5 సెప్టెం, 2013

తిరుప్పావై




తిరుప్పావై ఉపన్యాసాలు 
నల్లకుంట రామాలయంలో 1976 న జరిగాయి
గొప్ప వక్తగా పేరు గడించిన పుట్టపర్తి
శ్రీ వైష్ణవులకు ఎంతో ప్రీతిపాత్రమైన 
తిరుప్పావై ని హృదయంగమంగా చెప్పారు

దారిద్ర్యాన్ని భరించలేని ఒక భాగవతుడు 
స్పర్శచేతనే బంగారాన్నిగా వస్తువులను మార్చగలిగే 
ఒక మూలికను సంపాదించి 
స్పర్శ భాగవతుడుగా పేరు గడించాడట..

ఒకరోజు నామదేవుని ఇంటిలో 
నిత్యావసర వస్తువులు నిండుకున్నాయట
ఆయన శిష్యులు ఈ స్పర్శ భాగవతోత్తముని అరువడిగి 
ఆమూలికని తెచ్చుకున్నారు

విషయం విన్న నామదేవుడు కోపోద్రిక్తుడై
ఆ మూలికని బావిలో పారేశాడు
గగ్గోలు పెడుతూ వచ్చాడు దాని యజమాని

తుఛ్చమైన బంగారం కోసం 
బంగారం వంటి భక్తిని అమ్ముకున్నావు కదరా 
అని మందలించి
ఈ బావిలో ఎన్ని రాళ్ళు కావాలో ఏరుకో 
ప్రతిరాయీ బంగారమే అన్నాడట నామదేవుడు

అసలు భగవంతుని ప్రీతిని పొందడానికి 
దారిద్రయం ఒక అర్హతేమో
లేక 
భక్తులు భగవంతుని కోసం 
స్వఛ్చందంగా దారిద్ర్యాన్ని కౌగిలించుకున్నారో ..?

అందుకే 
ఎంత కావాలో అంతే సంపాదించి
అవసరాలకు సరిపడా వాడుకుని
మిగిలినదానిని  అతి తేలికగా వదిలి వేయగలగడం ఎవరికి సాధ్యం.. 


ఇది కేవలం ఒక ఉపకథ మాత్రమే..
ధనుర్మాసంలో తెల్లవారు ఝామున తిరుప్పావై 
పారాయణ చేయటం తమిళుల అయ్యంగార్లకు
మన తెలుగు వైష్ణవులకు ఆచారం

గోదాదేవి విష్ణువుని కీర్తిస్తూ తమిళంలో గానం చేసిన 
పాశురాలే ఈ "తిరుప్పవై"
పెళ్ళి కాని అమ్మాయిల చేత ఈ తిరుప్పావై పారాయణ చేయిస్తారు 
వైష్ణవులు శ్రీ మహావిష్ణువు వంటి భర్త దొరకాలని

సేకరణ శ్రీ రామావఝుల శ్రీశైలం 















ప్రొద్దుటూరులో పుట్టపర్తికి నివాళి


Madam
Please see the attached paper clippings 
where tributes were paid tor your father.
Rallapalli Ramasubbarao
Retired Tahsildar & President
Brahmana Maha Sabha,
Nellore,  524003

9908269665
Please visit <www.nellorebrahjmins.com>


సెప్టెంబరు ఒకటవతేదీ పుట్టపర్తి
పరమాత్మలో ఐక్యమైన  రోజు
ప్రొద్దుటూరులో పుట్టపర్తి అభిమానులు 
మా అయ్య శిలావిగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించారు



దీనిని రామసుబ్బారెడ్డి  మాకు అందించారు

మా అక్కయ్య నాగపద్మిని ద్వారా ఇది నాకు అందింది 





30 ఆగ, 2013

డాక్టర్ గరికపాటి నరసింహ రావ్ గారు యేం చెప్పారు..



త్రిపుటి చాలా విలువైన గ్రంధం..
పుట్టపర్తి వారి పాండిత్యానికీ,
వ్యంగ్య విన్యాసానికి యీ వ్యాసాలు దర్పణాలు








గరికపాటినరసింహారావు గారు 
సుప్రసిధ్ధ అవధానులు
ధారణ  విద్యలో నిష్ణాతులు


ధారణ బ్రహ్మ రాక్షస
శతావధాన గీష్పతి
అవధాన శారద
వీరి బిరుదాలు









18 ఆగ, 2013

"యోగ మూలము" రచన : శ్రీ పి. బాలయ్య శ్రేష్టి పుట్టపర్తి నారాయణాచార్యుల సమీక్ష


During my visit to Nellore on 16.08.2013, 
I have picked up a peetika (on 24.03.1948 @ Proddatur) written by ayyagaru,
 in santhanam old Book Shop @ Nellore.

Original  " - Basis of yoga in English (Aurobindo)
Telugu : translation :- Yoga Mulam by P. Balaiah Sresti
Pages - 172 III Edition Jan 1982
Publication  : Auribindo Ashram, Pondicherry

I am enclosing the scanned copies of the peetika of ayyagaru.


with regards


R. Sreesailam
 





12 ఆగ, 2013

రాష్ట్రపతిగారి సతీమణి పుస్తకమా ,,???



