27 జన, 2012

 
ఏ రచయిత అయినా ..
తన కాలానికి సంబంధించిన సమస్యలకే..
ప్రతిస్పందించి రచన చేస్తాడు కదా ..!
అటువంటప్పుడు..
ఆ రచనకి శాశ్వత కాలం నిలిచే శక్తి ఎలా వస్తుంది. 

జరిగే ప్రతి సన్నివేశానికీ ..
కవి హృదయం స్పందిస్తుంది. 
సందేహం లేదు ..


కానీ ..
ప్రతి స్పందనకూ ..
కావ్యత్వం యిస్తే ..
వాని స్పందన..
మనసులో ఎంతకాలం పని చేసిందో..
అంత కాలమే..
ఆ కావ్యానికి కూడా ఆయుష్షు వుంటుంది. 

కలిగిన ప్రతీ స్పందనను ..
రాయడం విజ్ఞతకు లక్షణం కాదు.
అందుకే అనుభవం కావాలంటారు. 
వయస్సు కొంత ముదరవలె ..
అప్పుడప్పుడూ..
చేకూర్చుకున్న సంస్కారం ..
ఒక పరిణతమైన స్థితికి వస్తుంది.
ఆ స్తితిలో రచన చేయ వలె ..

సమకాలిక సంఘటనే కావలసిన అక్కరలేదు. 
పూర్వకాల సంఘటన అయినా తీసుకోవచ్చు.
ఏది తీసుకున్నా ..
అందులో తన సంస్కారం చోటుచేసుకుంటుంది. 
ఈ విషయం ఇంకా విస్తరిస్తే పెద్దగా చెప్పవచ్చు. 

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను...
మళయాళం లో భాగవతం..
"ఎళుత్తచ్చన్" వ్రాసినాడు. 
అందులో కృష్ణుడు ఏడ్చినప్పుడల్లా..
యశోద అరటి పండు ఇస్తుందట..
కారణం ..
వాళ్ళ దేశాచారమది...

ఇలాంటివి ఎన్నో ఉంటాయి..
కలిగిన ప్రతి భావననూ ..
కాగితం మీద పెట్టడం ..
అదంతా ప్రింటు కివ్వడం..
చాలా అనాగరికమైన అలవాటు.
ఒక కవి పరిణతుడు కావడానికి ముందు...
ఎన్నో వ్రాసి చించి వేయాలి.

నేను ఎన్నో సార్లు ..
నా రచనలు అనేకం చించివేసాను. 
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కావ్యాలే చించి వేసారు. 
రాసిందంతా ప్రెస్సుకు పోవాలనే..
నేటి యువకుల్లో కనిపించే దురాశ.
 
ఇప్పటి కవిత్వం దుస్థితిలో ఉందని ..
సాహితీ విలువలు పడిపోతున్నాయని..
చాలా మంది అంటున్నారు..
నిన్నటి మహా రచయితలు కూడా..
నేటి సాహిత్యం పై సదభిప్రాయాన్ని చెప్పటం లేదు. 
ఈ విధంగా ..
సమకాలీన సాహిత్యాన్ని యోగ్యంగా లేదనడం ..
కొన్ని దశాబ్దాలుగా కూడా వుంది. 
ఇదంతా చేమకూర వేంకట కవి చెప్పినట్టు..
ఏ గతి రచియించిరేని..
సమకాలము వారలు మెచ్చరే కదా..
అని అనుకోవచ్చా..
 
ఈనాడు వచ్చేదంతా ..
మంచి సాహిత్యం కిందకి చేరడం లేదనే మాట..
వివేకంతో కూడినదే ..
రాసే వాళ్ళకే విసుగైపోతున్నదన్నమాట.. 
ఇది ఒక శుభ పరిణామం..
ప్రమాణాలు పడిపోతున్నాయనే రొద కూడా..
వాళ్లలోనుంచే ఆరంభమౌతోంది..!

కానీ ..
వాళ్ళ దృష్టిలో ..
ప్రమాణాలనేవి ఏవో సరిగా చెప్పడం లేదు 
అక్కడే మళ్ళీ అస్పష్టత వుంది. 
వారనుకునే ప్రమాణాలు ఏవో..
కొంత విడదీసి చెబితే..
మా బొంట్లకు బాగుంటుంది. 

ఎంతసేపు చెప్పినా..
భాష ..
భావం ..
రెండే ప్రధాన వస్తువులు..

