7 అక్టో, 2011


మార్చిన వార్తా విశేషాలు - శని వారం అక్టోబర్    08th 2011 - 2:32 AMRSS  


నవ్యకవితకు నాంది
సొమ వారం, జనవరి 11, 2010 , 5:20 [IST]

venkata rao(గత సంచిక తరువాయి)
3. ధర్మవరము రామకష్ణమాచార్యులు- తమిళ నాటక చక్రవర్తి సంబంధమొదలియారునకు రామకష్ణమా చార్యులు గురుదేవులు. నేను మదరాసులోనున్నప్పుడు సంబంధమొదలియారు గారిని దర్శించి, వారిచేత- రామకష్ణమాచార్యుల  వారినిగూర్చి ''నాగురుదేవుడు అను వ్యాసము వ్రాయించి ప్రకటింపజేసినాను. సంబంధమొదలి యారు గారు తమిళులైననుతెలుగు భాషలో మంచి ప్రవేశముగలవారు. తెలుగుననే ఆ వ్యాసము వ్రాసినారు. వారు నన్నెంతయో అభిమానించెడి వారు. ఆంధ్రవిశ్వవిద్యాలయమున డాక్టరు దివాకర్ల వేంకటావధానిగారు ధర్మవరము వారిని గూర్చి పరిశోధన జరిపిరి.

4. కోలాచలము శ్రీనివాసరావు- శ్రీనివాసరావు గారి అన్నగారు - వెంకటరావు గారు- శాసన సభసభ్యులు- వారే, విశాఖపట్టణమున జగన్మిత్ర హాలు అను నాటకశాలకు శంఖుస్థాపన చేసిన వారు. శ్రీనివాసరావుగారు గొప్ప విద్వాంసులు.ఆంగ్లభాషలోనున్న వారి ప్రపంచనాటక చరిత్ర తిరిగి ముద్రితము కావలెను. ఆంగ్లభాషలో రచయితలయిన తెలుగు వారిలో వారికొక విశిష్ట స్థానమున్నది. డాక్టరు ఎన్‌. గంగప్ప - కోలాచలమువారి నాటకములను గూర్చి పరిశోధన చేసి పట్టమును పొందినారు.
5. కట్టమంచి రామలింగారెడ్డి -  రెడ్డిగారి ముసలమ్మ మరణము నవ్యకవిత్వమునకు నాంది. గురజాడ, రాయప్రోలు - ఆయన తరువాతివారు.

అర్థశాస్త్ర ప్రారంభమున - వారు వ్రాసిన
''అస్మత్ప్రియ సఖి....
సస్మేర ముఖేందుబింబ సమ్యక్తేజో
విస్మయ ముఖి...
అనుదానితో మొదలిడిన పద్యములు వారి నవ్యకవితా వైశద్యమును తెలుపును.

పింగళి సూరన కవితాకళా ప్రతిభ లోకమునకు మొదట చాటినది రెడ్డిగారే- కట్టమంచివారిని గూర్చి సి.ఆర్‌.రెడ్డి - అను గ్రంథమును - సుప్రసిద్ధాంగ్ల భాషారచయితలైన డి.ఆంజనేయులుగారు. ఇంగ్లీషులో రచించిరి. కేంద్రసాహిత్య అకాడమీవారు దానిని ప్రచురించిరి. 1992లో రాజరాజనరేంద్ర - నవశతాబ్ది సభకాయన అధ్యక్షత వహించినారు - ఆయన అధ్యక్షవచనము - నన్నయ భట్టారకుని రచనా విశిష్టతను గూర్చి.ఇంతవఱకు తెలుగున నన్నయగూర్చి ఎంతో మంది వ్రాసినారు కాని రెడ్డిగారి వ్యాసమునందున్న విషయములు వేరెచ్చటను కానబడవు.