ఒకసారి 
రాయలు బెద్దనామాత్యులను 
మహాకావ్య రచనకై ప్రేరేపించెను 
వారన్నారు ..



"నీకు గావలసినప్పుడంతయు 
గవిత్వము వ్రాయుటకు నాకు సాధ్యపడదు..
నా కవితా రచన కనేకోపకరణములు గావలెను.. 
ఊయలమంచముండవలెను..

నాయూహలను దెలిసి వ్రాయగల లేఖకులు గావలెను..
నా పద్యములను 
మధుర రాగ యుక్తముగ ..
నర్థమును జెరుపక ..
గానముసేయగల బాఠకులు బరివేష్టింపవలెను..

ఆత్మకింపయిన భోజనముండవలెను..
రమణీయమగు స్వరూపముగల రమణీమణులు 
దెచ్చియిచ్చు కర్పూర తాంబూలము గావలెను..

ఇన్ని సాధనములు గుదిరినప్పుడే ..
కవిత్వము నాకు దొరలును..

రాయలీ సమాధానమునకు గోపపడలేదు..
వారు జిరునవ్వు నవ్వి ..
యట్లేగానిమ్మన్నారు..

తరువాత నెంతయోకాలము గడచెను
మరల రాయలు పెద్దనామాత్యులను 
గావ్యరచనకై యడుగలేదు

రాయల యాస్థానమున నున్న విద్వాంసులకు 
స్వాతంత్ర్యము మెండు
వారొక్కొక్కసారి..
రాయల యానతికి గూడ బదులొసగుచుండిరి.. 

రాయల నీతి కథలలోని 
కవిసన్మానము కథలోని పంక్తులివి..

శ్రికృష్ణదేవ రాయలు కళాపిపాసి
ఎందరో కవులని ఆయన ప్రొత్సహించాడు
అష్టదిగ్గజాలని తన పక్కన ఉంచుకొని పాలనతో పాటూ కవితారసాస్వాదన కూడా చేస్తూ తన కాలాన్ని 'స్వర్ణయుగ'మనిపించుకున్నాడు.

నాటి కవులు 
ఒకరిని మించి మరొకరు కవిత్వ సృష్టిచేస్తూ వచ్చారు
కవిత్వం కన్నా పాండిత్యానికి పెద్దపీట వుండేది

పాండిత్యంలో ఒకరినొకరు ఓడించుకొని 
'నేనే మహాపండితుడి'నని భుజాలు విరుచుకొనేవారు
తర్వాత్తర్వాత కవిత్వం పలుచబడూ ..బడుతూ ..
వచనకవిత్వం దాకా వచ్చింది
నేటికి వచన కవిత్వం పచన కవిత్వమైపోయిందేమో కూడా

చాగంటి వారొక సారి ఒక తమాషాకధ చెప్పారు
ఎవ్వడినైనా 
'ఒరే ..నీకు సరస్వతీ కటాక్షం లేదురా..'
అంటే 
'ఏవిటండీ అలా మాట్లాడతారు.. 
నాకెంత తెలుసో మీకేం తెలుసు..?'
అంటాడు

'ఒరే నీకు లక్ష్మీ కటాక్షం ఉందిరా..
 అంటే
'అబ్బే ఎక్కడిదండీ ..
ఆవచ్చేది వడ్డీలకే సరిపోటం లేదు..
ఏదో వంశపారంపర్యంగా వస్తోందని చేస్తున్నామంతే..'
అంటాట్ట..

అలా ఈనాటి కవులు కూడా
తలలో పుట్టిన కవితలను 
వెంటనే అక్షర రూపమూ 
ఆ వెంటనే ముద్రణ రూపమూ ఇచ్చి
వాటిని అందరికీ ఉచితంగా పంచిపెడుతూ
మంచి సమీక్షలకోసం 
అభిప్రాయాలకోసం అడ్డమైన గడ్డీ కరుస్తూంటారు 

"నే ను వ్రాసిన పద్యముల సంఖ్య , 
ప్రకటింప బడినవాని సంఖ్య, 
సుమారు ఇరువది వేలుండ వచ్చును. 
నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును "


"ఒకసారి నా సన్మాన సభలో 
నూరుమందివరకూ కవిత్వాలు నాపై వ్రాసారు
అప్పటికప్పుడు 
అక్కడికక్కడ కూచుని రాసిన ఘనులు కూడా వున్నారు..

నాకనిపిస్తుంది 
'కవిత్వం ఇంత తక్కువ పదార్థమిపోయిందా.. అని?"
అని పుట్టపర్తి వారు ఆశ్చర్య పోతారు..

