10 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు బిరుదు--పుట్టపర్తి అనూరాధ






బిరుదులలో  రక రకాలు..
ఇతరులు ఇచ్చినవి..
సొంతంగా పెట్టుకున్నవి.
నిజంగా సార్థకమైనవి ..
అషామాషీగా తగిలించుకున్నవి..



 
నిజానికి ప్రతిభా జీవులకు బిరుదులు అఖ్ఖర్లేదు..
ప్రజల అభిమానమే వారికి గొప్ప బిరుదు
కానీ కొందరు కొనుక్కుంటున్నారు..
అడుక్కుంటున్నారు..
బేరసారాలాడుకుంటున్నారు..

అలనాడు..

నన్నయను "ఆదికవి", "వాగనుశాసనుడు" అన్నారు.
శ్రీకృష్ణదేవరాయలును "ఆంధ్రభోజుడు" అన్నారు.
ఆదిభట్ల నారాయణదాసును "హరికధాపితామహుడు" అన్నారు.   





కొన్ని ప్రముఖుల బిరుదులు..చూడండి..
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 
జాతిపిత, బాపూజీ, మహాత్మాగాంధీ 
జవహర్‌లాల్ నెహ్రూ... 
చాచాజీ 
సుభాష్ చంద్రబోస్... 
నేతాజీ 
సి. రాజగోపాలాచారి...
 రాజాజీ 
లాల్ బహదూర్ శాస్త్రి.... 
శాస్త్రీజీ 
కందుకూరి వీరేశలింగం పంతులు... 
గద్య తిక్కన
బాలగంగాధర తిలక్... 
లోకమాన్య 
లాలా లజపతిరాయ్... 
పంజాబ్ కేసరి 
రవీంద్రనాథ్ ఠాగూర్... 
గురు దేవుడు
విశ్వకవి వల్లభాయ్ పటేల్... 
సర్దార్, ఉక్కు మనిషి 
సి.ఎన్. అన్నాదురై... 
అన్నా 
శ్రీమతి ఇందిరాగాంధీ... 
ప్రియదర్శిని 
అబ్దుల్ గఫార్ ఖాన్... 
సరిహద్దు గాంధీ
ప్రాంటియర్ గాంధీ ఆండ్రూస్... 
దీనబంధు 
సరోజినీ నాయుడు... 
నైటింగేల్ ఆఫ్ ఇండియా

ఇక రాజకీయ బిరుదులంటారా..


లగడపాటి.. జగడపాటి
ఆంధ్రా జోకర్
రాయపాటి... ఐరన్‌లెగ్‌పాటి
కావూరి... కయ్యాల కోరి
చంద్రబాబు... కంత్రీబాబు, ఆంధ్రాబాబు
మేకపాటి... జగన్ డాగ్
తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి..
డబ్బువరపు గజ్జి రామిరెడ్డి
పయ్యావుల కేశవ్... కయ్యాల కసబ్
దేవినేని ఉమ.. చేవలేని దోమ
సబ్బం హరి... పబ్బం జగన్
ఆనం వివేకా... ఆల్‌లైన్ డ్రింకర్
టీజీ వెంకటేష్... తెలంగాణ విలన్
జగన్.. జగత్ కిలాడీ
జగ్గారెడ్డి... టౌన్ టార్జాన్
శైలజానాథ్.. జలగనాథ్
దానం+ముఖేఫ్.. గోడమీది పిల్లులు





 నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి..
అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి..
తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు.
వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. 
వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే..
ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.

నన్నయ్య గారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు.
తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని..

తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము.
నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు.



శ్రీ కృష్ణదేవ రాయలు (Krishnadevaraya) (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి.
ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. 
కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. 
సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. 
యన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలుస్తూంది. 



అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (Ajjada Adibhatla Narayana Dasu) 
ప్రముఖ హరికథా కళాకారుడు.., 
సంస్కృతాంధ్రాలలో ..
అనేక రచనలు చేసిన రచయిత.., 
కవి.., బహుభాషా కోవిదుడు.., తాత్వికుడు... 
తెలుగునాటనే కాక ..
ఇతర రాష్ట్రాలలో కూడా ..
హరికథా ప్రదర్శనలిచ్చి.., 
ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. 
"శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.


పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా.., 
పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే.., 
భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. 
ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. 

