8 ఏప్రి, 2017

భగవంతుడెవనిపై మైత్రి పాటించునో..

భగవంతుడెవనిపైమైత్రి పాటించు
సత్కృపానిరతి  బ్రసన్నండగుచు 
నతనికి దమయంత ననుకూలమైయుండు 
సర్వభూతంబులు సమతబేర్చి
మహిదలపోయ నిమ్న ప్రదేశములకు
ననయంబుజేరు తోయముల పగిది..

భగవంతునిదయకు పాత్రమైన వాని దగ్గరికి అందరూ తమంతతామే అనుకూలభావంతో పల్లానికి పారే నీటి వలె చేరుకుంటారు.
(ధృవోపాఖ్యానము)