9 ఏప్రి, 2012

పుట్టపర్తినారాయణాచార్యులు జనప్రియ రామాయణ రచన జనప్రియం 2--పుట్టపర్తి అనూరాధ

వల్లంపాటి గారు మా అయ్యపై ..
నా స్మృతి మంటపంలో పుట్టపర్తి ఎంత బాగా వ్రాసారు.
మేము చూసిన మా అయ్యను ఎంత బాగా అర్థం చేసుకున్నారు
మేము చూసినదాన్ని ఆయన నోట వింటున్నట్లుంది.
మేము అనుభవించినదాన్ని..ఆయన మా మనసుల్లోంచీ వెలికి తీసినట్లుంది.




సంవత్సరం జ్ఞాపకం లేదు కానీ, 
నంద్యాలలో జరిగిన రైతుమహాసభలో కూడా
వారు ఉపన్యసించారు. 
ఆ ఉపన్యాసాన్నివిన్నవారు కూడా 
ముగ్ధులైపోయారు. 
దురదృష్టవశాత్తు
ఈ రెండు ఉపన్యాసాలను గురించీ 
పెద్దలు చెప్పగా వినటమేకానీ, 
నేరుగా వినే అదృష్టం నాకు లేకుండా పోయింది.
సంస్కృతం – ఇంగ్లీషు, 
ప్రాచీనం – ఆధునికం, ఆధ్యాత్మికం –
సామాజికం, సమాజం – వ్యక్తి 
ఇలా అనేక ద్వంద్వాల విషయంలో
పుట్టపర్తి వారిలో 
నాకు తెలిసినప్పటినుంచీ ఊగిసలాట ఉండేది.


ఈ ఊగిసలాటను 
ప్రాచీన మార్గీయులు అవకాశవాదంగానూ..,
నవీనులు అశక్తతగానూ భావించేవారు..
 కానీ ఇరువురూవారిని ..
స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు.
తమను తాము ..
వీరిద్దరూ కూడా ప్రమాణాలుగా భావించేవారు.


తమకంటే కాస్త ఎక్కువగా మారటం చేత ..
ప్రాచీనులూ,
తమంతగా మారకపోవటం చేత నవీనులూ..
వారిని..
నిరాదరంగా చూసేవారు..

మారటానిక్కానీ, మారలేకపోవటానిక్కానీ 
వారు అనుభవించిన వేదనను 
ఇద్దరూ గుర్తించేవారు కాదు.

చెప్పవచ్చేదేమిటంటే..
 పుట్టపర్తి వారు తన్ను తాను మార్చుకోవటానికి
శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. 
కానీ మారలేకపోయారు.
“ఇందులో వారు సాధించిందేమిటి? 
చివరకు రామాయణం వద్దకేవచ్చారు కదా?” 
అని కొందరు ప్రశ్నిస్తుంటారు. 

అది వారి రామాయణాన్ని
చదవకుండా అనే మాట.  
వారు తాను రామాయణాన్ని భక్తి కోసంరాశానని అన్నా, వారు దాన్ని కవిత్వం కోసం రాశారని నా నమ్మకం.

 తెలుగులో ఉన్న ఇతర రామాయణాలకూ, 
పుట్టపర్తి వారి“జనప్రియ రామాయణం” కూ
 ఉన్న తేడా మౌలికంగా కవిత్వంలోనే..
ఉందన్నది నా నిశ్చితమైన నమ్మకం. 
వాల్మీకికి దగ్గరగా ఉన్న రామాయణం 
పుట్టపర్తి వారిది మాత్రమే!
ఇరవయ్యవ శతాబ్దపు కవుల్లో ..
పుట్టపర్తివారిని సుదూరంగా పోలిన
పండితుడు కూడా లేడన్నది 

నా దృఢవిశ్వాసం..

అసలు వారు 
రామాయణాన్ని రాయటమే భక్తి కోసం.
మతవ్యవస్థలని సమర్థించటం కోసమో, 
ఖండించడంకోసమో 
తాను రామాయణాన్ని రాయటం లేదని చెబుతుండేవారు.


రామకథ కవియన్న వానికెల్లను సేద్యమైనదని అవతారికలోచెప్పారు.
తాను రామాయణంలో చేసిన మార్పుల్ని గురించి
 కూడా అప్పుడప్పుడూ ప్రస్తావిస్తుండేవారు.
 వారి రామాయణంలో కైక
దుర్మార్గురాలు కాదు.
దశరథుడు బహుపత్నీకుడూ,స్త్రీలోలుడూ అయిపోయాడు.
అతనితోరఘువంశం యొక్క కీర్తిప్రతిష్టలు, ధర్మనిష్టాపతనం కావటం ప్రారంభించాయి. 
రావణుని వంటి వారు అతని రాజ్యం మీద
అక్రమాలు చేస్తున్నా వారిని నిరోధించే శక్తిని
 దశరథుడు కోల్పోయాడు.


