19 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల తత్వం రమణ తత్వమేనా..??




 ఇది..
శ్రీనివాస ప్రబంధం పీఠిక..
దీనిలో అయ్య ..
ప్రతి పనిలో..
తన ఉపేక్షా భావానికి చింతిల్లినారు..

ఢిల్లీ లోనే అయ్య ఉండినట్లయితే ..
జ్ఞాన పీఠమేం ఖర్మ ..
నోబల్ బహుమానమూ ..
అయ్య ఒడిలో వచ్చి చేరేది..

కడప లాంటి చీకటి ఖండంలో ..
బండ హృదయాల నడుమ ..
అయ్య తన రచనా వ్యాసంగానికి ..
ఉపాసనా జీవనానికీ..
అది ఒక రహస్య మయ స్థావరంగా ..
ఎంచుకున్నారేమో..

ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా..
యేమి నోము నోచె ఈ యశోద..

పరీక్షిత్తు భాగవతం చెబుతుంటే..
లీలాశుకుడు ప్రశ్నించాడట..

అలా..
ఒక పరమ పురుషుడు ..
అక్కడ నడయాడటానికి..
రాయలసీమ లోని రాళ్ళూ.. 
పుణ్యం చేశాయేమో..!!

గిరిధారిలాల్ అరవింద ఆశ్రమవాసి. 
ఒకసారి ..
అతడు రమణమహర్షి దగ్గరకు వచ్చి  ..
పురాణాలు..
ప్రతి యుగం ఇంతకాలం ఉంటుందని ..
ఎందుకు చెప్తాయి..??
అని ..
తన సందేహాన్ని బయటపెట్టాడు గిరిధారి. 

దానికి సమాధానంగా మహర్షి..
‘‘ఒక్కొక్క యుగం..
ఇంతకాలం ఉంటుందని చెప్పడంలో ఉద్దేశం... 
మనిషికి ఉన్న వందేళ్ల జీవితం ..
ఎంత స్వల్పమైనదో తెలుపడమే..."

కాబట్టి..
మనిషి జగత్తులో..
తన స్థానమేమిటో తెలుసుకుని..
తన ప్రాముఖ్యాన్ని..
గొప్పగా భావించకుండా ఉండాలి

మనకు అశాంతిగా అనిపించినప్పుడు ..
పర్వతాలను..
నదులను.., 
నక్షత్రాలను.., 
చంద్రుడిని ..,
చూస్తే శాంతి లభిస్తుంది..
అలాగే ..
ఎంతో దూరంలో ఉన్న,,
గ్రహాల చుట్టూ మన ఆలోచనలను పోనిస్తే ..
‘ఇంత విశాలమైన ఖగోళంలో భూమి ఎంత? 
ఆ భూమి మీద మనమెంత..?
 అన్న భావన ..
ఎవరిలోనైనా ఇట్టే కలుగుతుంది...
అప్పుడు ..
మనిషి ..
తన సంపదలు.., 
పేరుప్రతిష్ఠలను ..
చూసుకుని గర్వపడడానికి.., 
తన కష్టనష్టాలకు కుంగిపోవడానికి ..
అవకాశం ఉండదు... 
అన్నారు రమణులు..
 
రమణులంటే అయ్యకు ప్రాణం..
అందుకే ప్రతిదానిలోనూ ఉపేక్ష..

అనేక మార్గాల్లో..
కీర్తిని కొనుక్కొనే వారిపట్ల అసహ్యం చూపారు..అయ్య
ఇటువంటి వాళ్ళకు..
యేమి రాస్తే యేముందిలే అనే నిర్వేదం..కూడా..

ఇది వ్రాసే సమయంలోనే అమ్మకు అనారోగ్యం..
మాటి మాటికీ ఫిట్సు..
తడవ తడవకూ..
డబ్బులకు  చేయి తడుముకోవలసిన పరిస్థితి..

ఈనాటికి ..
శ్రీనివాస ప్రబంధము..
మొదటి భాగము పూర్తయినది..
ఇంకా రెండవ భాగం ప్రింట్ కావలసి వుంది...

ఈ నడుమ ..
ప్రభుత్వము గ్రంధ ప్రచురణలకు..
సహాయము నిలిపివేసినదని విన్నాను..

మరి ..
ఉత్తరార్థం..
యెప్పుడు గడ్డకు వస్తుందో చెప్పలేను..
అన్నీ ..
ఆ పరమేశ్వరుని దివ్య చిత్తానికి వచ్చినప్పుడే..
వచ్చినట్లే జరుగుతాయి ..
ఈ ప్రబంధం రచన ప్రారంభించి ..
సుమారు ముఫై యేండ్లకు పైగా అయింది... 

