31 డిసెం, 2013
మతము
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
30 డిసెం, 2013
సరస్వతీపుత్రుడిని మరిచారా..??
లేబుళ్లు:
paper cuttings
28 డిసెం, 2013
భాగవత వాత్సల్యం
''కటిక దరిద్రాన్నైనా అనుభవిస్తాను గానీ..
జీవితంలో క్షణమైనా నాస్తికత్వాన్ని భరించలేను..'' అన్నారు ఆచార్యులవారు
''వైకుఠాన్నయినా వదలిఉంటాను గాని ..
తనను ఆశ్రయించిన భక్తులను మాత్రం
ఒక్క క్షణమైనా వదలి ఉండలేను..''
అంటాడా యేడుకొండలస్వామి
ఆయనకు శ్రీ వైకుంఠం కంటే భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రం అంటేనే మహా ఇష్టమట..
అందుకే భక్తులందరితో తానూ ఒక్కడై తిరుగుతూ ఆటలాడినాడు..
ఆనందించినాడు..
పాడినాడు..
పరవశించినాడు..
ఒక్కొక్కమారు భక్తులతో పరాచికమాడినాడు..
తిట్టించుకున్నాడు..
దెబ్బలు కూడా తిన్నాడు..
ఇలా ఆ భగవంతుడు
తన భక్తులతో ఆడటం పాడటం పాచికలాడటం పరాచికాలాడటం ఇవి ఒకనాటివా..
ఒక యుగానివా..
యీ అనంత లీలల్లో మన ఊహకు మన బుధ్ధికి మనసుకు అందినవి అర్థమైనవి ఆసక్తిగా ఆర్తిగా చర్చించుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం కదూ ..
25 డిసెం, 2013
నేనెరిగిన మండలి
లేబుళ్లు:
paper cuttings
22 డిసెం, 2013
మధుర భక్తి
లేబుళ్లు:
చిత్ర కవితలు
పుట్టువులెల్ల ..స్వకృత.. కర్మ ఫలితములే...
లేబుళ్లు:
చిత్ర కవితలు
21 డిసెం, 2013
అపురూప లేఖాసాహిత్యం
19 డిసెం, 2013
నేను రసవాదిని
లేబుళ్లు:
చిత్ర కవితలు
17 డిసెం, 2013
రసోవైస్సః
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
తండ్రి బాధ్యత..
శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర ఎడమ వేపున
సాయి కృష్ణ యాచేంద్ర గారు
సంగీతావధానంలో పేరుపొందాడు
ఆయన సంగీత నిర్వహణలో
బాలసుభ్రమణ్యం వాణీ జయరాం
తదితరులు పాడుతుంటారట
త్వరలో మనం శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గారి నిర్వహణలో రూపొందిన పుట్టపర్తి శివతాండవాన్ని మార్కెట్లో చూడబోతున్నాము..
అలానే
ప్రాచ్య లిఖిత గ్రంధాలయం వారు పుట్టపర్తి కృతులను శతజయంతి సంవత్సరంలో భాగంగా
ముద్రించటానికి ముందుకు వచ్చారు
ఆ కృతులను మంచి వారితో పాడించి
పనిలో పనిగా CD లను కూడా తేవాలని
శ్రీ మండలి బుధ్ధప్రసాద్ గారు
నిర్ణయించడం కూడా సంతోషకరం.
మండలి వెంకట కృష్ణారావ్ గారు
విద్యాశాఖామంత్రిగా వున్నప్పుడు
పుట్టపర్తితో మంచి స్నేహ సంబంధాలు నెరపేవారు
పుట్టపర్తి మందలి ఇంట్లో బసచేయటం జరిగేది
ఆ చుట్టరికంతో తమ తండ్రి బాధ్యతను
పవిత్రంగా భుజాన వేసుకొని కార్యం నిర్వహిస్తున్న బుధ్ధప్రసాద్ గారిని
నేను అభినందించటం కూడా జరిగింది
అక్కయ్య మా అయ్యగారి కార్యాన్ని దీక్షతో చేయటం బహుశా ఆయనను ప్రేరేపించి వుండవచ్చు..
లేబుళ్లు:
వ్యాసాలు
పోతన్నా ..యెంతపని చేసావయ్యా ..
రచయిత జీవితం పాత్రల్లో ప్రతిఫలిస్తుందా..?
అతని ఆలోచనల ప్రకారం పాత్రలు నడచుకుంటాయా..
ఒకవేళ రచయిత మృదుస్వభావి అయితే భయంకరమైన సన్నివేశాలనెలా వర్ణించగలడూ..
క్రూర మైన మనస్తత్వం వున్న
పాత్రల చిత్రణ ఎలా చేయగలడు..?
కదా..
ఒక సినిమాలో రాద్దామని పుస్తకం తెరవగానే
పాత్రలన్నీ వచ్చి మాట్లాడతాయి రచయితతో
(అల్లు రామలింగయ్య )
నేను 'ధరణికి గిరి భారమా'
కథ రాసినప్పుడు అక్కడ ఆ సంస్థ నిర్వహణ చూడవలసి వచ్చింది
అప్పుడు ఆ ముసలివారి వ్యధలూ భాధలూ పరిస్తితులూ తెలిసాయి
అంతే ..
ఆ ఘోరాలు చూడలేను బాబోయ్ అని పారిపోయొచ్చాను..
ఇంకొకటి
తనకెదురైన వ్యక్తుల్ని పరిశీలిస్తూ వారి నడకా మాటతీరు గమనిస్తూ వారినే
కలంతో దింపేయటం
ఒకసారి కోటేశ్వరరావు గారు చెప్పారు
వారు ఎవరింటికెళ్ళినా ..
'మా పూజామందిరం చూడండి ..'
అని బ్రతిమలాడి తీసుకెళ్ళి చూపించేవారట
ఆయన యేవైనా చెబితే దిద్దుకొనేవారు
ఇక ఆయన తన ఉపన్యాసాలలో
అన్యాపదేశంగా
వారి ఇంటి తీరును.. పూజా విధానాన్ని.. వగైరాలను ఉటంకించటం మొదలెట్టేసరికి ఖంగుతిన్నారు
మీ పూజామందిరం చూపించండి ..
అని యీనే అడిగినా..
వద్దులెండి ..
మీ ఉపన్యాసాలలో మా ప్రస్తావనలు వస్తున్నాయి ..
అంటూ మాట తప్పించే వారట..
అలా ..
వారు చూచినవీ విన్నవీ.. కథలూ కాకరకాయల్లో రాకుండా వుంటాయా..
