26 జూన్, 2015

యుధ్ధాలతో ఒరిగేదేమీ లేదు..

నేను పోస్ట్ చేసే విధిలో 
గూగుల్ నూ వెదికి కొంత సమాచారం తీసుకుంటాను
సామవేదం.. చాగంటి వంటి మహాత్ముల ప్రవచనాలు విని కొంత సంస్కారాన్ని పెంచుకుంటున్నాను..
 

పోతన్న రాయలసీమలో పుట్టినారని వ్రాసాను..
అది గూగుల్ నుంచీ తీసుకున్నదే..
 

శ్యామలీయం గారు
 ''కొంపముంచారు.. 
పోతన్న రాయలసీమలో పుట్టారంటే
తెలంగాణావాళ్ళతో విభేదం వస్తుందేమో నని .''

చ మత్కరించారు..

''యేమీ రాదులెండి.. 
 తెలంగాణా వాళ్ళు మాకు విరోధులేమీ కారు .. బంధువులే.. 
ఆ మాటకొస్తే ఆత్మ బంధువులు.. 
పోతన్న భాగవతమే భగవత్స్వరూపం .. 
'' భగవంతుడు .. భక్తుడు .. భాగవ తమూ ఒక్కటే వేరు కాదు ''
అన్న పుట్టపర్తి చివరి వాక్యాలు అర్థం కావడానికి 
ఎంతో ఔన్నత్యం కావాలి.. 

మాకు తెలంగాణా వారితో ప్రేమానుబంధాలే వున్నాయి మీ సంగతి చూసుకోండి అన్నగారూ..  
అంటూ ..

కవికి కులమతాలు లేవని జాషువా వంటి వారం టుంటే.. 
ప్రాంతీయతలు కూడానా.. 
అన్నారు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు చెంది
 పుట్టపర్తి పై రిసెర్చ్ చేసిన పద్మావతిగారు..''

మన విభేదాలు పోతన గారికి ఆపాదించడం ఎందుకులెండి వాళ్ళమానాన వాళ్ళని బ్రతకనిద్దాం.. 
నేను మా తండ్రి గారి విశేషాలు 
వారి అభిమానులకు అందించాలనే ఉద్దేశం తో 
బ్లాగు నడిపిస్తున్నానే తప్ప 
నేను పెద్ద జ్ఞాన వంతురాలిని కాదు.. 
కనీసం అలా చెప్పడం నటించటం కూడా రాదు 
నన్నిలా ఒదిలేయండి.. 

మనం 
పోతన్న తెలంగాణా వాడివన్నా పొంగిపోడు.. 
రాయలసీమ వాడివన్నా కుంగిపోడు.. 
అందుకే 
ఆయన భాగవతా న్ని పట్టుకుని ఎంతో మంది తరించిపోతున్నారు..
పుట్టపర్తి అనూరాధ. ''
అంటూ జవాబిచ్చాను .. 

తరువాత మనసంతా వికలమైంది. 
మొన్న పద్మావతి గారి సంభాషణ గుర్తుకొచ్చింది .. 
అది ఇదే .. 
ఆవిడ మాటల్లో నే ..

 '' ద్వానా శాస్త్రిగారు ఈ విషయాన్ని బాగా మేన్షన్ చేసారు   కవులందరినీ సంపుటిగా వేశారట ద్వానాశాస్త్రిగారు .. 
తన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పుట్టపర్తిని ఆహ్వానించారు ద్వానా శాస్త్రి గారు .. 
 సభలో పుస్తకం పరిశీలించారు పుట్టపర్తి 

ఆ పుస్తకం చూపించి సభాముఖంగానే..
 ఇందులో రాయలసీమ కవుల ప్రసక్తి ఎక్కడన్నా వుందా..
ఒక్కరిపేరైనా ప్రస్తావించారా .. 

మా రాయలసీమ కవుల పేర్లేమైనా వున్నాయా..
అని కోపంగా అడిగారు 
ద్వానా శాస్త్రి గారికీ కోపం వచ్చిం ది.. 