మరి భాష పడిపోయిందా..?
భావం పడిపోయిందా..?
వాళ్ళే తేల్చి చెప్పాలి. 
నా దృష్టిలో రెండూ పడిపపోయినాయి..

కొన్ని చిన్న కథలు..
నవలలు మాత్రం..
మంచివి వస్తున్నాయనిపిస్తోంది.
 
మీకు కోపం వస్తుందేమో..
నవలా సాహిత్యం ..
కన్నడంలో ..
తమిళంలో ..
బాగా వస్తొందనే అభిప్రాయం నాకుంది. 
ఇక కవిత్వ మంటారా.. 
ప్రతి భాష లోనూ ఇంతే అయిపోతొంది. 

ప్రతి భాషలోనూ ..
రాజకీయాల ప్రభావం ..
ఎంతవరకూ విసంకటంగా సాగుతుందో..
అంతవరకూ..
ఈ దుస్తితి తప్పదు.

వాల్మీకికి ముందు..
కావ్య రచన లేదంటారు కదా.. 
అటువంటప్పుడు ..
ప్రధమ రచన అయిన ఆదికవి వాల్మీకి రామాయణం ఇంతవరకూ కూడా..
స్థిరంగా నిలిచి వుండడానికి కారణం ఏమిటి..?
ఆ విధంగా సమగ్ర రచన చేసే శక్తి ..
వాల్మీకికి ఎలా సంక్రమించింది..?

ప్రాచీనులతో మనకు చిక్కే లేదు.. 
సరస్వతీదేవి ఆవిర్భావమే..
వాల్మీకితో ఆరంభమయ్యిందంటారు కదా..!
ఆ  ఆవిర్భావమే ..
సర్వాంగ సుందరంగా జరిగింది. 

కేవలం లౌక్య దృష్టితో ఆలోచిస్తే ..
నాకు తోచే అభిప్రాయమిది ..

సామవేదం కేవలం గానాత్మకం..
అధర్వణం ప్రయోగాత్మకం..
ఋగ్వేదం శృత్యాత్మకం..
వీటి అధ్యయనం వాల్మీకికి వుంది. 
కనుక రామాయణ రచన ..
సమగ్రంగా జరిగి వుంటుందని నా ఊహ..

ఇది నా ఊహ మాత్రమే సుమండీ..

కానీ ఒకటి నిజం ..
వాల్మీకి వలె ..
సర్వాంగ సుందరమైన రచన..
మరొక్కనికి చేయడం అసాధ్యం 

మరి ..
ఆయన సంస్కారమేమిటో ..?
ఆయన చదువేమిటో ..?
మనం గ్రహించలేం..
 
కొన్ని కొన్ని చోట్ల..
ఋగ్వేదంలో..
మనకు మంచి కవిత్వం దొరుకుతుంది. 
నా చిన్నప్పుడు ఋగ్వేదంలో..
కొన్ని ఘట్టాలు చదివి ఆశ్చర్య చకితుణ్ణి అయ్యాను. 
ఉషస్సూక్తులు మొదలైనవి...

అప్పుడే తెనిగించే సాహసానికి పూనుకున్నాను. 
తర్వాత ఎందుకో..
ఆ ప్రయత్నం నిలిచి పోయింది.
 
కడుపులో చల్ల కదలకుండా వున్న కాలంలో..
పురాణాలు ప్రబంధాలు రాశారు ..
అని ప్రాచీన సాహిత్యాన్ని ఎత్తి చూపే వారికి..
మీ సమాధానం ఏమిటి..?
అంతకు మించిన గొప్ప విలువలు..
నేటి రచనలు ప్రతిబింబిస్తున్నాయా..?

ఆనాటి వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా ఉండడానికి కారణం ..
ఆనాటి రాజకీయాలు..
అంతే కాకుండా ..
అప్పటి వాళ్ళంతా కడుపులో చల్ల కదలని వాళ్ళే అనుకోవడం మన మూర్ఖత్వం. 
ఫ్యూడలిజం..
పెట్టుబడిదారీ సమాజం..
ఆనాటి నుంచీ ఇప్పటి వరకూ అనుభవిస్తూండేదే.
ముఖ్యంగా ..
నేటి మన జీవితంలో జీవశక్తి నశించింది..
జిజ్ఞాస పోయింది..
సుఖాన్ని కూడా చక్కగా అనుభవించలేని పరిస్తితికి వచ్చినాము ..
మన దౌర్భల్యానికి సిగ్గు పడకుండా..
వాళ్ళని నిందించడం..
"అబధ్ధం పఠత్వా కుతోద్యం కరోతి"
అన్నట్టు ఉంటుంది. 