అక్కడ పుస్తకాల కొట్టులో..,
భాగవతం చూసి ..(బాల దాసు)
అది కావాలి ..
అని మారాం చేస్తుంటే.., 
ఆ కొట్టు యజమాని.. 
భాగవతం నీకేమి అర్థమవుతుంది..?
అన్నాడట.
అంతే ..
ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట.

అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా ..
పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు.., 
కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.

ఇది ఇలా ఉండగా, 
ఒకసారి..
దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది.
అక్కడ అరుగు మీద కూర్చుని ..
రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే.., 

అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి..,
తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని ..
వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. 

దాంతో అప్పటిదాకా.. 
ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. 

ఒకప్రక్క సంగీత సాధన.., 
ఇంకో ప్రక్క విద్యాభ్యాసం..
ఇలా రెంటినీ ..అతను ఎంతో నేర్పుగా 
సంబాళించగలిగాడు చిన్నవయసులోనే.

తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు.

ఇలా కొంతమంది మహానుభావుల బిరుదులు వారిని పొంది.. 
అవి సార్థకమయ్యాయి..

ఇలాంటి అనుభవాలు పుట్టపర్తి వారి జీవితంలో కోకొల్లలు..





ఎవరు బిరుదులిచ్చినా పెట్టుకొనే అలవాటు నాకు లేదు..
చాలా మంది బిరుదులిచ్చారు నాకు .. 
అభినవ కాళిదాసన్నారు..
ఇంకొకడు..అభినవ నాచన సోముడన్నాడు..
ఆ గద్వాలలో ..
చాలా చిన్నవయసులోనే ..
అభినవ పోతన్న అన్నాడొకడు..


ఒక రూపాయిస్తే అబధ్ధం చెబుతాను నేను..
ఇటువంటి వాణ్ణి..
అభినవ పోతన అని ఎందుకంటావు ..?
అని నమస్కారం పెట్టి వచ్చినాను..


తరువాత ..
బాపట్లలో నాకు కవి సార్వభౌమ బిరుదు ఇచ్చినారు..
వెనక్కే ఇచ్చేసినాను నేను..


అయ్యా నేను బీదవాణ్ణి ..
నాకు డబ్బులేక మీ ఊరికొచ్చినాను..
వెయ్యి రూపాలిచ్చినారు..
ఇంకో నూటపదహార్లు కలిపి ఇవ్వండి..
సంతోషపడతాను..
ఈ కవి సార్వభౌమ బిరుదు మీరే వెనక్కి తీసుకోండి..
అని వచ్చేసినాను ..
సాధారణంగా ఎక్కడ బిరుదులిచ్చినా ఒప్పుకునే మనస్తత్వం నాకు లేదు..
నాకెందుకయ్యా కొత్త బిరుదు..?
నేను పుట్టపర్తి నారాయణా చార్యులంతే..
నేను అభినవ కాళిదాసూ కాదు.. ఎవడూ కాదు..

కొందరి విషయంలో అయితే..
ఇచ్చే బిరుదు యొక్క అర్థం ..విలువా..
ఇచ్చే వానికీ తెలియదూ.. 
పుచ్చుకొనే వానికీ తెలియదూ..
ఇదీ పుట్టపర్తి వారి వరస..

ఒకప్పుడైతే వాడో.. వీడో ..
కాస్త సభలో నిలబడగలిగిన వానికి .. 
కాస్త ధాటీ గా వుండే బిరుదును అప్పజెప్పి సంతోషపడేవారు..
 
కానీ ఇప్పుడో..
మనకూ ఓ బిరుదు వుంటే పేరుకు మరింత హుందాతనం వస్తుందనుకున్నప్పుడు..
బిరుదుల బజార్లో కెళ్ళి చక్కటి బిరుదూ.. 
గ్యారంటీ ..వారంటీ ..
చూసుకుని కొని తెచ్చేసుకోవటమే..

 

మిత్రుడు మిగిల్చిన అనుభవాలు.. జ్ఞాపకాలు..



అయ్య ..
రామ చరిత మానస్ ..
పదమూడు సంవత్సరాలు పారాయణ చేసారట.
ఇప్పుడు ..

ఈ వ్యాసాలు చదువుతుంటే ..
కనుల నీరు కమ్మి ..
మనసు మూగవోయి..
అప్పుడే ఎందుకు పుట్టలేదా..
అన్న విచారం మనసును క్రుంగదీస్తూంది..
 
అయ్యతో వ్యక్తిగత పరిచయమున్న వారు..
వారి అనుభూతులను వివరిస్తూంటే ..
మా కన్నా వారే ఎంత అదృష్ట వంతులో కదా..
అన్న విచారమూ కలుగుతోంది..

