20 జూన్, 2013

పుట్టపర్తి మంత్రశిష్యుని "శ్రీ గురు చరితామృతం"









పుట్టపర్తి మంత్ర శిష్యుడు రఘూత్తమ రావు
ఆయనెంత సద్గురువో
ఈయనంత అంతే వాసి 
ఎందరో శిష్యులు ఉన్నా
ఆశ్రమ జీవనంలో
శ్మశాన వాసంలో తోడుగా నిలిచినా 
జీవితం చివరివరకూ
పుట్టపర్తిని వీడని వాడు
జ్యోతిశ్శాస్త్రం చక్కగా ఎరిగినవాడు
ఆయన తన గురువుపై
శ్రీ గురు చరితామృతం వ్రాసాడు
ఇది 
పుట్టపర్తి ప్రత్యేక సంచికలో ముద్రింప బడింది


పండరీ భాగవతం లోని 
పుండరీక చరిత్ర 
భాగవతంలోని మరెన్నో కధలు చెప్పుకుంటూ 
ఆ గురు శిష్యులు భక్తి పారవశ్యంలో 
కన్నీరు కార్చేవారు 
ఇద్దరికీ అంతటి హృదయ సామీప్యత..