కడుపులో చల్ల కదలక కాదు..
  చల్లే లేకుండా..
గొప్ప వాళ్ళైన వాళ్ళను..
ఎంతమందినో నేను చూసినాను.
ఇవన్నీ కూడా ..
ఆడలేక ..మద్దెల పైన మొత్తుకునే మాటలు..
ఇటువంటి వాని పైన నాకు సానుభూతి లేదు...
 
ఇలా ..
ఎంతో వివరంగా..
సునిశిత మేధాశక్తి ఉట్టి పడేలా..
నిష్కర్షగా ..
ఎన్నో సాహితీ విషయాలను వివరించారు. 
తెలుగు జాతి ఏనాటికీ మరువలేని మహా కవి..
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు...

ఆ సరస్వతీ పుత్రుని మాటలు.. 
అపూర్వ మేధా సంపత్తిని ప్రకాశింపజేసే..
మాణిక్యాల మూటలు..
ఆ విలువైన మాటల్ని ..
పాఠకులకు అందజేయాలని..
ఆయన దగ్గర సెలవు తీసుకుని..
బయలుదేరింది స్వాతి.
 
స్వాతి మాస పత్రిక అయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లోని కొన్ని ఇవి...

26 జన, 2012

హరికథలు









మీరు హరికథలు చెప్పేవారని విన్నాము..
సాహిత్యంలో హరికథల గురించి..
మీ అభిప్రాయాన్ని వివరించండి...
 
మరొక్క విషయం ..
మీరు తాత్విక చింతనతో ఉండి..
ప్రొద్దుటూరిలో..
ఆశ్రమం ఏర్పాటు చేసుకొని..
ఉండేవారని వినడం జరిగింది. 



మీ అనుభవంలో ..
ఈ తత్వానందం ..
రసానందానికి..
సామ్యం గానీ.. సమన్వయం గానీ ..
ఏమైనా కుదిరిందా..
 
చాలా సంవత్సరాలు హరికథలు చెప్పేవాణ్ణి ..
నా హరికథలకు పెద్ద పేరుండేది..
చిన్నప్పట్నుంచీ ..
చెప్పినానుకదా..
సంగీతం లోనూ ..
నాట్యములోనూ ..
ఎక్కువగా కృషి చేసిన దానివలన ..
నా హరికధ కాలక్షేపాలలో..
నాకెక్కువగా పనికి వచ్చేవి..



ఈ ఊర్లో కూడా ..
ఆ V.V .శేషాచార్లు ఉండినప్పుడు..
ఒకట్రెండుసార్లు హరికథలు ఏర్పాటు చేసినారు.

అప్పుడు నేను ప్రొద్దుటూరులో పనిచేస్తూ ఉంటిని..






హరికథ కూడా ఒక సాహిత్య ప్రక్రియే.. 
ఆదిభట్ల నారాయణదాసు ఉండినాడు..
చాలా గొప్ప పండితుడాతడు..
సంగీతంలో ..
సాహిత్యంలోనూ..
చాలా గొప్ప వాడు. 

 




 
ఒక్కో మనిషీ ..
ఒక్కో కళకు..
అట్లా పుడతాడేఅమో ..అనిపిస్తుంది. 

బ్రహ్మాండమైన కంఠం ..
పూర్వకాలంలో..
ఆయనకు వెయ్యిన్నూటపదహార్లిచ్చేవారు..
మైసూరు సంస్థానంలో ..
అక్కడి పండితులల్తో నమానంగా తులతూగి..
గొప్ప మర్యాదలు కూడా పొందినాడు.
 


హరికథలు సాహిత్యంలో ఒక భాగమా ..?
అంటే అన్నీ భాగాలే ..
కానీ ..
శక్తిని బట్టీ ..
వాని వాని వ్యుత్పత్తిని బట్టీ..
ప్రతిభను బట్టీ ..
వెల్లడించుకుంటూ పోతాడు.. 
వైయక్తికంగా ..
అది వాడి వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. 

ప్రతిది కూడా..
సాహిత్యంలో భాగంగా చేసుకోవడానికి అవకాశం ఉన్నది.
 


ఆశ్రమ జీవితం కొంత ఉన్నది. 
కానీ నేనందులో కృతకృత్యుణ్ణి కాలేదు..
అటు తరువాత ..
నేను హిమాలయాలకు పోవటం తటస్థ పడింది..