అందులో వారి స్వవిషయాలకు భావాలూ బాధలూ ఎక్కడో ఒకచోట దూకుతూనే వుంటాయి
సరే..
పోతన్న విషయానికొస్తే..
ఆయన రైతు ..
దరిద్రం ఆయన వెంటే ..
అందుకాయనకు బాధకూడా లేదు..
ఇది చూడండి..
''గొల్లవారి బ్రదుకు గొరతన వచ్చునె
గొల్ల రీతి బాలకుప్ప ద్రచ్చి
గొల్లలైరి సురలు ; గొల్లయ్యె విష్ణుండు
చేటులేని మందు సిరియు గనిరి...''
గోపాలకుల జీవితం కొంచెమైంది కాదు.
దేవతలు గొల్లవారివలె పాల సముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు.
అమరత్త్వాన్ని అందించే అమృతాన్నీ శ్రీలక్ష్మినీ పొందగలిగాడు.
అని ఎంత అందంగా చెప్పాడో ..చెప్పాడు కానీ..
మరి దరిద్రానికతి చేరువలో వుండే పోతన
తెలిసో.. తెలియకో.. ఆ లక్ష్మీ నాధుణికీ
తన లేని తనాన్ని అంటించకుండా వుంటాడా ..
అదే చెబుతున్నారు ఆచార్యులవారు
వ్యాసుడు కృష్ణుని అంతఃపురాన్ని
'సర్వకాంతా.. అనుత్తమా..'
అని ఊరుకుంటే
పోతన్న కాస్త ముందుకు పోయి
కృష్ణునికి సువర్ణ సౌధమునే కట్టినాడట..
పోనీలేపాపం.. కల్పనే కదా..
కడితే కట్టాడు.. అనుకుంటారేమో
తరువాత పోతన్న యేం చేసాడో తెలిస్తే ..
మీరూ ముక్కున వేలేసుకుంటారు..

పోతనామాత్యుల యూహా చిత్రము..
అంతేగాని ..
చారిత్రకముగా నాతని గురించి
మన కేమియు దెలియదు
ఒక్క విషయము మాత్రము గట్టిగ చెప్పవచ్చును
అతడు దరిద్రుడు..
ఇది మాత్రము నీకెట్లు తెలియునందురా..
అందున కుపస్ఫోరకమిది..
కృష్ణ భగవానుడు ద్వారకకు వచ్చినాడు
ఆ సందర్భమున వ్యాసులిట్లు వర్ణించిరి.
''పత్న్యః పతిం ప్రాప్య గృహానుపాగతం
విలోక్య సంజాత మనో మహోత్సవాః
ఉత్తస్థురారా త్సహసాసనాశయైః
సాకంవ్రతైః వ్రీడితలోల లోచనాః
తమాత్మ జైర్దృష్టి భిరంతరాత్మనా
దురంతభావా, పరిరేఖ రేపతిం
నిరుధ్ధమ ప్యాస్రవ దంబునేత్రయో
ర్విలజ్జితానాం భృగు వర్య ! విక్లబాత్ !!
వ్యాసుడు కృష్ణుని యంతః పురమును
'సర్వకాంతా' యనియు 'అనుత్తమా'
యనియు బలికిరి
పోతన్నయును
పురుషోత్తమునకు సువర్ణ సౌధమునే గట్టినాడు..
కాని యంతతో నూరకున్న బాగుండెడిది.
అతడు
భార్యల యోగక్షేమముల విచారింప మొదలు పెట్టెను
అందులో మొదటి పద్యమిది
''కొడుకుల్ భక్తి విధేయు లౌదురుగదా కోడండ్రు మీ వాక్యముల్
గడవంజాలక యుందురా ! విబుధ స్త్కారంబు గావింతురా
దొడవుల్ వస్త్రములున్ పదార్థ రస సందోహంబులున్ జాలునా
కడమల్గావు గదా ! భవన్నియముల్ ! కల్యాణ యుక్తంబులె..!!''
దీనిని జదివినప్పుడు ..
'వైభవావతారుడైన కృష్ణుని భార్యలకు గూడ
కూడు గుడ్డల కొరత దప్పక పోయెగదా..' యని
నాకు మాత్రము పట్టరానంత నవ్వు వచ్చినది
ఇందులో నున్న దారిద్ర్యము..
నిశ్చయముగ పోతన్నదే..
అది వాసుదేవుని యంతః పురమున గూడ తొంగిచూచినది...
లేబుళ్లు:
వ్యాసాలు
16 డిసెం, 2013
శోధించి.. సాధించాలి..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
ముఖే ..ముఖే ..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
14 డిసెం, 2013
భక్తుడు సీరియస్ .. దేవుడు యమ సీరియస్స్..
13 డిసెం, 2013
మన్నేల తింటివిరా కృష్ణా..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
12 డిసెం, 2013
భాగవతాలెన్నో ..మరి.. మనకు తెలిసినవెన్ని..??
రామాయణం..
భారతం..
భాగవతం..
రామాయణం.. రాముని గమనం.. అంటే నడక
ధర్మాధర్మముల మధ్య అతని ప్రయాణం.
భారతం ..కౌరవులు పాండవులవారసత్వ యుధ్ధం..
దానికి కృష్ణుని సారధ్యం
ఇక భాగవతం..??
కృష్ణ తత్త్వాన్ని చెప్పే సాధనం..
దీనిని రాసింది పోతన్న
పొలాలు దున్నుకొనే పోతన్న
భాగవతాన్ని ఆంధ్రీకరించాడు
దీనిద్వారా అతను కోరింది తనకూ తనతో పాటూ
అది చదివిన వారందరికీ కృష్ణ ప్రేమ..
తరువాత ఎంతమంది ఎన్ని రాసినా ..
పోతన్న రాసినదే ప్రామాణ్యమైంది
మరి ఇతర భాషలలోనూ భాగవతాలుంటాయిగా
వుంటాయి ..ఎందుకుండవూ..
వివిధ భాషలలోని భాగవతాలను గురించి
మనకెవరు చెబుతారు..
అని ఆలోచిస్తున్నారా..?
'' కొందరకు దెనుగు గుణమగు
గొందరకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందరకు గుణములగు నే
నందర మెప్పింతు గృతుల నయ్యై యెడలన్.. ''
అని పోతన ప్రతిజ్ఞ
యీ ప్రతిజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చి శాశ్వత కీర్తిని పోతనార్యుడు గడిస్తే
పుట్టపర్తి కూడా ఆబాటనే పట్టి
మరిన్ని భాషల భాగవత సుధలనాస్వాదించారు..