ఆంధ్ర మహాభారతము వారు  చదివినట్లు మరియొకరు చదవలేదనుట సత్యోక్తి.రెడ్డిగారిని గూర్చి ఇదివఱకెవ్వరు వ్రాయని వారి ఛలోక్తి నొకదానిని తెలుపుచున్నాను.వారాంధ్ర విశ్వవిద్యాలయోపాధ్యక్షులుగా రెండవ సారి ఉన్నప్పుడు విశ్వవిద్యాలయమున-విద్యార్థినీ వసతి గహము (గరల్స్‌ హాస్టల్‌) విద్యార్థుల వసతిగహమునకు (బాయస్‌ హాస్టల్‌) ఎదురుగా కట్టబడినది- కట్టమంచివారు దానిని తెఱచుచూ ఇట్లు చెప్పినారు.''ఐ ప్రెజ్యూమ్‌, వు§్‌ు హావ్‌టు ఓపెన్‌ ఎ మెటర్నిటీ హోమ్‌ నెక్ట్స్‌ యియర్‌.''వచ్చేయేడు మనమిచ్చట ఒక ప్రసూతి గహము కట్టించవలెనేమో తరువాత కొలది కాలమునకే అది మరియొక చోటికి దూరముగా తరలింపబడినది.

6. గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు- గాడిచెర్ల వారిని గూర్చి సమగ్రముగా వ్రాసినందులకు ఎంతో సంతోషించినాను. దర్శి చెంచయ్యగారి వాక్యముల నుదాహరించినందులకు  మరీ సంతోషము - ఈ తరము వారికెవ్వరికి నీవిషయములు తెలియవు.
పుట 43.
''వారు క్రిస్టియన్‌ కళాశాలలో చేరి ఎం.ఏ. పట్టము పొంది ఇదిసరికాదు. ఆ కాలమున ఎంఎ పట్టము తెలుగులో పొందుటకు, ప్రత్యేకముగా బి.ఏ. పట్టమును పొందిన తరువాత- ప్రయివేటుగా  ఎం.ఏ.కు వెళ్ళవలెను. హరిసర్వోత్తమ రావుగారు అట్లే చేసినారు. వారు మదరాసు విశ్వవిద్యాలయమున తెలుగు ఎం.ఏ. లలో ప్రాథమిక వర్గములోనివారు.

7.రాళ్ళపల్లి అనంతకష్ణ శర్మగారు - తమ వైదుష్యమునకు విమర్శనాపాటవమునకు, రసగ్రహణపారీణతకు స్థానీభూతమైన ఒక ప్రత్యేక గ్రంథమునందింపలేదు - శర్మగారు సాహిత్యము ననే గాక సంగీతమున నిష్ణాతులు. గాయక మహాసభకధ్యక్షత వహించినారు - తెలుగు భాష సంగీతప్రధానమైనది. వాస్తవముగా తెలుగున సంగీతసాహిత్యముల అవినాభావసంబంధమును గూర్చి సాధికారముగా చెప్పవలసినవారు వారొక్కరే - అయినను వారి కలమునుండి అట్టి గ్రంథము వెలువడుటకు మనము నోచుకొనలేదు. అట్లే వారు తెలుగు కన్నడముల పరస్పర ప్రభావమును గూర్చి ప్రామాణికముగా తెలుపగలవారు. అయినను వారు వ్యాసముల మూలముగానైనా తెలిపిన మన ప్రాచీన వాంగ్మయ చరిత్రకెంతో యుపయోగకరముగా నుండెడిది కాని ఆ భాగ్యము మనకు కలుగలేదు.

8. దుర్భాక రాజశేఖర శతావధాని:- రాజశేఖర శతావధాని గారి పేరునకు, వారి కతియగు రాణాప్రతాప చరిత్రకు యతిమైత్రి గలుగుటచేనది యజరామరమైనది-  తెలుగున దిట్టకవి నారాయణ కవి రంగరాయ చరిత్ర తరువాత, రాణాప్రతాప చరిత్రవంటి వీరరసోద్దీపక కావ్యము తిరిగి అవతరింపలేదు. వారి ''పుష్పావతి  కావ్యమును నేను సమీక్షించినాను. అదియు ప్రశస్తమైన కతి - శతావధాన చరిత్రయందు వారికి స్థానమున్నది.9. గడియారము శేషశాస్త్రి- శేషశాస్త్రి గారి శివభారతమును గూర్చి 'శివభారతోదయము అను విమర్శక గ్రంథము పద్యకావ్యము వెలువడినది- అదిచెఱుకు పల్లి సుందర రామయ్య గారు రచించినది.

