27 అక్టో, 2014

ప్రబంధ నాయికలపై రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి అభిప్రాయం చూద్దాం ..






భారతి సంపాదకీయాలుగా ప్రబంధ నాయికలు వ్యాసాలు 1938 లో ప్రధమంగా ప్రచురింపబడ్డాయి...
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు 
ముందు మాట రాస్తూ
 పుట్టపర్తి వాక్కు వణుకులేనిది అని వ్యాఖ్యానించారు..

తరువాత 
అన్నామలై
 ఆంధ్ర 
ఉస్మానియా 
మద్రాసు యూనివర్సిటీలలో పాఠ్య గ్రంధంగా ప్రభుత్వాలు ప్రకటించాయి..

ముద్రణ కాక మునుపే ప్రాచుర్యం  పొందిన యీ రచన 
మహాకవుల హృదయాలు పట్టించే విధంగా వర్ణన వుందని దివాకర్ల వెంకటావధాని గారు అభిప్రాయపడ్డారు


 అల్లసాని వారి అల్లిక జిగిబిగి లో చెప్పినట్లు రాయలేరుకున్న  కథ నిజముగ 
చతుర రచన కనుకూలమైనది..

కథా సంవిధానములో తొలుత తిక్కన వలె 
అతడు గొన్ని రేఖలను గీయును
తరువాత పాత్ర చిత్రణమంతయు 
ఆ రేఖలపై నడచును..

పెద్దన ప్రవరుడు. 
మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి..

తక్కిన వ్రాతగాండ్రు వర్ణించి విసిగించు 
అనేక ఘట్టములనీతడు సంగ్రహించును.

ఇతర కవులైనచో అరుణాస్పద పురములోని  
గుర్రపు దోకలు మొదలుకొని.. 
యేను గుల తొండములవరకును 
సాగదీసి వర్ణించి మనల చంపి యుందురు..
అంటారు పుట్టపర్తి

ఔచిత్యమునకు ఆచార్యుడగు పింగళి సూరన్న కూడా ముసలి ముప్పున ఈ పనియే చేసినాడట
అదేమిటంటే
అతని ప్రభావతీ ప్రద్యుమ్నములోని
 ద్వారకా నగర వర్ణనము నాతడెట్లు వ్రాసెనో గాని చదువుటకు మనకు పెద్ద వేధ..
 ఇదీ పుట్టపర్తి తీరు   

వ్యంగ్యం.. 
చమత్కారం..
 సందర్భం కుదిరి
వచన రచనలో పుట్టపర్తిని 
శిఖరాగ్రాన కూర్చోపెట్టినాయి..

శ్రీశైలం గారి మాటల్లో..