రాళ్ళసీమగా పేరుపడిన రాయలసీమలో
రత్నమై భాసిల్లి..
తన జీవితం ద్వారా ...
ఆత్మ గౌరవానికి అసలైన అర్థం చెప్పి
పధ్నాలుగు భాషలపై మంచి పట్టున్న
మన సరస్వతీపుత్రులు పుట్టపర్తి వారి కన్నా సమర్థవంతంగా యెవ్వరు చెప్పగలరు..?
పదండి ..
అడుగుదాం..

భాగవతమన్నిభాషలయందును గలదు
కాని కొన్నిటిలో మాత్రమేయది
సమర్థుల చేతిలో పడి నది.
కన్నడము నందును భాగవతము గలదు
సదస్త్సంశయ గోచరము.
కుమార వ్యాసుని భారతమునకు
యితర వీర శైవ కావ్యములకు వచ్చినంత ప్రచారము భాగవతమునకు రాలేదు.
తమిళ భాగవతమునకు కూడ నింతే గతి..
ఆ భాషలో నాయనార్లు, ఆళ్వార్లు
వీరు రచియించిన భక్తి రచనలకే ప్రధమ తాంబూలము.
వాని తరువాతే నట్టి గౌరవము కలిసి వచ్చినది
కంబ రామాయణమునకే.
భారత భాగవతములకు గాదు
భారతమునకంటె భాగవతమునకు
బరియు వ్యాప్తి దక్కువ
కేరళ దేశమున మాత్రము
భాగవతము ప్రజాదరమును గౌరవమును జూరగొన్నది
దానిని రచించిన మహాకవి ఎజుత్తచ్చన్ .
మహారాష్ట్రము నం దేకనాధుడు
భాగవతమును రచించెను.
హిందీలోని సూరసాగరము ప్రసిధ్ధమే.
ఒరియా భాషయందును అచల దాసనుకొందును భాగవతమును వ్రాసి నారట.
అది ప్రసిధ్ధములే యని వారందురు.
కాని యిన్ని భాగవతములున్నను..
వీనిలో వేనికిని పట్టని యదృష్టము
ఆంధ్ర భాగవతమునకే బట్టినదని నా యూహ..
''పాయియకత్వం పడిడం , గుంఫేఉం , తహయకుజ్జ పసూణం
కునియంచ పసాయేవుం,అజ్జని బహవేణ యాణంతై''(వజ్జలగ్గ)
ఏకనాధుడు తన భాగవతమునందు
బ్రహ్మండముగ పెంచి వ్రాసినది కృష్ణోధ్ధవ సంవాదమునే.
తక్కిన కథాభాగమునంతయు జాల టూకీగ వెళ్ళగొట్టినాడు.
''ఎచుత్తచ్చన్'' వ్రాసిన భాగవతమునకు వర్ణలావైపుల్యమునను కథా సంవిధానమునకు పోతన్నతో పోటీలేదు.
అతని రచనలోనూ దశమస్కంధమొక్కటే పెద్దది.
హృదయ లాలిత్యమునకు
భావోన్మాదమునకు ప్రతీకమైన సూరదాసునకు భావముల నదుపులో నుంచుకొను వశిత్వము తక్కువ
తలపులెట్లీడ్చిన నాతడట్లు పరువెత్తిపోవును.
ఒక దశమ స్కంధము బాత్రమే యాతని కవితోద్యానమున విరిసి పూలు బూచినది.
తక్కినవన్నియు రసమును మూతిముట్ట వెలిచినవే..
దశమ స్కంధము నందును
యొక దారి యొక తెన్ననిలేదు.
తోచినది తోచినట్లు వర్ణింపబడెను
ఒరియాలోని భాగవతమును నేను చదువలేదు..
కన్నడము , అరవము
వీనిలో భాగవతము లున్నవనిగూడ చాలమందికి దెలియదు.
కారణమేమననా గ్రంధకర్తలు తపస్వులుగారు కవితా నిర్మాణమున నందెవేసిన వారును గారు
రెంటను సమర్థుడైనవాడు తెనుగునందలి పోతనామాత్యుడొక్కడే..
అతడు పవిత్రుడైన తపస్వి..
కవితలో నెన్ని పోకడలైనను పోగలవాడు..
లేబుళ్లు:
వ్యాసాలు
11 డిసెం, 2013
కృష్ణుని అవతారం అందరికీ అర్థం కాదా..
కృష్ణుని యవతారమందర కర్థముగాదు..
ఆతడు పూర్ణపురుషుడు..
అడుగడుగునను
పరిమితమైన బుధ్ధి నాతడపహాస్యము సేయును.
అట్లే భాగవతము గూడ..
యెత్తిన వారి చేతి బిడ్డగాదు
ఒక మాట ఒక బాణము గల రామపరబ్రహ్మము అందరకు నందుబాతులో నుండువాడు.
రామునివలెనే ..రామాయణ రచనయు..
నొకటే తిన్నని మార్గము నాశ్రయించినది.
కృష్ణపరమాత్ముడట్టి సులభుడుగాడు
ఆ జీవితమున నెన్న్నియో యెగుడుదిగుడులు. అతడు మహాయోధుడు..
పిరికివాడు..
పదునారు వేల మంది భార్యలతో కాపురమీడ్చినవాడు
ఇన్ని యుండినను బ్రహ్మచారియట..!!
త్యాగభోగముల రెంటిని గడజూచినవాడు..
అతని ధర్మాధర్మముల వింగడింపు మనమనుకొనునది గాదు..
కృష్ణుని పాపపుణ్యములకు
అడుగడుగునను అతడే భాష్యము చెప్పవలయును
కృష్ణుని పరివారములో ..
నాకసమున నెన్ని చుక్కలో యన్ని భేదములు
అతని వంటిదే యతని కథ యైన భాగవతమును..
ప్రాకృత కావ్యములను జదివి యానందించుటకును
కుందపుష్పమాల గ్రుచ్చుటకును ..
కుపితయైన ప్రియురాలినోదార్చుటకును..
తెలిసిన యదృష్టాశాలురు కొందరేనట..
ఒకానొక ప్రాకృత కవి సవాలు..!!
అట్లే కృష్ణ భక్తి నెరపుటకును..
భాగవతమును పఠించుటకును అధికారులు కొందరే..
లేబుళ్లు:
వ్యాసాలు
10 డిసెం, 2013
'భారతదేశం పట్టనంతటి కవి '

జరుగుతున్నది మహామహులు పాల్గొనే సభ..
అధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్ణన్..