దశరథునిలో లేని గొప్ప గుణాలు
 కైకకు రామునిలో కనిపించాయి.
 లోకకల్యాణం కోసం, 
ధర్మరక్షణ కోసం తాను చెడ్డపేరును
 కోరి తెచ్చుకొని కైక రాముణ్ణి అడవులకు పంపింది. 
ఇదీ కైకకు
పుట్టపర్తివారి వ్యాఖ్యానం. 
“వాల్మీకి కథను మార్పు చేయటాని
కి నీకేం అధికారం ఉంది?” 
అని ఎవరైనా అడిగితే 
“రామకథను
 కావ్యాలుగా, నాటకాలుగా రాసిన వాళ్ళల్లో
 మార్పు చేయనివాణ్ణి
ఒకణ్ణి చూపించు” 
అనేవారు.
అంగదుని పాత్రను హామ్లెట్ ను ఆదర్శంగా
తీసుకుని తీర్చిదిద్దారు. 
అంగదుడు వాలి కొడుకు. 
అతని తల్లి తార
వాలిని చంపిన సుగ్రీవుణ్ణి పెళ్ళాడింది. 
తండ్రిని చంపినవాడి కొలువులో
అంగదుడు క్లాడియస్ కొలువులో హామ్లెట్ లాగా – ఆత్మను
చంపుకుంటూ జీవించవలసి వస్తుంది.  


“రామాయణం మీద
షేక్స్పియర్ ప్రభావమేమిటి?”
 అని ఎవరైనా ప్రశ్నిస్తే పుట్టపర్తి
వారు ఇలా సమాధానం చెప్పేవారు.
అంగదుని పాత్రను హామ్లెట్ ను ఆదర్శంగా
తీసుకుని తీర్చిదిద్దారు. 
అంగదుడు వాలి కొడుకు. 
అతని తల్లి తార
వాలిని చంపిన సుగ్రీవుణ్ణి పెళ్ళాడింది. 
తండ్రిని చంపినవాడి కొలువులో
అంగదుడు క్లాడియస్ కొలువులో హామ్లెట్ లాగా – ఆత్మను
చంపుకుంటూ జీవించవలసి వస్తుంది.  


“రామాయణం మీద
షేక్స్పియర్ ప్రభావమేమిటి?”
 అని ఎవరైనా ప్రశ్నిస్తే పుట్టపర్తి
వారు ఇలా సమాధానం చెప్పేవారు.

“ఏ రచయిత ఏం రాసినా ప్రాథమికంగా 
మానవ ప్రవర్తనను గురించే రాస్తాడు.


మానవ ప్రవర్తనలోని లోతులు 
వ్యాసునికి, షేక్స్పియర్ కూతెలిసినంతగా
ఎవరికీ తెలియవు. 
ఆ దృష్టితో చూసినప్పుడే
నాకు అంగదుడిలో హామ్లెట్ కనిపించాడు. 
షేక్స్పియర్ ను చదివినవాడి రాతకూ 
చదవనివాడి రాతకూ తేడా ఉంటుందని నా నమ్మకం”
 అనేవారు.
ఒకసారి నేనూ, పుట్టపర్తి వారూ కలిసి
 మదనపల్లెకు సమీపంలో
ఉన్న కలిచర్ల అన్న గ్రామానికి వెళ్ళాం. 
అక్కడ ఏడాదికోసారి చాలా
పెద్ద పరష (పశువుల సంత) జరుగుతుంది. 
అప్పుడు అక్కడ
తెలుగు పండితుడిగా పనిచేస్తున్న కథారచయిత వేణు, ఒక కవి గోష్ఠి ఏర్పాటు చేశాడు. 
అంటే పశువుల్ని కొనటానికో, అమ్మటానికో
వచ్చిన రైతులకు కవిత్వం చదివి చెప్పటమన్నమాట.


ఆ సందర్భంలోనే
 మరో వినోదాన్ని కూడా ఏర్పాటు చేశారు.
పరష జరిగేది ఒక పెద్ద తాటితోపులో. 
ఆ తోపులో ఉన్న
 ఏ చెట్టును చూపిస్తే దాన్ని 
ఒక వ్యక్తి తన చేతుల్తో ఊగించికూలదోసేస్తాడు. 
ఈ సంగతి తెలియానే పుట్టపర్తి వారు
చిన్నపిల్లాడిలా సంబరపడిపోవటం ప్రారంభించారు.

“ఒరే సుబ్బయ్యా, 
త్వరగా తయారుగా. మనం దగ్గరగా నిలబడి
 వాడి బలప్రదర్శన చూడవలె..
 నిజంగా అది సాధ్యమారా..?
ఇంకా అట్లాంటి బలవంతులు ఉన్నారంటావారా?” 
అంటూ మాట్లాడుతూనే ఉన్నారు.

అందరికంటే ముందుగానే ఆ తాటితోపు చేరుకున్నాం. ఎద్దుల మధ్య తిరుగుతూ..
 వారు ప్రతి చెట్టునూ పరిశీలించటం ప్రారంభించారు.
అలా కూలదోయటం కష్టం కావాలంటే..
 తాటి చెట్టు ఎత్తుగా ఉండాలా..?,
 లావుగా ఉండాలా..?
 అని ఆలోచించటం ప్రారంభించారు.
ఈలోగా ..
గుబురుగా ఉన్న తాటి చెట్ల వద్ద జనం చేరారు.
ఆ పరష జరిపిస్తున్న 
కలిచెర్ల నరసింహారెడ్డి గారు కూడా 
అక్కడికొచ్చారు.
పడదోసే తాటిచెట్టును వెదికే కార్యక్రమం ప్రారంభమైంది. అనుభవంఉన్న ముగ్గురు రైతులు ..
దాదాపు యాభై అరవై చెట్లను నిశితంగా
పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేశారు. 
ఆ చెట్టు బాగా బలంగా ఉంది.
వేళ్ళు భూమి లోపలికే ఉన్నాయి.
 ఎత్తు దాదాపు ఇరవై అడుగులుండవచ్చు.