కానీ ..
ఖుస్రో
ఈ కష్టాలు..
నా జీవితంలో నాకు..
మనుష్యత్వాన్ని నేర్పినాయేమో ..
అని అనిపిస్తుంది. 
ఖుస్రో అని ఒక కవి ఉన్నాడు. 
ఉర్దూలో ..
వాడోటి తమాషాగా అంటాడు. 
దేవుడు కావడం సులభమే..
మనిషి కావడం కష్టం అని.. 

అందువల్ల..
అప్పుడు నేననుభవించిన కష్టాలు..
తిండి లేక నేను బాధపడినటువంటి సన్నివేశాలు..
నేను పొందినటువంటి అవమానాలు..
ఇవన్నీ..
నాలో మనుష్యత్వం పెరగడానికి..
నా అహంకార కక్ష్య తగ్గడానికి..
కారణాలైనాయేమో ..
అవన్నీ లేకపోతే ..
నాలో మనుష్యత్వం బాగా పక్వం అయ్యేది కాదేమో..
నన్న సందేహం నా కిప్పటికీ ఉన్నది.



అందువల్ల ..
ఇబ్బందులూ..
కష్టాలూ..
నాకన్నీ మేలే చేసినాయి.

23 జన, 2012



ప్రజలకందరికీ అర్థమవ్వాలని ఆరంభించిన..
ప్రజాకవిత్వంలో ..
ప్రస్తుతం వస్తున్న కొత్త పోకడలు..
పూర్తి అస్పష్టంగా..
అర్థంగాని రీతిలో ఉంటున్నాయని..
ఓ విమర్శ వుంది. 
ప్రాచీన కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి..
ఓ వ్యాకరణమనో ..
చందశ్శాస్త్రమనో ..
పధ్ధతులున్నాయి..

కానీ ..
నేటి కవిత్వం అర్థం కావడానికి..
ఓ విధానం అంటూ లేదు ..
మరి..
ఈ అస్పష్ట కవిత్వం వల్ల..
ప్రయోజనం ఏమైనా వుందా..?
 
ప్రజాకవిత్వమనే మాట..
సామాజిక స్పృహకు పుట్టిన మరొక కొమ్మ.
కవిత్వమని ఎప్పుడన్నామో ..
అప్పుడే దాని ఫీల్డ్ పరిమితమని అర్థమౌతుంది. 

గిరిజనులకు ..
హరిజనులకు ..
తండాలకు ..
చెంచులకు..
అందరికీ ప్రజా కవిత్వం అర్థం కాదు కదా.. 

కనుక ..
అందరికీ కవిత్వం అర్హమౌతుందనుకోవడం..
ఒక పిచ్చి విశ్వాసం..
పైగా ..
నాకు ఎక్కువ బాధ కలిగించే విషయం ఏమిటంటే ..
ఈ సభల్లో కవిత్వాలు చదవడం..
అనధికారులంతా చప్పట్లు కొడితే..
తన జన్మ కృతార్థమయ్యిందని కవి అనుకోవడం..

నేను సభల్లో ఎక్కువగా కవిత్వం చదవను. 
కవిత్వం ఏకాంతంగా చదువుకుని..
మనసులో భావింపవలసిన పదార్థం. 
దానిని సంతలో పెట్టడం నాకిష్టం లేదు. 
పైగా శ్రోతలు తన వైపుకు అభివృధ్ధి చెందాలని..
రచయిత ప్రయత్నించాలి గానీ ..
వారి స్థాయిని దిగజార్చాలని ప్రయత్నించగూడదు.
 
ఇక కవిత్వంలో అస్పష్టత గురించి..
ఈ రోగాలన్నీ మొదట పాశ్చాత్య దేశాల్లో మొదలౌతాయి. దాన్ని వాళ్ళు ముద్దుగా సింబాలిజం ..
మిల్టన్ ..
అని పిలుచుకుంటారు.

TS ఇలియట్ కూడా..
సింబాలిజం కు చెందిన కవే ..
కానీ ..
అతని పైన భారతీయ అధ్యాత్మిక ప్రభావం వుంది. 
అతడు కొంతవరకు అర్థమౌతాడు. 

