30 నవం, 2012

అరుణాచలం





ఒకసారి  పుట్టపర్తి వారు RVR వల్లంపాటి తదితరులు

అరుణాచలం వెళ్ళారు
అక్కడ ప్రఖ్యాత చలం గారు అప్పటికే స్థిర నివాసం ఏర్పరచుకొని వున్నారు.
వారి కి  ఆచార్యుల వారు
జనప్రియ రామాయణం వినిపించారు
పుట్టపర్తి వారితో కలిసి..
చాలా ప్రయాణాలు చేశాను.
వారూ, నేనూ కలిసి రమణాశ్రమం వెళ్ళాం.
చలం గారిని చూశాం.
ఆ కలయిక
ఇద్దరికీ నచ్చలేదని నా అనుమానం.
“జనప్రియ రామాయణం” లోని
రామజనన ఘట్టాన్ని వారు
చలం గారికి చదివి వినిపించారు.
ఇక్కడ ఒక్కమాట..
రామ జనన ఘట్టం అత్యద్భుతంగా వుంటుంది..
కానీ..
“ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు”
అన్నారు చలం గారు.
“ఏం చేద్దాం ఎవడి స్థాయి వాడిది”
అన్నారు పుట్టపర్తి వారు.
 అంటూ తన అనుభవాన్ని చెప్పుకున్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు.

ఆనాటి వారి అనుభవాన్ని RVR గారి నోట విందాం

1981 లో మాస్కో రాదుగ ప్రచురణాలయంలో అనుదాదకునిగా చేరి 
1991లో జూన్ దాకా పదేళ్ళు పనిచేసారు. 
మాస్కూ రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. 
400 లకు పైగా సోవియట్ 
డాక్యుమెంటరీ ఫిల్మ్ లకి వాయిస్ ఇచ్చారు





28 నవం, 2012

గుప్తా ఫౌండేషన్




ఈ వ్యాసం పుట్టపర్తి వారికి గుప్తా ఫౌండేషన్ వారు 

అవార్డు ప్రదానం చేసినప్పుడు వచ్చినది
వారు దానిలో 
ఆస్థాన కవి పదవి వారికి ఇవ్వాలని 
ప్రతిపాదించారు
కానీ అది జరగనూ లేదు 
వారు దాటీపోయారు.

ఇటువంటి పేపర్ కటింగ్స్ 

శ్రీశైలం గారు ఇన్నాళ్ళు అతి భద్రంగా దాచి వుంచారు
వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది
నిజమైన సాహిత్యాభిమాని అనాలంతే..






           సరస్వతీ పుత్రునికి అక్షర ప్రణామాలు 

ఆంధ్రప్రభ, మద్రాసు, మంగళవారం, 1990, జనవరి 30.




సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు 

నేడు ఏలూరులో 
గుప్తా ఫౌండేషన్ అవార్డు
ప్రదానం చేస్తున్న సందర్భంగా 
ప్రచురిస్తున్న ప్రత్యేక వ్యాసం. 




సరస్వతీపుత్ర బిరుదాంకితులు 
మహాకవి  పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఆంధ్ర జగమెరిగిన బ్రాహ్మణులు 

ఆంధ్ర సాహితీ ప్రపంచంలో 

రాయలసీమ ఆది నుంచీ
ఉత్తమ శ్రేణికి చెందిన 
ఎందరో కవితల్లజులను గన్న ధన్యసీమ

రాళ్ళసీమ అని 

కొందరు కొన్ని కారణాల చెత 
వ్యవహరించవచ్చుగాని 
సాహిత్య విషయంలో మాత్రం 
అది ముత్యాల వజ్రాల సీమ 

మామూలు బాలకులు 

ఆటపాటలలో అనురక్తులై ఉండే 
పన్నెండేళ్ళ పసి ప్రాయంలోనే 
ఆయన రచించిన 
పెనుగొండ లక్ష్మి కావ్యం పేరెన్నికగన్నది 
తదాదిగా 
ఆయన బహుళ సంఖ్య లో 
నిర్విరామంగ సాహిత్య వ్యవసాయం చేసి 
అత్యుత్తమ కృతుల నెన్నింటినో పండించారు. 