దానిని మీరు చూచియే యుందురను కొందును - ఈ సుందరరామయ్యగారు శేషశాస్త్రి గారితో సహోధ్యాపకులు -మంచి కవులు - వారు శివభారత రచనకు తోడ్పడిరి. 1943వ  ప్రథమ ముద్రణములో సుందరరామయ్యగారిన గూర్చి ప్రస్తావనలో నెంతగానో వ్రాయబడినది. తరువాత నాల్గవ ముద్రణలో - ఆ సుందరరామయ్య గారి ప్రసక్తియే లేదు - అందుపై సుందరరామయ్యగారు, తాము శివభారత రచనకు తోడ్పడదగిన- కవితాశక్తి యున్నదని చూపుటకు నీ గ్రంథము పద్యములతోనే రచించినారు. తెలుగుదేశమున ప్రసిద్ధికెక్కిన సాహిత్య విద్వాంసుల కందఱకు పంపినారు - శేషశాస్త్రి గారు, తమ జననము 1901 అని స్కూలురికార్డులో వేయించుకొనగా - సుందర రామయ్యగారు - వారి జాతకమును బట్టి 6-4-1894 అని ప్రకటించిరి.

మీరు వారి జననతిధి- 7-4-1894 అని వ్రాసినారు. శేషశాస్త్రిి గారి కతులలో మురారి, పుష్పబాణవిలాసము,  వాస్తుజంత్రి- అముద్రిత ములని (అనర్ఘరాఘవము) మల్లికా మారుతము, వాల్మీకి అసమగ్రములని, కష్ణదేవరాయ చరిత్రము రచనలోనున్నదని ఆంధ్రరచయితల (మ.స.శాస్త్రి) యందుగలదు. ఇవి ఆకాశకుసుమములని శివ భారతోదయము - దీనిపై పరాస్త ''శివభారతో దయమని శ్రీ సి.వి.సుబ్బన్న శతావధానిగారు ప్రకటించినారు. అందు వీనిని గురించిన వివర ములేలేవు. ఈ గ్రంథమును శ్రీ సుబ్బన్న శతావధానిగారు నాకుపంపిరి. శేషశాస్త్రిగారి రచనల విషయమై ఇంకను వివరములు కావలసి యున్నవి. వారి ''రఘునాధీయము అను చారిత్రక ప్రబంధ మునుగూర్చి యా గ్రంథము పుట 65లో నిట్లుగలదు.

''రఘునాథనాయకుని ఆస్థానము ఇందిరా మందిరము అందు శారదా ధ్వజము చిందులు ద్రొక్కి నర్తించినది - కాని అవి రఘునాథ నాయకునికి సంబంధించినవి కావు. అవి ఆతని కుమారుడగు విజయరాఘవ నాయకుని కాలమునాటివి. ఈ రెండింటి ప్రతిష్ఠాపకుడు విజయరాఘవనాయకుడే.చూడుడు. నా దక్షిణ దేశీయాంధ్ర వాంగ్మయము- (రాజగోపాల విలాసమును గూర్చిన విషయము) 

10. పుట్టపర్తి నారాయణాచార్యులు: ఈనాటి తెలుగు కవులలో - విద్వాంసులలో బహుభాషా విశారదులు పుట్టపర్తి వారే అనుటలో అతిశయోక్తి ఎంతమాత్రమును లేదు. సత్యోక్తియే - మీరు ''పదికి మించిన భాషలలో పసిడినిగ్గు లేరుకొన్న పుట్టపర్తి ధిషణ అమోఘము అని వ్రాసినారు. (పుట74) వివరములనిచ్చిన బాగుగానుండెడిది.మీ గ్రంథమునుబట్టి వారు ఏడు భాషలలో ప్రవీణులని తెలియుచున్నది. అధునాతనకాలమున ద్విపద రచయితలలో వారగ్రగణ్యులు. కొడవలూరి రామచంద్రరాజు: వీరి మహాసేనో దయము- ఆంధ్రశైవ వాంగ్మయముననొక విశిష్టకతి.




