన

పుట్టపర్తికీ కొంత సన్యాసిత్వం పై అపేక్ష వున్నది
అందుకు కారణం 

కొందరు  లోపల వున్నారు
వారు ..
అరవిందులు..
రమణులు..
రామకృష్ణులు..
 

వారు ఆశ్రమ జీవితం కొరకు కొంత ప్రయత్నించి వున్నారు కూడా
కానీ మనసులోని అన్ని భావనలను సాకారమొనర్చడం సాధ్యం కాదు
అదీ భార్య నలుగురు పిల్లలతో..
 

తన సఫలమవని కోరికపట్ల అసంతృప్తి.. 
కానీ .. 
ఆశ్రమ జీవితంపై విడని మోహం..

చంద్ర శేఖర పరమాచార్యులవారు కూడా  
అతి చిన్నవయసులో పీఠాధిపతిగా యెంపిక అయ్యారు
ఆ పసివాడు గుర్రపు బండిలో బోర్లా పడుకుని 
లో తాను దుఃఖించార ట..

ఆ తర్వాత ఆ కొత్త పాత్రలో వొదగడానికీ
తనను తాను మార్చుకోడాని కి 
దినదినమూ ప్రయత్నం  చేశారట..
కొత్తలో సత్యదండాన్ని వదలి తిరిగేవారుట..
తరువాత 
తన నడుముకు బట్టతో గట్టిగా కట్టుకుని పడుకునేవారు

ఆ ప్రయత్నాలు స్వచ్చమైన.. 
శక్తివంతమైన సన్యాసిని ..
మనకు చూపాయి..

యెక్కడికైనా నడకే..
లేదా పల్లకీ
ఇతర వాహనాలు యేనాడూ యెక్కలేదు..

 మౌన వ్రతాలూ ఉపవాస దీక్షలూ..

కఠిన ఆహార నియమాలూ
ధ్యాన యోగాది నిత్యకృత్యాలూ..
వయసు ప్రలోభాలకు తావివ్వలేదు..
పూర్వాశ్రమ బంధాలను 
తిరిగి కొనసాగించలేదు..
పూర్తిగా తన జీవితాన్ని 
వైదిక ధర్మానికి ఆశ్రమ విలువలకూ రాసిచ్చేసారు..

అందుకే ఆయన్ని నడిచే దేవుడన్నారు..
కోటీశ్వ రులు సైతం రోడ్డుమీద కూడా సాగిల పడేవారు..

 యీనాడూ కూడా మంచి కార్యాక్రమాలను నిర్వహిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి

 వంటి వారూ..
అలానే సన్యాసిత్వానికి మసి పూస్తున్న నిత్యానందలూ 
మనకు తగుల్తూనే ఉన్నారు..

మరీ స్వామి మనకేం చెబుతారో.. 
అని ఆలోచిస్తూ

నేను వెళ్ళాను..

దూరం నుంచే..    కిటికీ లోంచీ పేద్ద టీవీదర్శనమిచ్చింది
అందులో  ఫుట్ బాల్ మ్యాచ్..

బయట పిల్లలు పిలకలతో వేదాలు చదువుకుంటున్నారు
మరి..లోన టీవీ..??

నాకు సాదరంగా ఆహ్వానం పలికారు..
టీవీ రూం లొంచీ స్వామి బయటికి వచ్చారు..
వూగే వుయ్యల కుర్చీలో స్వామి ఆశీనులయ్యారు..
స్వామి భారీ విగ్రహం కుర్చీలో కష్టపడి ఒదిగింది..
ఇంతలో స్వామి వారి సహోదరులు వచ్చి చేరారు..  

'పుట్టపర్తివారు మాకు చాలా సన్నిహితులు..'
అంటూ చెప్పారు..
కానీ..
తరువాత సాగిన సంభాషణ అంతా ..
ఎవరు అన్య కులస్తుణ్ణిచేసుకున్నారు..
ఎవరెవరికి యేయే వ్యసనాలున్నాయి..
వగైరాలచుట్టూతిరిగింది..

పది మాటలు స్వచ్చంగా ధారగా సూటిగా 
మాట్లాడలేని స్వాములవారు.. 
మాటిమాటికీ తడబడుతున్నారు..  

వాళ్ళ లో వాళ్ళే మేనేజర్లూ..అకవుటెంట్లూ..నట..
కాషాయ వేషధారణలో తప్ప 
యెందులోనూ కనపడని పవిత్రత..
ఆకాషాయంకూడా గత్యంతరంలేక 
వాళ్ళని భరిస్తున్నట్లనిపించింది..

పైకి సంభాషణ సాగుతున్నా 
లోలోన నా మనసు రోదిస్తోంది
మా అయ్యగురించి 
యేమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో
అని ఎంతో ఆశగా వెళ్ళిన నాకు 

తీవ్ర భంగపాటు..
 

స్వామి గారూ ..వారి సహోదరులూ..
 ఆ వాతావరణం చూసిన నన్ను 
చుట్టుముట్టిన అశాంతి..
 

అతనే..
అతనే ..
 సన్యాసి..
నిజమైన సన్యాసి..
నిజమైన సన్యాసి..