ఆ సభలో పుట్టపర్తి ఒక వాణి వినిపించారు
విషయం తెలుగు కన్నడముల చుట్టరికము
పంపని భారతన్నీ నన్నయ భారతాన్నీ పోల్చే ప్రయత్నం
చాళుక్యులు పంపనిచే భారతము ననువదింపజేసి
తమ కీర్తికాయమున కాయువు పోసుకొన్నారు
మరి రాజనరేంద్రుని ప్రోద్బలంతో నన్నయ
యీ కార్యానికుపక్రమించాడు
చాళుక్య వంశాన్ని గొప్పగా వర్ణించే పంపడు
భారతం లో తనకాశ్రయమిచ్చిన అరికేసరినే
అర్జునునిగా ధ్వనింపజేస్తూ రచన సాగించాడు
మొన్నటికి మొన్న
మన యన్ టీ ఆర్
ట్యాంక్ బండ్ పై పలు విగ్రహాలు ప్రతిష్టింపజేస్తే
అందులో ప్రతి ముఖములోనూ
ఆ యన్ టీ ఆర్ కవళికలే పలికినట్లు
పంప భారతాన్ని పలుమార్లు
తన కార్యనిర్వహణలో భాగంగా చదివిన నన్నయ్య
తానూ అతనికన్న మెరుగుగా ధ్వని మార్గమున
యీ పని చేయాలనుకున్నాడు
ధర్మరాజుతో రాజరాజును పోల్చే ప్రయత్నం చేశాడు
పంపని భారతాన్ని
అతడేవిధంగా చేసాడనే పరిశీలనలో
కొన్ని చోట్ల అనుసరించి
మరికొన్ని చోట్ల తన పంధాననుసరించి
నన్నయ్య పనిచేసాడు
ఇలా నన్నయపై పంపభారతం ప్రభావముందన్నది నిరూపించే ప్రయత్నం
యీ వాదం తెలుగు వారైన కవులకు నచ్చలేదు
వారు మారువేషం వేసుకున్న కన్నడిగుడని
పుట్టపర్తిని నిందించారు
విశ్వనాధ కన్నడం నేర్చుకొని పరిశీలించి
సమాధానం చెబుతానన్నారు
కానీ సాహిత్యానికి భాషాభేదం లేదు
తెలుగు సరస్వతి ..కన్నడ సరస్వతి ..వుంటుందా..
కేవలం తెలుగులోనే కూపస్తమండూకాలవడం సబబా..
ఇంతకూ అందరిలో తనదే పైచేయిగా మెలగడం
పుట్టపర్తి లక్షణం..
దానికి ఎంతమంది ఉడుక్కున్నా.. అసూయ పడినా.. సరే
కాదంటే చర్చకు రావలసివుంటుంది
కేవలం తెలుగులో తేలడానికే
ముష్టియుధ్ధాలూ
దిక్కుమాలిన రాజకీయాలనాశ్రయించే సాహిత్యకారులు ఇతరభాషలవేపు తొంగిచూచే ప్రయత్నమైనా చేస్తారా.. ?
దానికి తగ్గ సత్తా యెవ్వరిదగ్గరా లేకపోవటం
పుట్టపర్తి తప్పుకాదు కదా ..!
మన పక్కనున్న కన్నడానికే అదిరి పడితే
మళమాళమేమిటి
తమిళమేమిటి
అసలు మరాఠీ వ్యాకరణమే క్లిష్టం లిపి మరింత క్లిష్టం
ఇక మాగధి అర్ధ మాగధి పైశాచీ
అందుకే పుట్టపర్తిని 'భారతదేశం పట్టనంతటి కవి 'అన్నారు
మరాఠీ ప్రసిధ్ధ నాటకాలను పుట్టపర్తితో అనువదింపజేసారు అక్కడివారు
నిన్ను తెలుగు ప్రజలు గుర్తించకపోతే పోనీ
మా కేరళ ప్రభుత్వం తరఫున నిన్ను మా ప్రతినిధిగా పంపిస్తాం అంటూ
కేంద్ర సాహిత్య అకాడమీకి తమ ప్రభుత్వం తరఫున పుట్టపర్తిని పంపారు మళయాళీలు
అంతెందుకు..
వారి మళయాళ నిఘంటు నిర్మాణంలో..
పుట్టపర్తి కీలక పాత్ర వహించారు వారి అభ్యర్థనపై

శ్రీనివాస ప్రబంధ రచనకు తిరుమలేశుని ఆనతి
తిరుమలేశుని మూర్తిలో
ఎక్కడా మరెక్కడా కానరాని కానగలేని
అద్భుత సౌందర్యతేజో విశేషం కేంద్రీకృతమైవుంది
అనంత తేజః పుంజమని చెప్పబడే యీ మూర్తిని
ఒక్కక్షణం చూచినా తనివి తీరదు
గంటల తరబడి చూచినా తనివి తీరదు
ఆయనను దర్శించి వచ్చిన భక్తులందరికీ
ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా దివ్యానుభూతిని ప్రసాదిస్తాడు
కొందరికి ఆలయమంతా తానై
కొందరికి ఆనందంగా అప్పుడే విచ్చుకున్న మల్లెమొగ్గ చందాన
ఇంకొందరికి 'ఖబడ్దార్' అని హెచ్చరిస్తూ
ఆత్మీయునిగా చేయందిస్తూ మరికొందరికి
అది ప్రతి వ్యక్తీ స్వయంగా అనుభవించాలే తప్ప
చెప్పటానికి వీలుకాదు.
ఇలా భక్తులకే కాదు
నిత్యమూ శ్రీవారి అర్చన నైవేద్యాలలో సన్నిహితంగా పాల్గొనే
అర్చక స్వాములకు కూడా
ఆ మూర్తి
పరమానందాన్ని పరమాద్భుతాన్ని పరమాశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది
ఆభరణాల సమర్పణవేళల్లో
పుష్పాలంకరణ వేళల్లో
స్వామివారి పాదాలు చేతులూ మెత్తగా సుతిమెత్తగా
స్పర్శకు తగులుతూ
గగుర్పాటును కలిగిస్తుందట..
వారి నిత్యానుభవంలో
శ్రీ స్వామి విగ్రహం శిలగా తోచనే తోచదట..