మేము కూడా పూర్వ జన్మలో ..
ఎంతో పుణ్యం చేసి వుంటాం..
కనుకే 
అంతటి మహోన్నత వ్యక్తి కడుపున 
జన్మించి తరించాము..



అప్పుడు ..
మా వయసు ప్రలోభాలు.. 
చిన్నతనం .. 
కనులకు మబ్బులుగా కమ్మి..
అయ్య విశ్వరూపాన్ని గమనించలేకపోయాం..
 

కానీ ఇప్పుడు ..
మా సర్వ శక్తులనూ వత్తులుగా చేసి ..
దివ్వెలుగా ఆయన ధీరత్వం ముందు వెలగాలని..
మనసు తపించిపోతూవుంది.. 

                     మిత్రుడు మిగిల్చిన ..
                 అనుభవాలు జ్ఞాపకాలు
        డా. వి. రామమూర్తి "రేణు"MA,Dlit
                                      

వాగ్దేవీ స్థనద్వయామృతాన్ని..
కడుపార గ్రోలి ..
సుష్టుగా జీర్ణించుకుని..
తృప్తిగా త్రేంచిన ..
అసలైన సిసలైన ..
సరస్వతీ పుత్రుడు శ్రీమాన్ నారాయణాచార్యులు.


ఆయన సాహితీ స్వరూపం..
బహుముఖాల సానలు తీరిన భారత జాతి రత్నం... 

తౌర్యత్రిక విద్యకు మరో పేరు పుట్టపర్తి.
 


ప్రేమ ..మధుర భక్తి మందాకినిలో..
మునిగితేలిన మహితాత్ముడు..
ఆయనతో పరిచయమున్న ఏ సహృదయుదికైనా..
ఇది ఏమాత్రమూ పొగడ్త అనిపించదు..

 

  
శ్రీ నారాయణచార్యులతో నాకు గల పరిచయం..
ఆత్మీయత ..అనురాగాలు ..
ఈనాటివి కావు. 

 1945లో అనుకుంటా ..
ఓ పర్యాయం ఆయన గుంటూరు వచ్చారు..
ఏదో సభలో పాల్గొనటానికి. 

ఆ రోజుల్లో ..
నేను హిందూ కాలేజీలో 
హిందీ ఉపాధ్యాపకుడిగా వున్నా.. 


కీ.శే . శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ ..నేను ..
ఒకే ఇంట్లో ..
ప్రక్క ప్రక్క వాటాల్లో ..
అద్దెకు ఉంటున్నాం...


శ్రీ శర్మ నన్ను తన వెంట సభకు తీసికెళ్ళారు. 
అందులో ..
ఆయన తన శివతాండవంలోని కొన్ని భాగాలు..
సమాహిత చిత్తంతో ..
తన్ను తానే మరచినట్లు గానం చేసారు. 


నా మనస్సు మీద ఆనాడే..
ఆయన వ్యక్తిత్వం చెరగని ముద్ర వేసింది.
 
ఆ రాత్రి..
శ్రీ శర్మ గారింట ఆయనకు ఆతిధ్యం ..
ఆ రాత్రంతా.. 
సాహిత్య గోష్టితో గడిచింది. 
ఆయన వ్రాసిన సాక్షాత్కారం..
లఘు కావ్యం ప్రతిని నాకిచ్చారు .


అందులో భక్త శ్రేష్టుడు 
శ్రీ గోస్వామి తులసీదాసు భక్తి సాధన ..
అనితర సాధ్యంగా వర్ణించబడింది.

ఆశ్చర్యంతో తులసీదాసును గురించి 
మీకెలా తెలుసునని ప్రశ్నించా ..
ఆయన నిమీలిత నేత్రాలతో ..
శ్రీ రామ చరితమానసం..
 పదమూడేండ్లు పారాయణం చేసానయ్యా..
అనడంతో బిత్తర పోయాను .


ఆనాడే ..
మా ఇద్దరి హృదయాలు ఏకమయ్యాయి.
శ్రీ తులసీ దాసు సాధనా పధాన్ని ..
అంత హృద్యంగా ..,అనవద్యంగా..,
కావ్యరూపంలో ..

 
నాకు తెలిసినంతవరకూ ..
హిందీ కవి కూడా నిబధ్ధించలేదు. 