    మహాయోగి అరవిందులు గొప్ప విద్యావేత్త. 

భారత జాతీయోద్యమంలో పాల్గొన్న 

స్వాతంత్య్ర సమర నేత. 

క్రమంగారాజకీయాలనుంచినిష్క్రమించి తత్త్వానే్వషకులై పాండిచేరిలో 

తమదైన రీతిలో ఆశ్రమం నెలకొల్పారు.

  ‘నా జన్మదినంనాడే నా మాతృ దేశానికి స్వరాజ్యం లభించడంనాకుభగవంతుడందచేసిన జన్మదినకానుక’ అన్నారు అరవిందులు.

అరవిందులు మానవుడినుంచి దివ్యమానవుడు 

వెలువడవలసినఅవసరముందని,ప్రపంచ మానవులంతా శాంతి సామరస్యాలతో విలసిల్లగలరని విశ్వసించిన మహాద్రష్ట. 

భారతదేశంనుంచి విశ్వమానవాళికి 

వినూత్న సందేశమందజేశారు.

  శ్రీరామకృష్ణ పరమహంసలకు దైవదత్తమైన 


శిష్యుడుగాఅవతరించాడు స్వామి వివేకానంద. 


ఆవిధంగానే శ్రీఅరవిందయోగి ఆశించిన వసుధైక 


కుటుంబ సృష్టికోసం 



జన్మించిన మహా యోగిని శ్రీమాత.

  శ్రీమాత 1878 ఫిబ్రవరి 21వ తేదీన పారిస్‌లో జన్మించారు. 

తల్లిదండ్రులుఆమెకు‘మిర్రాఆల్ఫాసా’అని 

నామకరణంచేసారు.

 బాల్యంలోనేఅంతర్ముఖీనురాలుగా వుండేది. 

బాలికగాఆమెఆటపాటలలోపాల్గొనకుండా

 ఏదో ఆలోచనలో వుండేది. 

క్రమంగాఆమెకుఅంతరంగానుభూతులు కలుగుతుండేవి. 

ఆకలితో,రోగాలతో మానసిక రుగ్మతలతో బాధపడేవారు ఆమె సన్నిధి చేరి ఉపశమనం పొందేవారు.

 ఎందరో మహనీయులు 


ఆమెకు కలలో కన్పించేవారు. 


వారిలో


ఒకరిపట్ల ఆమెకు భక్తి కలిగింది.

 

1914 మార్చి 29వ తేదీన భర్త, తత్త్వవేత్త అయిన 

పాల్ రిచర్డ్‌తోపాటు పాండిచేరిలో 

శ్రీ అరవిందులను దర్శించింది. 

 

తనకు కలలో కన్పించిన మహానుభావుడితడే 

అని నిశ్చయించుకొన్నది. 

తాను నిర్మించదలచుకొన్న ప్రపంచానే్న 

అరవిందులు కూడా నిర్మించాలని ఆశిస్తున్నట్లు 

ఆమె గుర్తించింది. 

 

ఆయన సన్నిధిలోనే వుండాలని 

నిశ్చయించుకొన్నది.

ఆ తర్వాత 

ఒక సంవత్సరం పాండిచేరిలోనే 

అరవిందుల సన్నిధిలో వుండి, 

ప్రథమ ప్రపంచ యుద్ధ కారణంగా 

భర్తతో కలసి పారిస్ వెళ్లింది. 

 

1916లో జపాన్‌లో పర్యటించింది. 

అక్కడ రవీంద్ర కవిని కలుసుకొన్నది. 

ఆమె అసాధారణ ప్రజ్ఞను గమనించిన రవీంద్రులు భారతదేశానికి వచ్చి తాను ప్రారంభించిన ‘శాంతినికేతన్’ సంస్థను నిర్వహించమని కోరారు. 