ఏ గ్రంధం గానీ ..
మొదలు పెట్టి..
దీక్ష గా ముగించే అలవాటు నాకు లేదు..
కొన్ని సంవత్సరాలు కూడా..
ఆ వైపు చూడకుండా వుండడం కద్దు..

ఈ ఒక్క విషయంలో కాదు..
ప్రతి పనిలోనూ...
నా ప్రవృత్తి ఇంతే ..
ప్రతిపనిలోనూ..
విపరీతమైన ఉపేక్షాభావం. 
తీరా నెత్తిపైకి వచ్చినప్పుడే..
కార్యానికి పూనుకోవడం..

ఈ ఉపేక్షా భావంతో ..
యేన్ని విషయాల్లోనో నష్టపడినాను ..
కానీ ఈ జీవి ప్రవృత్తి అంతే...!!

1939 నుండీ ..
నేను రేడియోలో ఇచ్చిన రచనలు కోకొల్లలు. 
అయినా ..
యే ఒక్కటీ నాదగ్గర లేదు.
దాని ప్రసక్తి తీరుతూనే ..
యెక్కడ పారేస్తానో నాకే తెలియదు...

పైగా..
యేవేవో భావాలు ..
నా జీవితంలో యేంతో మందిని..
హెమవత్శిఖరాల వంటి వారిని చూచినాను...
వారు పేరూ ప్రఖ్యాతీ లేకుండా పోయినారు...!!
మనదేముందిలే అనే భావం. 
నన్నెప్పుడూ పీడిస్తూ వుంటుంది..

పైగా ..
లోన లొటారంగా..
కీర్తిని అనేక మార్గాల్లో..
కొనుక్కునే వాళ్ళను చూచి అసహ్యం 
వీళ్ళకు యేమి రాస్తే యేముందిలే 
అనే భావం ఇంకా యెన్నో..

16 మార్చి, 2012

రామాయణం నేనెందుకు రాసానంటే..??పుట్టపర్తి నారాయణాచార్యులు




రామ నామం ..
ఇప్పటికీ మనల్ని ఎలా ఉధ్ధరిస్తుందీ..??
తెలిసి కానీ..
తెలియక కానీ ..
ఒక్కసారి రామా అన్నారా ..??
లోపల ఉన్న పాప రాశి దగ్ధమైపోతుంది..

మ అమృత బీజం ..
మ అన్నప్పుడు..
 పెదవులు మూసుకుంటాయి ...
ఇంక పాపరాశి లోపలికి ప్రవేశించలేదు..

ర అగ్ని బీజం
" ఓం నమో నారాయణాయ.."
అనే అష్టాక్షరీ మహా మంత్రం లోని ప్రధాన బీజాక్షరం..
మ  పంచాక్షరీ మహా మంత్రం లోనిది..

రెండూ.. రెండు ..అధ్భుతమైన బీజాక్షరాలు..
శివ కేశవులని రెండులేవు ..
ఉన్నదొక్కటే పరబ్రహ్మ స్వరూపం.

ఎలా చూస్తే ..
అలా కనిపిస్తుంది..
ద్భావం ..తద్భవతి..!!

ఒక సారి ..
బ్రహ్మ స్వరూపం అర్థమైందనుకోండీ..
ఏమవుతుంది..??
అపారమైన ఆనందం కలుగుతుంది..

వాల్మీకి 24000శ్లోకాలలో..
 రామాయణాన్ని పూర్తి చేసారు ..
గాయత్రీమహా మంత్రం లోని..
ప్రతి వెయ్యి శ్లోకాలు..
ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం .
గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది.
మిగిలిన మంత్రాలలో ..
ఒక బీజాక్షరం ఉంటుంది.

ఆ బీజాక్షరానికి..
ఒక ఋషి. 
ఒక దైవము.
గాయత్రీ మంత్రం అలా కాదు ..

24 అక్షరాలూ  బీజాక్షరాలే...
24 మంది ఋషులు.
అందుకనే ..
24000 శ్లోకాలలో రామాయణం వచ్చింది.


తులసీరామాయణాన్ని ..
పదమూడు సంవత్సరాలు..
దేక నిష్టతో పారాయణ చేసారు అయ్య..
 

పుణ్యక్షేత్రాలకు బస్సులో వెళ్ళి ..
దారి లో ..

ఎదురైన సాధువులను..
మొక్కుకుంటూ వెళ్ళటమే తప్ప...
 

ఎవరైనా ..
జేబులో పైసా లేకుండా..
సాధు సంతులను వెతుక్కుంటూ వెళ్ళ గలరా..
అదీ ఎందుకు ..??
ఎన్నో కోట్లు జపం చేసినా..