తరువాత అక్కడి వాళ్ళు చెప్పారు.. 
చెట్టు ఎత్తు ఎక్కువ ఉండకూడదట,
అది బలంగా కౌగిలించుకోవటానికి 
వీలు లేనంత బలంగా ఉండాలట,
దాని వేళ్ళు భూమి పైన కాక, 
భూమి లోపల ఉండాలట, 
అందరూ
ఆ చెట్టు వైపుకు నడిచారు, 
పరిశీలించారు.
పుట్టపర్తివారుచిన్నపిల్లాడిలాగా దాని చుట్టూ తిరిగి చూశారు.
“ఒరే, వాడు నిజంగా దాన్ని తోసేస్తాడంటావా?”
 అని అడిగారు.
“చూద్దాం” అన్నాను.
ఇంతలో అసలు వ్యక్తి బయటికొచ్చాడు.
ఇప్పుడతని పేరు జ్ఞాపకం రావటం లేదు.
అతడు సాధారణంగా ఉన్నాడు.
పాంటు,షర్టు వేసుకున్నాడు.
అతడు ఆ ప్రాంతం వాడేనట.
బెంగళూరుహెచ్,ఏ,ఎల్ లో ఉద్యోగం చేస్తున్నాడట.

అతడు ముందుకొచ్చి చొక్కా, పాంటు విప్పి 
పక్కనున్నపొదమీద పారేశాడు.
లంగోటీలో నిలబడ్డ అతడు బలంగా ఉన్నాడే కానీ తాటిచెట్లను పెకలించేవాడిలాగా లేడు. 
పుట్టపర్తి వారు ఆసక్తిగా, అపనమ్మకంగా 
అతని వైపు చూస్తున్నారు.
అతడు పది బస్కీలూ,దండాలూ తీశాడు.
రెడ్డిగారికి నమస్కరించాడు.
తాటిచెట్టు వద్దకు వెళ్ళి దాని మొదలు తాకి 
మూడుసార్లు దండం పెట్టుకున్నాడు.


దాన్ని కౌగిలించుకుని కదిలించడం ప్రారంభించాడు.
పుట్టపర్తివారు ఆసక్తిగా..
దగ్గరకి వెళ్ళి నిలబడ్డారు.
మొదట చెట్టులో కదలిక కూడా లేదు. 
అరగంట తరువాత
తాటిమట్టలు గలగలలాడటం ప్రారంభించాయి.
మరో అరగంట తరువాత 
చెట్టు ఊగటం ప్రారంభించింది.
ఒకటొకటిగా చెట్టువేళ్ళు
పటపటమని తెగటం ప్రారంభించాయి. 
మరో గంటలో ఆ చెట్టుకూలిపోయింది. 
పుట్టపర్తివారు గొప్ప ఆరాధనతో 
ఆ వస్తాదునుచూస్తున్నారు. 
అతడు రెడ్డిగారి ముందుకొచ్చి నిలబడ్డాడు.
అతని వక్షస్థలమంతా గీక్కుపోయింది.
దండల మీద అక్కడక్కడా చిన్నచిన్న రక్తం చారికలు కనబడుతున్నాయి.


రెడ్డి గారు ఉద్రేకం పొంగుతున్న ముఖంతో
 అతనికి డబ్బూ,కొత్తబట్టలూ ఇచ్చారు.
వాటిని అందుకుని, రెడ్డిగారికి వినయంగా
నమస్కారం చేసి, 
మళ్ళీ కూలిపోయిన తాటిచెట్టు వద్దకు వెళ్ళి
దాన్ని మూడుసార్లు కళ్ళకద్దుకుని  నిలబడ్డాడు అతడు.


జనం అతణ్ణి వదిలేసి 
కూలిపోయిన తాటిచెట్టు చుట్టూరా చేరారు.
ఆ రోజు రాత్రి మదనపల్లి చేరుకున్నాం.
పుట్టపర్తివారు ఆ సంఘటనను
 గురించి ఆశ్చర్యంతో చెబుతూనే ఉన్నారు.
“ఒరే సుబ్బయ్యా, కవిగా నాలో ఒక గొప్ప బలహీనత ఉందిరా”
అన్నారు అకస్మాత్తుగా.
నేను నిశ్శబ్దంగా ఉన్నాను.
“నేను శృంగారాన్నీ,భక్తినీ,కరుణనూ అద్భుతంగా రాయగలనని నా నమ్మకం.
అందులో ఇప్పుడు రాస్తున్న తెలుగు కవులెవరూ
 నాదరిదాపులక్కూడా రాలేరు.
కానీ వీరరసం వద్దకు వచ్చేసరికి చతికిలపడిపోతాను.


