25 మార్చి, 2015

పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక సభావేదికమీద 
తన పక్కనే కూర్చొన్న కథా రచయితతో 
”ఏమప్పా! ఇన్నాళ్లుగా కథలు రాస్తున్నావుగదా? 
ఎంత సంపాదించావు?” అని ప్రశ్నిస్తే 
దానికి ఆ కథా రచయిత 
”పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం” 
అన్న సమాధానం ఇచ్చినట్లు చదువుతుంటాం. 

ఆ కథా రచయతని ”చిత్తూరు అయ్యవారు” అని కూడా అంటారు. ఎవరాయన

 సమాధానం మధురాంతకం రాజారాం
?http://piratla.blog.com/

రస నిష్ఠ

http://patrika.kinige.com/?p=3758


కనక ప్రసద్ గారికి క్షమాపణలతో తమరి వాక్యాలు ఉపయోగించుకున్నందుకు
మా అయ్య మీకర్థమైనంతగా మాకెప్పుడు అర్థమౌతారో అన్న దిగులుతో..
 http://patrika.kinige.com/?p=3758

24 మార్చి, 2015

He was a legend..


రాళ్ళ సీమ లో ఏముంది

1955 లో రాజమండ్రిలో  
మహాకవి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారి దర్శనం కోసం 
వారి ఇంటికి వెళ్ళారు పుట్టపర్తి
శాస్త్రి గారి శిష్యులు కొందరు.. 

రాయల సీమ రాళ్ళ సీమ అని
సంస్కృతి మృగ్యమని కించపరుస్తూ మాట్లాడారు..
 

శ్రీపాద వారు 
అబ్బాయ్ కవిత్వమేమైనా వ్రాశావా.. అన్నారు.
అంతటితో వినయానికి స్వస్తి చెప్పి
మహోధ్ధతితో క్రింది చాటువు చెప్పారు

"హేరాళం బిదె నాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారినిన్
జూచితిలెమ్ము.. చెప్పకుము
గొప్పల్.. విప్పుగా గౌతమీ
ధారావర్ధిత గోస్తనీ రస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్యంబుల ముందు తావక
పయః పానంబు శోభించునా.."


అంటూ ఆశుకవితను వినిపించిన తర్వాత
సంస్కృతంలో మరో రెండు శ్లోకాలు ఆశువుగా చెప్పారు
శ్రీపాద వారి శిష్యులు విస్తు పోయారు
శ్రీపాద కృష్ణమూర్తిగారు జరిగిన దానికి 

విచారం వ్యక్తం చేసి
అత్యంతానందంతో సత్కరించారు పుట్టపర్తి వారిని..

9 మార్చి, 2015

వడిబాయక తిరిగే ప్రాణబంధుడా..





అది 1982 కావచ్చు..
మా అమ్మ మంచం లో వుంది..
కాన్సర్ తీవ్రంగా వుంది..
అదీ బ్రెయిన్ కాన్సర్ 

అప్పట్లో కాన్సర్ కు మందు లేదు..

కాళ్ళూ చేతులూ పడిపోయాయి
మాట పడిపోయింది..
ఇంట్లో అందరికీ దిగులు బాధ
యేం చేయాలో తెలియదు..
 

ఒక పక్క 
మా అయ్య తెల్లవారి మూడుకు లేచి రాఘవేంద్ర స్తోత్రం 108 సార్లు పారాయణ చేస్తున్నారు..
ఎందరో సాధువులు జ్యోతిష్కులు అపుడపుడూ వచ్చి విచారిస్తున్నారు
శిష్యులు భక్తులూ.. ఆవేదన చెందుతున్నారు..
కానీ
ఎవరూ యేమీ చెయ్యలేని స్థితి..
 

ఎందరికో అన్నం కలిపి ముద్దలు పెట్టిన చేయి
మొన్న మా అన్నయ్య దగ్గరికి పోతే చెప్తున్నాడు
తన చిన్నప్పుడే మా ఇంటికి వచ్చాడు
నేను అయ్య గారింట్లో నే వుంటాను అని మొండి చేసేవాడట ..
 

జన్మతః వైశ్యుడు..
పేరు సుబ్రమణ్యం..
కానీ పెరిగిందంతా మా ఇంట్లోనే..
పోనీలే అయ్య గారింట్లో వుంటే బాగుపడతాడు అనుకుని వాళ్ళ నాయన
మా అయ్యకు కొంత డబ్బివ్వ బోయాడట..
 

వుండనీలే  డబ్బు గిబ్బు యేమీ వద్దు
వీణ్ణి ఇక్కడే వుండనీ
ఈ సన్న పిల్ల వాడు మాకు బరువా .. 

అందరితో వాడు..
అని పంపేశారట..
 

అలా మా ఇంటికి వచ్చిన వాడు
అప్పటికి ముగ్గురు పిల్లలు నికరమైన వుద్యోగం లేదు..
మా అమ్మకు పధ్నాలుగేళ్ళ వయసు
సుబ్రమణ్యం అన్నయ్యకు తొమ్మిదేళ్ళు
పధ్నాలుగేళ్ళకే తన పిల్లలతో పాటు సుబ్రమణ్యానికీ నోట్లో అన్నం ముద్దలు పెట్టేదట మా అమ్మ.
తనకంటే పెద్ద వాళ్ళకూ మా అమ్మ అమ్మే..