అధ్యాత్మిక మైన అనుభూతులు కలుగలేదని..
అది ఎన్ని సార్లు..

మళ్ళీ ..మళ్ళీ ..విన్నా..
మళ్ళీ ..కొత్త గానే వుంటుంది..!!

అయ్య అలా వెళ్ళారు..

పూర్తి ఇండియా అంతా తిరిగారు..
హిమాలయాలలో..
శివానంద సరస్వతులవారిని కలుసుకోవటం..
ఒక అపురూప మైన అనుభవం..!!

అసలు రామాణం రాసే ఉద్దేశం.. 
నాకెందుకేర్పడిందంటే..
నలభై ఎనిమిదీ ..
నలభై తొమ్మిదీ ..
అప్పుడు కొన్ని కోట్లు ..
జపం చేసుకున్న తరువాత కూడా 
నాకేమీ ఎక్స్ పీరియన్స్ కలగకపోవడంతో ..
నాకు జీవితంపై విరక్తి పుట్టి ..
సాధువులనూ ..
సన్యాసులనూ ..
వెతుక్కుంటూ ఇండియా అంతా తిరిగినాను.

ఆ ఊపులో ..
నేను హిమాలయాలలో..
కొంత కాలం ఉండడమూ..
శివానంద సరస్వతుల యొక్క అనుగ్రహమూ ..
నాపైన ప్రసరించడమూ జరిగింది. 
వారే ఇచ్చింది సరస్వతీ పుత్ర అన్న బిరుదు.

అంతకు ముందు ..
ఎప్పుడు ఎవరు బిరుదులిచ్చినా..
పెట్టుకొనే అలవాటు నాకు లేదు..
చాలా మంది..ఇచ్చినారు..
ఆ ప్రొద్దుటూరులో అభినవ కాళిదాసన్నారు 
నాచన సోముడన్నారు.
చాలా ..
ఆ గద్వాలలో ..
చాలా చిన్న వయసులోనే అభినవ పోతన.. అన్నారు. 

ఒక రూపాయ్ ఇస్తే ..
అపధ్ధం చెబుతాను నేను.. 
ఇటువంటివాణ్ణి ..
అభినవ పోతన.. అని ఎందుకంటావు..??
అని నమస్కారం పెట్టి వచ్చేసినాను. 
తరువాత బాపట్ల లో 
కవి సార్వభౌమ అని బిరుదు ఇచ్చినారు.
 వెనక్కే ఇచ్చేసినాను..

అయ్యా నేను బీదవాణ్ణి...
నాకు డబ్బు లేక ..మీ ఊరికి వచ్చినాను..
వెయ్యి రూపాయలు ఇచ్చినారు...
ఇంకో నూట పదహార్లు కలిపి ఇవ్వండి 
సంతోషపడతాను. 
కవి సార్వ భౌమ బిరుదు మీరే వెనక్కి తీసుకోండి..
 
సాధారణంగా..
ఎక్కడ బిరుదులిచ్చినప్పటికిన్నీ గూడా ..
ఒప్పుకునే మనస్తత్వం నాకు లేదు..
 నాకెందుకయ్యా.. కొత్త బిరుదు...
నేను పుట్టపర్తి నారాయణాచార్యులు ..
అంతే..

నేను అభినవ కాళిదాసూ కాదూ..
ఎవడూ కాదు.. 
కానీ ఆ శివానంద సరస్వతి ఇచ్చిన 
బిరుదు మాత్రం ఉంది. 
మరి వారు నిర్భంధించినారు. 

నేను కైలాసంలో ..
ప్రాణత్యాగం చేయవలెనని ..పోతూ ఉండినాను.
 ఆ గంగ ఒడ్డున శివానందులు 
అక్కడ ఉన్నారని నాకు తెలియదు. 
ఆయన పుస్తకాలు చదివినాను ..

నేనా గంగ ఒడ్డున నడిచి వెళ్ళే సన్నివేశం..
ఆయన ధ్యాన మందిరం ముంచీ ..
గడ్డకు వచ్చే సన్నివేశం ..
రెండూ ఒకేసారి జరిగాయి...!!
who are you..?
where are you going  ..?

అని ఆయన నన్నడిగినారు.

సరే..
నా కథ నేను చెప్పినాను..
లోపలికి పోదాం రమ్మన్నాడు.
కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాడు. ..
ఆయన అన్ని విద్యల లోనూ పరీక్షించినాడు...