 తర్వాత ..
C .డెలిగీస్ ..
W. D. ఆడం 
ఇంకా ..
TS ఇలియట్ 
ఫ్రాయిడ్ ..
అనుయాయులు మరికొందరు ..
రంగంలోకి వచ్చారు 

ఈ నడుమ ..
ఇంగ్లీష్ కవిత్వం చదువుతూ వుంటే ..
మనకు తెలియని పదం ఒకటీ వుండదు. 

కానీ..
వాడేమి చెప్తున్నాడనేది అర్థం కాదు. 
ఈ రోగమే ..
తెలుగుకు పట్టుకుంది. 

ఈ తెగకు చెందినవే ..
క్యూబిజం ..
డాడాయిజం ..
మొదలైన కేకలన్నీ. ..
అవి పాశ్చాత్య దేశాల్లోనే..
ఇప్పుడిప్పుడే చచ్చిపోతున్నాయి..
మన దేశంలో చచ్చిపోవడానికి ..
ఇంకొంచం సమయం పడుతుంది. 

క్యూబిజం అనేది..
చిత్రలేఖనం నుంచీ తీసుకున్న సిధ్ధాంతం..
డాడాయిజం .. 
రెండు యుధ్ధాల తర్వాత.. 
ఆదర్శాలన్నిటినీ గేలి చేయడమే..
ప్రధానంగా పెట్టుకున్నది. 

అసలు వాళ్ళ మనసుల్లోనే ..
షెల్లీ
తాత్కాలిక ప్రయోజనాలు పెట్టుకున్నారు.
 
ప్రాచీన కవిత్వం ఎందుకు అర్థం కాదు...?

ఒక పదం అర్థం కాకపోతే డిక్షనరీ చూసుకుంటాం...
నేను ఫారిన్ లాంగ్వేజెస్ రేడియో వినేవాణ్ణి. 

మిల్టన్ ..
షెల్లీ ..
కీట్స్ ..
మొదలైన వాళ్ళలో ఈ అస్పష్టత వున్నదా..?
లేదు కదా ..?

కీట్స్
దీనికి వాళ్ళు యేవేవో కారణాలు చెప్తారు. 
ఇటువంటి వాటన్నిటికీ ఆయుష్షు వుండదు. తెలుగులోనూ ..


ఇదే పధ్ధతి అయిపోయింది. 
ఒకడు వ్రాసినది.. ఇంకొకడు చదవడు. .
కారణం ..
పరస్పర గౌరవాలు లేవు...
ఎందుకు లేవు...?
ఇద్దరికీ ఏమీ రాదు కనుక ..

కానీ ..
నాకు భవిష్యత్తు పైన నమ్మకం వుంది. 
ఇది ఇలాగే చాలా కాలం కొనసాగుతుందని అనుకోను.
నాకు అనేక మంది ..
పీఠిక రాయమని ..
పుస్తకాలు పంపుతుంటారు. 
నేను రాయను ..
కాకపోతే వాళ్ళు "పొగరుబోతు.."
అని ఓ బిరుదు ఇచ్చుకుంటారు. ..
ఇచ్చుకోనీ ..

మా తట్టు ఒక సామేత వుంది. ..
"కట్టె తిప్పే వాని శక్తి ..
కట్టె నేలకు కొట్టడంలోనే" తెలిసిపోతుందట..

అలాగే మొదటి పేజీలోనే ..
అయ్యగారి సత్తా తెలిసిపోతుంది. 
ఇంక నేనేం రాయను. ..?

అభ్యుదయ కవుల్లో ..
అదందరూ వ్యర్థులని ..
నేనడం లేదు. 
కొందరు బాగా రాసే వాళ్ళున్నారు. 
వాళ్ళు నిలిస్తే నిలవ్వచ్చు.
తక్కిన వాళ్ళంతా షరా..

22 జన, 2012

 
 
సామాజిక స్పృహ ..
ఈ మాటను ఏ మహానుభావుడు..
వాడుకలోకి తెచ్చినాడో కానీ.. 
అప్పటినుండీ ..
ఈ మాట.. స్వైర విహారం చేస్తూ ఉంది..
 
వాళ్ళకు తోచిందంతా వ్రాసి..
సామజిక స్పృహ తెర వెనుక ..
ఎందరో అనక్ష రాక్షసులు ..
సారీ ..
 
అనక్ష  రాశ్యులు..
అల్పాక్ష రాశ్యులు ..
యధేచ్చా విహారం చేస్తూ ఉన్నారు..
 
సాహిత్యం లోకి రాజకీయాలు చొచ్చుకొని వచ్చి..
ప్రతిభ లేని వారికి ..
కల్పవృక్షంలా తయారయ్యింది..
 