ఇప్పుడు “జనప్రియ రామాయణం” లో 
సుందరకాండ రాస్తున్నాను కదా.
యుద్ధకాండ వస్తున్నదంటేనే భయంగా ఉంది.
దాన్నిరాయలేనేమోనన్న భయం 
లోపల్లోపల పీకుతూ ఉంటుంది. 
భుజబలం మీద పూర్తిగా నాకు విశ్వాసం లేదు.
అందుకే వాడెవడో తాటిచెట్టును
పడదోస్తానంటే నమ్మలేకపోయినాను.


ఇప్పటికీ వాడుచేసిన పని కళ్ళారా చూసినా
 నమ్మబుద్ధి కావటం లేదు.
వీరరసానికీ, నా తత్వానికీ పడదురా” 
అన్నారు.
నిజమే ..
వారు యుద్ధకాండ వద్దకే రాలేదు.
యుద్ధకాండ రాయకుండానే వెళ్ళిపోయారు…..

            జనప్రియ రామాయణ రచన జనప్రియం
డా. నారాయణం రామమూర్తి ఢిల్లీ..


రామకథను దేశభాషలలో ..
యెవరి అనుభూతి మేరకు వారు ..
అత్యద్భుతంగా రచించారు ..
మహాకవులెందరెందరో ..
ప్రపంచంలోని ఇతర భాషలలో కూడ ..
రామాయణ రచనలు చేసారు. 
రామగాధ దేశకాలాలకు అతీతంగా వుండి..
అందరినీ ఆకర్షించింది.. 
తెలుగు భాషలో ఎందరో మహానుభావులు
రామకథను అనేక ప్రక్రియలలో రచించారు.


త్యాగరాజస్వామి వారు..
రామకథను గేయ రూపంలో రచించి ..
స్వయంగా తానే వానిని..
మృదుమధుర రాగాలలో గానం చేసారు.

గోన బుధ్ధారెడ్డి ..
రంగనాధ రామాయణాన్ని ద్విపదలో రచించారు
అదొక విశిష్ట రచన..
కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు రచించిన
శ్రీ మద్రామాయణ కల్ప వృక్షం..
 ఆంధ్రదేశంలో అమోఘమైన సంచలనం సృష్టించింది. 

ఇదే సమయంలో ..
పుట్టపర్తి వారు కూడ..
రామాయణ రచన చేయదలచారు..
ఇతర కవుల రచనల కన్న ..
పుట్టపర్తి వారి రామాయణ రచన యొక్క పరమార్థం విశిష్టమైనది.
పూర్వ రచనల కన్న భిన్నవైఖరి కలది.

సంస్కృతంలోని వాల్మీకి రామాయణం..
వ్రజభాష (హిందీ) లోని తులసీ రామాయణం ..
తెలుగు..
తమిళ ..
మరాఠీ..
మళయాళ భాషలలో..
వెలువడ్డ వివిధ రామాయణ రచనలు ..
ఒక్కసారిగ పుట్టపర్తి వారి మానసవీణను మీటి ..
ఆయన హృదయంలో ..
కవితామృతాన్ని నిపినాయి..

వెనువెంటనే ..
ఆచార్యుల వారు..
ఆధునిక కవులెవ్వరు అంటని ..
చతుష్పద షట్పదులను స్వీకరించి ..
గాన యోగ్యమైన తీరులో ..
రామాయణాన్ని ..
కిష్కింద ..
బాలకాండలు రచించారు..
దాని పేరే "జనప్రియ రామాయణము."
శ్రీ పుట్టపర్తి వారు..
రామకథా కధనలో..
తన మానస వీణను మీటిన..
మహానుభావుల నెందరినో ..
తన కావ్య పీఠికలో స్మరించి..
వారికి వినమ్రంగా అంజలి ఘటించారు.
 
రామాయణంలో..
అతికష్టమైన కిష్కింధ కాండను..
వారు మొదటిగ రచించారు..
దానిని పండిత పామర సభలలో వింపించారు. 
అందరు రచనను బహుధా ప్రశంసించారు.

రామాయణ రచన..
ఆచార్యుల వారి కలం నుండి....
యెంతో సరళ సుందరంగా జాలువారింది.

 అభిమానులు..
సాహితీ వేత్తలు ..
వారి రచనను ప్రోత్సహించారు. 
ప్రశంసించారు..
ఆచార్యుల వారు ..
రామాయణ రచనను పూర్తి చేసారు ..

కానీ ..
ఇప్పటికి..
బాల ..
కిష్కింధ కాండలు..
రెండు మాత్రమే ప్రచురింపబడ్డాయి..

ఈ రచన..
 పాఠకుల హృదయం నిండుగ..
 భక్తి భావాన్ని నింపుతుంది.. 
ఆచార్యులవారు రచించిన..
 జనప్రియ రామాయణములోని రాముడు..
 సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ..!!!
పాఠకులకు..
 ఆయన భగవంతునివలె అనుక్షణం దర్శనమిస్తాడు.  

కిష్కింధలోని తార..
అంగదుల పాత్రలు అత్యద్భుతాలు. 
తార పాత్ర పోషణలో..
రచయిత చూపిన ప్రతిభ విశిష్టమైనది.
పుట్టపర్తి వారు ..
రామకథా రచయితలైన వారిని 
కావ్యారంభంలో స్మరించిన తీరు గమనింప దగును.
వాల్మీకి
ఆదికవీ..!!వేదాత్మకమగు నీ
కవితామృతమున నవనియేమి..?నా
కమ్ముగూడ పూతమ్ముగ నైనది..
దీవింపగవలె నీదాసున్..
 