మహాకవి "నిరాలా" ..
తన తులసీదాసనే ..
హిందీ కావ్య ఖండికలో ..
తులసీ హృదయ పరివర్తనను మాత్రమే..
అద్భుతంగా వర్ణించాడు. 


ఆ మహా భక్తుని భక్తి సాధనను ..
పుట్టపర్తి భావించినట్లుగా
మరే కవీ వర్ణించలేదు. 


పదమూడేండ్లు మానసాన్ని మధించిన..
మేధామందరం సరస్వతీపుత్రుడు. 
శివకేశవ అభేదాన్ని ..
అడుగడుగునా భావించి..

బోర్కర్
స్వస్థ సుందరమైన..
అద్వయ దృష్టితో రచించబడ్డ తులసీ మానసాన్ని..
పుష్కర కాలానికి పైగా ..
పారాయణం చేసిన ..శ్రీ వైష్ణవుని నోట..
శివతాండవ దర్శన ధార ప్రవహించడం..
అబ్బురం కాదనిపించింది...




హరి హర నాధునకు ..
అక్షర దేవాయతనం నిర్మించిన తెలుగు గడ్డ మీద..
నారాయణాచార్యుల వంటి బ్రహ్మ దృష్టి గల 
వాఙ్మయ తపస్వి పుట్టడం ..
సాధారణం కాకపోయినా..
అసహజం కాదు. 


కనుకనే .. 
ప్రాతఃస్మరణీయులు ..
పరమ హంసావతంసులు..

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ శ్రీ చరణుల..
కామకోటి పరమాచార్యుల అనుగ్రహానికి.. భాజనులయ్యారు నారాయణాచార్యులు.

మామావరేర్కర్
  శ్రీమదప్పయ దీక్షితేంద్రులు ..
బిల్వ మంగళాచార్యుల వంటి..
స్వస్థసుందరమైన అద్వయ బ్రహ్మ దృష్టి ఆయనది.

శ్రీ నారాయణా చార్యులను గురించిన
స్మృతులెన్నెన్నో..
ఆయన తలంపుకు వచ్చినప్పుడల్లా 
గిలిగింతలు పెడుతుంటాయి ..

దినకర్.
 ఆయన తమ్ముడూ..
స్వస్థి సౌహార్ద్ర సంపదే ! 
అని వ్రాసిన జాబులెన్నింటిలోనో ..
నన్ను అనుజునిగా ..
సుహృదునిగా..
భావించి ..
ఏనాటిదో గదా ..
మన అనుబంధం..
అని ఆత్మీయతను వర్షించిన సన్నివేశాలు ..
మరపునకు రావు.

బనఫూల్
 పూజ్య పాదులు..
శ్రీ పరమాచార్యుల శ్రీ చరణాలవిందాల వద్ద ..
మేమిద్దరం గడపిన క్షణాలు ..
నేటికీ నాకు జీవన పాధేయాలుగా నిలిచాయి.

శ్రీశైల క్షేత్రంలో ..1968 లో ..
శివరాత్రినాడు.. 
శ్రీ పరతేశ్వరుని గర్భాలయంలో.. 
స్ఠిరలింగానికి ఎదురుగా ..
అచర లింగేశ్వర (కంచిస్వాముల ) సన్నిధిలో.. మేముభయులమూ అనుభవించిన..
ఆ దివ్యానుభూతిని 
నేటికీ స్మరించుకుంటాను.



దాదాపు 35 నిమిషాలు..
 శ్రీవారు కావించిన ..
దివ్యానుగ్రహ భాషణాన్ని..
"శ్రీశైల క్షేత్రం-శివరాత్రి" అనే ఉపన్యాసాన్ని ..
నేను రికార్డు చేసి చరితార్థుణ్ణయినాను.



శ్రీ నారాయణాచార్యుల ప్రతిభ ..
ఆంధ్ర రాష్ట్రపు టెల్లలను గూడ దాటి ..
ఆసేతు శీత నగ వ్యాప్తిని సంతరించుకుంది. 



Malayalaen Lexicon సంపాదకునిగా.. తిరువనంతపురంలో 
పేరు తెచ్చుకొన్న పుట్టపర్తిని ..
హిందీ మహా కవయిత్రి శ్రీ మహదేవి వర్మ..

శ్రీ మహదేవి వర్మ
   
1953లో ..
ఉత్తర ప్రదేశ్ లో..
శీతాచల సానువుల్లో..
నైనిటాల్ లో నిర్వహించిన.. 