 నా మనసులో ధ్వనులు ప్రతిధ్వనులను సృష్టిస్తున్నాయి..


 ''నేను ఇన్ని కోట్ల గాయత్రి చేసాను ..

ఇన్ని కోట్ల అష్టాక్షరి చేసాను ..
ఇదీ నా స్థితి..
నాకే అనుభూతీ కలుగలేదు....
నీకు కలిగిందా..?

నీవు దేవుణ్ణి చూశావా ..?

నాకు చూపగలవా ..?''
అని పీఠాధిపతులనే ప్రశ్నించి తత్తర పుట్టించినవాడు

 వాళ్ళేం చెబుతారు..
అంత సాధన వాళ్ళే చేసివుండరు
అదీకాక అంత తపన వాళ్ళలో వుంటేకదా..?

 ఆధ్యాత్మికానుభూతి కలుగలేదని 
అశాంతితో ఇల్లు విడిచి దేశం పట్టిపోయి..
అనేక మంది సాధువులనూ సన్యాసులనూ కలుస్తూ..
చివరకు హిమసానువుల పైనుంచీ విరక్తితో

 జీవితం త్యజించాలనుకున్న పుట్టపర్తి ఎక్కడా..
వీళ్ళెక్కడా..


 అందుకే పుట్టపర్తికి దేవుడు కనిపించాడు
దయానంద సరస్వతి గా ..
ప్రేమగా తన ఆశ్రమానికి తీసుకెళ్ళారు..
అన్ని విధాలా పరీక్షించారు..
కాదు కాదు
తండ్రి తన పిల్లవాణి సామర్థ్యానికి మురిసినట్లు మురిసిపోయారు
పుట్టపర్తిని విరక్తినుంచీ బయటకు తెచ్చి..
 

నాయనా నీకు ఇంకా జీవితం ముందుంది..
కీర్తి కిరీటాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి..
ఎన్నో అనుభవాలు నీకై వేచి వున్నాయి..
తరువాత ..
నిన్ను నేనే నా దగ్గరికి పిలిపించుకుంటాను..
అని చెప్పి పంపారు..

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యులవారు
నీకు అంత్యదశలో కృష్ణదర్శనమవుతుందని భరోసా ఇచ్చారు..

 
నూనెకీ ...నీటికీ ..తేడా లేదు
అగ్నిలో పోసినప్పుడు మాత్రమే.. 

దాని నిజ స్వరూపం తెలుస్తుంది.. 
అగ్నిని ఆర్పేవి నీళ్ళు
మరింత ప్రజ్వలింపజేసేది  నూనె..


12 ఫిబ్ర, 2014

పుట్టపర్తి సాహిత్య సర్వస్వం



పుట్టపర్తి సాహిత్య సర్వస్వం ముద్రణ పనులు 
 శరవేగంగా జరుగుతున్నాయి

ఒకవేపు 
ప్రాచ్య లిఖిత గ్రంధాలయం తరఫున 
ముద్రణ జరుగుతున్న కృతుల పనులలో 
అక్కయ్య మునిగి వుంది

పర్యవేక్షణ బాధ్యతను 
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు 
శ్రీ కొమండూరు శేషాద్రి గారికప్పగించారు
వారు పుట్టపర్తివారితో 
యెన్నో యేళ్ళ పరిచయం కలిగినవారు

కానీ వారు ఇప్పుడు అమెరికాలో వుంటున్నారు
వారితో ప్రొద్దున అయిదుగంటలకు
తిరిగి సాయంత్రం అయిదు గంటలకు
రెండు రెండు గంటలు ఆన్ లైన్లో 
జాక్ ద్వారా ప్రతిదినమూ సంభాషిస్తూ
ఆ కృతుల వ్యవహారాన్ని చూస్తూంది అక్కయ్య


ఎక్కువగా ప్రయోగంలో లేని రాగాలలో
ముత్తయ్య భాగవతార్ ముత్తుస్వామి దీక్షితులు మొదలైన వారు వానిలో ఒక్కొక్క కీర్తనలే వ్రాసారు
వానిలో కూడా పుట్టపర్తి అనేక కీర్తనలు వ్రాసారు

వాటికి కూడా యేమి ఎత్తుగడలు
యేమి పల్లవులు
యేమి వైవిధ్యం
పుట్టపర్తి సంగీతాత్మకమైన ఆకృతిని తెలుసుకోవలసిన వారు వీనిని తప్పక స్పృశించాల్సిన అవసరముంది
 

రాళ్ళపల్లి సంగీతాన్ని నమ్ముకొని 
సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేసారు
నేను సాహిత్యాన్ని నమ్ముకొని 

సంగీతాన్ని పట్టించుకోలేదన్న
పుట్టపర్తి మాటలలోని ఆవేదన 

కొంతవరకు తన కీర్తనలకు పొందుపరచిన 
రాగాలతో కొంతవరకు తీర్చుకున్నారేమో..