 

రవీంద్రుల ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి భారతదేశం చేరి శ్రీ అరవిందుల సన్నిధిలో చేరింది.

 

అరవిందాశ్రమంలో

 1920 ఏప్రిల్ 24న శ్రీ అరవిందులనుకలుసుకొన్నది. 

 

ఒకనాడు భయంకరమైన తుపానువల్ల 

ఆమె వుంటున్న వసతి గృహం కూలిపోయింది.

 శ్రీఅరవిందులుంటున్నబంగళాలోనేస్థిరంగా వుండిపోయింది.

1926 నవంబర్ 24న అరవిందులు 

తమ తపస్సులో ఒక ప్రధాన ఘట్టం చేరారు.

 

 శ్రీకృష్ణుని దివ్య శక్తి వారితో ఏకమైంది. 

ఆరోజునే సిద్ధిదినమంటారు. 

ఆ సిద్ధినిచేరుకొని పరిణామక్రమంలో 

మానవజీవితాన్ని దివ్య జీవితంగా మార్చడంకోసం, అవసరమైన అతి మానస అవతరణకోసం 

అరవిందులు ఏకాంతవాసంలోకి వెళ్లారు. 

యోగ నిమగ్నులైన అరవిందులు 

 

కొన్ని ముఖ్యమైన దినములనాడే 

శిష్యులకుదర్శనమిచ్చేవారు. 

ఆశ్రమ నిర్వహణ బాధ్యతను 

యోగిని మిర్రా మాతాజీ స్వీకరించింది. 

 

అరవిందుల యోగశక్తి 

శ్రీమాతలో సాక్షాత్కరించింది. 

 

తమ నివాసమును 

శ్రీ అరవిందాశ్రమంగారూపొందించింది.

 అరవిందులు, విశ్వామిత్రుని వంటి వాడన్నారు 

 

పుట్టపర్తి నారాయణాచార్యులు. 

 

విశ్వామిత్రుడు త్రిపాన గాయత్రిని సృష్టించినట్లే 

 

అరవిందులు భాగవత జీవన విధానమును 

 

నిర్ణయించిరి. 

 

డార్విన్ పరిణామవాదాన్ని తీసుకొని 

 

అరవిందులు అలౌకిక మొనర్చారన్నారు. 

 

వైయక్తిక ముక్తిని నిరసించి 

 

జగత్తునే దివ్యముగ మార్చుటకు యత్నించిన 

 

విప్లవ యోగీశ్వరుడు అరవిందులు 

 

అన్నారు పుట్టపర్తివారు.


ఈ దివ్య జీవితం ఉనికిలోనికి వచ్చినప్పుడే వసుధైక 

 

కుటుంబం అవతరిస్తుంది అన్నారు 

 

మహాయోగిని మాతాజీ. 

 

నేడు అరవిందాశ్రమంలో అన్ని మతాలవారు 

 

అన్ని దేశాలవారు, 

 

విభిన్న భాషా సంస్కృతులకు చెందినవారు 

 

శాంతిసామరస్యాలతో నియమబద్ధంగా జీవిస్తున్నారు. 

 

వ్యక్తిఅవసరాలనుఆశ్రమమేచూచుకొంటున్నది. 

 

వసుధైక కుటుంబం అరవిందుల ఆశయం. 

 

అరవిందుల సంకల్పాన్ని 

 

సాకారం చేసిన శ్రీమాత 

 

తన 95వ ఏట 17 నవంబర్ 1973లో 

 

తమ పార్ధివ శరీరం వదలి 

 

పరలోకం ప్రవేశించారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోతిరుపతి, హైదరాబాద్ ప్రొద్దుటూరు, 

 

తెనాలి వంటి పట్టణాలలో 

 

అరవింద విద్యాలయాలు వెలిశాయి.