పుట్టపర్తి శతజయంతి కార్యక్రమం దూరదర్శన్ లో జరిగినప్పుడు
నరాల రామారెడ్డి కామిశెట్టి శ్రీనివాసులు పొత్తూరి చాలామంది వచ్చారు
అప్పుడు కామిసెట్టి ఒక విషయం చెప్పారు
కానీ దాన్ని ఎలా ప్రజంట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండినాను
ఇంతలో అక్కయ్య హరికొలువు అనే ఒక పుస్తకం ఇచ్చింది
అందులో అంతా తిరుమలేశుని విశేషాలే
అందులోని కొన్ని పంక్తులద్వారా
కామిశెట్టి చెప్పిన విషయాన్ని మీకు చేరవేస్తున్నాను
అది ఇది
ఒకసారి పుట్టపర్తి కామిశెట్టి తదితరులు
శ్రీనివాసుని సన్నిఢిలో వున్నారు
స్వామికి దగ్గరగా అతిదగ్గరగా..
పుట్టపర్తికి అర్చకులు హారతి చూపిస్తూ ఒకమాటచెప్పారు
అది యేమంటే..
''స్వామివారు మిమ్మల్ని తన గ్రంధాన్ని పూర్తి చేయమని సెలవిచ్చారు..''
అని
అయ్యకు కాస్త చెవులు వినబడవు
''యేమిరా.. యేమంటున్నారు వారు..''
అని కామిశెట్టినడిగారు
ఆయన వివరించారు
అంతే..
పుట్టపర్తి కన్నీరు మున్నీరయ్యారు
అప్పటికి శ్రీనివాస ప్రబంధం సగం పూర్తయి నిలిచిపోయివుంది
పుట్టపర్తి ఆనందాన్ని పట్టలేక పోయారు
అదే ఊపులో తిరిగివచ్చి ప్రబంధాన్ని పూర్తిచేసారు
ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో
అన్న కామిశెట్టి ఇచ్చిన సమాచారం తో ..
లేబుళ్లు:
జీవన చిత్రాలు
9 డిసెం, 2013
ఆంగ్ల హృదయాలు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
తుకారాముడు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
4 డిసెం, 2013
అయ్యో పాపమీ జీవి కెందుకింత వేధ
పుట్టపర్తి వారొక సంగీత కచ్చేరి కెళ్ళారు
రస భావాశ్రితమైన సంగీతం కోసం వెదికారు
సంత బజారు ఘోష కానవచ్చింది
'ఉల్లిపాయలలో మల్లెవాసన'లా
కడపట కూర్చున్నారు కాబట్టి
'బ్రతుకు జీవుడా..'
అని బయటపడ్డారు..
అది తామస సంగీతము
త్యాగయ్య జన్మమంతా ఉపాసించింది
సాత్విక సంగీతాన్నే
తరువాత బయలు దేరిన విద్వాంసులు
దానిని కష్టపడి తామసమున కీడ్చారు..
'త్యాగరాజీ యుధ్ధము లెరుగనే యెరుగడే ..'
అని విస్తుపొయ్యారు..
విలంబ కాలంలోని సాహిత్యాన్ని
మధ్య కాలంలోనికి తెచ్చే సాహసానికి కూడా ఆయనెన్నడూ పూనుకోలేదు
ఇంతకూ..
ఆ పాటగాడెంచుకున్నది
ఒక సంకీర్ణ జాతి ధృవతాళము
తలనొప్పికదిచాలు
ఇక వెర్రి మొర్రి ప్రస్తారములు గూడ
ఆ కోలాహలములో గాయకుని మనసునకు
రస భావములవైపు చూచు తీరికేలేదు
'ఎన్నుకొన్న తాళమెక్కడతప్పునో' అని
వంటినిండా చెమట
తొడలతోలెగిరి పోవునట్లా తాళము
వాని ప్రాణము తీయుచుండెను
ఆరంభములోనే స్వరములకు పద చ్యు తి
అవి
బహుకాలము ఎండలో నెండిన వరుగులు
వానినాతడు
అప్పుడప్పుడు చప్పరించునే యుండును.
ఇక అతని సాహిత్యము
'రావణునకు చిక్కిన రంభ..'
'నగుమోము గనలేని' కృతియది
ఆ సంగతుల రభసలో
భేతాళుని మూతివలెనున్న రాముని మొగమును
మాపై విసరివేసెను
ఇక 'ఖగరాజు' వచ్చు వేళకు
తాళములను పక్కలకు విసరివేయుచున్న
సంగీత జ్ఞులు
'నేనేమి తక్కువ తిన్నానా..'
అని విజృభించిన ఫిడేలు..
పుట్టపర్తి హాస్య చమత్కృతికి
వ్యంగ్య విన్యాసానికీ
ఇదొక మచ్చుతునక

నాదము యొక్క బహురూపముల రాగమనిపేరు
అనంతావైరాగారి రాగములకు లెక్కలేదు
ప్రస్తారముతో ఛందస్సులవలె
చమత్కారములతో నలంకారములవలె
శాస్త్రము బెరుగుకొలదియు వీని సంఖ్య బెరిగినది.
సమర్థులైనవారు వ్యాప్తికి దెచ్చి
చక్కగ నిర్వహించిన రాగములును లేకపోలేదు
'గురుగుహ' ముద్రలో కృతులు రచించిన
సంగీత త్రిమూర్తులలో నొకరగు
ముత్తుస్వామి దీక్షితులు ప్రసిధ్ధులుగదా
వీరి తండ్రి రామస్వామి దీక్షితులు
హంసధ్వని రాగమునకు
రూపురేఖలేర్పరచినది వీరేనందురు
కానీ నేడు చాలామంది
యేవేవో వింత వింత రాగములను బాడుటకు బాధపడుచున్నారు
ఉన్నరాగములు వారి భావ సృష్టికి చాలనట్లు
వారు పాడురాగములకు వారు వేయు కల్పనా స్వరముల నోర్చుకొనునంత కడుపైన ఉండదు.
పైగా శతమానము వక్రగతులు
పులిమీద పుట్రయన్నట్లు
ఉత్తరాదివారినుండి యెరువుదెచ్చుకున్న
వింత వింత బాణీలు
అది యట్లుండె..
అఖండమైన కాలమును ఖండములొనర్చి
యెచ్చు తక్కువలు లేకుండ నికరముగ జోడించి తనియుటకే 'తాళ'మని పేరు
'నాదము'కూడనఖండమైనదే..