తులసీదాస్
ఆరఘువీరున కాప్తుడ వగునో
తులసీ నిద్రల మెలకువలను నీ
యడుగులు,నా దైవంబగుతన్..
తులసీ పవిత్ర వా
క్కులతోడ నిరతంబు
పూతమైనది నాదు మనమూ తద్రచిత
రామాయణమ్ము నా ధనమూ తచ్చరణ
కమల రజముల కధా కథనంబు సాగిపో
వును లోక కల్యాణ భూమిగా దిరముగా
 
కంబన్
ద్రావిడామ్నాయంబు
ధన్యముగ రఘువ్వరుని
కీర్తి బల్కిన యట్టి ఘనుడూ కంబరు మ
హాజ్ఞాని వేదార్థ విదుడూ తద్రచన
ములు ద్రావువారికి తరుల వచశ్చాతుర్య
మశున పక్షికి వినుచునట్టి తమ్మట రవము

ఆచార్యుల వారు.. 
బహుభాషా కోవిదులగుట వలన ..
సంస్కృత ..
హిందీ.. 
తమిళ ..
రామాయణాలలోని అందచందాలను..
 ఆపోశన పట్టి ..
తన రచనలో వానిని మెరుగులు దిద్దారు. 

వారి రామాయణములోని ప్రతి పాత్రలోను ..
భక్తి భరితమైన ఆర్ద్రత ..
పుష్కలంగా నిండి వుండి..
 పాఠకుల మనోకుహరంలో నొక వినూత్న భావ రేఖను ఉదయింప చేస్తుంది.

రామలక్ష్మణులతో..
సుగ్రీవునకు హనుమ ద్వారా మైత్రి ఏర్పడుతుంది. 
పిదప ..
సుగ్రీవుడు తన అన్న వాలిని..
రెండవమారు యుధ్ధానికి రమ్మని ..
సవాలు చేస్తాడు. 

సుగ్రీవుని మద గర్వాన్ని అంతం చేయాలని..
వాలి సన్నధ్ధుడౌతాడు.
 
అది గమనించిన తార 
చాల దూరాలోచన చేసి ..
"సుగ్రీవుని యువరాజు గ చేసి ..
భ్రాతృద్వేషాన్ని  పోగొట్టుకో వలసినదిగ హితముపదేశిస్తుంది. 

మరియు..

అన్నదమ్ములకు నగ్గి రగిల్చిన
కాకుత్థుని చెలికారము గోరుము
బలవంతులతో బగ లంటిన రా
జ్యమ్ములు బ్రదుకులు దక్కెడునే..

అని అంటూ..
సుగ్రీవునకు ..
పరాక్రమ వంతులైన..
 రామ లక్ష్మణుల అండదండలు ..
పుష్కలంగా వున్నాయని..
 వారి వల్లనే సుగ్రీవుడు నిన్ను..
యుధ్ధానికి మరల రమ్మని పిలుస్తున్నాడని..
యుధ్ధానికి పోవటం మంచిది కాదని ..
యుధ్ధానికి పోవటం మంచిది కాదని బోధిస్తుంది.
 
పైగా..
 మీ యిరువురకు యుధ్ధాన్ని రగిల్చిన..
ఆ రాముని స్నేహాన్ని ..
వాంచించమని చెబుతూ..
 బలవంతులతో పగ వల్ల ..
రాజ్యాలు.. 
జీవితాలు.. 
నాశనమవుతాయని హెచ్చరించిన రాజకీయవేత్తగ ..
పుట్టపర్తివారు ఆమెను చిత్రించారు. 

వారి పాత్ర చిత్రణ అమోఘమైంది.
శ్రీ రాముని బాణహతికి వాలి మరణిస్తాడు 
అతడి మరణానంతరం 
తార తన సమస్తాన్ని శాశ్వతంగా కోల్పోయినట్లు విపరీతంగా విలపిస్తుంది.

వగపెరుగని నా బ్రదుకిక వై ధ
వ్య విదూనితమై యపగత సుఖమై
కృపనంబై కడి యెడలిన పూలై
యనాధమై యిటె నశియించున్

అనియు

ఓయి..1 హృదీశ..! మహా యూధవ యూ
ధవ నీతోనే దలగెను నా యా
శలు, సంతోషమ్ములు నా కిక
మిగిలినదొకటే!! దుఃఖ వ్రతమూ..!!

అని విలపించింది.
 
భర్త ప్రాణంతో ముడిపడిన ..
తన సంతోషము ..
తన జీవనము ..
భర్త మరణంతో పూర్తిగ పోయాయని..
తనకిక మిగిలింది కేవలం సహగమనం ఒక్కటేనని..
 అదే శరణ్యమని..
 విలపిస్తుంది ఆమె. 

ఆమె దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. 

నా గుండె ఇనప గుండె..
లేకున్న..
నీ మర వార్త వినగనే..
 వేయి ముక్కలు చెక్కలై పోవలసినది. 
కాలమే నీపై కత్తి కట్టి ..
నిన్నిట్లు సుగ్రీవునితో యీ ఘోరము చేయించినది ప్రాణములు కోల్పోయిన నీవు ధన్యుడవే. 
నేనే కుంకుమకు నోచుకోని దాన నైతిని. 
అని పైపరి విధముల..
 ఆమె విలపించుట గమనింపదగును.
 
