27 ఫిబ్ర, 2016

కుహు .. కు హూ ..



ప్రాచీన కావ్య సాహిత్యములు జెప్పెడి కొన్ని ఆచారములు మనకర్థమేగావు.
జీవన విధానమే మారిపోయినవి కదా..
నాచనసోముడు మొదలైన వారు ఇట్టి ప్రయోగము లెన్నిటినో చేసినారు.
కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డిగారు .. 
వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి విద్వాంసులెంతయో శ్రమకోర్చి కొన్నింటి కర్థములను వివరించిరి.
కాని .. ఇంకను దెలియని వెన్నో గలవు.
అన్నమయ లోనిట్టివి వేలకు..
నలుగురు చెప్పని రీతిగా జెప్పవలె ననునాస వరాహపురాణములో నెక్కువ..
ఈ గుణము హర్షింపదగ్గదే..
కాని.. సాధించుట కష్టము..

ఆంధ్ర సాహిత్యములో నీ ''మురారే స్త్రుతీయః పంధా' ను సమర్థముగా నెగ్గించి కొన్నవారిద్దరే..
రాయలు.. తెనాలి రామకృష్ణుడు..
ఈ క్రిందిది వీరి వసంత వర్ణనములోనొకటి..

కం. తన పగతు కంఠమును బో
లె నటించురతీశ్వరుండలిగి కత్తుల బో
నున బెట్టిన మూల్గెడి విధ
మున పికము ప్రవాళ మధ్యమున నెలుగించెన్..

వసంత కాలములో కోకిల కూసిన స్వారస్యమిది 
మనకవులు కోకిల స్వరమును పంచమ స్వరముతో బోల్చి యెంతయో మురిసిరి..
దాని కషాయ  కంఠమున కేమేమో మేత లు ..
వీరి కోకిల మూల్గినదట..

వరాహ పురాణము పీఠిక నుంచీ..