ఆ పరిస్తితుల్లో ఒక ఉపాసకుడు  వ చ్చాడు
నేను అమ్మగారి కోసం ప్రయత్నం  చేస్తానని
నేనప్పుడు పదహారేళ్ళదాన్ని
ఆయన పేరు యేదో మరిచిపోయాను
ఆయన మా ఇంట్లోనే వున్నాడు


 సూర్యోదయాత్పూర్వమే మిద్దిమీదికి వెళ్ళే వాడు
ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని..
ఎవ్వరినీ పైకి రావద్దని చెప్పేవాడు
బయటినుంచీ గొళ్ళెం పెట్టుకోమనే వాడు
 

సరే..
ఒక రోజు ఆయన యేం చేస్తున్నాడో చూద్దామని
నేను మెల్లిగా గొళ్ళెం తీసుకుని పిల్లిలా పైకి వెళ్ళాను
పై మిద్దె కాక ఆపై మిద్దెపై ఆయన వున్నాడు
ఆ పైకీ వెళ్ళాను నిశ్శబ్దంగా..
తీరా చూశాను కదా..
 

ఆయన ఒంటికాలుపై నిలబడి
పదకొండు గంటల వేళ చండ ప్రచండంగా ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి తదేకంగా చూస్తున్నాడు
అంతటి సూర్యుణ్ణి చూస్తున్నా ఆయన కళ్ళు నీరు కారడం లేదు
ఒక నిమిషం కాదు
పదినిమిషాలు కాదు
గంట కాదు..
పొద్దున్నించీ సాయంత్రం సూర్యుడస్తమించే వరకూ అలానే..

నేను ఒక సారి కాదు
నాలగైదు సార్లు అలానే  వెళ్ళి గమనించాను
కాసేపు మెట్లపై అలానే కూచుని
మళ్ళీ వచ్చేసేదాన్ని

మళ్ళీ మధ్యలో గుర్తొస్తే మళ్ళీ వెళ్ళేదాన్ని
కానీ ఆయన నన్ను గమనించనే లేదు
కారణం ఆయన దృష్టి సూర్యునిపైనే..

అబ్బ యీయన ఎట్లా సూర్యుణ్ణి చూడగలుగు తున్నాడు
అనుకున్నాను..
అంతసేపు సూర్యుణ్ణి ఎవరు చూడగలరు..
ఆ తీర్థాన్ని అమ్మకు తాగించే వాడు


అలా చూడ టం తప్పు అని ఇప్పుడనిపిస్తుంది
కానీ వెళ్ళిందానివలన ఒక గొప్ప దృశ్యం నా జీవితంలో గుర్తుండిపోయింది..


కానీ విధి బలీయం
అమ్మ వెళ్ళిపోయింది..

టీవీలలో దేవుడు లేడు వుంటే చూపించండి
మహిమలు లేవు సాధువులు స్వాములు అందరూ మోసగాళ్ళు
అని అప్పుడప్పుడూ మాట్లాడుతూ వుంటారు..

కానీ ప్రయత్నిస్తే కదా దేవుడున్నాడా లేదా తెలిసేది..
యే ప్రయత్నమూ లేకుండా
అవాకులూ చవాకులూ మాట్లాడే వాళ్ళని యేమనగలం..

పైన చెప్పినటువంటి సాధకులు
మన దేశంలో ఎందరో వున్నారు..
వాళ్ళు వాళ్ళ సాధనలో వాళ్ళు వున్నారు..
వాళ్ళకు మనతో పని లేదు..
మనకూ వాళ్ళతో పనిలేదు 



వాళ్ళు టీవీ లకు వచ్చి 
నేను సూర్యుణ్ణి కన్నార్పకుండా చూడటమ్ 
అనే సాధన చేశాను 
అని చెప్పరు. 
కారణం .. 
వారికి పబ్లిసిటీ అవసరం లేదు 
పేరుపై మోజు లేదు.. 

అసలు మన మధ్య తిరగాలనే ఇచ్ఛ లేనే లేదు.. 
వారి రహస్యం  తెలుసు కోవాలంటే 
వారి దయను చూ రగొ నాలి
సేవ చేయాలి 
పరి ప్రశ్న తోనే 
వారు శిష్యరికం ఇస్తారు..

ఒకసారి వారి దయాదృ ష్టి పడిందా 
అనుగ్రహానికి అవధులుండవు 

సౌందర్య లహరి చేసి బాగుపడిన వాళ్ళను 
ఎందరినో చూసాను
సుందరకాండ చేసి 

మా పిన్నయ్య తన కొడుక్కు ఉద్యోగం తెచ్చుకున్నాడు
దీనికి సాక్ష్యం యేముందీ..
విశ్వాసం అంతే..

8 మార్చి, 2015

కళా తపస్వి కి అర్థం చెప్పిన సరస్వతీ పుత్ర



ఒకసారి పుట్టపర్తి పై అభిప్రాయం కోసం విశ్వనాధ గారి కై ప్రయత్నించాను.. కానీ కుదరలేదు..
తర్వాత ఒకరోజు పొద్దున టీ వీ లో పుట్టపర్తి ని సందర్భానుసారంగా వివరించిన విశ్వనాధ కనిపించాడు..
ఇంక వేరే అభిప్రాయ సేకరణ ఎందుకు .. 

అనిపించింది..
నిజమే కదూ..