వయసును రూపము నయమును గల వగకత్తెలు , 
నిను గుడి గ్రుత్తురు, కౌగిట
నాకములెఒ, మరి నా కుంకుమ మీ
నాటికి దీరినదోయి ప్రభూ

అనియూ

ఆ రవిజుని భార్యను బట్టితి, నా
తనిఁ దోలితి  సాంద్రారణ్యములకు
నా ఫలమే యిటులై నీ చావై
నా కుంకుమను దుడిచినదీ..
అని దుఃఖించినది. రుమను
చెరబట్టి సుగ్రీవుని అరణ్యములకు పంపి భార్యాభర్తలిరువురిని నీవు వేరు చేసితివి. 
ఆ పాప కార్య ఫలమే 
నా పాలిటి దుఃఖమై 
నిన్ను నాకు దూరము చేసినది
 నా నుదుటి కుంకుమ తుడిచివైచినదని
 దురపిల్లినది.
 
వాలి ప్రాణములు వీడిపోవుచు ..
తమ్ముడైన సుగ్రీవుని దగ్గరకు పిలిచి..
వినయముగ నీవు తార సూచనలను పాటించుము. 
రాజ్య పాలనమున ..
ఆమె అభిప్రాయములకు వెలకట్టుమని సూచించుచు..

తారాధిపముఖి, తార, సుషేణుని
కొమరిత, సూక్ష్మార్థములను గమనిం
చి నిర్ణయమ్ములు సేయుటలె గడు
మెలకువ గలయది, మది గలదీ..
ఒక్కట నున్నది, యొక్కట లేదని
చెప్పగాదు, తచ్చిక్షా దక్షత
శకునమ్ములు మొదలఖిల విద్యలను
బేరు మ్రోసినది యాతార..!!
తారా వచనము దప్పినది పోయినది
లే, దేనాడిది సత్యంబు.

తార గునగనాలను వ్యక్తీకరిస్తాడు.
 వాలికి తార మాట శిలాక్షరమైనది. 

ఆమె రాజ్యతంత్రము అమోఘమైనది. 
ఆమె సూక్షమ విషయగ్రాహి..
 సమస్త విద్యల యందు ఆరితేరిన..
ఆమె ఆలోచనలను పాటించుట వలన ..
యెల్లవేళల రాజ్యమునకు శుభమే కల్గినది కాని.. అపజయ మింతవరకును చవిచూడలేదని..
 సుగ్రీవునకు వాలి తెలియజేయుచు..
 తార గొప్పదనమును ప్రశంసించుట..
 బహుధా ప్రశంసించదగినది. 
వానర రాజ్యానికి ..
ఆమె ఆలోచనలు పెట్టని కోటలు..
 
సుగ్రీవుడు..
 సుఖజీవనంలో మునిగి తేలియాడుచు..
 రామున  కిచ్చిన వాగ్దానాన్ని మరచాడని ..
కోపగించిన లక్ష్మణుడు..
 సుగ్రీవుని రాజప్రాసాదానికి వెళ్ళి..
 తన ధనుస్సు నందలి వింటినారిని ఎక్కుపెట్టాడు. 

ఆ శబ్దానికి..
 అంతః పురంలో వున్న సుగ్రీవుడు..
 భయకంపితుడౌతాడు. 
 తన వాద నైపుణ్యంతో ..
లక్ష్మణుని శాంతింప జేయమని ..
సుగ్రీవుడు తారను ప్రార్థిస్తాడు. 

ఆమె లక్ష్మణుని శాంతమూర్తిని చేయుటలో చూపిన విజ్ఞత..
 నైపుణ్యంతో నిర్వహించిన రాయబారం..
 ప్రసంగించిన తీరు..
ఆమెకు గల లోకిక జ్ఞానాన్ని..
ధర్మాధర్మ విచక్షణనూ చాతుతాయి. 
ఆమె మన్మధుని ఆరవ బాణమా అనునట్లుండి..

కామసుఖంబఖిల జీవులకు నైజము గాదా.. !! 
నారీ విరహాకుల రాములకిది తెలియదటే..!!
మనసుగల మగలకు జెల్లవో..
మగువల కనువేదురలకు జిక్కని దెవడయ్యా ..??
అని కోపోద్రిక్తుడైన లక్ష్మణుని ముందుగ నిలదీసినది. 


పిదప ..
లక్ష్మణుని అనునయించుచు..
దిక్కెవ్వరు రవిజునకును మీరలు దక్కన్..
ఎవరది శాశ్వత మీ భువి
ఋతు పరివర్తనలు జీవుల బ్రతుకుల్..
అని వ్యాఖ్యానించినది. 

ఆ మాటలకు..
లక్ష్మణుని మనసు కొంత శాంతించినది. 
మరియు ..
తార యందు..
తన సోదరియగు శాంతాదేవి ..
లక్ష్మణునకు కల్పించినదని..
కవి అత్యధ్బుత కల్పన చేసినాడు...

ఆమె మాటలవల్ల..
లక్ష్మణుడు శాంతించి..
ఆమె ఆహ్వానాన్ని మన్నించి..
రాజ ప్రాసాదంలోకి నడిచి.. సుగ్రీవుని క్షమిస్తాడు. 