ఇద్దరినీ అనుసంధానం చేసారు జానుమద్ది .. 
ద్వానా శాస్త్రి గారింటికి వెళ్ళారు .. 
ద్వానా శాస్త్రిగారు .. బాగానే ఆదరించారు 

''నేను ఇట్లా   అన్నానంటే.. 

మీ కందరికీ కోపం రావచ్చు
కానీ నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది..

నా కవకాశం వచ్చింది కాబట్టి చెప్పాను..

ఇది తప్పు .. .  పధ్ధతి కాదు 
 అని అన్నారట..

అప్పుడు ద్వానా 
శాస్త్రి గారి మనసులొ ఒక బీజం పడింది.. 
ప్రాంతీయతత్త్వం ఉండకూడదు..అని..
రాయలసీమ .. తెలంగాణ ఇలా అందరు కవులనూ కలుపుకోవటం ప్రారంభించారు..
అందరినీ సమాన దృష్టి తో చూడటం..
ఆదరించటం చేశారట..
 

సాహిత్య చరిత్రలో కూడా 
ఆంధ్ర రాయలసీమ తెలంగాణా ప్రాంతాల కవులను గురించి రాశారట..
సమానదృష్టితో చూడటం అలవర్చు కున్నారు..
 

పొట్టిశ్రీరాముల యూనివర్శిటీనుంచీ అవార్డ్ వచ్చిన సందర్భంలో
 

 ద్వానా శాస్త్రి గారికి 
కవులందరి పట్ల సమాన దృష్టి ఉంది.. 
ప్రాంతీయత అనే దురలవాటు ఈనకు లేదు 
అందుకే ఈ అవార్డ్ వచ్చింది అని శివారెడ్డి గారు వేదికపైనుంచీ చెప్పారట..
 

అప్పుడు జవాబుగా 
నాకు ఇటువంటి దృష్టి పడటానికి బేస్ యేది .. 
పునాది యేది అంటే..
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు .. 

అని నాలో ఈ బీజం పడటానికి 
ఇదిగో ఈ సన్నివేశం అని చెప్పారట..
 

తరువాత 
ఉస్మానియా యూనివర్సిటీ లో 
పుట్టపర్తి ఉపన్యాసాల ద్వారా నేను స్పూర్తిని పొందాను..
ఇటువంటి దృష్టి నాకు 

నారాయణాచార్యుల వారి వల్లే పడింది..
అని చెప్పారట..
 

పద్మావతి గారు 
పుట్టపర్తి శ్రీనివాస ప్రబంధం పై రిసెర్చ్ చేస్తున్నారు..
ఆక్రమంలో రాళ్ళబండిగారినీ  ద్వానా శాస్త్రి గారినీ.. 

ఇలా ఎందరితో నో  ఇంటర్వ్యూ నిర్వహించి 
దాన్ని రికార్డ్ కూడా చేశారు..
ఆవిడ సబ్మిషన్ అదీ అయ్యాక 

అన్నీ మీకు అందజేస్తానని చెప్పారు..
ఈ సంఘటనను పెడదామని ఆలోచనలో వుండగానే..
శ్యామలీయం గారి ద్వారా దీన్ని చెప్పాల్సి వచ్చింది..
 

నేను పుట్టపర్తి కూతురిగా 
వీనిని వెలుగులోకి తెస్తున్నానే కానీ..
నాకు యేమీ జ్ఞానం లేదు..
నేనొక మూఢురాలిని అని గుర్తించి..
నా అజ్ఞానాన్ని మా తండ్రి గారిని చూసి క్షమించమని ప్రార్థన..


యే ప్రాంతం వారైనా..
పుట్టపర్తి ప్రబంధ నాయికలు ఉపన్యాసాలు యూనివర్శిటీలో ప్రత్యక్షంగా విన్న అదృష్టవంతులలో నేనూ ఒకడిని అన్న ద్వానా శాస్త్రి గారికి వినయంగా ప్రణమిల్లుతూ..
పుట్టపర్తి అనూరాధ.