యీ కృషిలో 
పెద్దజమాలప్ప సహకారం తీసుకున్నారు
పుట్టపర్తి
నా కృతులను స్వరపరచాలి జమాలప్పా 
మా ఇంటికి రా అంటే
చెప్పిన సమయానికి 
హార్మోనియం పెట్టె తీసుకొని వచ్చి
ఎన్ని గంటలైనా..  రోజులైనా ..రాత్రైనా.. పగలైనా..
తిండి తిన్నా.. తినకున్నా ..
పుట్టపర్తి కెంత తపన ఉందో 
అంతే తపనతో పనిచేసే వారిని చూస్తే యేమనగలం
భగవంతుని పని అలానే జరుగుతుంది 
అంటాం అంతే కదూ
 
పెద్ద జమాలప్పగారు గొప్ప విద్వాంసులు
ఆరోజుల్లో గండపెండేరం కూడా తొడిగించుకున్నారు
పుట్టపర్తి వారు అపూర్వ రాగాలలో 
యెన్నో కీర్తనలను వ్రాసారు
చాలా వాటికి సంగీతం నోట్లు కూడా వ్రాసారు
ఎత్తుగడలు  ఆకట్టుకొనే విధంగా వున్నా యి
కొన్నిటికి ఆరోహణలు అవరోహణలు వున్నాయి
కొన్నిటికి లేవు
కొన్నిటికి వుండి మరికొన్నిటికి వుండకపోతే బాగుండదు 

కనుక
కొత్త కొత్త రాగాలకు
ప్రాచుర్యంలో లేని రాగాలకు ఆరోహణ అవరోహణల విషయంలో కొమండూరి గారు 
రాధా పార్థసారధి అనే ప్రొఫెసర్ పేరు సూచించారు

ప్రతిరోజూ ఆమె తో సంప్రదింపులు
ఆమె వీలైన సమయంలోనే 
అందుబాటులో ఉన్న సమయంలోనే ఆమె నడగాలి

యే రాగం చెప్పినా మరునిమిషంలో 
ఆరోహణ అవరోహణలు చెప్పే కొమం డూరి గారి
ప్రజ్ఞ కు అక్కయ్య ఎంతో సంతోషపడుతూందిఅయ్య 

శతజయంతి ఘనంగా జరగాలని 
నా చిరకాల వాంఛ
సాహిత్య సర్వస్వం కృతులు ముద్రణ కావటం 
మన అదృష్టం
అంటుంది అక్కయ్య.

నిజానికి అక్కయ్య అకుంఠిత దీక్ష వలననే 
పుట్టపర్తి కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి
ఒక కూతురు తన తండ్రికి ఇచ్చే ఘనమైన నివాళి  ఇంతకన్నా యేముంటుంది

బాహ్యంలో బ్రతుకుతున్నా
ప్రతిక్షణం అయ్య అయ్య అని మనసులో జపించేదే నిజమైన తపస్సు 
కాదంటారా..

దేవునికి తన వ్యక్తిగతమైన కోరికలు పక్కన పెట్టి
మా అయ్య సాహిత్య సర్వస్వం త్వరగా ముద్రింపబడాలని మొక్కుకునే బిడ్డలు యెవరికుంటారు..


అదేగాక
కృతుల సాహిత్యం
శిష్యులు వానిని వ్రాసారు
వ్రాత గాని పైత్యం కూడా అందులో కలిసింది
అన్వయం కుదరనివానిని సరిచూసుకోవాలి


నే నూ డి టి పి లో పాలు పంచుకుంటున్నాను 
మే ఘదూతము లోనికవితా సౌరభాలను 
సాక్షత్కారంలోని తులసీదాసును 
సిపయిపితూ రీ లోని దే శ భ క్తిని 
అనుభవిస్తూ చేస్తున్నాను 

నిడుద కన్నుల దాని 
నిండు చెక్కుల దాని 
నడు ము వడ కెడు దాని 
నగవు చిత్తడి దాని 
బెడగు నడకల దాని 
పేర్మి పొడవగు దాని 
దానిమ్మ పూ వంటి తళుకు బెదవుల దాని 
తన్వంగి దలపోసి దలపోసి నిట్టూర్చు ... 
ఆహా .. 

ఇక
సాక్షాత్కారము లో
తులసీ దాసును రామునికై తపసు చేయమని పంపుతుంది మమతాదేవి
అక్కడ తులసీ దాసుకు మనసు నిలువదు
ప్రతిక్షణం ప్రేయసి సాన్నిధ్యానికై తహ తహ లాడే మనసు
 

రాముడు రాముడంచని 
విరామము లేని జపమ్మునెల్ల 
నీ ప్రేమయె నాక్రమించినది ప్రేయసి ! 
దుర్గమమీ పరీక్షలో
రాముడె నిల్చునొ !

అనురాగ భరాలస ముగ్ధవైన 
నా కామిత మూర్తి 
నీవె కడగన్నుల నిల్తువొ 
ధ్యాన లక్ష్యమై..
ఆమె ధ్యానంలో విలవిల లాడతాడు.. తులసి

యెన్ని యుగంబులయ్యె హృదయేశ్వరి 

వింతగ బల్కరించు నీ కన్ను జూచి 
కాటుక నిగారపు కాంతులు జూచి 
యెంత లోగొన్నదే యీ యెడంద 
నొడగూడని కూడగ రాని చెల్మి, 
నేనన్న ప్రతిజ్ఞయే గరళమైనది 
జీవితముల్ దహింపగన్..