ప్రతి ఒక్కడూ ..
ఏదో ఒక రాజకీయ గొడుగు కింద దూరటమూ ..
ఇదంతా కవిత్వమని ప్రజల నెత్తిన రుద్దటమూ.
ఆధునిక కవిత్వమంటే.. 
రాజకీయ కవిత్వమే.
 
 శ్రీ శ్రీ తర్వాత..
ప్రస్థుతం తెలుగు సాహిత్యంలో..
అంతటి ఉత్కృష్ట భావాలు చెప్పేవారు లేకపోవటంతో..
ఆ స్థానం ఖాళీగా ఉందనేది నిజమా..?

నిజమే ..
కానీ ..
ఎందుకు ఎవరూ రాలేదు ..?
దానిక్కారణం సిన్సియారిటీ లేకపోవడమే..

కొందరు మన దేశానికి ..
మన సభ్యతకు దూరంగా ఉండే ..
విదేశీ భావలను జొప్పించి ..
మెస్మరిజం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. 

కానీ ..
అవి నిలవవు..
ఎందుకంటే ..
ఆ భావం ..మన హృదయాల నుంచీ పుట్టింది కాదు 

తిలక్
శ్రీ శ్రీ కవిత్వం చూసామంటే ..
ఇటువంటివి కనపడవు
ఉదా ..
రాబందుల రెక్కల చప్పుడు ..
పొగ గొట్టపు భూంకారం ..
అరణ్యమున హరీంద్ర గర్జన..
అన్నాడు.

ఇందులో ప్రతి భావం ..
మనం అనుభవించిందే.. 
చూసిందే.. 
అందుకే ..
మనసుకు సంపూర్తిగా హత్తుకుపోతుంది..

అధునాతనుల్లో ..
ఒక్క తిలక్ మాత్రం ..
అతని త్రోవలో ..
అతను పరిణతుడుగా నాకు తోస్తాడు..
కానీ పధ్ధతి వేరు.


చందస్సు అంటే ..
గణ యతి ప్రాసలతో ..
కూడుకున్నదేనా ..?
లేక మరేమైనా అర్థం వుందా..?
కవిత్వానికి చందస్సు ఎంతవరకు అవసరం..?


చందస్సు అంటే నా దృష్టిలో ..
ఒక లయ ..
తర్వాత ఎన్నో రీతులుగా ..
దానికి కొమ్మలు రెమ్మలు పుట్టినాయి 
లా కంటే భిన్నమైనదిగా చందస్సు నాకు తోచదు. 
యతి ..ప్రాస ..
అన్ని కూడా ..
శ్రవణ సుఖానికి ఏర్పడ్డవి. ..

తర్వాత శాస్త్రకారులు ప్రవేశించి ..
ఏవేవో వింత వింత పోకడలు పోయినారు.

చందస్సులు ఎన్నని ..?
నువ్వు ఏది రాసినా..
అటో మాటిక్ గా .. 
ఏదో ఒక చందస్సులోకి వస్తుంది
దానికి పేరు పెట్టకపోవచ్చు ..
అది వేరే మాట ..

చందస్సు ప్రస్తారం చేస్తూ పోతే..
అనేక చందస్సులు ఏర్పడతాయి..

వాటినన్నిటినీ నువ్వు వాడకపోవచ్చు..
పేర్లు కూడా లేకపోవచ్చు. ..
సంగీతం కూడా అంతే ..
అనంతావై రాగాః...
అంటారు ..
రాగాలు ఎన్ని..?
అనంతం వాడుకలో వుండేవి ఏ కొన్నో ..

చందస్సులు కూడా అంతే..
చందస్సుకు లయ ప్రాణం..
కనుక..
ఆ లయ ఏ రీతిగా నడచినా ..
ఏదో ఒక చందస్సు అవుతుంది.
శ్రీ శ్రీ చందస్సుల నడుము విరగ్గొడతా అన్నాడే కానీ..
అతడు రాసినదంతా ఏదో ఒక చందస్సులోనిదే.. 


చందో బందో బస్తులన్నీ చట్ ఫట్మని తెంచి ..
అని అన్న శ్రీ శ్రీ రచనలో ..
యతి లేదూ..?
లయ లేదూ..?
స్పష్తంగా దీన్లోనే చందస్సు కనిపిస్తోంది..
 