అసలు రాయలసీమ గాలిలో 

అక్కడి నీళ్ళలో 
అక్కడి రాళ్ళలో 
కొండలలో.. బండలలో..
 సర్వే సర్వత్రా 
సాహిత్య సమీరం వీస్తూ ఉంటుందంటే 
అతిశయోక్తి కాదు 

నాడు తెలుగు సాహిత్య రంగలో 

అనితర ప్రఖ్యాతి సంపాదించిన మహా కవులు 
ఎలా తెలుగు కావ్య సరస్వతిని 
తమతమ అమూల్య కావ్యాభరణాలతో అలంకరించారో 

అదే విధంగా నేడు కూడా 

అనేకులు కవులు 
అధునాతన  ఆంధ్ర సాహిత్య సరస్వతిని 
వివిధ ప్రక్రియలలో 
ఆమూల్యాభరణాలతో అలంకరిస్తున్నారు 

ఎందరు ఇతర కవులు 

కవి శబ్దమాత్ర వాచ్యులు 
ఎక్కడెక్కడ 
అనేక కారణాలతో విజృంభిస్తున్నా 

ఎవరెవరిపేర్లు 

కావ్య గౌరవం కారణంగా కాక 
ఇతరేతర కారణాలతో 
మారుమ్రోగిపోతున్నా 
సీమ ప్రత్యేకత సీమదే.

శ్రీమాన్ పుట్టపర్తి పేరు 

ఆంధ్రదేశం అంతటా 
అత్యంత గౌరవాదరాలతో 
సాహిత్యాభిమానులు తలచుకొంటూ ఉంటారు 

రాజకీయ కారణాలు 

కూటముల కారణాలు 
సంఘాల కారణాలు 
ఏవి ఎన్ని విధాలుగా కవులను విడదీసినా 

పుట్టపర్తి వారిది మాత్రం 

అత్యంత భక్తితో గౌరవంతో 
తలచుకోవలసిన పేరు 

1914 వ సంవత్సరం జన్మించిన పుట్టపర్తి వారిది 

అనా దిగా విద్వద్వంశం 
పదునారవ శతాబ్దపు 
సాహితీ సమరాంగణ సార్వభౌముని మన్ననలందిన తిరుమల తాతాచార్యుల వారి సంతతికి చెందినవారు 

వీరి పూర్వులందరూ 

వారణాసిలో విద్య నభ్యసించి 
మహా సంస్కృత విద్వాంసులుగా 
పేరు పొందినవారు. 

ఆ కుదురుకు చెందిన పుట్టపర్తివారిలో 

ఆ విద్వల్లక్షణాలు
 ఆ పాండితీ గరిమ 
ఆ కవిత్వ వైభవం 
ఉండడంలో ఆశ్చర్యమేముంది ..?

పుట్టపర్తి వారిది 

అనన్య సామాన్యమైన మేధ. 
ఒకటి లేక రెండు 
మహా అయితే మూడు భాషలకు మించి 
పాండిత్యం అలా ఉంచి 
కనీస వ్యావహారిక పరిజ్ఞానం 
సంపాదించడమే సకృత్తు. 

అలాటిది 

పుట్టపర్తి వారు 
అక్షరాలా పధ్నాలుగు భారతీయ విదేశీ భాషలలో గణనీయమైన పాండిత్యం సంపాదించారంటే ఆశ్చర్యకరమైన విషయం

అన్ని రంగాలలో 

విపరీతమైన వేగం పెరిగిపోయిన ఈ యుగంలో 
ప్రతి కవి నామమాత్రుడు. 
విపరీతమైన తాపత్రయంతో 
తన పేరు రేడియోలో టీవీలో సినిమాలలో 
రకరకాల దిన వార మాస పక్ష పత్రికలలో మ్రోగిపోవాలన్నంత తపన తో 

అక్షర శక్తిని దుర్వినియోగంచేస్తూ ఉంటే 

పుట్టపర్తి వారు మాత్రం 
చేయగలిగిన సాహిత్య సృష్టిని చేసి 
ఏ మాత్రం ప్రలోభాలకు లోను కాకుండా 
ఒక యోగివలె 
ఋషి వలె 
మౌనంగా ఉన్నారు 

బహుశా 

తన చుట్టూ ప్రపంచంలో వేగంగా పతనమౌతున్న 
సాహిత్య విలువలను గమనిస్తూ 
మౌనంగా బాధపడుతూ ఉండవచ్చుకూడా. 

చెలరేగిపోతున్న వికృత ధోరణులను 

సగటు ప్రతిభ గలవారు చేసే 
అనవసర ఆర్భాటాన్ని అలజడినీ 
గమనిస్తూ ఉండవచ్చు 

ఈ సాహిత్య అరాచకత్వం 

ఆ తరంవారు సహించలేక 
బాధపడడం సహజం కూడా 

నూరుకు మించిన పుట్టపర్తివారి కృతులలో 

ఆయనకు అనన్య సామాన్యమైన 
అజరామరమైన కీర్తి ప్రతిష్టలార్జించి పెట్టిన 
కమనీయ కృతి శివతాండవం 

తెలుగులో సాహిత్యం పట్ల ప్రేమ ప్రీతి ఉన్న 

పాఠకులందరి అభిమానానికి పాత్రమైన 
ఉత్తమ శ్రేణి కావ్యం అది. 