దానిని వేర్వేరు సరళరేఖలుగా దీర్చి జోడించినప్పుడు ముచ్చటయైన సౌందర్యమేర్పడును
దానిని గ్రహించి
దానివెంట మనము నడచి
లయానందమనుభవింతుము
రాగతాళములు పరస్పర మొదిగినప్పుడు మనస్సునకనితరవేద్యమగు నానందము కలుగును
సంవాదమునకానందపడుట
మనస్సునకు సహజధర్మముగనుక
భావముయొక్క క్రమపుష్టిలేనిది రాగముకాదు
ఒకవేళ యైనను అది సర్కసూఅని, సంగీతముగాలేదు
ఆధార షడ్జమును చక్కగా నంటిపెట్టుకుని స్వరములను వాని వాని స్థానములలో
శుధ్ధముగ పలికించుటయే శృతిలయము
శృతిలయము లేని పాట
సమ్మతిలేని మాటవంటిది
భావరాగములను ధిక్కరించి రాగమధికారమునెరపుట బీదబలిసి బందెకాడగుట
'అయ్యో ఇది దురాక్రమణకదా '
అని మనసులో బాధ
శృతిలయమొకవేళ యభ్యాసముతో సిధ్ధించినను
భావలయము మాత్రము తపః స్సాధ్యము
కొందరికి శృతిలయముగూడనుండదు.
కర్ణాటక గాయకులలో
యీ దౌర్బల్యమెక్కువ
కచేరీయంతయు
శృతిలో గాత్రము సరిగా నదుకక సకిలింతలతో అపస్వరపుమూటలైన గాయకులని నేనెరుగుదును.
అట్టివారికి
సంఖ్యాప్రదానమిన తాళమేముఖ్యము
వింత వింత లెక్కలని ప్రస్తరించుటలో గ్రామకరణములకు వీరికి భేదములేదు
మొదటనే
యే సంకీర్ణజాతి ధృవతాళమునో యేరికొందురు
తలనొప్పికది చాలును
అందులో వెర్రిమొర్రి ప్రస్తారములకు
అమృతాంజనము ఖర్చు.
ఈ కోలాహలములో గాయకుని మనస్సునకు రసభావములవైపుకు జూచుటకు తీరికేదీ..
ఎన్నుకున్న తాళమెక్కడ తప్పునోయని..
యెంటినిండ చెమట
నడుమ నడుమ మార్చు జాతులకెన్ని వర్ణములో
ముఖమున నన్ని సొట్టలు..
ఆ వైభవము "క్రాంతం క్రతుంచాక్షుషము" గావుండును.
తొడలతోలెగిరిపోవునట్లాతడు మర్దించుటజూచి
'అయ్యో పాపమీ జీవికెందుకింత వేధ..'
యని మనము జాలిపడవలసివచ్చును
చాలని దానికి తాళముతో సాహిత్యమునీడ్చుటకై అవసరమున్నను లేకున్నను
'ఉ ఊ..ఎ ఏ.. 'ల కోలాహలము
స్వరములకు పదచ్యుతి ప్రారంభములోనే జరుగును
వానిని గాయకుడు బహుకాలమెండలో ఎండిన వరుగులవలె చప్పరించుచుండును.
ఇక సాహిత్యమా..
అది రావణునకు జిక్కిన రంభ..
ఒకసారి యొక గాయకుడు ప్రసిధ్ధుడే..
పాడుచున్నాడు
ముందొక పెద్ద బోర్డు
'ఇక్కడ సంగీతమమ్మబడును' అన్నట్లున్నది
లోపలగూర్చున్నాను
'నగుమోము గనలేని'
అను త్యాగయ్యగారి కృతినెత్తికొన్నాడు
'అభేరి' రాగమే మృదువైనది
అయ్యగారి సాహిత్యమంతకన్నను మృదువుగానున్నది
మనస్సును నీరుగా నొనర్చు నా రచన యీ క్రిందిది
అభేరి ఆదితాళము
నగుమోము గనలేని నా జాలిదెలిసి
నను బ్రోవగరాదా శ్రీ రఘువర నీ
నగరాజ ధర నీదు పరివారమెల్ల
ఒగిబోధలు సేసేవారలు గాదే అటులుండుదురే నీ
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికిలకూ బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ యెవరితో మొరలిడుదూ
వగజూపకుతాళనునన్నేలుకోరా త్యాగరాజనుత నీ
రాగమును పక్కనబెట్టి వచనముగా జదివికొన్ననూ
పదముల యొద్దిక యెంతయో బాగున్నది
సంయుక్తా క్షరములకును
సంగీతమునకును వైరము
'నగరాజ ధర.. 'యనుటలో
ధరగోవర్ధనమునెత్తుటలోని
పరిశ్రమమును సూచించుచున్నది
పరమాత్ముడు బరువైనవాడు.. గొప్పవాడు..
సాహిత్యము సర్వాంగ సుందరమైనది..
చతురశ్రగతితో హాయిగా నడచు నాదితాళము..
విలంబకాలములో పాడి..
రసము తాననుభవించి.. ఇతరులననుభవింపజేయుటకెంతయో యవకాశమున్న కృతి
ఆ పండితుడు మొదటనే
ధృతగతితో నారంభించి ..సంగతుల రభసలో
'భేతాళుని మూతి' వలెనున్న
రాముని మొగమును మాపై విసరివేసెను
'ఖగరాజు' వచ్చు వేళకు
'మురళి ..భంజళి 'మొదలైన యొక్కటే
గుర్రముల నడకలు..
సభలో నున్న సంగీతజ్ఞుల రొద..
వారు శక్త్యానుసారముగ తాళములను
దిక్కులకు విసరి వేయుచుండిరి..
'నేనేమి తక్కువ తిన్నానని..'
ఫిడేలు వాద్యము విజృంభించినది.
మర్దల ధ్వనుల ఢమఢమలు..
ఒక్కటే సంత బజారు వంటి ఘోష..
'ఇక్కడ రస భావాశృతమైన సంగీతమేదీ..?'
అని వెదకితిని
'ఉల్లిపాయలలో ..మల్లెవాసనలా'
కడపట గూర్చొని యుంటిని గనుక ..
'బ్రతుకు జీవుడా ' యని బైటపడినాను
ఇదే 'తామస' సంగీతము
త్యాగయ్యగారు
జన్మమంతయు నుపాసించిన 'సాత్విక సంగీతము'ను
గాయకుడు కష్టపడి తామసమున కీడ్చెను
త్యాగరాజీ యుధ్ధములెరుగనే యెరుగడు
విలంబకాలములో నున్న సాహిత్యమునకు
మధ్య కాలమును జోడించు స్వాతంత్ర్యము గూడ నాతడరుదుగా తప్ప నవలంబింపలేదు
రస భావాశ్రితమైన సంగీతం కోసం వెదికారు
సంత బజారు ఘోష కానవచ్చింది
'ఉల్లిపాయలలో మల్లెవాసన'లా
కడపట కూర్చున్నారు కాబట్టి
'బ్రతుకు జీవుడా..'
అని బయటపడ్డారు..