18 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు-పది కాలాలు నిలిచే కవిత్వం ఏది..?-- పుట్టపర్తి అనూరాధ



పది కాలాలు నిలిచే కవిత్వం ఏది..?
ఒకో దశలో ఒకో రకమైన భావోద్వేగాలు చుట్టుముట్టినపుడు..
తదనుగుణంగా సాహిత్య సృష్టి జరుగుతుంది..
ఆ భావోద్వేగాల తీవ్రత తగ్గిన తరువాత ..
వాని ప్రాధాన్యమూ తగ్గిపోతుంది..
కానీ కొన్ని ..
కాలాలు ఎన్ని మారినా ..
అజరామరమై.. 
మనవులకు దిశా నిర్దేశనం చేస్తూ..
నిలచి వుంటాయి..

అవే మన రామాయణమూ..
భారతమూ..
భాగవతమూ..
తదితరాలు..
రామచంద్ర మూర్తి నడకకు రెండు కాళ్ళు
సత్యం ధర్మం..
ఎంత కష్టం రానివ్వండి ..
సత్యమూ ..ధర్మమూ..
రెంటినీ జీవితంలో విడిచిపెట్టలేదు.
 
సత్యధర్మములను నమ్ముకున్న వానిని ..
ఆ రెండూ ఎలా కాపాడతాయో ..
రామాయణం మనకు చూపిస్తుంది..
సత్యమూ ..ధర్మమూ ..
ఎంతకాలం భూమి పై వుంటాయో ..
అంతకాలం రామాయణం నిలచి వుంటుంది.
ఒక మాట ఎలా మాట్లాడాలో ..
రాముడు నేర్పుతాడు..
ఆమాటకు కట్టుబడటమెలాగో.. 
రాముడు నేర్పుతాడు..
ఇది రామాయణానికి వున్న గొప్పదనం ..
అందుకే మన పెద్దలు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు..
విశ్వనాధవారు రామాయణ కల్పవృక్షం వ్రాస్తూ అంటారు..
మళ్ళీ అందరూ వ్రాసే రామాయణం వ్రాయటమెందుకు..
అంటే ..
ప్రతిపూట తిన్న అన్నమే మళ్ళీ ఎందుకు తింటున్నావ్ అన్నం తినకపోతే వుండలేవు కనుక..
 
రామాయణం లేని నాడు మనిషికి జీవితమే లేదు..
మనిషి జీవితాన్ని..
మనిషి జీవితంగా నిలబెట్ట గలిగిందీ..
 
మనిషిని మనిషిగా ప్రవర్తింప జేయగలిగిందీ..
సృష్టిలో రామాయణమొక్కటే..
 
ఐన్ స్టీన్ ..
కలవడానికెళ్ళాడొకడు....
ఆయన సంస్కృతంలో ఆహ్వానించాడట ..
మన వాడికి అది అర్థం కాలేదు..
ఇది మీ సంస్కృతమే..

నీకు రాదా ..? అని అడిగాడు..
లేదు విన్నాను..

అది మన జవాబు..
 
మీ విజయ రహస్య మేమిటని అడిగితే ..
తన లైబ్రరీకి తీసుకెళ్ళి ..
ఒక పుస్తకం తీసి చేతిలో పెట్టాడుట..


అది మన భగవద్గీత..
తనకు మార్గ దర్శకత్వాన్నిచ్చినదీ గ్రంధమని చెబుతాడాయన..
పరిశోధన .. 
విశ్లేషణ ..
విచారణా .. 
దీర్ఘ దివ్య దృష్టీ ..
ఇచ్చింది ఇదే.. అన్నాడు..


చేసే కర్మను సద్భావనతో చేయి ..
సత్ జ్ఞానంతో చేయి అంటుంది..గీత..
ఏ సంస్కృతిలోని మంచినైనా ..
అంగీకరించడం సంస్కారవంతుల వల్లనే అవుతుంది..

మీ దృష్టిలో ఆధునిక సాహిత్యంలో పదికాలాల పాటు నిలబడగల రచనలేమైనా ఉన్నాయా..
మీవి ఉన్నాయా..
లేవంటే ..ఇంత సాహిత్య కృషీ.. వ్యర్థమైపోయిందనుకోవటానికి ప్రత్యేక కారణాలున్నాయా..
పది కాలాల పాటు నిలిచే కవిత్వాలు లేవని నేనెట్లా చెప్పేది..