అంటే ..
భాగవతమన్నాడు..
సంస్కృతమన్నాడు. ..
ఇతర భాషల్లో ..అన్నాడు..
సంగీతమన్నాడు..
నాట్యం వచ్చునా ..??
అన్నాడు ..
అన్నీ అడిగినాడు.. 
కొంతకాలం వారితో ఉన్నాను నేను
ఆయన సరస్వతీ పుత్ర అనే బిరుదిచ్చి..

నాయనా..
దీన్ని నువ్వు వాడుకోవలె ..
నామీద ఉన్న గౌరవంతో ..
 అని అన్నాడు. 
నువ్వు వెనక్కి పో ..
నీకింకా కొంత కర్మ శేషమున్నది...
 అంతా తృప్తిగా అనుభవించు ..
నువ్వు దేనికీ భయపడవద్దు. !!
నీది ఉత్తమమైన జన్మ. 
అని చెప్పి ఆయన వెనక్కు పంపించినాడు.
ఆయన పుస్తకాలన్నీ ఇచ్చి...
 
ఒకసారి ..
కాశీ నుంచీ ..లక్నోకు పోతూ ఉన్నాను. 
మన దగ్గరేముందీ.. 
టికెట్టా ..??బకెట్టా ..?
షష్టి పంచె కట్టుకోని పోతున్నాను. 
లోపలంతా జనం దిక్కులేనంతమంది ఉన్నారు. 
ఆ కడ్డీలు పట్టుకుని నిలబడున్నారు. 
పోతూ ఉంది ట్రెయిన్..

ఆ లోపల్నుంచీ.. ఎవరో ..
తులసీ రామాయణంలో ఒక లైన్ చెప్పినారు. అప్పుడారంభించినాను..
 
బిను సత్ సంగ వివేకనహోయీ--
రామకృపా బిను సులభనసోయీ..
సత్సంగతి ముదమంగలమూలా--
సోయి పరసిధ్ధి సత్ సాధన ఫూలా..
సరసు తరహి సత్ సంగతిపాయీ--
పారస పరసి కుధాత్ సుఖాయీ
బిదిబస సంగ సంగతి పరహీ--
ఫణమని సమ నిజగున్ అనుసరహీ..
అని అందుకున్నాను...
 
కౌన్ హై బాహర్ మహరాజ్..
అందర్ ఆయియే..
అందర్ ఆయియే ..మహరాజ్..
అన్నారెవరో..

ఒక బెంచీ నాకు ఖాళీ చేసి ఇచ్చినారు. 
తరువాత ..
పండ్లు పాలు ఇచ్చినారు...

ఆప్ ఇధర్ జానా హై ..అన్నారు ..
హమే తో హరిద్వార్ జానా హై..
 అన్నాను. .

టికెట్ హై ఆప్ కే పాస్ ..??
అన్నారు ..

హం బైరాగి ..అన్నాను. ..
అప్పుడు లక్నో నుంచీ టికెట్ తీసిచ్చినారు...!!

తరువాత ..
హరిద్వార్ వరకూ ..
కు రాజభోగం జరిగిందనమాట.. ..
నవ్వు.. 

ఓహో ..
తులసీ రామాయణమంటే..
ఉత్తర భారతంలో ..
అంత గౌరవముందన్నమాట..!!


ఇటువంటిది ..
తెలుగులో ఒకటి వస్తే బాగుంటుంది కదా.. !!
అనేటటువంటి సంకల్పం..
అప్పుడే పుట్టింది నాక

దువల్ల 
నేను రాసిన ..
జనప్రియ రామాయణం పైన..
తులసీ రామాయణం ఇన్ ఫ్లుయన్స్ ..
 ఒక్కటే కాదు... 
ఏకనాధ భాగవతం ఇన్ ఫ్లుయెన్స్ ఉన్నదీ ..
కబీరు సూక్తులూ ప్రతిఫలించినాయి. 
కంబ రామాయణం ఇన్ ఫ్లుయెన్స్  ఉన్నది..!!


14 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల పద్మశ్రీ ఫొటో కథ..



పై ఫొటొ చూసారా..??
అయ్య కు పద్మశ్రీ వచ్చినప్పటిదిది అయ్య ఇందిరా గాంధీ తదితరులు ఉన్నారిందులో..
కానీ ఎందుకో ..
అయ్య కనుబొమ్మలు చిట్లించి ఉన్నారు ..
ఎందుకట..??
ఎందుకంటే..
అయ్య వెనకాతల..
 ఓ అందమైన అమ్మాయి నిల్చుందిగా..
ఆమె అయ్యను మరీ ఆనుకుని నిల్చుందిట..
అది అయ్యకు నచ్చలేదు..
అందుకే ..
అయ్య అలా ఉన్నారట..
నా చిన్న తనంలో ..
అమ్మ ..అక్కయ్యలు ..చెప్పి నవ్వుకొనేవారు..
రహస్యం ..
ఎవరికీ చెప్పకండి..!!

