23 డిసెం, 2015

అరణ్య రోదన





పుట్టపర్తి విజ్ఞాన సంపన్నులు ..  
అనేక భాషలు నేర్చా రు .. 
అనేక పుస్తకాలూ వ్రాసారు  .. 
అంతేకాదు 
ఎంత రాసారో అంతకు వంద వంతులు చదివారు .. 
ఆకాలంలో కేవలం పుస్తకాలు కొనటా నికే 
మద్రాసు వెళ్లేవార ట .. 

బస్సులో పుస్తకం చదువుతూ చదువుతూ 
జేబులో డబ్బు ఏ దొంగ తీసినా తెలియనంత మమేకమై 
పోయేంత పుస్తక ప్రియులు .. 

మా అమ్మ ఒక బనియన్ కుట్టింది . 
ముందు జేబు వుండేలా .. 
దాన్ని దొంగల బనియను అనేవాళ్ళం .. 

NTR గార్డెన్స్ లో బుక్ ఫెయిర్  జరుగుతూంది. 
మా అయ్య పుస్తకాలు అక్కడ వెలిసాయి. 
చాలా మంది సందర్శిస్తున్నారు.
 భావాలు పంచుకుంటున్నారు. 

ఈ సందర్భంగా 
కడప జిల్లా రచయితల సంఘం సమావేశాల్లో అధ్యక్షోపన్యాసం ఇస్తూ.. పుట్టపర్తి ఇచ్చిన సందేశం. 

ఈనాడు హైదరాబాద్ లో 
బుక్ ఫెయిర్ జరుగుతున్న సందర్భంలో 
ఆనాటి వారి భావాలను పొందుపరుస్తున్నాను.

ఆశ్చర్యమేమంటే .. 
ఆనాటి వారి భావాలు ఈనాటికీ  వర్తిస్తుండటం..
అంతేకాదు.. 
ఈనాటికీ అవి అత్యంతావశ్యమకమై వుండటం

ఎందుకంటే పరిస్థితులు 
ఆనాటికంటె ఈనాడు సాంఘీకంగా రాజకీయంగా 
దిగజారి ఉన్నాయి కాబట్టి..

చదవండి..


''ఆంగ్లము నుండి మనము ఇంకను అనేక పుస్తకము లను భాషాంతీకరించుకోవలసి వున్నది. 
ఇప్పటికిని కాల్డ్ వెల్ రచనలు కుడా పూర్తిగా తెలుగులోకి రాలేదు. 
ఏ విజ్ఞానము కావలసియున్నను 
మనము ఇంగ్లీషులోనికి పోవలసినదే.. 
హిందీ యభివృధ్ధి కూడనంతంతయే యున్నది. 

మన దేశంలో అనేక భాషలున్నవి. 
మనకు దగ్గరగానున్న భాషలు ఒక్కదానినైనను నేర్చుకొనుటమంచిది. 
అప్పుడీ భాషా భేషజములెన్నియో తగ్గును. 

''నీవు చెప్పిన సలహాలన్నియు బాగుగనే యున్నవి. 
ఈ పనులు చేయుటకు ధనమెక్కడనుంచి వచ్చును ? ''

ప్రశ్న బాగుగనే ఉన్నది.. 
ఉత్తరము గూడ సులభమే.
 ప్రభుత్వమునకు తక్కిన పనులకు ధనమెక్కడినుంచి వచ్చునో ఇదియును అక్కడనుండియే రావలయును. ఉన్నధనమంతయు దీనికే దోచిపెట్టమని 
నేను చెప్పుటలేదు. 
పెట్టగూడదు గూడ. 

కాని ఇదియు కూడ చేయవలసిన పనియేయని ప్రభుత్వము యొక్క దివ్య చిత్తమునకు వచ్చిన చాలును. ఎలక్షన్లకు కోట్ల కొలది వెచ్చించి 
ప్రజలకు ఎన్ని దురభ్యాసములు నేర్పుచున్నారో మీరెరుగనిది కాదు. 

ఈ సందర్భములో రాజకీయవాదులకు 
ఒక చిన్న సలహా.. 
వారు విందురో విన రో.. నాకు తెలియదు.. 
కాని మనము చెప్పవలెను గదా.. 
వారు కొంత చదువుకొనిన బాగుగా నుండునని 
నా విన్నపము. 
కళాకారులను మనుష్యులుగా గుర్తింపవలెనని నా విన్నపము. కాలమున నిలుచునవి రాజకీయములు కావు. విజ్ఞానమే..! కళలే.. !