ఇప్పటికి పదకొండు ముద్రణలు పొందినదంటే 

ప్రశస్తిని అర్థంచేసుకోవచ్చు. 
శివతాండవం విదేశీ భాష అయిన జర్మన్ లోకీ 
అఖిల దేశ భాష అయిన హిందీలోకి 
సమర్థంగా అనువదించబడి 
పేరు ప్రఖ్యాతులు గడించింది. 

హృషీకేశ్ కు చెందిన 

స్వామీ శివానంద సరస్వతి 
ఏ శుభముహూర్తంలో పుట్టపర్తివారిని 
సరస్వతీపుత్ర బిరుదంతో ఆశీర్వదించారోగానీ 

ఆ బిరుద నామంతో ఆయన లోక ప్రసిధ్ధులైనారు 

మూడు విశ్వవిద్యాలయాలు 
ఈ మహాకవిని డాక్టర్ బిరుదంతో గౌరవించి 
తమను తాము గౌరవించుకున్నాయి. 

అందరినీ అలరించే 

చిత్రమైన ఉదంతం ఒకటి ఉంది. 
ఆయన పన్నెండవ ఏట రచించిన 
పెనుగొండ లక్ష్మి అనే రచన 
విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. 
ఆయన అదే పరీక్ష రాయడానికి 
తమ ఇరవైయవ యేట పరీక్షార్థిగా వెళ్ళారు. 

తెలంగాణ నా కోటి రతనాల వీణ 

అని నినదించిన మహాకవి దాశరధి మరణించారు అంతకుముందే 
గత రద్దుల ప్రభుత్వం 
ఉఛ్చనీచాలు పాటించకుండా 
ఆస్థానకవి 
ఆస్థాన గాయక పదవులను 
పొదుపు చర్య అనే మిష తోనూ 
ఆ పదవులు రాచరిక వ్యవస్థకు చిహ్నాలనే 
కుంటి సాకుతోనూ రద్దు చేసి 
ఒక మహా కవిని 
ఒక మహా సంగీత విద్వాంసుని  అవమానం చేసింది. 

ఇప్పుడు పరిస్థితులు మారాయి. 

కొత్త గాలి వీస్తున్నది. 
ఆ పదవులు పునరుధ్ధరించి 
సాహిత్య సంగీత రంగాలకు 
తమిళనాడులోనూ 
ఇతర రాష్ట్రాలవలె 
గౌరవం గుర్తింపు కలిగించడం అవసరం. 

ఆస్థానకవి పదవికి 

పుట్టపర్తి వారి పేరు ఉటంకించబడుతున్నది. 
నిజానికి మౌనితుల్యులైన 
ఈ మహాకవికంటే 
ఆ పదవికి గౌరవం తేగలవారు 
ఇతరులెందరోలేరు. 

ఇటీవల సీమ కు అన్ని రంగాలలోనూ 

అన్యాయం జరుగుతున్నదని 
తజ్ఞులు తలపోస్తున్నారు. 
పైన చెప్పినట్లు జరిగితే 
ఆనందించని వారుండరు. 
అలా జరుగుతుందని ఆశిద్దాం.

1989 వ సంవత్సరానికి 

గుప్తా ఫౌండేషన్  వారి 
ప్రతిష్టాత్మక సాహిత్య బహూకృతి 
ఈ నెల 30వ తేదీన 
అఖిలాంధ్రకూ సాహిత్య కేంద్రమైన హేలాపురి లో పుట్టపర్తివారికి ప్రదానం చేయబడుతున్నది. 

ఇది తెలుగు సాహిత్యాభిమానులెల్లరకూ 

అత్యంత ఆనందదాయకమైన విషయం 
ఇలా పుట్టపర్తి వారిని సన్మానించి 
గుప్తా ఫౌండేషన్ వారు 
తమ సాహిత్య బహుమతికి 
ఆదిలోనే ప్రతిష్టను సముపార్జించుకుంటున్నారు



-రామసుబ్బయ్య.