అది తామస సంగీతము
త్యాగయ్య జన్మమంతా ఉపాసించింది
సాత్విక సంగీతాన్నే
తరువాత బయలు దేరిన విద్వాంసులు
దానిని కష్టపడి తామసమున కీడ్చారు..
'త్యాగరాజీ యుధ్ధము లెరుగనే యెరుగడే ..'
అని విస్తుపొయ్యారు..
విలంబ కాలంలోని సాహిత్యాన్ని
మధ్య కాలంలోనికి తెచ్చే సాహసానికి కూడా ఆయనెన్నడూ పూనుకోలేదు
ఇంతకూ..
ఆ పాటగాడెంచుకున్నది
ఒక సంకీర్ణ జాతి ధృవతాళము
తలనొప్పికదిచాలు
ఇక వెర్రి మొర్రి ప్రస్తారములు గూడ
ఆ కోలాహలములో గాయకుని మనసునకు
రస భావములవైపు చూచు తీరికేలేదు
'ఎన్నుకొన్న తాళమెక్కడతప్పునో' అని
వంటినిండా చెమట
తొడలతోలెగిరి పోవునట్లా తాళము
వాని ప్రాణము తీయుచుండెను
ఆరంభములోనే స్వరములకు పద చ్యు తి
అవి
బహుకాలము ఎండలో నెండిన వరుగులు
వానినాతడు
అప్పుడప్పుడు చప్పరించునే యుండును.
ఇక అతని సాహిత్యము
'రావణునకు చిక్కిన రంభ..'
'నగుమోము గనలేని' కృతియది
ఆ సంగతుల రభసలో
భేతాళుని మూతివలెనున్న రాముని మొగమును
మాపై విసరివేసెను
ఇక 'ఖగరాజు' వచ్చు వేళకు
తాళములను పక్కలకు విసరివేయుచున్న
సంగీత జ్ఞులు
'నేనేమి తక్కువ తిన్నానా..'
అని విజృభించిన ఫిడేలు..
పుట్టపర్తి హాస్య చమత్కృతికి
వ్యంగ్య విన్యాసానికీ
ఇదొక మచ్చుతునక

నాదము యొక్క బహురూపముల రాగమనిపేరు
అనంతావైరాగారి రాగములకు లెక్కలేదు
ప్రస్తారముతో ఛందస్సులవలె
చమత్కారములతో నలంకారములవలె
శాస్త్రము బెరుగుకొలదియు వీని సంఖ్య బెరిగినది.
సమర్థులైనవారు వ్యాప్తికి దెచ్చి
చక్కగ నిర్వహించిన రాగములును లేకపోలేదు
'గురుగుహ' ముద్రలో కృతులు రచించిన
సంగీత త్రిమూర్తులలో నొకరగు
ముత్తుస్వామి దీక్షితులు ప్రసిధ్ధులుగదా
వీరి తండ్రి రామస్వామి దీక్షితులు
హంసధ్వని రాగమునకు
రూపురేఖలేర్పరచినది వీరేనందురు
కానీ నేడు చాలామంది
యేవేవో వింత వింత రాగములను బాడుటకు బాధపడుచున్నారు
ఉన్నరాగములు వారి భావ సృష్టికి చాలనట్లు
వారు పాడురాగములకు వారు వేయు కల్పనా స్వరముల నోర్చుకొనునంత కడుపైన ఉండదు.
పైగా శతమానము వక్రగతులు
పులిమీద పుట్రయన్నట్లు
ఉత్తరాదివారినుండి యెరువుదెచ్చుకున్న
వింత వింత బాణీలు
అది యట్లుండె..
అఖండమైన కాలమును ఖండములొనర్చి
యెచ్చు తక్కువలు లేకుండ నికరముగ జోడించి తనియుటకే 'తాళ'మని పేరు
'నాదము'కూడనఖండమైనదే..
దానిని వేర్వేరు సరళరేఖలుగా దీర్చి జోడించినప్పుడు ముచ్చటయైన సౌందర్యమేర్పడును
దానిని గ్రహించి
దానివెంట మనము నడచి
లయానందమనుభవింతుము
రాగతాళములు పరస్పర మొదిగినప్పుడు మనస్సునకనితరవేద్యమగు నానందము కలుగును
సంవాదమునకానందపడుట
మనస్సునకు సహజధర్మముగనుక
భావముయొక్క క్రమపుష్టిలేనిది రాగముకాదు
ఒకవేళ యైనను అది సర్కసూఅని, సంగీతముగాలేదు
ఆధార షడ్జమును చక్కగా నంటిపెట్టుకుని స్వరములను వాని వాని స్థానములలో
శుధ్ధముగ పలికించుటయే శృతిలయము
శృతిలయము లేని పాట
సమ్మతిలేని మాటవంటిది
భావరాగములను ధిక్కరించి రాగమధికారమునెరపుట బీదబలిసి బందెకాడగుట
'అయ్యో ఇది దురాక్రమణకదా '
అని మనసులో బాధ
శృతిలయమొకవేళ యభ్యాసముతో సిధ్ధించినను
భావలయము మాత్రము తపః స్సాధ్యము
కొందరికి శృతిలయముగూడనుండదు.
కర్ణాటక గాయకులలో
యీ దౌర్బల్యమెక్కువ
కచేరీయంతయు
శృతిలో గాత్రము సరిగా నదుకక సకిలింతలతో అపస్వరపుమూటలైన గాయకులని నేనెరుగుదును.
అట్టివారికి
సంఖ్యాప్రదానమిన తాళమేముఖ్యము
వింత వింత లెక్కలని ప్రస్తరించుటలో గ్రామకరణములకు వీరికి భేదములేదు
మొదటనే
యే సంకీర్ణజాతి ధృవతాళమునో యేరికొందురు
తలనొప్పికది చాలును
అందులో వెర్రిమొర్రి ప్రస్తారములకు
అమృతాంజనము ఖర్చు.
ఈ కోలాహలములో గాయకుని మనస్సునకు రసభావములవైపుకు జూచుటకు తీరికేదీ..
ఎన్నుకున్న తాళమెక్కడ తప్పునోయని..
యెంటినిండ చెమట
నడుమ నడుమ మార్చు జాతులకెన్ని వర్ణములో
ముఖమున నన్ని సొట్టలు..
ఆ వైభవము "క్రాంతం క్రతుంచాక్షుషము" గావుండును.
తొడలతోలెగిరిపోవునట్లాతడు మర్దించుటజూచి
'అయ్యో పాపమీ జీవికెందుకింత వేధ..'