సుగ్రీవుడు..
సీతాన్వేషణ తత్పరుడై ..
సమస్త రాజ్యభారాన్ని తారపై మోపుతాడు. 
తన కన్న ..
ఆమెకే వ్యవహార దక్షత కలదని..
సుగ్రీవుడు భావిస్తాడు.

ఆచార్యుల వారి తార పాత్ర..
 చాల గొప్పగ చిత్రించబడినది..
 మహా భారతంలోని ..
సంజయ ..
శ్రీకృష్ణరాయబారాలకన్న..
 తార రాయబారం ..
మిక్కిలి జయాన్ని చేకూర్చింది..
 స్త్రీ యెంతటి వివేకవంతురాలో..
 దీనిలో చూడనగును. 

కట్టమంచివారే బ్రతికివుంటే..
 తాను యెంతగానో అభిమానించి..
 మెచ్చిన..
 ద్రౌపది పాత్రకన్న..
 శ్రీ పుట్టపర్తి వారు రూపొందించిన తార పాత్ర.. బహుశ్లాఘనీయమైనదని..
 అభినందించెడి వారేమో ??
 అలాగే అంగదుని పాత్ర అమోఘమైంది. 

మాన్యశ్రీ ..
డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులుగారికి..
 శ్రీవారి జనప్రియ రామాయణం అంటే..
 యెనలేని అభిమానం వుంది. 
వారి మాటల్లో గమనించండి..
"జనప్రియ రామాయణం మహా కావ్యం..
 కొన్ని చోట్ల వారి రచన..
 వాల్మీకిని మించిపోయింది...
ఒక జన్మలో పొందిన సంస్కారం ..
ఇలాంటి రచనకు సాధ్యము కాదు.
వెనుకటి జన్మలో ..
పుట్టపర్తిగారి సాధన ..
ఆర్జించిన సంస్కారం తోడ్పడి..
యీ జన్మలో..
 యింతటి గొప్ప కావ్యం..
 ఆయనచే రచింపబడునట్లు చేసింది.
 
నేను..
 కవి సామ్రాట్..
 విశ్వనాధ సత్యనారాయణగారి శిష్యుణ్ణి ..
అభిమానిని..
 అయినా ..
రామాయణ కల్ప వృక్షము కంటే..
జనప్రియ రామాయణం చాల విశిష్టమైనది..
అన్నారు నండూరివారు. 

మిగిలిన కాండలు ప్రచురింపబడి ..
ప్రజలకు అందుబాటులో వుండాలి..
 శ్రీ పుట్టపర్తిగారికి ..
వేయ్యేండ్ల తెలుగు చరిత్రలో..
 ప్రధమ స్థానాన్ని సంపాదించి పెట్టేది.. 
రామాయణం మాత్రమే..








                   

పుట్టపర్తి నారాయణాచార్యులు తిరుమల రామచంద్ర హంపీ నుంచీ లో


హంపీ నుంచీ హరప్పాదాకా..
తెలియని వారుండరు..
అది చదివితే ..
శ్రీ తిరుమల రామచంద్ర గారిని..
సాహిత్య అభిమానులు మరచిపోవటం కష్టం.

రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు, సమీక్షలు రాశారు. ‘హైదరాబాద్ నోట్‌బుక్’ 
వంటి దాదాపు 15 శీర్షికలు నిర్వహించారు. 
‘సత్యాగ్రహ విజయం’ నాటకం, 
రణన్నినాద గీతాన్ని సంస్కృతంలో రాశారు. 

ఆయనకు ఎనలేని కీర్తిని ఆర్జించిపెట్టిన పుస్తకాలు

‘మన లిపి: పుట్టుపూర్వోత్తరాలు’, 


మనకు భాషపై కన్నతల్లిపై ఉన్నంత ప్రేమే ఉంటే 
తప్పక చదవ వలసిన పుస్తకం .

కొన్ని వేల సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ తరువాత బండలపై ..రాగి రేకులపై ..తాళ పత్రాలపై ..
నడచి నడచి వచ్చిన లిపి ..
ఈనాడు అందమైన చేతివ్రాతలా తళుకులీనినా..
దీనికి పూర్వం దీని రూపం  వంకర టింకర గీతలే..
తొలి పుస్తకం ఏది ..?
అన్న ప్రశ్న దగ్గరినుంచీ అసలు లిపికి మూల కారకులెవ్వరు ..?
అన్న మూలాలను చేదించుకుంటూ వెళ్ళి..
రామచంద్ర గారు తెలుగు వాడి సత్తాను ..
లోకానికి ఒంటరి గొంతుకతో చాటే ప్రయత్నమే..
ఈ తెలుగు లిపి పుట్టుపూర్వోత్తరాలు..

ఇంకో గొప్ప విషయం. 
ఈ రచన వ్యవహార భాషలో సాగటం. 
ఇలాంటి గ్రంథం వ్యవహార భాషలో 
అదీ అప్పటి కాలంలో రాయడం ఓ నేర్పు.