26 నవం, 2012

పుట్టపర్తి మాటలలో దేవులపల్లి

                                               
              



    

25 నవం, 2012

బెజవాడ గోపాలరెడ్డి


                           బెజవాడ గోపాలరెడ్డి




బహుభాషావేత్తగ
 వివిధ సాహిత్య ప్రక్రియల్లో
మహా రచయితగా
లబ్ధ ప్రతిష్టులైన నారాయణాచార్యులవారి వ్యక్తిత్వం విశిష్టమైనది
 విలక్షణమైనది.
అనితర పూర్వములు
అనుపమానములు
అనిర్వచనీయములైన
బహు గ్రంధ కర్తలుగా
సారస్వత సేవ గావించి
ఆంధ్రుల సారస్వత వాఙ్మయ ప్రతిష్టను
దిగంతములకు పరివ్యాప్తమొనరించిన
పరమ ప్రామాణికులైన పండిత శ్రేష్ఠులు పుట్టపర్తి వారు..
సాహిత్యమందేగాక
సంగీత నృత్య నాట్యాది వివిధ కళలందును సిధ్ధ హస్తులు..
అతి బాల్యమునందే
మహాకవిగ పలువురు సాహితీ వేత్తల ప్రశంసలు
అమితముగ చూరగొన్న అశేషశేముషీ దురంధరులు
శ్రీ నారాయణాచార్యులవారు..

బెజవాడ గోపాలరెడ్డి.

గుర్రం  జాషువా


ప్రివ్యూ

శివతాండవమాడెడు 
మీ కవితా శాంభవికి 
నెదురుగా నిల్వరు,
దుష్కవులెవ్వరు,
రాయలోర్వి ప్రవిమల మణిదీప!
పుట్టపర్తి కవీంద్ర..  

-గుర్రం  జాషువా

24 నవం, 2012

కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ.


         కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ.


ఈయన వ్రాసిన 
పండరీ భాగవత గ్రంధము 
పూర్వ ద్విపద కావ్యముల కేమియు తగ్గిపోదు..సరికదా..
కొన్ని చోట్ల 
పూర్వ ద్విపద రచనకు మెరుగు పెట్టినట్లుండును..
ఈయన యధిక శక్తిమంతుడనుటకు 
తెలుగు దేశములో నీయన పొందిన
 ప్రతిష్ఠయే సాక్ష్యము..
ఇట్టి కవి 
పరుల యభిప్రాయము నాశించుట
యెందులకో తెలియదు..
అవతలి వానియందు గౌరవము నెరపుటకని యనుకొనుచున్నాను. 
మా నడుమ మైత్రి చాల యేండ్లుగా గలదు.
కొన్ని కొన్ని యెడల నీయ 
నా కంటె గొప్పవాడుగా..పరిగణింపబడుట
 నేనెరుగుదును. 
ఇట్టి నా నుండి 
యభిప్రాయమాసించుట వట్టి స్నేహధర్మము. 

కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ.10.6.1974

పుట్టపర్తి వారి గురించి అద్దేపల్లి రామమోహన రావ్



పుట్టపర్తి వారి గురించి    
అద్దేపల్లి రామమోహన రావ్

ఆయన శివతాండవం
గుండెల్ని తాండవ మాడిస్తుంది.
ప్రాచీన ధోరణి గల గొప్ప కవుల 
మొదటి వరుసలో వుంటాడు.

-అద్దేపల్లి రామమోహన రావ్

23 నవం, 2012

కౌముదీ పరిషత్తు..విజయనగరం.






ఆలోచనామృతం సాహిత్యమైతే .. 
ఆ అమృతాన్ని పసితనంలోనే వశం చేసికొని 
అది పదిమందికీ.. 
కాదు..

గత్తంతటికీ పంచిన 
సాహిత్య తపస్వికి 
మరణమెలా సంభవం..?
పదునాల్గు పైగా భాషలలో 
సాహితీ పటిమను పెంపొందింపజేసుకొని .. కవికి అవధులు లేవని నిరూపించారు.
శివతాండవాన్ని 
పాఠకుల ముంగిట దర్శింపజేసిన నారాయణాచార్యులవారు..
పెనుగొండలక్ష్మి,
మేఘదూతం 
జనప్రియ రామాయణం 
మొదలగు రచనల ద్వారా 
చిరస్మరణీయుడై జగతిని నిలచి ఉంటారు..

కౌముదీ పరిషత్తు..విజయనగరం.

పుట్టపర్తి మాటలలో కాళోజీ..


                 పుట్టపర్తి మాటలలో కాళోజీ..

పుట్టపర్తి మాటలలో కాళోజీ..


తన నాళ్ళలో జరిగిన సన్నివేశాలను
నిర్భయంగా విమర్శించిన సాహసి.