యని మనము జాలిపడవలసివచ్చును
చాలని దానికి తాళముతో సాహిత్యమునీడ్చుటకై అవసరమున్నను లేకున్నను
'ఉ ఊ..ఎ ఏ.. 'ల కోలాహలము
స్వరములకు పదచ్యుతి ప్రారంభములోనే జరుగును
వానిని గాయకుడు బహుకాలమెండలో ఎండిన వరుగులవలె చప్పరించుచుండును.
ఇక సాహిత్యమా..
అది రావణునకు జిక్కిన రంభ..
ఒకసారి యొక గాయకుడు ప్రసిధ్ధుడే..
పాడుచున్నాడు
ముందొక పెద్ద బోర్డు
'ఇక్కడ సంగీతమమ్మబడును' అన్నట్లున్నది
లోపలగూర్చున్నాను
'నగుమోము గనలేని'
అను త్యాగయ్యగారి కృతినెత్తికొన్నాడు
'అభేరి' రాగమే మృదువైనది
అయ్యగారి సాహిత్యమంతకన్నను మృదువుగానున్నది
మనస్సును నీరుగా నొనర్చు నా రచన యీ క్రిందిది
అభేరి ఆదితాళము
నగుమోము గనలేని నా జాలిదెలిసి
నను బ్రోవగరాదా శ్రీ రఘువర నీ
నగరాజ ధర నీదు పరివారమెల్ల
ఒగిబోధలు సేసేవారలు గాదే అటులుండుదురే నీ
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికిలకూ బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ యెవరితో మొరలిడుదూ
వగజూపకుతాళనునన్నేలుకోరా త్యాగరాజనుత నీ
రాగమును పక్కనబెట్టి వచనముగా జదివికొన్ననూ
పదముల యొద్దిక యెంతయో బాగున్నది
సంయుక్తా క్షరములకును
సంగీతమునకును వైరము
'నగరాజ ధర.. 'యనుటలో
ధరగోవర్ధనమునెత్తుటలోని
పరిశ్రమమును సూచించుచున్నది
పరమాత్ముడు బరువైనవాడు.. గొప్పవాడు..
సాహిత్యము సర్వాంగ సుందరమైనది..
చతురశ్రగతితో హాయిగా నడచు నాదితాళము..
విలంబకాలములో పాడి..
రసము తాననుభవించి.. ఇతరులననుభవింపజేయుటకెంతయో యవకాశమున్న కృతి
ఆ పండితుడు మొదటనే
ధృతగతితో నారంభించి ..సంగతుల రభసలో
'భేతాళుని మూతి' వలెనున్న
రాముని మొగమును మాపై విసరివేసెను
'ఖగరాజు' వచ్చు వేళకు
'మురళి ..భంజళి 'మొదలైన యొక్కటే
గుర్రముల నడకలు..
సభలో నున్న సంగీతజ్ఞుల రొద..
వారు శక్త్యానుసారముగ తాళములను
దిక్కులకు విసరి వేయుచుండిరి..
'నేనేమి తక్కువ తిన్నానని..'
ఫిడేలు వాద్యము విజృంభించినది.
మర్దల ధ్వనుల ఢమఢమలు..
ఒక్కటే సంత బజారు వంటి ఘోష..
'ఇక్కడ రస భావాశృతమైన సంగీతమేదీ..?'
అని వెదకితిని
'ఉల్లిపాయలలో ..మల్లెవాసనలా'
కడపట గూర్చొని యుంటిని గనుక ..
'బ్రతుకు జీవుడా ' యని బైటపడినాను
ఇదే 'తామస' సంగీతము
త్యాగయ్యగారు
జన్మమంతయు నుపాసించిన 'సాత్విక సంగీతము'ను
గాయకుడు కష్టపడి తామసమున కీడ్చెను
త్యాగరాజీ యుధ్ధములెరుగనే యెరుగడు
విలంబకాలములో నున్న సాహిత్యమునకు
మధ్య కాలమును జోడించు స్వాతంత్ర్యము గూడ నాతడరుదుగా తప్ప నవలంబింపలేదు
3 డిసెం, 2013
గతజన్మ శృతి చేసుకున్నది..
ఆత్మకు సంకల్పము గల్గును
అప్పుడది మనస్సునుద్బోధించును
ఆ మనస్సు నాభియందున్న అగ్నిని గొట్టును
అగ్ని వాయువును ప్రేరేపించును
యీ కార్యతంత్రమే నాదమునకు పురుడు దీర్చుట..
బ్రహ్మగ్రంధి నుందీ బయలుదేరిన నాదము నాభిహృత్కంఠరస నసాదులకెక్కి వ్యక్తమగుచున్నది
అది నాభి యందలి సూక్ష్మము
హృదయమందీషద్వ్యక్తము
కంఠమున బూర్ణరూపముతో నుండును
మూర్ధమందపూర్ణము
ముఖమునందు కృత్రిమమనుట
నాదము మరల రెండు రీతులు
అనాహత నాదమొకటి
ఏకాగ్రమైన మనస్సులకే ఇది సాధ్యము
కనుక దీనిని గురూపదిష్ట మార్గమున మహర్షులుపాసింతురు
ఆహతము మనుష్యులకు దక్కినది
ఇది లోకరంజకము భవభంజకము
నాదమొక మహాసముద్రము
దాని యుపాసనయు మహాయోగము
జన్మమంతయు పలు రీతుల రాగ ప్రస్తారము జూపి..విసివి
కడకు
నాదసాగరమున శిరోదఘ్నముగ మునిగిన నాదయోగులను నేనెరుగుదును
బిడారం కిష్టప్ప గారివంటి వారు
అక్కడ లోకాపేక్ష తక్కువ
వింత వింత స్వరపంపకముల కుస్తీలు లేవు
మెదడు నొప్పిబుట్టించు తాళముల ఖత్తులేదు
ఆ స్వరపంపకము చక్కని రాజమార్గము
వారు వాడు తాళములేడెనిమిది మించిలేవు
ఆకారముల హావళి
హెచ్చు గడల హేషారవము
ముక్తాయింపుల కోలహలము
యేదియు వుండదు
వీనియన్నింటికిని నాదముతో నాలుమగల యొద్దిక
ప్రత్యేకముగ
దమ మొగము జూపించుటకే సిగ్గు
కాని
యీ యనుభూతిని పంచుకొనుటకల్ప సంస్కారము చాలదు...
(వాగ్గేయకారులు పదకృతి సాహిత్యం నుంచీ.. )
లేబుళ్లు:
వ్యాసాలు
1 డిసెం, 2013
దూరదర్శన్ లో ప్రసారమైన చర్చా కార్యక్రమం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)