13 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణా చార్యుల ఆధ్యాత్మిక అనుభవం









ఎవరు ఎంతెంత..
జ్ఞానం వేపు నడుస్తుంటే..
వాళ్ళతో ఆడుకోవటం పరమాత్మకు..
అంత సరదాగా ఉంటుంది....

పరతత్వ దర్శనం చేసిన వాడితో..
భగవంతుడు కూడా ..
పరాచికమాడతాడు..!!

మరీ బిర్ర బిగుసుకుపోయి..
అజ్ఞానంలో ఉన్నవాడిని చూసి..
వీడితో  నాకేంటి ఫో అంటాడు ..
ఆయన కూడా ..!!

లీలా శుకునికి ..
పరమాత్ముడు శ్రీరాముని రూపంలో కనిపించి..
తమాషా చేసాడు..

ఆయన మీరు భగవంతుడే ..
నేను మీకు నమస్కరించాలి..
లేకపోతే నా యందు దోషం ఉండి పోతుంది..
దోషం రాకుండా ..
మీరొక సర్దుబాటు చెయ్యండీ..
నేను నమస్కారం చేస్తానన్నాడు..

మీరు శ్రీ కృష్ణుడై..
నెమలి ఈక పెట్టుకుని..
వేణువు పట్టుకుని..
కనిపిస్తే నమస్కరిస్తానన్నాడు..
సాక్షాత్తూ..భగవంతుడే ..
అతని కృష్ణ భక్తిని చూసి ఆశ్చర్య పోయాడు..

ఆయనెలా ఆడాడో..
ఈయన అలానే ఆడాడు..

విహాయ కోదండ శరౌ ముహూర్తం ..
గృహాణ పాణౌ మణి చారు వేణుం..
మయూర వర్ధంచ నిజోత్తమాంగే ..
సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్..
అలా రండి ..
మీకు నమస్కారం చేస్తానని దానర్థం..

రామ కృష్ణులు ..
వీరిదొక అనుభవం..
 
అమ్మా ..
ఎంతకాలం ఇలా జపిస్తూ కూచోవటం..??
నా జప తపాలు శూన్యమేనా ..??
నేను నిన్నెందుకు దర్శించలేక పోతున్నాను..??

ఇక ఈ జన్మకు..
నీవు నాకు కనిపించవా అమ్మా..??
అని ఆవేదన చెంది..

అమ్మ చేతనమా..??
అచేతనమా..??

చేతనమైతే ..
నా బాధ ఆమెకు తెలియదా.. ??
నా ఏడుపు ఆమెకు వినిపించదా..??
అనుకుని దగ్గరికి వెళ్ళి ..
అమ్మ ముక్కు కింద వేలు పెట్టి చూసాడు.

ఆ మహాను భావునికి..
 కాళికా మాత ..
ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు గోచరించాయి..
ఉలిక్కి పడ్డాడు..

అంతే..

అమ్మా..
నన్ను క్షమించు ..
తల్లీ ..
నేను ఎంత పొరపాటు చేసానో చూడు..!!
నీవే లేనిచో నేనుండగలనా అమ్మా..??

ఏనాటికైనా ..
నీవు నాకు దర్శన మిస్తావు..
అని మురిసి పోయాడు..


ఇలాంటి సంఘటనలు ..
అయ్య అమ్మల జీవితంలో..
అడుగడుగునా వున్నాయి..


ఎందుకంటే ..
అయ్య పరుగెప్పుడూ..
పరతత్వం వేపే కాబట్టీ..


రామనవమికి 
భద్రాచలం వెళుతున్నారు..
అయ్యా ..
రఘూత్తమ రావ్..


భద్రాచలం ఇప్పట్లా డెవలప్ కాలేదు..
ఇసుకలో గుడారాలు..
కిలో మీటరు నడిస్తేనే మంచి నీళ్ళు..
అంత దూరమూ నడిచి ..
ఒక చిన్న కూజాతో నీళ్ళు పట్టుకొచ్చాడు..
మన రఘూత్తముడు.
 
ఒక గుడారంలో ..
అయ్య ..రఘూత్తముడు.
లోపల ..అయ్య ..
రామ చరిత మానస్.. పారాయణం
బయట స్టూలుపై ..
రఘూత్తముని కాపలా..
 
