8 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు - పరమాత్మునికై ప్రాణత్యాగం - పుట్టపర్తి అనూరాధ


హిమాలయ పర్వతశ్రేణులు..
మంచు కొండల మధ్యన ఆశ్రమాలు.. .
ఆశ్రమాల్లో సాధు సంతులు.. నిస్సంగులు..
గడ్డ కట్టే చలిలో ఆవాసాలు..
దొరికితేనే తిండి.. దొరక్కపోతే గాలే భోజనం..
బట్టలూ అంతంత మాత్రమే..
దిగంబరులకైతే ఆ  బాధా లేదు..


మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో
దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్షు ఎంతో తెలుసా?
మినిమమ్ 100 years ..
ఇంకా ముందుకు వెళ్తే ..
150  .. 250 ఏళ్ల పాటు జీవించిన వాళ్ళూ ఉన్నారంటే నమ్ముతారా? 
నమ్మాల్సిందే మరి..


అక్కడ మన పుట్టపర్తి ..
కైలాసంలో ప్రాణత్యాగం చేయాలని..
వెళుతున్నారు గంగ ఒడ్డున..

అప్పటికి ఆయనకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు..
ఓ రోజు ఇంట్లో తెల్ల కాగితంపై ఉత్తరం లాంటిది వ్రాసిపెట్టి హిమాలయాల దారి పట్టారు..

శివానందులు 

అతనికి శివానందులు అక్కడ ఉన్నారని తెలియదు..
ఆయన పుస్తకాలు చదివారు...

 




పుట్టపర్తి గంగ ఒడ్డున నడిచే సన్నివేశం..
శివానందులు ధ్యానమందిరం నుంచీ బయటకు వచ్చే సన్నివేశం ఒకేసారి జరిగాయి..

ఎవరు నీవు..?
ఎక్కడినుంచీ వచ్చావు..?
అని అడిగారు..
ఇక ఈ మహత్తర అనుభవం పుట్టపర్తి వారి నోటివెంటే వినండి..


నా ఇష్టదైవం కృష్ణుడు..
1945 వ సంవత్సరంలో నేను విధ్యార్థి దశలో ఉన్నప్పుడు..గాయత్రి ముగించినాను..

 
అటు తరువాత ఈ నారాయణం ..
పన్నెండు ..పదహైదు కోట్లు చాలా నియమంగానే చేసాను..
నాకు ఏదీ అనుభూతి కలుగలేదు..
తరువాత ..

ఒక రీతిగా ..
ఏమిరా జీవితం ..నిరర్థకంగా గడిచిపోతూవుందే..
అన్న పశ్చాత్తాపం కూడా నాకు కలిగింది.


దాన్నుంచీ..
 ప్రాణత్యాగం చేసుకుందామని ..
హిమాలయాలకు వెళ్ళిపోయాను. 

సాధువులనూ ..
సన్యాసులనూ..
వెతుక్కుంటూ ఇండియా అంతా తిరిగాను.. 
ఆ ఊపులో 
నేను హిమాలయాలలో 
కొంతకాలం ఉండడమూ ..
శివానంద సరస్వతుల
 అనుగ్రహం నా పై ప్రసరించడమూ జరిగింది.

వారే ఇచ్చింది 

సరస్వతీపుత్ర అన్న బిరుదు..

నేను కైలాసంలో 
ప్రాణత్యాగం చేయవలెననె పోతూ వుండినాను..
ఆ గంగ ఒడ్డున..
శివానందులు అక్కడ వున్నారని 
నాకు తెలియదు.
ఆయన పుస్తకాలు చదివినాను.
నేనా గంగ ఒడ్డున నడిచి వెళ్ళే సన్నివేశం..
ఆయన ధ్యానమందిరం నుంచీ గడ్డకు వచ్చే సన్నివేశం రెండూ ఒకే సారి జరిగినాయి ..

Who are you
where are you going  
అని ఆయన అడిగినారునన్ను.




నాకథ నేను చెప్పినాను..
లోపలికి పోదాం ..
రమ్మన్నారు. 
కొంతకాలం ఉంచుకున్నారు..

ఆయన 

సరే.. 
అన్ని విద్యలలోనూ పరీక్షించినారు..
భాగవతమన్నాడు.. 
సంస్కృతమన్నాడు..
ఇతర భాషల్లో అన్నాడు..
సంగీతమన్నాడు.. 
నాట్యం వచ్చునా ..
అన్నాడు..

అన్నీ అడిగినాడు..

కొంతకాలం వారితో ఉన్నాను నేను..
ఆయన "సరస్వతీ పుత్ర .."
అనే బిరుదిచ్చి..
నాయనా.. 
దీన్ని నువ్వు వాడుకోవలె..
నామీద ఉన్న గౌరవంతో 
అని అన్నాడు.. 

నువ్వు వెనక్కి పో .. 
నీకింకా కొంత కర్మ శేషమున్నది.. 
అంతా తృప్తిగా అనుభవించు ..
నువ్వు దేనికీ భయపడవద్దు.. 
నీది ఉత్తమమైన జన్మ ..
అని చెప్పి నన్ను వెనక్కి పంపినాడు..
ఆయన పుస్తకాలన్నీ ఇచ్చి..


కామకోటి చంద్ర శేఖర సరస్వతులకు నేనంటే చాలా ఎక్కువ ప్రేమ ప్రీతి ..
ఆయనకూడా జీవితంలో ఓ గొప్ప ధైర్యాన్ని ఇచ్చినారు..








డెబ్భయేడేళ్ళ సుదీర్ఘ సఫల సాహిత్య  జీవితాన్ని గడపిన పుట్టపర్తి ..
నేను నేర్చింది గోరంత ..
నేర్చుకోవలసినది కొండంత..
అంటూ.. 
సాహిత్య ..సంగీత ..తాత్విక..
విషయాల్లో ఎన్నో తెలుసుకోవాలని ఉంది.. 
ఒక్కోక్కటి అనుభవంలోకి వస్తున్నకొద్దీ ..
నాకు తెలిసింది చాలా తక్కువ అని అనిపిస్తోంది..
అని తన గొప్పదనాన్ని చాటుకొన్నారు..