Share:

Andhraprabha

Last Updated Oct 07 2011, 21:42:03, IST


శివతాండవ స్పూర్తి పుట్టపర్తి

apr -   Mon, 28 Mar 2011, IST
లైఫ్
ఆధునిక మహాకావ్యంగా పండితులు ప్రశంసించే శివతాండవ కావ్యం ఒక సరికొత్త భావావిష్కరణకు శ్రీకారం. దాని సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. శివతాండవం చదివేవారిని శివాలెత్తిస్తుంది. చదువుతున్నంత సేపు గుక్క తిప్పుకోనీయదు. ఆ కావ్యంలో ఉండే లయ, నాద సౌందర్యం, పదాల పోహళింపు అటువంటివి. ఆ లయ, ఆ శయ్యా సౌభాగ్యం అనితరసాధ్యం.
ఆకాశమంతాను నేనైతే
అంతా చుక్కలే చెక్కుతానేమో
సెలయేరులంతా నేనైతే
అంతటా కన్నీరె చిలుకుతానేమో
ఈ లోకమంతాను నేనైతే
అంతటా నా ప్రేమ నింపుతానేమో
అని అనగల సత్తాగల మహాకవి పుట్టపర్తి. ఆబాల గోపాలంతో జేజేలు పలికించుకున్న పుట్టపర్తి నారాయణాచార్యులు 1915, మార్చి, 28వ తేదీన అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మీదేవి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. ఆయన ఇంటి పేరు తిరుమల వారు. కృష్ణదేవరాయల రాజ గురువు తిరమల తాతాచార్యుల వంశం ఆయనది. ఆ తర్వాత ఆయన వంశీయులు చిత్రావతీ తీరంలోని పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది. తిరుపతి సంస్కృ కళాశాలలో సంస్కృతం నేర్చు కున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం. చందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వెెసే వారు.
ఆయన మొదట పని చేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్య్రం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ మీనన్‌కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివి తీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్లు తిరువాన్కూర్‌లోనూ, కొన్నాళ్లు ఢిల్లిd లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీరామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్‌ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. హృషీకేశ్‌లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు ''సరస్వతీ పుత్ర'' బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువ దించారు. ''లీవ్స్‌ ఇన్‌ ది విండ్‌', దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన ''ది హీరో'' ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జె.పిట్‌ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ భార్య. ఆమె కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో బ్రౌనింగ్‌ పై రీసెర్చ్‌ చేసి డాక్టరేట్‌ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్‌ ఇన్‌ ది విండ్‌ కావ్యం చూసి హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
ఆయన చరిత్రను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ 'సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చుకున్నాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?'' అని అడిగారు. టీచరు నోరువెళ్ళబెడితే 'కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్లూ'' అని విడమరచి చెప్పి టీచరుకు జ్ఞానోదయం కలిగించారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ పుట్టపర్తి వారిని కవిగా కన్నా చారిత్రకుడిగా గౌరవిస్తానన్నారు. గుర్రం జాషువా ''పుట్టపర్తి నారాయణాచార్యు లకంటే గొప్ప వాడెవ్వడు?'' అని ప్రశ్నించాడు. పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని అయిన పెనుకొండ దీనావస్థను చూసి హృద యం ద్రవించి ''పెనుకొండలక్ష్మి''అనే గేయ కావ్యం రాశారు. ఆయన విద్వాన్‌ పరీక్షలు వ్రాసేటప్పుడు ఈ కావ్యమే పాఠ్యపుస్తకంగా రావడం విచిత్రం. ఇంకా గొప్ప చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం ''పెనుకొండ లక్ష్మి'' నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూ ఉండిపోవడంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. దాంతో ఆయన పాస్‌ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్లే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వ నాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించాడు. ఒకసారి విజయవాడలో పుట్టపర్తి తన ''శివ తాండవం'' గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపై కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్‌ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్న ప్పుడు ఉపన్యాసం ముగిశాక ప్రాకృత భాషలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్నవాళ్లు ''ఆ శివుడు ఆడితే చూడాలి. ఆచార్యులవారు పాడితే వినాలి అని భావించేవారు. ఆయన 140 పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్‌. ప్రదానం చేశాయి. ఆయన కడపలోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్‌గా పని చేసి 1990 సెప్టెంబర్‌ 1న స్వర్గస్థుల య్యారు.
-డాక్టర్‌ వంగల రామకృష్ణ