మ్రొక్కుచునుంటి నీకు మరియున్ నీ జ్ఞాన పీఠంబుకున్







డా .సుందర రామకృష్ణ(M.A.,M.O.L.,Ph.D) గారు
కవి
గాయకుడు
రంగస్థల కృష్ణుడు
సినిమా నటుడు
బుల్లి తెర శ్రీనాధుడు
సినీనటి జమునతో కలిసి 
కృష్ణుడైనాడీయన ఎన్నోసార్లు


సుందర రామకృష్ణ గారు 
జాషువా అభిమాని

ఆనాడు సంఘంలోని కుళ్ళును దురాచారాలను 

జాషువా తూర్పార బడితే 
ఈనాడు వారి అభిమాని అయిన 
సుందర రామ కృష్ణ గారు 
అంతన్నా ధాటీగా సమాజాన్ని దుయ్యబట్టారు


"వాణిని సర్వ లోక జన వంద్య పురాణిగ వెల్గుచున్న పూ
బోణిని నిన్ను బట్టుకొని మోటుగ నీ "ప్రొఫెసర్లు"సైతమున్
'వానీ'యటంచు బల్క "వారెవా" యెటులోర్వగ జాలుచుంటివో
ఏ నొక చింతబెత్తమది యిచ్చెద వారల నీడ్చి కొట్టవే.."

ఇది అక్కిరాజు సుందర రామ కృష్ణ గారి కలం గళం
అధిక్షేప కవిత్వం లో అందెవేసిన చేయి సుందర రామకృష్ణ గారు
సమాజంలో జరిగే అన్యాయాలను
అన్యాయాలని ఆయన అనుకున్న వానిని శారదాదేవికి విన్నవించి 
కాదు గట్టిగా చెప్పి
కాదు కాదు ఈ పదం కూడా సరిపోదు
తెగించి దబాయించి చెప్పి
అమ్మవారి దయను కూడా డిమాండు చేసి 
త్రిశతిని వ్రాసారు

వారి ఇంటికి నన్ను ఆహ్వానించగా వెళ్ళిన నాకు

తెల్లని గడ్డంతో 
ఆయన దర్శకేంద్రుడు 
రాఘవేంద్రునిలా కనిపించాడో క్షణం
కాస్త అవీ ఇవీ మాటలయ్యాక
ఆయన చెప్పటం మొదలెట్టారు

పద్యాలను కమ్మని కంఠంతో చక్కని రాగంతో 

మధ్య మధ్య చిన్న చిన్న వ్యాఖ్యలతో పాడారు
అన్నీ అమ్మతో చెప్పే అల్లరి పిల్లాడిలా అనిపించారు
ఆయన చెప్పినవి
తనకోసం కాదు
సంఘం లో జరిగే అన్యాయాలు మోసాలు
వాణిని వానిని చేసే ప్రొఫెసర్లను బాదటానికి 
అమ్మకు చింతబెత్తమియ్యటానికీ వెనుకాడని
 గడుగ్గాయి పిల్లాడు
ఈ సరస్వతీ దేవి బిడ్డడు

దొంగ సర్టిఫికేట్లు పల్లీ బఠాణీల మాదిరి 

హైకోర్టు గేటుకు ముందర 
కోఠీ వీధులలో 
ఏర్ పోర్టుకు ఆవల ఈవల
అమ్ముతున్నారమ్మా 
ఇంక
సరస్వతీ నమస్తూభ్యం అని నిన్ను 
మా పిల్లలు భీతిగా కొల్చే రోజులు పొయ్యాయి 
పిచ్చితల్లీ ..అని
చదువులమ్మకే భయం పెట్టాడీ గడుసు  కవి 

అంతే కాదు


పుట్టపర్తి వారికి జ్ఞానపీఠ విషయంలో 

అన్యాయం జరిగిందని
అమ్మవారికీ చార్జి షీటులిచ్చాడీ శతక కర్త
పుట్టపర్తి వారు పోయి ఇరవై సంవత్సరాలైంది
ఇప్పుడెందుకు మళ్ళీ 
పాతవి తిరగతోడటమంటే
అలా అని అందరూ ఊరుకొంటే ఎలా
అని తాను వ్రాసిన పద్యాలు పాడుతూ 


ముఖ్యంగా ఆంధ్ర దేశంలో
పద్యం గాని గేయంగానీ
నిజమైన సిసలైన పాండిత్య ప్రకర్ష తో రచనలు వెలయించిన వాళ్ళలో
అగ్రేసరులలో అగ్రేసరుడు 
మనకు వెంటనే రాయలసీమ ప్రాంతం నుంచీ అది కూడా 
గుర్తొచ్చేటటువంటి వ్యక్తి
ఒక హిమాలయ శృంగం
ఎవరయ్యా అంటే పుట్టపర్తి నారాయణాచార్యుల వారు

సాహిత్యంలో పదునాలుగు భాషలలో పాండిత్యం సాధించి

మనకు బ్రహ్మండమైన కావ్యాలను 
మనకందించినటువంటి వాడు
ప్రభుత్వాలు సంస్థలు గుర్తించినాయా అంటే
అది ఆనాటినుంచీ ఈ నాటి వరకు ఒక ప్రశ్నార్థకం