ఒక్కో భావం గుండెల్లో గుచ్చేస్తుంది..

ఇది చూడండి
ప్రేమ బలంబులెంత విపరీతములే
నవ పుష్ప కోమల ప్రేమముతోనె 

భోగి నవలీలగ యోగినొనర్చివైచి తింతీ..
మహనీయమీ తపము నిండగ గీలుగొల్పి 

నా రాముని
రామచంద్రుని విరక్త హృదిన్వెలిగించి వేయవే..

ఆ కడసారి నిన్ను
సొగసంతయు పండిన నిన్ను వీడి
యుద్రేకము నూతగోలగొని
దీనత వచ్చిన యప్పుడీ యెదన్
బ్రాకిన వేయి సర్ప గరళంబుల జావనిదాని కొక్కడా
నాకొక వేయిరాములైన గనుపట్టవలెన్ రహస్సఖీ..
 

రహస్సఖీ.. ఓహ్..
ఎంత కఠినాత్మురాలు కదా ఆ మమతాదేవి

ఒక్కటేమిటి ప్రతి ఒక్క లైనూ హృదయంలో వజ్రవైఢూర్యాల్లా దాచుకోవలసినవే..
ఆ భావతీవ్రతలోంచీ బయటికి రావడం చాలా కష్టం
 

నా చిన్నప్పుడు..
మా అయ్య గీతాంజలి చెప్పేవారు
పాఠం అయిన తరువాత
పిచ్చిపట్టినట్లు అవే చదువుకుంటూ ఒకటే యేడవటం..
నాకప్పుడు పధ్నాలుగేళ్ళే..


ఇక గ్రంధాల విషయానికొస్తే 
శ్రీశైలం గారు వారి తమ్ముడు కొండయ్య గారు 
ప్రూఫ్స్ దిద్దుతున్నారు 

ఎలా 
అన్ని పనులూ పక్కన పెట్టి 
ప్రతిరోజూ ఉదయం అయిదు గంటల నుంచీ రాత్రి వరకూ 
దీక్ష గా
పండరీ భాగవతంలో 650 పేజీలు
 ప్రతి అక్షరం చూస్తున్నారు

డి టి పి గురించి శ్రీశైలం గారేమంటునారో చూడండి
"ప్రక్కన వుందనుకోండీ
నాలుగు లైన్ల తరువాత మళ్ళీ ప్రక్కన వస్తుంది
యీయన యీ ప్రక్కననుంచీ 
ఆ ప్రక్కన కెళ్ళిపోతాడు..
ద్విపదకు రెండవ అక్షరము ప్రాస 
ఆ ప్రాస మిస్సయితే కష్టం కదా

పదిరోజులనుంచీ ఉదయం అయిదు గంటలకు లేచి బయటికి ఎక్కడికీ పోకుండా
ఇదే పని మీద వున్నారు కొండయ్యగారు
ఆ శైలికి ఎవరు సాటి రారు .. హై శైలి
పండరీ భాగవతం చూడడం నా అదృష్టం అన్నారు 
ఆయన

ఇది నాకు లభించిన మంచి అవకాశం
పండరీ భాగవతం ధార అద్భుతమైన ధార
భక్తి తపస్సు చేసి యీ గ్రంధం వ్రాసినట్లు ఉంది
యెవరికీ సాటి రాదు యీ భాషాశైలి అంటారు 


9 ఫిబ్ర, 2014

భ్రమర కీట న్యాయం


'బాబూ నీకెవరిష్టం?'
  'సచిన్ టెండూల్కర్'
అంటాడబ్బాయి
కొద్ది రోజులు బ్యాటూ  బాలూ పట్టుకుని ఆడతాడు
పెద్దయ్యాక యే క్లర్కో ఇంజనీరో
 

'నాకు యంటీఆర్ ఇష్టం
ఆయన సినిమాలు ముఫై సార్లకు పైగా చూసేవాణ్ణి'
అంటూంటారు చాలామంది
తర్వాత  నటన చాయలకు కూడ పోకుండా
జీవితం వెళ్ళ దీస్తారు
 

కానీ కొందరుంటారు..
వాళ్ళ ఇష్టం వారి జీవితాన్ని నడిపిస్తుంది
చూపులు పక్కకు తిప్పనివ్వదు
అన్ని జీవిత ప్రాధాన్యతలూ దాని తరువాతే..
అగ్నియై కాల్చేస్తుంది వాళ్ళని
వాళ్ళే భ్రమర కీట న్యాయానికి నిలుస్తారు
 

భ్రమరం కీటకాన్ని తనగూట్లో తెచ్చి ఉంచి 
దానిచుట్టూ ఝుం... అంటూ 

తిరుగుతూ..తిరుగుతూ..  తిరుగుతూ
 

మొదట భయంగా .. తర్వాత తదేకంగా.. 
 తర్వాత యేకాగ్రతగా .. 
తర్వాత తన్ను మరచి..  మరచి .. మరచి .. చూసి..చూసి..
చివరకు కొద్ది రోజులకు 

తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం..
ఇదే భ్రమర కీటన్యాయం..
అదే తపస్సు..
అదే అహం బ్రహ్మస్మి..
భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడు..