పూర్వమిట్లుండలేదు. 
ఆనాడు రాజులూ రౌతులూ 
తమకున్నంతలో కళలనెంతయో పోషించినారు. రెడ్డిరాజులు సాహిత్యాదులకు చేసినసేవ సామాన్యమైనది కాదు. 
ప్రభుత్వమే గాదు ప్రజలు గూడ 
విజ్ఞాన విషయమై తమ ధనమును 
కొంత ఖర్చు పెట్టవలసియున్నది. 

వెర్రి వేడుకలకు .. త్రాగుడు మొదలగు దురభ్యాసములకు లెక్కలేనంత ఖర్చు పెట్టెదరు. 
సాహిత్యజ్ఞునకు కళాకారునకు ఒక బొట్టునివ్వరు. 

పూర్వమెన్ని విద్యలనో ప్రజలు పోషించినారు. 
తోలు బొమ్మలవాండ్లు, పగటివేషగాండ్లు. 
బుడు బుడక్కలవాండ్లు, బయలు నాటకం వారు నట్టుకాండ్రు, వీరందరూ ప్రజాభిమానులపై బ్రతికినవారు. 

పొరుగున నున్న రష్యా.. 
ఏ చిన్న కళనైనను చావనివ్వక రక్షించుకొనుచున్నది. ఆయా కళలలో పరిశోధనా భాగములే యేర్పరచినారు. మనకా దృష్టిలేదు. 
ఇది నేను ప్రజలకు ప్రభుత్వమునకు కూడ ఇచ్చు సలహా మహాజనులారా .. 
ఇవి నాకున్న భావములు .. 
వానిని మీముందుంచినాను. 
ఆ భావములు మీకు సరిపోకపోవచ్చు. 

మీరు వివేకవంతులు 
ఆలోచించుకొనగలిగినవారు .. 
నాకు మీరే ప్రమాణము.. ''

19 డిసెం, 2015

ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ??

 

ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ?? 
 మరి మన ఋషులు వానప్రస్థం అంటూ 
ఏకాంతంలోకి వెళ్ళిపోయేవారు కదా..
మిగిలిన ఒంటరితనాన్ని 
ఆత్మ చింతనలో 
తనను తాను వెతుక్కోవటంలో గడిపేవారు. 
చూశారా మన హిందూత్వం గొప్పదనం.. 
ఇలాంటి ఒక క్షణం రాజు కైనా పేదకైనా 
తప్పక సంభవిస్తుంది. 

ఇలాంటి మార్గమే తెలియని పాశ్చాత్యులు 
అంతులేని భోగలాలసత లో మునిగి తేలి చివరికి ఆధ్యాత్మికత కోసం
 ప్రశాంతమైన ఆ స్థితి కోసం భారత దేశపు సాధువుల పాదాలపై వాలుతున్నారు.

ఏ ఒక్క బంధమూ శాశ్వతం కాదు.. 
జీవితంలోని ఒక స్థితి మాత్రమే.. 
అది దాటుకుని మహా మహా రాజులు సైతం 
తమ రాజ్యాన్ని వైభవాన్ని తృటిలో త్యజించి
 ఏ వసతులూలేని ఏకాంత వాసానికి తరలి వెళ్ళే వారు. 


ఋషులు .. దార్శనికులు..  
ఇందుకు తగ్గ మార్గ నిర్దేశనం ముందుగానే చేశారు. 
ఆ మార్గాన్ని అర్థం చేసుకొని అమలు పరచటమే 
మనం చేయవలసింది.

బ్రహ్మచర్యం.. గా ర్హస్థ్యం.. వానప్రస్థం.. సన్యాసం..
ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరుకోడానికి 
మేడమెట్లలా ఉపయోగించుకోవాలి..
నేనెవరు అన్న అలోచన విరాట్ స్వరూపం ధరించేది అప్పుడే..

ఏ కుటుంబ బంధమూ శాశ్వతం కాదు. 
వారి వారి సంసారాలు పెరిగినకొద్దీ
 మనకు ప్రాముఖ్యం తగ్గిపోతుంది.
దాన్ని పాజిటివ్ గా స్వీకరించి 
అడిగి నప్పుడు మాత్రమే సలహాలు ఇస్తూ 
సాగిపోవాలి .. 