ఇంతలో ..
ఒక కాషాయాంబర ధారి..
ఒక పొడవు గడ్డము వాడు..
కడపనుంచీ వచ్చిన ..
పుట్టపర్తి నారాయణాచార్యులెక్కడా..?
అని అందరినీ విచారిస్తూ..
విచారిస్తూ..

వస్తున్నాడట..
 
ఇది సత్యం..
కల్పితం ఎంత మాత్రమూ కాదు..
 
వచ్చి.. వచ్చి ..
రఘూత్తముణ్ణి అడిగాడు..
అవును సరి అయిన ప్రదేశానికే వచ్చావు..
ఏమిటి పని..?
స్వామి వారు ..

లోపల పారాయణలో ఉన్నారు..
 

అవునా ..
చూద్దామని వచ్చానే..
కాసిని నీళ్ళియ్యవా..
ఎండనపడి వచ్చాను..
దాహంగా వుంది..
అడిగాడు అతను..
 
ఏమిటీ నీళ్ళే..?
కిలో మీటరు దూరం  ..
ఎండలో ఇసుకన నడిచి చూడు ..
రాముడు కనిపిస్తాడు..
కూజాడు నీళ్ళున్నాయ్ ..


ఆ నీళ్ళు నీకిస్తే ..
మేమేం తాగాలట..
స్వామికి డిస్టర్బ్ అవుతుంది.. 
వెళ్ళు..
అన్నాడట ..

ఇక్కడ రఘూత్తముని 
గురు భక్తి చూడండి..
 

మనకు ఓ శ్లోకం ఉంది.                             
నాస్తి గంగా సమం స్నానం ..
నాస్తి రూపం గురోః సమం..
నాస్తి గాయత్ర్యాః మంత్రం..
న మాతుః పర దైవతం..
 
ఈ లోకంలో గంగ కంటే పవిత్ర స్నానం ..
ఈ నదికీ వర్తించదు..
గందా నదిలో స్నానం చేస్తే..
ఇంక ఏ నదిలో ..
స్నానం చేయక పోయినా పరవాలేదు..


గురువు కంటే ..
ఈ లోకంలో ఎవరు గొప్ప వ్యక్తి కాదు...
గాయత్రి కంటే..
 గొప మంత్రం యేదీ లేదు..
తల్లికి మించిన దైవం లేదు..
అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
పేగు బంధం ..

ఎప్పుడు బాధ కలిగినా ..
"అమ్మా .."
అంటాం..
తల్లిని ప్రకృతి మనకు పరిచయం చసింది..
 

అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
యే ఒక్కటి పట్టుకున్నా..
పరమాత్మ వశుడవుతాడు.. .

 
కొంతసేపటి ..
అయ్య పారాయణ ముగిసింది..
ఎవరొచ్చారు..?
ఎవరో ..
మీ పేరు చెబుతూ ..
కడప నుంచీ పుట్టపర్తి నారాయణాచార్యులొచ్చారు..
ఎక్కడా ..
ఎక్కడా.. 
అని అందరినీ అడుగుతున్నాడు..స్వామీ
 
ఇక్కడ కొచ్చి..
దాహంగా వుంది ..
మంచినీళ్ళివ్వమన్నాడు..
నేను ఇవ్వలేదు..
 
ఇక్కడ నన్నెరిగిన వాళ్ళెవరున్నారు..?
ఏమో స్వామీ..
ఓరి దరిద్రుడా ..
ఎంత పని చేసావురా..
వచ్చిన వాడు శ్రీరామ చంద్రుడేరా..

అవునా..?
నా పేరు అడుగుతూ..
వెతుకుతున్న వాడు ..
ఆయన కాక ఇంకెవరు..?
మనం ఆయనను పారాయణతో పిలిస్తే..
ఆయన మన పేరు పిలుస్తూ వచ్చాడురా..
 
అని తిట్టుకుంటూ ..
ఆ ఎర్రటి ఎండలో ..
కణ కణలాడే ఇసుక లో వట్టి పాదాలతో పరిగెడుతూ
అరుస్తూ ..
పిలుస్తూ..
ముందు..
అయ్య ..


వెనక..రఘూత్తముడూ..
 


12 మార్చి, 2012

పుట్టపర్తి కనకమ్మ అప్పగింతల పాట..-పుట్టపర్తి అనూరాధ






అయోధ్యాకాండ లో..
అత్రి మహర్షి.. 
అనసూయను చూపించి..
ఈమె అనసూయ..
 నా భార్య ..
సమస్త భూతముల చేత ..
నమస్కరించబడేంత యోగ్యురాలు..

రామా.. 
నీవు సీతమ్మకు చెప్పు..                        
ఈమెకు నమస్కరించమని..
అన్నాడు..


