31 జులై, 2012

ప్రాకృత కవిత




పూర్వం 
భారత దేశంలో చదువుకున్నవారు 
సంస్కృత బాషలో, 
చదువురానివారు 
ప్రాకృత బాషలలో మాట్లాడేవారు. 
చదువుకున్నవారు కూడా కొన్ని సార్లు 
ప్రాకృత బాషలలో మాట్లాడేవారు. 
కొన్ని గ్రంథాలు ప్రాకృత బాషలలో వ్రాసారు. 

ప్రాచీన ప్రాకృత బాషలలో ముఖ్యమైనది 
'పాళీ బాష. 
స్థవీరవాది బౌద్ధులు, 
హీనయాన బౌద్ధులు 
ఈ బాషని పవిత్ర బాషగా భావిస్తారు. 

జైన మతానికి చెందిన కొన్ని గ్రంథాలని 
అర్థ-మాగధి అనే ప్రాకృత బాషలో 
రచించడం జరిగింది. 

మతంతో సంబంధం లేని 
కొన్ని గ్రంథాలని కూడా 
ప్రాకృత బాషలలో రచించడం జరిగింది. 
అందులో హాలుడు రచించిన 
'గాథాసప్తశతీ ఒకటి. 

ప్రాకృత బాషలలో కథలు, 
పౌరాణిక కావ్యాలు కూడా ఉండేవి. 
వీటిలో 
'పైశాచీ' మాండలికంలో వ్రాసిన 
గుణాఢ్యుని 'బృహత్కథా, 
ప్రవరసేనుని 'సేథుబంధం' ముఖ్యమైనవి. 

అప్పట్లో 'అపభ్రంశం' 
అనే ప్రాకృత బాషలో కూడా సాహిత్యం ఉండేది. 
ప్రాకృత బాషలు ఎన్ని ఉన్నా 
సంస్కృత బాష ప్రధాన 
సాహిత్య బాషగా ఉండేది.


ఈ ప్రాకృత వ్యాసాలను అక్కయ్య 
నాగపద్మిని ముద్రించింది.
ఇందులో ..
 
ప్రాకృత కవిత
సేతుబంధము
సావయధమ్మదుహా
జసహర చరివు
కొన్ని సప్త శతులు
సంస్కృత నాటకాలలోని ప్రాకృతం
 
 అన్న వ్యాసాలున్నాయి
మొదటిదైన ప్రాకృత కవితను
మనమిప్పుడు  చూద్దాం..

ఇందులోని..
"జహరసియ సింగాయి ..ఉధ్ధరియ కందాయి.. "
అని అయ్య తాళం వేస్తూ ఊగిపోతూ చిరునవ్వుతో చెప్పడం ఎంత తీపి గుర్తో..
అది ఊరిదేవతల జాతరలలో పోతరాజును వర్ణనార్భాటము.















జాడతెలియని నిధి -పుట్టపర్తి అనూరాధ






ఎవరంటారు జన్మ చేత 
సంస్కారాలు నిర్ణయింపబడతాయని..
ఇదిగో ఇది చూడండి

పుట్టపర్తి వారి చిన్నతనంలో 
నేసేరాముడుండేవాడు
అతని వృత్తి మగ్గం నేయటం
ప్రవృత్తి మహోన్నతం
ప్రబంధాలు అన్నీ నాలుకపైనే
 

ఉత్తర రామాయణమంటే ప్రాణం
రాత్రికి బాగా తాగి మత్తులో జోగుతున్న్నా
అతని నాలుకపై రాముడు నాట్యం చేసేవాడు..
ఎన్నో పద్యాలు .. శ్లోకాలు ..
 

పుట్టపర్తి వారు అప్పటికి చిన్న పిల్లాడు..
అతని దగ్గర కూచుని 
ఎన్నో తెలియని విషయాలు 
అడిగి తెలుసుకొనేవాడు.
 

ఇలా 
ఆ ధార పుట్టపర్తి వారి చిన్నతనాన్ని 
ముచ్చటగా స్పృశించింది..
 

"లత" మాస పత్రిక..
గుంటూరు మోహన వంశి లతగారి 

సంపాదకత్వంలో  వచ్చేది.
అర్ధాంతరంగా ఆగిపోయింది.
 

అందులో ..
పుట్టపర్తి వారు 
జీవితం అనుభవాలు శీర్షికన 
ఎన్నో విషయాలు వ్రాసేవారు.
 

వారి కలం వెంట వారి జీవితం 
ఎంతో రమణీయంగా  వ్యాఖ్యానింపబడేది.
 

కొన్ని మాసాలు ధారావాహికంగా సాగిన 
ఆ జ్ఞాపకాల తలపోత ..
అకస్మాత్తుగా ఆగిపోయింది.
అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు.
 

వచ్చిన ఆ సంచికలన్నీ 
తన పొత్తిళ్ళలో జాగ్రత్తగా దాచుకున్న 
శ్రీశైలం గారు..
పుట్టపర్తి వారు చెప్పిన మీదట
పుట్టపర్తి వారిపై Phd చేస్తానని వచ్చిన
 
సోమలింగా రె డ్డి  నే ధూర్తునికి
ఆ లత మాస పత్రికలు  ఇచ్చారు .
 

 ఎంతో అయిష్టంగా..
కన్నబిడ్డను అప్పజెపుతున్నట్లు 
తాను జాగ్రత్తగా దాచుకున్న ఆ ప్రతులను
అతనికి అప్పజెప్పారు శ్రీశైలం.
 
కానీ అతను..
అయ్య పై రిసెర్చ్ ఏమో కానీ 
ఆప్రతులను పోగొట్టాడు.
ఆరోజులలో జిరాక్స్ సౌకర్యం లేని కారణాన 
ఇంకో ప్రతి కూడా లేని పరిస్తితి ఏర్పడింది.
 

నేను ఇచ్చేసాననీ ఒకసారి ..
పోస్టులో పంపానని మరోసారి..
నోటికి వచ్చిన మాటలు చెబుతూ 
బుకాయించాడు సోమలింగా  రె డ్డి .
 

చేసే విషయంపై శ్రధ్ధ లేని వారు.
ఏదో వృత్తిలో ఉన్నతి కోసం 
Phd  మొక్కుబడిగా చేసే వాని చేతికి 
ఆప్రతులు వెళ్ళడం
మన దురదృష్టం.
 

అక్కిరాజు రమాపతి రాజు గారు
తెలుగు జాతి దురదృష్టం 
ఆ ప్రతులను కోల్పోవటం అన్నారు ఆవేదనగా..
 

ఇది జరిగి ఎన్నో ఏళ్ళయినా 
శ్రీశైలం గారి కన్నుల్లో సన్నని తడి .. 
సోమలింగా  రె డ్డి  అబధ్ధం చెప్పాడు 
అనే ఆయన వగపు వెనుక 
తెలియని ఏదో బాధ్యత ఆయన్ను కలచివేస్తుందని
ఆయనతో కాసేపు మాట్లాడితే 
వెంటనే మనకు అర్థమౌతుంది.
 
చివరకు ..
సోమలింగారె డ్డి  
చరిత్ర హీనుడి గా మిగిలిపోయాడు.
 

ఎవరైనా ..
అప్పటి లత మాసపత్రికలు దాచినవారు..
ఆ అమూల్యనిధిని మాకు అందజేస్తే..
వారికి జీవితాంతం ఋణపడి వుంటామని
పత్రికాముఖంగా..
కాదు..కాదు ..
 బ్లాగ్ముఖంగా ..
 తెలియజేస్తున్నాను..


నా ID anu_radha373@yahoo.com