సినీ నటుడు రంగనాధ్ ఆత్మహత్య చేసుకున్నారు 
ఉరి వేసుకుని
పిల్లల జీవితాలు ఎవరివి వారివయ్యాయి
భార్య వెళ్ళిపోయింది
సంపాదించిన డబ్బు ఆమె రోగం బారిన పడి కర్పూరమైపోయింది
మిగిలినవి గతం దాని తాలుకు జ్ఞాపకాలు

అయినా రంగనాధ్  ఎంతో గొప్పవాడు
అందమైన ఆడపిల్లలు ఎంతో సన్నిహితంగా మెలిగే వాతావరణంలో కూడా 
తనను తాను కోల్పోకుండా మిగిలాడు
ధనం తెచ్చే చెత్త అలవాట్ల వలలో జారి పడిపోకుండా తనను తాను రక్షించుకున్నాడు
మంచంలోపడిన తోడును 
అసహ్యించుకోకుండా .. వదిలేయకుండా.. 
ఎన్నో సంవత్సరాలు ఆమె బ్రతకటం కోసం తపించాడు

అయన ఆలోచనలు ఎంతో గట్టివి
అతను రాసిన కవిత చూడండి

ఎవరు దేవుడు
ఎవరు బండ
అదేదో ఊరినుంచీ మహాశక్తి వచ్చాడు
మరేదో ఊరినుండీపెద్ద బండ తెచ్చాడు
ఆరడుగులు కొలత బెట్టి బండను ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేశాడు
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది
మూడడుగుల బండ ముక్క చాకి రేవు చేరింది..
కంపు కంపు మనసులన్ని దేవుని ఎదుట నిలిచాయి
కంపు గొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి
గోతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి
మురికి మరకల బట్టలన్నీ నీళ్ళల్లో మునిగాయి
అర్థం గాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రధ్ధలు
చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు
శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది
పవిత్రతకై ప్రతిబట్టా బండను బాదుతోంది
కడకు, గుడినుండి మనసులన్నె కంపుతోనె వెళ్ళాయి
రేవునుండి బట్టలన్ని ఇంపుగా వెళ్ళాయి
గుడిలోని దేవుడా
రేవులోని బండా.. 
బండ దేవుడా కాదా అన్నది 


మన పరిపక్వతపై ఆధారపడివుంటుంది..


బండ లో దైవాన్ని చూస్తూ 
గురి నిలపడం కోసమే 
బండ దైవమయ్యింది
అక్కడితో మన ఆధ్యాత్మికత ఆగిపోలేదు..
ప్రతి ఒక్కరిలోను దైవాన్ని చూడమని చెప్పింది

భగవంతుడిచ్చిన జీవితాన్ని చివరివరకు 
సార్థకంగా జీవించమని చెప్పింది.. 
బండపై తమ మురికిని వదిలించుకోవడానికి 
బట్టలు తలలు బాదుకున్నట్టు
మనసులోని మురికిని వదిల గొట్టుకోడానికి
గుడిలోని బండ ఎదుట సాష్టాంగ పడటమే దాని అర్థం

రామకృష్ణుల వంటి వారు
రోజూ పొద్దుటే లేచి నా జీవితంలో ఒక రోజు వృధా అయిపోయింది

అమ్మ దర్శనం కాలేదు అని తలలు బాదుకుని ఏడ్చారు..

ఒకసారి ఏదో షూటింగ్ లో రంగనాధ్ గారిని చూశాను
మా ఊరివాడైన మల్లికార్జున్ పరిచయం చేశాడు..
ఆయనను నేనెంత ఆశ్చర్యంగా చూశానో
ఆయనా నన్నంత ఆశ్చర్యంగా చూశారు.. 

ఇంత మంచి మనసున్న రంగనాధ్ 
ఎవరో ఒక గురువును ఎంచుకుని ఆ మార్గంలో అడుగులేసి వుంటే బాగుండేదేమో..

11 డిసెం, 2015

తరం .. తరం .. నిరంతరం


ఇది శివతాండవం ..9వ తరగతి పాఠం 
పిల్లలకు అర్థమయ్యేలా వివరించిన దండె రామ్మూర్తి గారికి కృతజ్ఞతలు.. 