దాన్ని అద్భుతంగా ప్రతిపాదించేదే 
పుట్టపర్తి అష్టాక్షరీ కృతి
'' నీవనుచు నీవైతినే పరమాత్మ
నినుజూచి నీవైతినే..
''

భక్తుడు పరమాత్మను ఎల్లవేళలా పాడుచు పొగడుచు.. గుణకీర్తనం చేయుచు
తాను అతనై పోవటం ఉపాసన
మరి భ్రమర కీట న్యాయంలో పుట్టపర్తీ ఒక భ్రమరమైన వారే కదా..
మరి వారేం చెబుతారు ..





పోతన్న జీవితమును 
రామో పాసనతో నారంభించుట మనయదృష్టము
ఉపాసన యనగా 

దాను నమ్మె రామునినో కృష్ణునినో పాడుచు పొగడుచు నాతని దివ్య చరిత్రములను వినుచు జూచుచుండుటయేకదా
 

అట్లు సేయుటలో
నా యుపాసనా మూర్తి యొక్క 

గుణములు అభిరుచులు భక్తున కత్యంత ప్రియములై కొంత కాలమునకు వని స్వభావము గూడ నట్లే మారుటయు గలదని పెద్దలందురు
ఆ భావములు ప్రచండముగ నెదిగినప్పుడు
రూపురేకలు గూడ నట్లే యగునట
భ్రమర కీటక న్యాయమిదే
 

యీ విషయములు మన యూహ కందవు గాని
హనుమంతుని దీవ్రముగ భావించిన వాళ్ళలో 

రా మకృష్ణ పరమహంసకు 
తిన్నని తోక యొకటి బయలుదేరినదట.
 

రాధాదేవి ధ్యానమునందు నిమగ్నుడైన 
చైతన్య ప్రభువునకు దాను మగ వాడనుట 
యెప్పుడో దప్ప జ్ఞాపక మొచ్చెడిది కాదట..

రెండవదేమో గాని 
మొదటి విషయము మాత్రము
పిల్లలకందరికనుభవములో నున్నదే
తోకలేకయే హనుమంతులగుదురు. 

కొన్ని వేళలలో పెద్దలము గూడ..

8 ఫిబ్ర, 2014

5 ఫిబ్ర, 2014

ఆత్మలున్నాయా..

ఆత్మలున్నాయా..
కొంతమంది ఉన్నాయని విశ్వసిస్తే..
చాలా
మంది లేవని   
మానసిక భ్రమ మాత్రమే అనీ కొట్టిపారేస్తారు
 

మరికొంతమంది మాత్రం ఉన్నాయని అనిపించినా 
వానిని స్పష్టం చేయలేక
ఊరుకొంటున్నారు.
ఒక వేళ
ఆత్మలున్నా 
అవి మన మనుషుల్లాగ కనిపిస్తాయా..
లేక సినిమాల్లోలా తెల్లచీరలూ గట్రా ధరించి 

పగ సాధిస్తాయా..

ఆత్మలు గాలిరూపంలో వుంటాయని
పసిపిల్లలను కొత్తగా పెళ్ళయిన వాళ్ళనీ 

వంటరిగా వూరిచివర్లకీ వెళ్ళొద్దంటారు..

చాగంటి వారైతే..
అమెరికాలో లేదా దూర ప్రాంతాలలో పిల్లలు ఉన్న తలిదండ్రుల శవాలను దహనం చేయకుండా 

వారు వచ్చే వరకూ వైట్ చేయడం జరుగుతుంది
 

ఆ పరిస్థితులలో ఉగ్ర భూతాలు 
యీ ఆత్మలను భయపెడతాయని  
ఉత్తర కర్మలు జరిగిన తరువాతే 
ఆ ప్రేతం  విముక్తి పొందుతుందని అన్నారు

అయితే తాము ఆత్మ చూశామనీ, 
దానిని తమ కెమేరాలో బంధించామనీ అంటోంది 
లండన్ అతీత శక్తులపై పరిశోధనలు చేసే బృందం. 
  
ఇంతకీ ఆత్మలు ఉన్నాయా? 
అని విదేశీ ఫొటోగ్రాఫర్లను అడిగితే ఉన్నాయనే అంటున్నారు. 
తమ కెమెరాలతో వాటిని వెంటపడి బంధించామని కొందరు చెబుతుంటే 
మరి కొందరు ఏదో ఫొటో తీస్తుంటే 
తాము అనుకున్న బొమ్మతో పాటు 
తమకు తెలియకుండానే ఆత్మలు కూడా వచ్చాయని కొందరు చెబుతున్నారు. 
ఎదురుగా ఉన్న వస్తువుపై పడిన ఫ్లాష్‌ రియాక్టయి  
ఆత్మ ఆకారం వచ్చిందని 
కొందరు అంటుంటారు.