అత్రి మహర్షికి తెలియదా..??
వచ్చినావిడ శ్రీ మహాలక్ష్మి అని..
సీతమ్మ ..
సాక్షాత్తూ లక్ష్మీ దేవి అయినా..
చిరునవ్వుతో నమస్కరించింది..
"అమ్మా కుశలమా..?"
అంది..                                           

సీతా నీవు సకల సౌభాగ్యవతివి..
అంది అనసూయమ్మ.

సీత ..
ఏం సౌభాగ్యమమ్మా ..
మేం క్షత్రియులం ..
ఇదిగో ఇలా అడవిలో పడ్డాం.. 
చూసారా ..
మా ఆయనకు కాళ్ళకు చెప్పులు కూడా లేవు..
అనలేదు..



అవును ..
సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని అనుగమించడం లో గొప్పేముందమ్మా..
అంది..


రావణాసురుడు 
అందరు స్త్రీలను తెచ్చి అనుభవించే కామి..
కానీ ..
మండోదరి మహా పతివ్రత..
వాలి ...
తమ్ముని భార్యను తెచ్చి ..
బలవంతంగా తన భార్యను చేసుకున్న వాడు..
కానీ ..
వాలి భార్య తార మహా పతివ్రత..


పురుషుడు దుర్మార్గుడై.. 
చేతకానివాడై..
కఠినుడై ..
భార్యను విడిచిపెట్టి తిరిగే టటువంటి వాడై వుంటే అటువంటి వాడిని కూడా అనుగమించి..
తిరిగే స్త్రీ గొప్పదేమో..

 
సకల లక్షణ లక్షితుడై ..
అమృతము వంటి హృదయము గలవాడై ..
ధర్మాత్ముడైన..
నా భర్త మాట ..
నేను వినడంలో గొప్పతనమేముందమ్మా.. 
అంది సీత..
 
వివాహం చేసే టప్పుడు ..
అగ్ని కార్యంలో ..
పక్కన కూచో బెట్టుకుని ..
మా అమ్మ నాకీ విషయాలే చెప్పిందమ్మా.. 
అంది కూడా..
 


ఆడపిల్లని కన్నతల్లి 
కన్యాదానం చేసే సమయంలో 
నీ అత్తగారిని ఇలా అను..
నీమామ గారిని ఇలా అను..
మీ ఆయన్ని ఇలా లొంగదీసుకో
మీ అత్తమామల నుంచీ కొదుకును వేరు చేయి
అల్లుడు మనింటికి రావాలి 
అల్లుడిని గౌరవించకూడదు.. 
అతడి తల్లీ తండ్రీ యేమైపోతే మనకెందుకు..
ఈ దిక్కు మాలిన కబుర్లు కాదు..
తల్లి తన కూతురికి చెప్పవలసినది..
 
అత్తవారింటి వైభవాన్ని నిలబెట్టు..
నీ భర్త మనస్సును చూరగొను ..
ఆయన వెనుక అనుగమించు..
నీకు ఇవ్వాల్టి నుంచీ ప్రత్యక్ష్య దైవం నీ భర్త ..
తండ్రితో సమానం మీ మామ గారు.. 
మీ అత్త గారిని నన్ను గౌరవించినట్లె గౌరవించు..
అని నేర్పాలి..
 
పాపమా తల్లి..
ఇరవై సంవత్సరాలు ప్రేమించి..
 పెంచి ..పెద్ద చేసిన కొడుకును ..
నీ చేతిలో పెడుతూంది..
ఆమె కడుపు మండేత తప్పు నీవు చేయకు..
అని చెప్పి ..
అత్తవారింటికి పంపాలి..
అన్నారు చాగంటి వారు. 

అమ్మకు ..
ముఫయ్ ముఫయయిదేళ్ళ వయసులో..
మా పెద్దక్కయ్య పెండ్లి అయ్యింది..
అంటే అక్కయ్యకు సరిగ్గా ఇరవై..
తరువాత్తరువాత.. 
ముగ్గురు ఆడపిల్లల పెళ్ళి చేసి నప్పుడు..
 అమ్మ కొంత రాటుదేలి వుంటుంది..
 
ఆ దుఃఖంలో అమ్మ ..
అప్పగింతల పాట వ్రాసింది..
 
చూడండీ ..
అందులో అమ్మ
సీతకు వాళ్ళమ్మ చెప్పిన బుధ్ధులే చెప్పింది..
 
ఇది ఎంతో ప్రసిధ్ధి పొందిన పాట..
ఈ పాట పాడుతూ ..
కంటనీరు రాని వాళ్ళు వుండరు...
సాధారణంగా ..
అందరూ అప్పగింతల లో..
అమ్మ వ్రాసిన పాటను పాడుతుంటారు..