ఒకానొకనాడు..
దేశభక్తి కవిత్వాలు ప్రముఖంగా ఉండేవి.. 
అటు తరువాత ..
ఏవో మత కలహాలకు సంబంధించిన గ్రంధాలు.. 
ఈ భావాలన్నీ ..
ఎప్పుడూ తాజాగా ఉంటాయని నాకు నమ్మకం లేదు.
 
ఇలాంటి రచనలన్నీ ..
వాటి అవసరం తీరిపోతూనే ..
మరుగులో పడిపోతాయ్ ..
శ్రీ శ్రీ కవిత్వం కూడా అంతే నేమో ఎవరికి తెలుసూ.. 


కానీ..
రామాయణ భారతాల ఆవశ్యకత ..
ఎప్పుడూ ఉంది.
భారత కథలో సన్నివేశ గాంభీర్యం ఉంది. 
రామాయణ కావ్యంలో రచనా శిల్పం ఉంది. 
సంస్కృత భారతం మన విజ్ఞాన సంపుటి. 
అందువల్ల ..
ఏ కాలంలోనైనా దాన్ని చదువుతాం..
సంస్కృతం పనికిరాదు ..
అది బ్రాహ్మణుల భాష ..
ఇలాంటి పిచ్చి పిచ్చి వాదలు శాశ్వతంగా నిలవవు. 
ఏనాటికైనా..
ఎందరు ద్వేషించినా ..
అగౌరవించినా..
సంస్కృతానికున్న మర్యాద తొలగదు. 

తమిళం కూడా మొదట సంస్కృతాన్ని బహిష్కరించడానికి ప్రయత్నించింది. 
ద్రావిడ నాగరికత కొంత ప్రత్యేకత ఉన్నదని..
వారి వాదంగా ఉండేది. 
వేదాల్లోనే ..
కొన్ని ద్రావిడ పదాలు చొచ్చుకొని పోయినాయని ..
వారు ఈనాటికీ వాదిస్తారు. 
ఏదెట్లున్నా..,
సంస్కృతం తరువాత.. 
తమిళం అంత ప్రాచీన భాష మరొకటి లేదు ..
ఈ దృష్టితో ..
రామాయణం ఆర్య ద్రావిడ నాగరికతల సమ్మేళనాన్ని మనసులో ఉంచుకొని చేసిన కల్పనగా..
కొందరు వాదిస్తారు. 
రామాయణమేమిటి..?
అంతకు ముందే ఆర్యులు ద్రావిడులు కలిసిపోవటం బహుళ ప్రచారంలో ఉంది.
ఇంకూ చెప్పొచ్చేదేమిటంటే..
సంస్కృతానికి లోబడని ..
అనంత శబ్ద సంచయం వారికున్నా సంస్కృతాన్ని బహిష్కరించడం వారికినీ సాధ్యమవలేదు 
ఇలాగా ఎన్ని భావాలు మారినా..
భారతదేశంలో ఆస్థికతా బుధ్ధి పోదేమో ..
అనే విశ్వాసం నాకుంది. 
దానికి సంబంధించి ..
దానికి సంబంధించిన ఉత్తమ శిల్పంతో కూడిన కావ్యాలు నిలుస్థాయేమో నని నా ఆశ. 
నా రచనలేమైనా ఉన్నాయా ..?
అంటే నేనేమీ చెప్పలేను ..
దానిని కాలమే నిర్ణయిస్తుంది.
నా సృష్టి వ్యర్థమైపోయిందని నేనెట్లా అనుకోను..?
నేను కాలంలో నిలుస్తాననే అహంకారం నాకుంది.
మీరు కవిత్వం రాయటం ప్రారంభించిన నాటి నుంచీ..
నేటి వరకూ చూస్తే ..
ఎన్నో మార్పులు వచ్చాయి.

మీరిప్పుడే కవిత్వ రచన ప్రారంభించే దశలో ఉన్నట్లయితే మీరెటువంటి కవిత్వం రాస్తారు..
 
ఈ ప్రశ్న ..
సంస్కారి అయిన వారి విషయంలో వేయదగ్గది కాదు. 
ప్రతిభావంతుడైన కవి ఎవర్నీ గుడ్డిగా అనుసరించడు. 

తన్నితరులు అనుసరించేలా చేసుకుంటాడు.
వాని మార్గాన్ని ..
వాని ప్రతిభ నిర్ణయిస్తుంది. 
ఇప్పుడు ..
నేను రచనను మొదలు పెట్టి ఉండినట్లయితే ..
నా మార్గాన్ని నేను అనుసరించి ఉండేవాణ్ణి..