కొంత మందికి కొన్ని భిన్న మైన వ్యక్తిత్వాలుంటాయ్

మనం అడగటమేంది నన్ను గుర్తిస్తారులే 
అటువంటి మనస్తత్వమున్నవాడు 
పుట్టపర్తి నారాయణాచార్యులు

యేనాడూ ఆయన నాకీ బిరుదు కావాలని

లేదూ ఈ పదవి కావాలని ఆయన అడగలేదు
ఏది ఏమైనా 
పూర్ణ పురుషుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు.
అందరం పాఠాలు చెప్పినటువంటి వాళ్ళమే.
తెలుగు జాతి గొప్పదనం తెలుగు తల్లి గొప్పదనం
నిజానికి చాలా బాధేస్తున్నది

రేపు 27,28,29 ప్రపంచ తెలుగు మహాసభలన్నారు

ఆయన పేరు మీద ఏదన్నా పెట్టి 
ఒక రెండు రోజులు లేదా ఒకరోజు 
కేవలం ఆయన సాహిత్యంపై ఒక నలుగురితో మాట్లాడించి వుండినట్లయితే
చాలా బాగుండేదని నా అభిప్రాయం

నేను చెప్పే మాటలతో కూడా 

భిన్నమైన అభిప్రాయాలుండే వాళ్ళు ఉండొచ్చు.
పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక మామూలు గొప్ప కవి
 అనేటటువంటి వాళ్ళు కూడ వుంటారు.
అది లోకంలో ఎప్పుడూ వుండేదే.

ఆయన సాహిత్యం లోతుగా చదివి 

చెప్పగలిగిన వాళ్ళు చెబితే తెలుస్తుంది
మంచి వ్యక్తులతో సమావేశాలు పెడితే 
ఆయనంటే ఏవిటో ఈ తరం వాళ్ళకు తెలుస్తుంది.

ఆనాటి తరానికి మనం చెప్పక్కర్లేదు 

అది చేయాల్సిన ఆవశ్యకత వుంది.

నేను చాలా ఆగ్రహంతోటి 

ఏవిటి
ఆగ్రహం తోటి
నండూరి రామకృష్ణమాచార్యుల వారికీ 
సూర్య నారాయణ రాజు గారికీ అంకితమిచ్చి
అంకితమిస్తూ 2005 లో శారద అనే ఒక సతకం వ్రాసాను

దీనిలో నేను శారదాదేవిని నిలదీసాను

కేవలం పై పై మెరుగులు ఇచ్చకాలు పలికే వాళ్ళను చేరదీస్తున్నావు
తీ ..సంతోషమే
కానీ నిజమైన పాండిత్యం కలిగిన వాళ్ళను 
గొప్ప పండితులను కూడా నీవు దగ్గరికి తీయాలి కదమ్మా.
ముఖ్యంగా 
జ్ఞానపీఠాన్ని ఉద్దేశం లో పెట్టుకొని 
శారదా అనే నా పద్య కావ్యంలో అమ్మవారిని అధిక్షేపిస్తూ 
పద్యాలు పరంపరగా రాసాను
దానిలోంచి ఒక నాలుగు పద్యాలివి.


"సారయశుండు పండితుడు సర్వవిధంబుల తెల్గు ధాత్రిపై
కారణ జన్ముడీతడని ఖ్యాతి గడించిన స్వచ్చకీర్తి మం
దారుడు నీదుపట్టి పదునాలుగు బాసల మేటియైన ప్ర
జ్ఞారవి 'పుట్టపర్తీకవి చంద్రుని కంజలులిత్తు శారదా"

అని పుట్టపర్తి వారికి అంజలులిచ్చారు

ఇదేవిటీ యేదో ఆవేశంగా రాశానన్నావ్

కవిచంద్రుడు అంజలులు అని సామరస్యంగా వెళ్ళిపోతున్నావ్
అని అంటామని ముందే గ్రహించి

అదేవిటి యేదో ఆశ్చర్యంగా రాశానన్నాడు

పద్యాలేమో సౌమ్యంగా వున్నాయ్ అనుకుంటున్నారేమో

ఈ క్రింది పద్యాలు చూడండి అంటున్నాడు


"ఆతని నూకి ప్రక్కకటు "హాంఫటు-గప్ చుప్" యన్నయట్టు ఓ.
మాతరో..!నిన్ను నీవె అవమానము నిక్కము చేసికొంటివే..!
పూతచరిత్ర..!వాణి..!నవమోహిని..!నీదగు జ్ఞానపీఠికే
నూతనశక్తి ఆ సుకవి నూరువిధాల తలంప శారదా..!"