మా అక్కయ్యల కందరికీ..
అప్పగింతల సమయంలో..
అమ్మ ఈ పాటను పాడి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
కానీ ..
నాకా అదృష్టం లేదు..
ఈ పాట మాత్రం ..
అమ్మ అమృత హృదయాన్ని..
జ్ఞాపకం తెస్తూ వుంటుంది...
అప్పుడప్పుడూ..
ఈ పాట పాడుకుని..
నా కళ్ళ నీళ్ళు..
నేనే తుడుచు కుంటూ ఉంటాను..


అమ్మరో..కౌసల్యా..
అతివ సుకుమారియగు..
ఇమ్మహీజాత గైకొమ్మ..వేవేగ..
సమ్మతిగ నీ సుతకు ...
సమముగా చూతువని..
నమ్మి మదిలోన మాయమ్మనొప్పించెదను..    
అమ్మరో కౌసల్యా..


మా ఇంటిలో వెలుగు..
మా కంటిలో పాప..
మాదు హృద్పేటికను ..
మలయు రత్నమ్మూ..
మా మనో రధ ఫలము..
మా వంశ గౌరవము..
మీ ఇంటి కనిపెదము.. 
నెలతరో కోడలిగా..
అమ్మరో.. కౌసల్యా....


మా ఇంట పారాడు..
మహ లక్ష్మి జానకిని..
మీ ఇంటిలోనుండ ..
మేమంపుచుండా..
వేయి కన్నుల గాచి ..
వేసరక పోషించి..
చేయి విడువను మనసు .
చేదు మింగినటుండే..
అమ్మరో కౌసల్యా..

పుట్టినప్పటినుంచి..
చిట్టిమాటల మనసు..
అట్టే భ్రమియించి ..
మది నానంద పరచీ..
కట్టకడ కెటులైన..
కాంతు జేరెడునంచు..
పట్టరాని ముదమ్ము..
పరిఢవిల్లేమనమ్మూ..
అమ్మరో కౌసల్యా..


తొలిఝాముననే లేచి..
ఇలుదీర్చి..పెద్దలకు
తలవంచి యువనీత..
లలిత గతులా..
పులుగడుగు ముత్తెమై..
పుట్టువెరుగని సీత..
తలలోని నాల్క వలె ..
మెలగు మీ ఇంటయనీ..
అమ్మరో కౌసల్యా..


ఎన్నేండ్లు పెంచినా..
ఎన్ని గోములు పడిన..
కన్న కడుపేయైనగాని ..కడపటికీ..
సన్నుతాంగుని భాను 
సన్నిభుని పతి గూడి..
కన్నె తానేగునని ..
అనుకొంటి..కనుగొంటీ.. 
అమ్మరో  ..కౌసల్యా..


తొలిప్రాయమున తండ్రి..
మలి ప్రాయమున భర్త..
మలి వయసునను సుతుడు.. 
పడతి కెపుడూ..
కలిగి రక్షింపగా..
తులలేని సౌఖ్యాల..
తులతూగునని ధాత..
లలనలకు వ్రాసెననీ..
అమ్మరో.. కౌసల్యా..


అత్త మామల ఆజ్ఞ..
అనుసరించు విధమ్మూ..
బావ మరదుల మాట ..
పాటించు విధమూ..
ఇరుగు పొరుగుల వారి 
నేమరకటంచునే..
నరమరికలను చాల..
 కలవరించితినమ్మా..
అమ్మరో.. కౌసల్యా..


ఆడుబిడ్డల మనసు .. 
అలరించెడు విధమ్ము..
ఈడువారలగూడి ..
యాడు విధమూ..
వాడగల వారలకు ..
తోడుగా నగు విధము..
ఈడు లేని విధాన..
నేర్పించినానమ్మా..
అమ్మరో ..కౌసల్యా..


జననమొందిన ఇంట..
చన్న ఇంటను గూడ..
వినయగా నేడు..
తరముల వారికెల్లా..
అనయంబు కీర్తి 
దెచ్చినదంచు జనులెల్లా..
కనుగొనగ కనులార..
అనిపెదము ఈ బాల.. 
అమ్మరో ..కౌసల్యా..

పసితనపు చాపలము ..
వశముగా నేమైన..
కసటు మాటలు బల్కా..
కష్టపడబోకూ..
పసిబాలికయే గాని..
పడతీ ప్రౌఢాంగనా..
వశవాక్కు గాదమ్మ.. 
దొసగులను మన్నించీ..
అమ్మరో ..కౌసల్యా..