 ఒకసారి ఒకమ్మాయి ఇంట్లోంచీ అదృశ్యమైంది
ఇంట్లో వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు
నాలుగు వైపులా వెదికారు
ఎవరి సలహా వల్లనో 

అంజనం వేసే వాళ్ళు పిలిపించబడ్డారు
పెద్ద ముగ్గు వేసి 

ఒక చిన్న పిల్లాడిని పీటపై కూచో పెట్టారు
చిన్నపిల్లలు కళ్ళార్పకుండా చూడగలరట..
పూజ నడిచింది

 ఆ పిల్లవాడిని ఆ ముగ్గులోకి చూడమన్నారు
 

వాడికి అందులో 
ఆటో లో వాళ్ళ మామతో వెళుతున్న వాడి అత్త కనిపించింది
ఆ ఆటో వాళ్ళ ఇంకో అత్త ఇంటి ముందు ఆగింది 

అని వాడు చెప్పాడు
తర్వాత నిజంగానే 

ఆ అమ్మాయి ఆమె వదిన తమ్ముడిని ప్రేమించి
ఇంట్లో వాళ్ళు వద్దంటారని భయపడి
బంధువుల సహకారంతో అతణ్ణి పెళ్ళి చేసుకుంది.
వాడు చెప్పిన విషయం అక్షరాలా నిజమే..
 

మనకు తెలియని విషయాలన్నీ 
అపధ్ధాలని అనుకోవడం నిజంగా మన భ్రమే..
 


పుట్టపర్తి వారు కూడా 
ఒక దయ్యాల ఇంటిలో ఉండేవారట..
మా అక్కలు అప్పుడు చిన్న పిల్లలు
వాళ్ళు మిద్దె పైకి మెటికలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడూ వెనకనుంచీ ఎవరో తోసినట్లు అనిపించి

 కింద పడే వాళ్ళట..
ఆడుతూ ఆడుతూ తోసినట్లు 

ముందుకు పడిపోయేవారట..
ఆ యిల్లు గలాయనకు ముగ్గురు భార్యలు
ఇద్దరు చనిపోతే మూడవదాన్ని చేసుకున్నాడు
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మా అమ్మ అతనికి
చనిపోయిన ఆఇద్దరు భార్యలకు 

సరిగ్గా కర్మలూ అవీ  చేయమని
వారి పేరున ముత్తయిదలకు పసుపు కుంకుమ తాంబూలాలిచ్చి వారి కడుపు చల్ల చేయమని చెప్పివచ్చిందట..
 

ఒక్కటనిపిస్తుంది
మనం కడుపులో ఉన్నాం
బయటికొచ్చాం
ఒక రెండు మూడేళ్ళ వరకు 

మనకు యేమీ జ్ఞాపకం ఉండవు
కానీ అప్పుడు మనం లేమా ఉన్నాం
కానీ ఒక మూడేళ్ళ నుంచే మనకు మనవిషయాలు అమ్మా నాన్నా విషయాలు గుర్తుంటాయి..
అలానే మన దేహం పసితనం నుంచీ యవ్వనం నడివయసు వృధ్ధాప్యం లలో మార్పులు చెందుతుంది
చివరికి
కళ్ళు చెవులు కాళ్ళు చేతులు 

తమ పనిని చేయటం మానేస్తాయి
క్రమంగా శరీరం శుష్కించి పోతుంది
యేదో ఒకనాడు మనకు తెలియకుండానే 

మనం చనిపోతాం
తరువాత మనం లేమా..
లేకపోతే ఎక్కడికి పోతాం..
శరీరం ముసలిదయ్యిందే కానీ 

మనసు ఆలో చిస్తోందికదా..
మరి చనిపోవటం అంటూ జరిగాక మనసేమవుతుంది.. 
 మరణం తరువాతా మన కర్మ గతిననుసరించి 
ఎక్కడో ఒకచోట వుంటామేమో అనిపిస్తుంది
ఆ విషయం ఇప్పటి మనకు తెలియదంతే..


అప్పుడు నాకు పద్దెనిమిదేళ్ళు 
అది  మా అయ్య చనిపోయిన సాయంత్రం
అందరూ ఎక్కడి వాళ్ళక్కడ కూచుని మాట్లాడుకుంటున్నారు..
కరంటుపోయింది
 

నేను భోజనాల గదిలో
మా అయ్య ఫోటో గుండెలకు హత్తుకుని 
గోడకు ఆనుకుని కూర్చుని ఆలోచిస్తున్నాను అప్పుడప్పుడూ యేడుస్తున్నాను..
 

గతంలో 
నేను అలా ఆ గదిలో కూచునో పండుకొనో వున్నప్పుడు
మెల్లిగా మా అయ్య హాలునుంచీ నడుచుకుంటూ వచ్చి
'నాయనా మిద్దె మీద పడక వేసిరామ్మా ..'
అనే వారు..
నేను వెంటనే వెళ్ళి నవ్వారు మంచం పరుపు వేసి 

దోమల తెర కట్టి వచ్చేదాన్ని
ఒకవేళ దోమల తెర తరువాత కట్టినా 

ముందైతే పరుపు వేసేదాన్ని
అయ్య వచ్చి పడుకునేవారు
ఒక్కో సారి 'కొంచం కాళ్ళు వత్తమ్మా ..'

