25 జులై, 2012

అమ్మ చెప్పిందీ -- పుట్టపర్తి అనూరాధ





అది మధ్యాన్నం..
భోజనాల సమయం..
వేసవి..
మామిడి పళ్ళు ఉన్నాయ్..
రెండే రెండు..
అయ్య వేసవిలో ..
మామిడి పళ్ళు పెరుగన్నం లో కలుపుకుని 
ఎంతో ఇష్టం గా తినే వారు..
అయ్య భొజనానికి వచ్చారు..
వెండి పళ్ళెం ..
అయ్య పెళ్ళప్పుడు మా అవ్వ పెట్టిందనుకుంటా..
చెంబుతో నీళ్ళు..
పక్కనే చేయి తుడుచుకోవటానికి టవలు.
అయ్య వచ్చారు..
అమ్మ అయ్యకు ఒక్కొక్కటీ వడ్డించి..
విసనకర్రతో విసురుతూ కూర్చుంది..
అబ్బ ..
అయ్య నన్నూ కూర్చోమన్నారు..
మామిడి పళ్ళు రెండే వున్నాయ్..
పెద్దది నాకు కావాలన్నాను..
వద్దమ్మా.. 
నీవా చిన్నది తీసుకో..
అంది అమ్మ.
ఊహూ నేను పెద్దదే తీసుకుంటాను..
అప్పుడు వదినకు చిన్నది వస్తుంది..
అయినా అమ్మ మాట వినక నేను 
పెద్ద మామిడి పండే తీసుకున్నాను..
అమ్మ నా వంక ప్రేమగా చూస్తూంది..
పండు కొరకగానే ..
అది మొత్తం పుచ్చినపండు..
నేను అమ్మ వంక చూసాను..
అమ్మ నా వంక చూసి చిరునవ్వు నవ్వింది..
అప్పుడు నాకు పదమూడేళ్ళు..
అంటే ..
నేనర్థం చేసుకున్న దేమిటంటే..
వదినకు యేం ఇవ్వాల్లే 
అని ప్రవర్తించిన నాకు ..
గర్వ భంగం జరిగింది అని..
ఈ సత్యాలన్నీ 
స్పటికంలాగ చక్కగా బోధపడుతూ ఉన్నా కూడా ’నాది’ 
అనే మమకారాన్ని మనిషి వదలడంలేదు. 
మమకారం అనేది 
చర్చించినంత తేలికగా పోదు. 
అహంకారం ఉన్నంతవరకు 
మమకారం దూరం కాదు. 
కనుకనే, 
ఈ ప్రపంచంలో జీవించి యున్నంత కాలం 
 ఏదో కొంత త్యాగం చేస్తూ పోవాలి. 
దానం చేస్తూ ఉండాలి. 
ఇవి చేయడంలో ప్రధానమైన విషయం 
‘సేవ’ కాదు అనే సత్యాన్ని అందరూ గ్రహించలేరు. 
సేవ రెండవ విషయం.  
(గణపతి సచ్చిదానంద)