అఖిల భారత సాహితీ సమారాధకుల 
శిబిరానికి తీసికెళ్ళారు.
తెలుగు భాషకు సంబంధించిన ..
ఒక ప్రముఖ ప్రతినిధి కవిని కూడ ...
వెంట బెట్టుకు రమ్మని.. 
శ్రీమతి మహాదేవి వర్మ నన్ను కోరడంతో ..
నా నెచ్చెలిని వెంట తీసితెళ్ళాను.


ఆ ఉత్తమ మైన నిర్ణయాన్ని తీసికున్నందుకు..
15 రోజులు సాగిన ఆ సాహిత్య గోష్టుల తర్వాత..
నేనెంతో తృప్తి పడ్డాను.


మైధిలీ శర్ణ్ గుప్త 



 ఆ శిబిరానికి ..
భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దిగ్దంతులెందరో హాజరయ్యారు.


బనఫూల్..,
బోర్కర్.., 
మామావరేర్కర్..,
దినకర్.., 
మైధిలీ శర్ణ్ గుప్త..,
ఇలాచంద్ర జోషి ..
మొదలైన వారెందరో వచ్చారు.



చుక్కల్లో చంద్రుడిలాగ ..
అందరినీ తన శివతాండవంతో 
ఆకట్టుకున్నాడు పుట్టపర్తి. 
ఒకనాడైతే అందరం గుర్రాల మీద
Chinapeak అనే మంచు శిఖరానికెళ్ళాం..




అప్పుడు దినకర్ జీ ..
 "మహాకవీ ..యహ్ యోగ్య రంగ్ మంచ్ హై..
అపనీ శివ్ తాండవ్ కృతి గానేకేలియే..
  ఆయియే ..
హమే రసమగ్న బనాయియే.."

అని ఆహ్వానించారు




(మహాకవీ మీ శివతాండవ గానానికి అనువైన నాట్యశాల ఇది. లేవండి మమ్మల్ని రసాంబుధిలో తేల్చండి..)


ఆ నగాధిరాజ ప్రాంగణంలో ..
దాదాపు అరగంటసేపు సాగిన ఆ కావ్య గానం ..


శ్రీ నారాయణాచార్యుల సాహితీ వ్యక్తిత్వానికి..
అధ్బుతమైన మణికిరీటం..


అదే శిబిరకాలంలో చివర రోజులలో ..
ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రి ..
మహా పండితుడు సంపూర్ణానంద్ ..


శిబిరంలో పాల్గొన్న పండితుల నందరనూ..
తన వేసవి నిలయంలో 
(National Government House) లో 

మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. 

ఆయన కోరిక మేరకు ..
ఆ చోట చేరి కవులందరూ ..
తమ తమ భాషా కవితలను వినిపించారు.
వాటన్నిటినీ ..

శ్రీ సంపూర్ణానంద్ శిరః కంపంతో అభినందించారు. 
సంపూర్ణానంద్


కాగా..
శ్రీ నారాయణా చార్యులు 
శివ తాండవం లోని ..
"నందీ నాందీ" శ్లోకాలు గానం చేయగానే..
ఆయన సంతోషంతో ఊగిపోతూ..
"వాహ్ ..వాహ్.. కైసీ అద్భుత్ రచనాహై ..
చిత్త ప్రఫుల్ల హోగయా.. 
అని మౌఖికంగా తమ ఆనందం ప్రకటించారు. 
అలాంటిదీ శ్రీ పుట్టపర్తి వ్యక్తిత్వం.



నేడు ..
తన తీయని పవిత్ర స్మృతులను ..
మాత్రమే మనకు వదలి ..
నా నెచ్చెలి వెళ్ళి పోయాడు.


ఆ సరస్వతీ పుత్రుని ..
సంభావించి ..సన్మానించిన ..
సంస్థలు తమ ఉనికిని స్థార్థకం చేసుకున్నాయి. 
పైరవీలకు ..
ప్రలోభాలకు ...
మాత్రమే సంక్రమించే..
పెద్ద పెద్ద సమ్మానాలు.. 
అవార్డులూ ..

రాకపోవటంతో ..
ఆయన నిష్కలంక చంద్రుడైనాడు.
 
ఆ సంస్థల పక్షపాత పంకం..
ఆయన నంటుకోక పోవటం.. 
ఆయన అదృష్టమే.. 
"శివతాండవం.."
ఆయన అక్షర శరీరం. 
నిస్సంశయంగా ..
భర్తృహరి పలుకుల్లో ..
ఆయన రససిధ్ధ కవీశ్వరుడు..
అజరామర జీవి..