అనేవారు
నేను మా అయ్యసేవ 

ఆ భగవత్సేవ లాగనే భావించి చేసేదాన్ని 
హయగ్రీవం చెప్పుకుంటూ 
భక్తిగా అయ్య పాదాలు వత్తేదాన్ని

 అయ్య ఇక చాలు అనేవరకూ

ఆరోజు కూడా..
తలవంచుకుని వున్న నాకు 

'నాయనా  పైన పడకేసి రామ్మా..' అని వినిపించింది
నిజంగా నిజ్జంగా..
ఉలిక్కి పడ్డాను..
ఇది భ్రమా నిజమా అని ఆలోచించాను..
వెంటనే పైకి వెళ్ళాను..
పైనా అంతా చేకటి..
అక్కడ అయ్య కూచునే అరుగుపై కూచున్నాను..
అయ్యకోసం..
కానీ రాలేదు..
భగవన్నామం చెపుతూ 

యీ జగన్నాటకం నుంచీ నిష్క్రమించిన 
అయ్య దివ్యాత్మ 
నాకీ అనుభవమిచ్చినందుకు ఎంతో సంతోషపడ్డాను..




3 ఫిబ్ర, 2014

దురవస్థ


కొన్ని జ్ఞాపకాలు

గొల్లపూడి మారుతీరావు గారు కడప ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ డా. రేవూరి అనంత పద్మనాభరావు గార్లతో 

జిల్లెళ్ళమూడి అమ్మతో ఆ చిన్నపిల్లను నేనే ..
 ఇంకో విషయం చెప్పడం మరిచాను
అక్కడ కూర్చున్నప్పుడు జిళ్ళెళ్ళమూడి అమ్మ పక్కన ఉన్న పుట్టపర్తి వారి తలను నిమురుతూనే ఉంది..
ఆఫోటో కూడా వుందాలి అమ్మ అయ్య తలపి చేయి వేసి నిమురుతున్న ఫోటో



 రాజన్నతో


 కలకత్తా లో




2 ఫిబ్ర, 2014

పిబరే రామరసం


ఒకసారి విశ్వామిత్ర మహరాజు 
వశిష్టుని దర్శించటానికి వచ్చాడు
వెంట మహా సైన్యం..
వశిష్టుల వారిని సేవించి
కొంతసేపు అవీ ఇవీ మాట్లాడి 

వినయాను సంధానం చేసిన తరువాత..
ఇక బయలు దేరతానన్నాడు.
 

వశిష్టునికి విశ్వామిత్రునిపై అనుగ్రహం హెచ్చి
'మీరు మా ఆతిధ్యం స్వీకరించి వెళ్ళాలని 'కోరాడు
విశ్వామిత్రుడు
'వద్దులెండి..
మీరు తాపసులు..

 మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు.
ఊరకే మీ ఆశీర్వాదం కొరకు వచ్చాను ..
సెలవీయండి వెళతా'నన్నాడు
 

కానీ వశిష్టుడు
'మీరు మా అతిధి 

నేను గృహస్తును మీరు ఆతిధ్యం స్వీకరించాల్సిందే '
అని మొహమాట పెట్టాడు
'గురువుగారూ నేనొక్కడినే కాదు 

నావెంట బోలెడు సైన్యం వుంది..
అర్థం చేసుకోండి' అని విశ్వామిత్రుడు అనేలోగా
 

'మరేం పర్లేదు..
మీకు మీ సైన్యానికీ కూడా ఆతిధ్యమిస్తాం..'
అన్నాడు చిరునవ్వుతో వశిష్టుడు
 

'పెద్ద చిక్కొచ్చిందే .. 
వీళ్ళ దగ్గర మందీ మార్బలం లేవు
కావలసిన సరంజామా లేదు..
ఎలా ఈయన ఆతిధ్యం ఇస్తా .. ఇస్తా .. అంటున్నాడు..?'

అని ఆలోచనలో పడ్డాడు విశ్వామిత్రుడు..
 

'శబలా  'వశిష్టుడు పిలిచాడు
పిలవటమేమిటి ఒక ధేనువు వచ్చినిలబడింది
విశ్వామిత్ర మహారాజు అతని సైన్యం మన అతిధులు వీరిని తృప్తి పరచవలసిన బాధ్యత నీదే.. అని ప్రశాంతంగా చూచాడు ధేనువు వంక..
 

ఎన్నో రుచికరమైన పదార్థాలు 
ధేనువులోంచీ ఉద్భవించాయి
విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో అలా చూస్తూనే వున్నాడు
సైనికులందరికీ మృష్టాన్న భోజనం అందింది..
భోజనానంతరం అందరూ వెనుదిరగాలి కదా
 

ఇప్పుడు 
విశ్వామిత్రుని మనసులో విషపుటాలోచన
ఆధేనువు తనది కావాలను కున్నాడు
 

వశిష్టుడిని ధైర్యంగా అడిగాడు కూడా
'యీ శబల ను నాకివ్వండి బదులుగా ఎన్నో కానుకలిస్తానన్నాడు'
వశిష్టుడు ఒప్పుకోలేదు

'ఇది నా హోమ ధేనువు ఇవ్వ'నన్నాడు..  
'నేను రాజుని ..
తన రాజ్జంలోని యేవస్తువుపైనైనా
 ప్రధమాధికారం రాజుకే కనుక
యీ శబల  పై అధికారం నాదే..
మర్యాద ఇస్తే ఇవ్వు ..