నూకి అనేది తెలంగాణాలో బాగా ఎక్కువగా వాడే మాండలీకం


చిన్నప్పుడు హాంఫట్ గప్చిప్ అని గారడిని మనం చూసాం 

అదిగో అలా చేసావ్ నీవు
అటువంటి మహాకవిని పక్కకు పడేసి.
నిన్ను నీవు అవమానం చేసుకున్నావ్ ఏమైనా 
చాలా బాధ తోటి అన్నాను నేను


"తీయని మాటలన్ మివుల తీయని చేతల తోడ నీవు "నా
రాయణు" సాక్షి మోసమును లావుగ జేసితె "పుట్టపర్తి"నిన్
మాయల తల్లినేననెడి మాటలు గావివి ఆంధ్ర లోకమే
కూయుచునుండె నిచ్చలును కుక్కుటమై ..!వగలాడి శారదా..!


కోడై కూస్తుందంటాం చూడండి
నారాయణుని సాక్షి గా నీవు పుట్టపర్తి నారాయణుణ్ణి నీవు మోసం చేసావ్
అది నేనన్న మాట కాదు 
నేనన్నానంటే ఏదో పక్ష పాతంతో అన్నాననుకోవచ్చు 

ఆయన నాకు బంధువు కాదు

పోనీ ఇప్పట్లాగ
నా ప్రాంతీయుడూ కాదు
నిజమైన కవికి కులము మతము ప్రాంతీయతేమిటండీ..
జాషువా వున్నాడు
ఒప్పుకోని తీరాలి
మహాకవి

అంచేత బాధతో 

నువ్ మాత్రం తప్పు చేసావూ 
నేనిది ఢంకా బజాయించి చెప్పగలనూ

"
అక్కట కన్న పుత్రునకు న్యాయము సేయని పల్కుతల్లి! నే
నిక్కరణిన్ దురాగ్రహము నెవ్వియొ బల్కుచుంటి గాన నీ
తిక్క గుదుర్తురా యని మదిన్ తలపోసి నిరంకుశత్వము
ప్రక్కకు నెట్టివైచితివొ రచ్చ యొనర్చెద నిన్ను!శారదా.."


ఒకవేళ నేను నిన్ను ఇట్ల అన్నాను కదా అని 
 నా మీద ఆగ్రహం తోటి నన్నేమైనా చేయ దలచుకున్నావంటే 
రచ్చ చేస్తాను 
ఈ రచ్చ అనేది కూడా గమ్మత్తైన మాట



ధీయుతులైనవారు నిను తిట్టక ముద్దును పెట్టుకుందురే..?
మాయురె..?మోసగత్తె వనుమానము లేదని పల్కకుందురే..?
కోయిల గొంతుదాన..!అతి గొప్పకు బోతివి నిశ్చయంబు..!నీ
ధ్యేయమదేమిటో తెలియదే మరి నాకు వరాల శారదా..!"



నిన్ను తిట్టక ముద్దు పెట్టుకోమంటావా 
అనేది తెలుగులో కద్దు
ఇంత గొప్పదానివైవుండి.
పోతన లాంటి వాళ్ళను చూసినదానివైవుండి 
కాళిదాసాదులను చూసినదానివైయ్యండి.
శ్రీనాధాది కవులను చూసినదానివయ్యుండి 
ఇదేమిటమ్మా..


ఏమండీ ఇంతవరకు ఎవరైనా చెప్పగలరండీ..
తరువాతి పద్యాలు చాలా ధైర్యంతో చెప్పాను
ఇది నా గొప్పదనమనండి
నా మొండి ధైర్యమనండి
పొగరనండి
పిచ్చితనమనండి
మూర్ఖత్వమనండి..
నేనేమన్నానంటే..





'పగలే వెన్నెల 'యన్నమాత్రమున.. అంబా అంత 'ఖుషౌ'దువా..?
'జగమే ఊయల' యన్నమాట.. మునుపచ్చా ..నీవు విన్లేదటే..?
పొగరున్ ..గర్వము.. క(చ)న్నుల్న్ వెలుగు అంభోజాక్షి..!విద్యాసతీ..!
సొగసౌ నవ్వుల చూడకట్టు ..కసితో..చో ద్యంబుగా శారదా..!

ఇంకోమాట కూడా అన్నానండీ అదికూడా చెప్పాలి మీకు


'చాం(సాం)బుభళా' కవిత్వములు.. సారసలోచన నేనెగాదు.. ఆ
రింగులజుట్టుచాన ..కమలేక్షణ సుబ్బులు నుంచుకున్న.. మా
రంగయ తాత గూడ ..కడు లావుగ.. సర్వులు మెచ్చునట్లు.. వ్రా
యంగలడే ..తలంపగను..! ఆ గతి జూడకు.. గుస్స ..శారదా..!!