‘నుడి-నానుడి’, 

తెలుగులో కొన్ని పదాలను తీసుకుని ..
వాటి పుట్టుపూర్వోత్తరాలను వివరించారు..
పనస, ఉప్పు, పాలు, సీతాఫలప్పండు, మగువ, ఉల్లి, వేప, కోమటి,  టెంకాయ, కోటలోపాగా,
మొదలైనవి.

‘సాహితీ సుగతుని స్వగతం’,


మంచి మార్గంలో వెళ్ళేవాడు సుగతుడు ..బుధ్ధుడు కూడా..
ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు
ఆంధ్రసాహిత్యంలో స్త్రీపర్యాయపదాలు
పద్యాలకు రాగనిర్దేశం
నూరు, నూటఎనిమిది, నూటపదహారు
దేశీనామాలలోని మరికొన్ని తెలుగుపదాలు
బుద్ధుని ముందునుంచే ఉన్న ధూమపానం
వేదంలో, ఆయుర్వేదంలో గర్భనిరోధం
దండి దశకుమార చరిత్ర
త్యాగయ్య గారి కృతులలో రాగ రచనా సమన్వయం
చేతబళ్ళూ, తలనీలాలూ.
తదితర వ్యాసాలు ఉన్నాయి
ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. 

ప్రాకృత వాఙ్మయంలో రామకథ

తిరుమల రామచంద్ర గారు, భారతి పత్రికలోనూ, మరికొన్ని సందర్భాలలోనూ..
రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
ఇందులో..
ప్రాకృత వాఙ్మయంలో రామకథ
వజ్జాలగ్గంలో తెలుగు పదాలు
ప్రాకృత ప్రకృతి  
తెలుగు ప్రాకృతాల సంబంధం 
అపభ్రంశ వాఙ్మయ పరిచయం  
తెలుగు దేశంలోని బౌద్ధ శాఖలు :
తెలుగు దేశంలోని బౌద్ధ శాఖలు :
బౌద్ధ సాహిత్యం : ఆంధ్ర బౌద్ధాచార్యులు
జిన వల్లభుడి మహావీర స్వామి స్తోత్రం
దేశీ నామమాలలోని తెలుగు పదాలు


‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ 

భారతీయుల సాంఘిక జీవనాన్ని 
కమనీయంగా వ్యాఖ్యానించడమేగాక, 
గాథాసప్తశతిలో ఏయే సందర్భాల్లో, 
ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు. 
కాళిదాసుపై 
గాథాసప్తశతి ప్రభావం ఉందని తేల్చిచెప్పారు.

మరపురాని మనీషి

రామచంద్ర గారు ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎందరో ప్రముఖులను ముఖాముఖి జరిపారు, 
మరెందరి మీదో అద్భుతమైన వ్యాసాలు రాసారు. 
అప్పటి ప్రముఖుల మీద రాసిన 
వ్యాస సంకలనం ఇది. 
విశ్వకవి రవీంద్రుడు, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి,
 దాలిపర్తి పిచ్చిహరి, విస్సా అప్పారావు గారు, 
చిలుకూరి నారాయణరావు గారు.. 
ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల గురించి 
ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.


ఇందులో ‘సాహితీ సుగతుని స్వగతం’ గ్రంథానికి 1970లోనూ రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం,
‘గాథాసప్తశతిలో తెలుగుపదాలు’కు 
1986లో రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచే అవార్డు లభించాయి. 
రెండు వేల ఏళ్లనాటి 
భారతీయుల సాంఘిక జీవనాన్ని 
కమనీయంగా వ్యాఖ్యానించడమేగాక, 
గాథాసప్తశతిలో ఏయే సందర్భాల్లో, 
ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు. 
కాళిదాసుపై 
గాథాసప్తశతి ప్రభావం ఉందని తేల్చిచెప్పారు.

లాహోర్ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 
ఏడాదిపాటు పనిచేసి 
తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ
తాళపత్ర గ్రంథాలు వెయ్యింటికి 
వివరణ సూచీ తయారు చేశారు. 


తిరుమల రామచంద్ర పుస్తకానికి 
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఆయన రాసిన 
ఆత్మకథ హంపీ నుంచి హరప్పా దాకా 
అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.

ఆయన తన హంపీ నుంచి హరప్పా దాకా 
అనే పుస్తకాన్ని ..
కేవలం ఆత్మకథగానే రాయలేదు. 
ఈ పుస్తకంలో సాంఘిక పరిస్థితులకు, 
వందేళ్ల సాహితీ చరిత్రకు అద్దం పట్టారు.
అయ్యకూ తిరుమల రాంచంద్ర గారికీ 
మంచి అనుబంధం ఉండేది..
తిరుమల రామచంద్ర గారు తన హంపీనుంచీ హరప్పా దాకా లో సహాధ్యాయులూ సత్పురుషులూ శీర్షికలో ఆసక్తి కరమైన అంశాలను ముచ్చటించారు.
 
ఇది శ్రీ శ్రీశైలం గారి ద్వారా నాకు అందింది..
నాగక్కయ్యకు 
పుస్తక ముద్రణలోనూ 
తన వద్ద దాచిన అయ్యగారి విలువైన సమాచారాన్ని 
అతి పదిలంగా అందివ్వడంలోనూ 
తన బాధ్యతను మరచిపోని శ్రీశైలంగారికి 
నా బ్లాగు ముఖంగా హృదయ పూర్వక నమస్సులు.