లేకపోతే బలప్రయోగం చేస్తా'
 

వెంటనే పదిమంది సైనికులు ఆధేనువును 
బలవంతంగా లాక్కుపోతున్నారు
ఇంతలో ఆ ధేనువు వారిని విడిపించుకుని

 పరిగెత్తుకుని వశిష్టుని సమీపించి
 

'మీకై మీరే నన్ను ఆ రాజు స్వాధీనం చేసారా
లేక బలవంతంగా వాళ్ళు నన్ను తీసుకుపోతున్నారా' 'అని అడిగింది
'నేను నిన్ను వదులుకో లేదు
వాళ్ళు నిన్ను బల ప్రయోగంద్వారా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు'
అన్నాడు బ్రహ్మర్షి
 

అంతే శబల అగ్రహోదగ్ర అయ్యింది
ఆమె చెవులు కళ్ళు తోక పృష్టి పాదాలు గిట్టలు 

మొదలైన ప్రదేశాలనుంచీ 
వందలు వేల సైనికులు పుట్టుకొచ్చారు
విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడారు..
నిశ్చేష్టుఁడు  విశ్వామిత్రుడు 


వశిష్టునిది తపోబలమని గుర్తెరిగి
తపస్సుతో తానూ దాన్ని సాధించి 

తన మాట చెల్లించుకోవాలనుకున్నాడు
 

వెంటనే
తీవ్ర తపస్సు
పరమశివుని కై  
 శివుడు  ప్రత్యక్షం 
నాకు ధనుర్వేదంలోని సర్వ అస్త్రాలు.. 
 సాంగోపాంగంగా  ఇప్పటికిప్పుడు అనుగ్రహించమని కోరిక
విషయాన్ని గ్రహించిన శివుడు 

తనలో తను నవ్వుకున్నాడు 
తధాస్తు అన్నాడు
 

రెట్టించిన ఉత్సాహంతో 
తిరిగి వశిష్టుని ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు
తన అస్త్రాలన్నీ ప్రయోగించాదు
 

అన్నిటికీ వశిష్టుని బ్రహ్మదండమే సమాధానం చెప్పింది
విశ్వామిత్రుడు ప్రయోగించిన సర్వాస్త్రాలూ బ్రహ్మదండంలోకి చేరిపోయాయి
బ్రహ్మ బలం ముందు క్షత్రియ బలం ఓడిపోయింది
 

తరువాత జరిగిన కథలో విశ్వామిత్రుడు
బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు
గాయత్రీ మంత్ర కర్త అయ్యాడు
త్రిశంకు స్వర్గన్నే సృష్టించాడు..
హరిశ్చంద్రుణ్ణి పరీక్షించి వదిలాడు


ఇక్కడ చెప్పేదేమంటే
 ఎంతటి రాజాధిరాజులైనా 

భక్తులతో తప స్వులతో చెలగాటమాడారా
వారు పాములతో చెలగాటమాడినట్లే
అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూస్తూ 

సాధుజీవనం గడిపే భగవద్భక్తుల 
మనసు నొప్పించి ప్రవర్తిస్తే
ఇడుముల పాలు కావలసిందే..
 

తులసీ దాసు అక్బర్ నడుమ జరిగిన యీ ఉదంతం మనకిదే చెబుతుంది..


 అక్బరు తులసీ దాస్ వద్దకెళ్ళాడు
రామ దర్శనం ఇప్పించమన్నాడు
రామ దర్శనం అంత సులభంగా జరిగేది కాదు
కామ క్రోధాదులు జ్ఞానాగ్నిలో భస్మీపటలం అయితేనే రాముడనుగ్రహిస్తాడు
అనేక జన్మ వాసనా వాసితములైన కామ క్రోధాదులు అల్ప ప్రయత్నములతో నశింపవు
రాముని చేరుటకు రామభక్తి ఒక్కటే రాజమార్గం
ఆ దారిన పయనింప మొదలిడు
నీ తపన ఎంత తీవ్రమైతే గమ్యమంత చేరువవుతుంది అని చెప్పాడు తులసి
వెంటనే అక్బర్ కు తన చక్రవర్తిత్వం గుర్తొచ్చింది
ఫలితంగా తులసీదాస్ చెరసాల పాలయ్యాడు
ఆపైన యేం జరిగింది..?
తన భక్తుడు తులసీదాసు ను ఆ రాముడెలా రక్షించుకున్నాడు ..
 

పుట్టపర్తి వారి 'రాయల నీతి కథలు' లోని 
ఈ తులసీ దాసు ను  చదవండి..