గుస్సా అనేది కూడా తెలంగాణ మాటే
అలా అమ్మవారిమీద నా కోపం చూపా 


నాభావం 
ఈ పద్యాలన్నీ చెప్పిన తరువాత కూడా అర్థం కాకపోతే
 వేస్టిక ..
పుట్టపర్తి నారాయణాచార్యులకు ఎంత అన్యాయం జరిగిందనేటటువంటిది
ఇక్కడ నా బాధ 
నా హృదయావేదన
అంతకంటే
నేనెవరినీ అవమానించాలని 
తక్కువచేయాలని కాదండి
ఎవడి గొప్పతనం వాడిది 
ఎవడి విలువ వాడిది
అందుకే నేనన్నాను..



"దర్పంబున్ వగలెన్నొ చూపి బుధులన్ దద్దమ్మలన్ సేయుటల్
ముర్పెంబంచు తలంచినావే వికచంభోజాక్షి? బల్ యోచింప
నేర్పే!మ్రొక్కుచునుంటి నీకు మరియున్ నీ జ్ఞాన పీఠంబుకున్
సర్పంబట్టుల బుస్సు బుస్సుమనకే ! సర్వజ్ఞ!శ్రీ శారదా!!"



నువ్వు నేరం చేసావ్ 

నువ్వు చాలా తప్పు చేసావ్ 

ఆ రెండు పద్యాలివి 

ఒక కవి ఎవరైనా ఇంకో కవికి అన్యాయం జరిగితే ఇన్ని పద్యాలు రాయడు..
నాకు రాయాలనిపించింది..
రాశా..

చిన్నపిల్లలు సారీ చెప్పు సారీ చెప్పు అని ఏడిపిస్తారు
చిన్నపిల్లలం అమ్మ ముందు మనమెంతండి..
శారదను నేనెవణ్ణి తప్పు పట్టడానికి
నేనెంత
నా పాండిత్యమెంత..
కాని 
ఒక ఆవేదన 




నేరము లొప్పుకొమ్ము ..కడు నిక్కును టెక్కును చూపినావొ తూ
ర్పారగబట్టెదన్..! పెడసరమ్ముగ పల్కగ చూచినావొ, నా
నోరు భయంకరంబది..మనోన్మయి నన్సుతు రెచ్చగొట్టి బే
జారయిపోకహో.. నిగమ సన్నుత.. పల్కులరాణి.. శారదా..!!


ఒక కవి ఎవరైనా ఇంకో కవికి అన్యాయం జరిగితే
 ఇన్ని పద్యాలు రాయడు..
నాకు రాయాలనిపించింది..
రాశా..


ఒకవేళ కొంతమందికి కోపాలొస్తాయి
అందుకే అన్నా

అండజయాన..! నా పలుకులన్నియు తుఛ్చులు కుట్రగాళ్ళకున్
గుండెల మీద గుద్దినటు - క్రోధము మీర మహోగ్రమూర్తియై
చండిక భీకరాకృతిని సల్పిన నాట్యమిదన్న రీతిగా
నుండును - నీవెరుంగవో తలోదరి కారణమేమొ..? శారదా..!!


అక్కిరాజు రమాపతి రావు గారికి 
పుట్టపర్తి వారిపై ఎనలేని గౌరవాభిమానాలున్నా
ఆయన స్వభావం మృదువైనది.

వారి తమ్ముడైన సుందర రామ కృష్ణ గారు

గుండె ధైర్యం మెండుగా గల గుంటూరోడు

అన్నదమ్ములిద్దరిలో ఎంత వ్యత్యాసం

అనిపించింది 

ఆయన శారదతో


"గుంటూరోళ్ళతొ పెట్టుకోకు 

మొదలే గూండాలులే శారదా.."

అంటున్నారు 



మీరూ చూడండి








21 నవం, 2012

రాయలనాటి రసికతా జీవనము


పుట్టపర్తి వారి ప్రబంధ నాయికల


[Image: rhnar9.jpg]

వసుచరిత్ర సంగీత సాహిత్యములు



[Image: rhnar9.jpg]

పుట్టపర్తి వారి "వరాహ పురాణం"


[Image: rhnar9.jpg]

భామినీ విలాసము చదవండి..


[Image: rhnar9.jpg]

పుట్టపర్తి వారి "వసు చరిత్ర సంగీత సాహిత్యములు" చదవాలా..?? క్లిక్ చేయండి..


[Image: rhnar9.jpg]

పుట్టపర్తి వారి "బుధ్ధ భగవానుడు"


[Image: rhnar9.jpg]

ప్రాకృత వ్యాసమంజరి-పుట్టపర్తికి అతి చిన్నవయసులోనే గొప్ప కీర్తిని తెచ్చిన ప్రాకృత భాషా ప్రాభవం మీ కోసం


[Image: rhnar9.jpg]