27 సెప్టెం, 2012

సుకవి





అది తిరుపతిలోని 
మధురాంతకం రాజారాంగారి ఇల్లు. 
కథకుడు, 
విమర్శకుడు 
వల్లంపాటి వెంకటసుబ్బయ్య 
ఆనాటి రాత్రి 
అక్కడ ఆతిథ్యం పొందుతున్నారు. 
భోజనానంతరం వల్లంపాటివారు 
ఓ కావ్యం చదవడం మొదలుపెట్టారు. 

అంతలో కరెంట్ పోయింది. 
వల్లంపాటి కవితాగానం మాత్రం ఆగలేదు. మధురాంతకంవారి సతీమణి ఆశ్చర్యపోయారు. 
‘చీకట్లో ఎట్ల చదువుతున్నారన్నా?’ 
అని అడిగారు. 
‘ఈ కావ్యం 
అచ్చులో చూసి చదవాల్సిన పనిలేదు - 
అది నా నాలుకమీద నర్తిస్తూనే ఉంటుందమ్మా!’ 
అన్నారు వల్లంపాటి. 
ఆ కావ్యం ‘శివతాండవము’. 
దాన్ని రాసింది 
‘సరస్వతీపుత్ర’ 
పుట్టపర్తి నారాయణాచార్యులు. 
‘సుకవి జీవించు ప్రజల నాలుకలపైన’ 
అన్న జాషువ వాక్యానికి 

ఇంతకన్నా నిర్ధారణ వేరేం కావాలి?