22 ఏప్రి, 2012

పుట్టపర్తి వారు మహా జ్ఞాని ఆర్తుడు భక్తుడు..అక్కిరాజు రమాపతిరావు -పుట్టపర్తి అనూరాధ



తెలుగు సాహిత్యం లో ..
ఇరవయ్యో శతాబ్దిలో ..
అత్యంత ప్రతిభావంతులైన..
ఇంకా కొన్ని తరాలు చెప్పుకోదగ్గ గొప్పరచయితలు అయిదారుగురిని ఎంపిక చేయాలంటే..
అందుకు ఎవరు పూనుకున్నా..
పుట్టపర్తి వారు వుండడం అనివార్యం..
 
పది మంది సమూహంలో పోల్చుకోదగిన 
ప్రతిభ ఆయనది..
చిన్న కోనేరులకూ..
తటాకాలకూ..
సరస్సులు కూ ..
మహానదికీ ఎంత అంతరం వుంటుందో ..
తక్కిన రచయితలకూ ఆయనకూ ..
అంతటి భేదం వుంటుంది..
 
మర్రి చెట్టుకూ ..తక్కిన వృక్షాలకూ..
ఎంతటి ఎంత వ్యత్యాసం వుంటుందో ..
ప్రౌఢిలో ..విస్తీర్ణతలో ..
అంతటివ్యత్యాసం..
ఆయనకూ ..ఇతరులకూ ..వుంటుంది.
అక్కి రాజు రమాపతి రావు గారు ..
20.9.2010 లో వ్రాసిన వ్యాసమిది..


అక్కిరాజు రమాపతి రవు గారు. .
మంజుశ్రీ గా ప్రసిధ్ధులు.
సృజనాత్మక రచనలతోపాటూ 
పరిశోధనా రచనలు 
జీవిత చరిత్రలూ 
సంపాదక వ్యాసాలు 
సాహితీ విమర్శలూ 
మొదలైన అరవై పుస్తకాలు రచించారు.
 
వీరు 
పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర లోని 
దీక్ష, 
పురాతన ప్రకరణాలను 
2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.

"తెలుగులో స్వీయచరిత్రలూ ఆత్మకథలూ ఎన్నో వచ్చాయి కానీ ఇంత ఆత్మ నివేదన ప్రణవంగా ఏ రచనా రాలేదు అనడం సాహసం కాదేమో"

 హంపీ నుంచీ హరప్పా దాకా 
తిరుమల రామచంద్ర గారి పుస్తకానికి 
సంపాదకత్వాన్ని వహించిన 
అక్కిరాజు రమాపతిరావ్ గారు 
అన్నారంటే 
ఆయన పరిశీలన ఎంత నిశితంగా 
హృదయపూర్వకంగా వుంటుందో 
మనకు తెలిసి మనం 
ఆయనతో యేకీభవించక తప్పదు

 
భాగవతం నవమస్కంధంలో 
105 గద్య పద్యాలతో పోతన రచించిన 
శ్రీరామ చరిత్రకు 
 డా. అక్కిరాజు రమాపతిరావు గారి సార్థ తాత్పర్య సహితము తాత్పర్య సహిత వ్యాఖ్యను సులభశైలిలో వ్రాసారు.
 గ్రంధానికి కె.వి.భీమారావు గారి చిత్రాలు వన్నె తెచ్చాయి. 
ప్రతి తెలుగింట తప్పక ఉండవలసిన పుస్తకమిది.

అటువంటి అక్కిరాజు గారు అయ్యను విశ్లేషించిన వైనం చూడండి..