26 ఏప్రి, 2014

గువ్వల చెన్నా ..


గుడికూలును - నూయి పూడును
వడినీళ్ళకు చెరువు తెగును
వనములు ఖిలమౌ
చెడనిది ‘పద్యం’ బొక్కటె
కుడియెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా!!

కవి వాక్కు నిలిచినంతకాలం 
తనకీర్తి నిలవదని రాజులకు చక్కగ తెలుసు
అందుకే విజయ స్థంభాలను చెక్కించడం 
గుళ్ళు గోపురాలుకట్టించడం
విగ్రహాలను ప్రతిష్టించడం నగరాలు నిర్మించడం
వీనితో సంతృప్తి చెందక కవు లను దగ్గరతీస్తారు
 
భోజుని వంటి రాజు కలిగితే 
కాళిదాసు వంటి కవి అప్పుడే వుంటాడు అనడం తప్పు
కాళిదాసు వంటి కవి కలిగితేనే 
భోజుడు వుండడం
కవికృపను సంపాదించగలిగితే 
సామ్రాజ్జాధిపులైనా 
సామాన్యులైనా అమరత్వం పొందగలరు..
 
ప్రపంచ చరిత్రలో ఇందుకు తార్కాణాలు వందలూ వేలూ
ఇందులో పైధియాస్ కు సంబంధించిన గాధ 
బహు చక్కనిది
 
ప్రాచీన కాలంలో ఇతడు ఈజియానాకు చెందినవాడు
ఇస్థమియన్ పోటీలో జగజ్జెట్టీగా ఎన్నికై
తనను కీర్తిస్తూ ఒక పద్యం రాయడానికి 
ఎంత చెల్లించ వలసివుంటుందని అడగడానికి
తమ ఊరుకవి పిండార్ దగ్గరకు వెళ్ళాడు
 
తన కట్నం ఇప్పటి మనలెక్క ప్రకారం 
సుమారు మూడు వేల రూపాయలని చెప్పాడా కవి
'అబ్బో అంతే ..
అంత పెడితే నా కంచు విగ్రహాన్నే పోత పోయించుకోవచ్చు..' నని పైధియాన్ పెదవి విరిచాదు
 
'నిజమే కావచ్చు '
అని పిండార్ మందహాసం చేసి మిన్నకున్నాడు 
రాత్రి ఇంటిలో బాగా ఆలోచించుకున్న మీదట..
అడిగిన డబ్బు ఇచ్చి పద్యం రాయించుకోవటమే మంచిదని పైధియాన్ కు తోచింది
ఇప్పుడు
ఈజి
యానాలేదు  అందులో కంచువిగ్రహాలు లేవు
కానీ పద్యం మాత్రం నిలిచివుంది..
మనలో చాలామంది
అయితే మనమూ ఆపని చేద్దామనుకోవచ్చు

అయిదో పదో చేతిలో పెడితే 
పంచరత్నాలూ నవరత్నాలు దండిగా దొరుకుతాయి
అందుకు బాలకవులు ప్రౌఢ కవులు మధుర కవులు సరస కవులూ ఫుల్లుగా వున్నారు..
కానీ ఆ పిండార్ వంటి కవి దొరకాలికదా
ఇవి నా మాటలు కావు ..
నార్ల వారి సంపాదకీయంలోవి..

భట్టుమూర్తి రాయల కొలువులో ఒక దిగ్గజం
అతడు ఒక బెస్తవానిపై ఒక పద్యం కాదు
 శతకాన్నే వ్రాసినాడు
కారణం
వాడెంతో త్యాగ శీలి
వాడొక బెస్త వాడు చేపలమ్మితేనే వాణి పొట్టకు తిండి
అలాంటివాడేమి త్యాగం చేయగలడు
చేసినా ఎంత చేయగలడు..
 
తనకున్న దానిలోనే 
ఎంతో కొంత ఉదార బుధ్ధితో ఇస్తారు కొందరు
లక్షలు కోట్లు ఉన్నా 
దానం త్యాగం అనే పదాలే తెలియవు కొందరికి..
 
భట్టుమూరి బెస్తడి త్యాగాన్ని చవిచూశాడు
ఆశ్చర్య పడ్డాడు
వెంటనే అతని హృదయం ఉప్పొంగింది
వెంటనే కొన్ని పద్యాలు చెన్నడిపై దొర్లాయి అవి 'గువ్వలచెన్నా' అనే మకుటం కలవి
ఈ కథ పిల్లలకోసం పుట్టపర్తి వ్రాసిన
 రాయల నీతి కథలు లోనిది