సాధారణంగా పుట్టపర్తి వారు అభిప్రాయం రాయరు
రచన బాగుండివుంటే తప్ప
వారినుంచీ ముందుమాటలను 
సమీక్షలనూ పొందటానికి 
చాలామంది తపన పడేవాళ్ళు..
అలాంటి సంఘటనే ఒకటి జరిగింది
అదేమంటే..




పుట్టపర్తి పదిమందిలో కూచుని వున్నారు
ఇంతలో పోస్ట్ వచ్చింది
ఎవరో అందుకున్నారు.
అయిదారు జాబులు

అప్పట్లో జాబులూ 
రిజిస్టరులో పుస్తకాలు చాలా వచ్చేవి
కాంప్లిమెంటరీ పంపేవారు 
అభిప్రాయం కోసం పంపేవారు.
సాహిత్య పరిషత్  TTD 
ఎన్నో ఇలా

అయ్య ఒక్కో లెటరూ తెరిచి చూస్తున్నారు
ఇంతలో పక్కవారి దృష్టిని ఆకర్షించిందొక ఉత్తరం
దానిపై presiDent of India అని వుంది..
వారు దానిని తెరిచారు.
ప్రెసిడెంట్ నుంచీ అని ఒకరికొకరు గుస గుస లాడుకున్నారు.

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి
నమస్సులు
నా పేరు "..."
నేను రచించిన ఈ గ్రంధ రాజాన్ని మీ పరిశీలన కై పంపుతున్నాను.
మహా శివుని తాండవాన్ని అద్భుతంగా చిత్రించిన మీకు ఇది పంపడం సాహసమే
సహృదయంతో అభిప్రాయం వ్రాసి నన్ను కృతార్థురాలను చేయ ప్రార్థన..
ఇట్లు
".............."
గమనిక
అభిప్రాయం అందిన వెంటనే తగిన మూల్యం పంపబడును.
"......."
w/o V.V.Giri.
President of India

ఈ వుత్తరాన్ని ఎవరో చదివి వినిపించారు.
విన్న వెంటనే పుట్టపర్తి వారి భృకుటి ముడిపడింది...
చివరది మళ్ళీ చదువు...

ఓ శివా
నీవెంత దయాళువు
ఓ శివా
నీ కంఠాన గరళం ధరించావు..
ఓ శివా
బూదిని నీవు ధరించావు
పాములను అలంకరించుకున్నావు
శ్మశానాన వాసమున్నావు
హిమన్నగాల నిష్టపడ్డావు..

కవిత్వాన్ని చదివి పెదవి విరిచారు మరొకరు..
అయినా ప్రెసిడెంట్ భార్య..
అందరికీ ఆశ్చర్యం..

ఇదేం కవిత్వమయ్యా..
దీనికి మీరు అభిప్రాయమా..
చివరన చూడు తగిన మూల్యం పంపుతుందట..

పుట్టపర్తికి ఆ పుస్తకం పై అభిప్రాయం వ్రాయబుధ్ధి కాలేదు
అందరూ
ఎందుకు స్వామీ 
పెద్దవారితో పని అంటూ పుట్టపర్తిని మెత్తబరిచారు
చివరికి తప్పేది లేక మా అమ్మ
ఏవో నాలుగు మంచి మాటలు వ్రాయవలసి వచ్చింది
తదుపరి కొంతకాలానికి
శివశ్రీ అనే కవి
ఈ పుస్తకానికి నిరంకుశులుగా పేరొందిన పుట్టపర్తి 
అభిప్రాయం ఎలా వ్రాసారో నాకు అర్థం కావటం లేదు
అని పత్రికాముఖంగా అన్నాడు
దానికి బాధపడిన పుట్టపర్తి

"నిజమే

నేను కొన్ని ఒత్తిడులకు తలఒగ్గలసి వచ్చింది
దీనిని పత్రికాముఖంగా అంగీకరిస్తున్నాను"
అంటూ
తెలియజేసారు.. 

కవి నిరంకుశుడు. 
నిజాన్ని నిర్భయంగా చెపుతాడు
తనికి దురాశలు లేవు. 
ఆశల ఉచ్చులు లేవు. 
అతడు దేనికీ చిక్కడు ..
వేదనకు ఆవేదనకు నివేదనకు తప్ప. 




శ్రీ జానుమద్ది హనుఛ్చాస్త్రి ,
శ్రీ వీణా రమాపతి రాజు,
శ్రీ మల్లెమాల వేణు గోపాలరెడ్డి ,
మా అక్కయ్య నాగపద్మిని 
తదితరులు ఈ విషయాన్ని ధృవీకరించారు..

ఇంకా
పుట్టపర్తి ఇఛ్చా మరణాన్ని పొందారా..??
సహస్రారం నుంచీ వారి ఆత్మ నిర్గమించిందా..??
అందుకే శ్రీనివాసా అన్న చివరి పలుకులతో జన్మ ఉధ్ధరింపబడిందా
చివరి క్షణాలలో పుట్టపర్తి వారి దగ్గరే ఉన్న శిష్యుడు 
గోవిందు  ఏం చెప్పారు..?
తదుపరి పోస్ట్ లలో