8 డిసెం, 2015

వాణిశ్రీ vs సురేకాంతం




ఒకసారి మా అయ్యతో 

సినిమా నిర్మాత ఎం.ఎస్. రెడ్డి 


కూతురు పెండ్లికి పోయాం మద్రాసులో .. 

నేను చిన్నదాన్ని పదో పన్నెండో వయసు.. 

వాణిశ్రీ అంటే బోల్డంత ఇష్టం.. 


దీనికి చదువుకంటే యే సినిమా యాక్టరు


 యెవరో అన్నీ అడ్రసుతో సహా చెబుతుందిరా.. 

అనేవారు మా అయ్య నవ్వుతూ.. నేను వాణిశ్రీ ని 


చూస్తానని మారాం చేశాను.. మా అయ్యకు ఇష్టం 


లేకపోయినా ఇంతలో వాణిశ్రీ వచ్చింది ఆమె చుట్టూ


 ఒకటే గుంపు.. ఆమెను కలవలేదు.. 

చివరికి సూర్యకాంతం ఎదురు వచ్చింది 

రెండుచేతులూ జోడిస్తూ

 నమస్తే పుట్టపర్తి నారాయణాచార్లు గారూ అంది నోరారా 


నవ్వుతూ..

నమస్కారమమ్మా .. ఇదిగో ఇది నా బిడ్డ అన్నారు 

అయ్య యేం మాట్లాడాలో తెలీక.
.
అంతే .. 


ఆమె నన్ను గుండెలకు గట్టిగా హత్తుకుని

 బాగున్నావా.. అంది.. ప్రేమగా.
.
తర్వాత మా అయ్య యెవరికి చెప్పారో యేమో ..


వాణిశ్రీ ఫోటోలు చాలా పోస్ట్ లో వచ్చాయి..


6 డిసెం, 2015

నవలాభిరామం

నవలాభిరామం 

28 నవం, 2015

హృదయమె సంకెల యౌ నా ..??


న గురోరధికం ..


న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః 
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః
గురువును మించిన తత్త్వం లేదుగురువును మించిన తపం లేదుగురువును మించిన జ్ఞానమూ లేదుఅట్టి గురుదేవులకు నమస్కారము.

శంకరాచార్యులవద్ద పద్మపాదాచార్యులనే శిష్యుడు
గురువు మాటే వేదవాక్కు
గురువే దైవం
తోటి శిష్యులకు అసూయ..

వారికి కనువిప్పు కలిగించాలని 
శంకరాచార్యులవారనుకున్నారు.

ఒకసారి సనందుని రమ్మని కబురంపారు
నదికటువైపునుంచీ..
ఇటువేపున ఉన్న శిష్యుడు పరుగు పరుగున వెళ్ళాడు.
నడుమ ఉరకలేస్తున్న నదిపైన
డాటడం ఎలా అన్న ప్రశ్న లేదు..
వేస్తున్న ప్రతి అడుగు కిందనుంచీ 
ఒక పద్మం వికసించింది..
ఆ పద్మాలపై నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇతర శిష్యులకు తమకు అతనికి ఉన్న భేదం చక్కగా 

గోచరమైంది..

ఇలా గురు చరితలు మనకనేకం . . 
మన మనసులో ముద్ర వేసిన వానిని మనం 
అప్పుడప్పుడూ వాడుతుంటాం .. 

ఒకసారి కేతు విశ్వనాధ రెడ్డి గారూ
శశిశ్రీ గారూ ఇద్దరూ ఒక దేవాలయం వెళ్ళారు..
అక్కడి పూజారి 
శశిశ్రీ ని గోత్రం చెప్పమని అడిగారట..
శశిశ్రీ తడుముకోకుండా భారద్వాజసగోత్రం అన్నాడట..
ఆశ్చర్యపోయిన కేతు గారు..
శశిశ్రీ నీవు ముస్లిం వి కదా 
మరి నీ గోత్రం భారద్వాజస అన్నావెందుకు 
అని అడిగారు
నేను పుట్టపర్తి నారాయణా చార్యుల శిష్యుడిని 
నా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులదే గోత్రమైతే 
నాదీ అదే గోత్రం 
అని చిరునవ్వుతో జవాబిచ్చారట శశిశ్రీ..
ఈ  విషయం 
కడప ఇన్ఫో లో త్రివిక్రమ్ గారు ప్రస్థావిం చారు
వాస్తవానికి పుట్టపర్తిది షటమర్షణ గోత్రం.
కానీ గురువు గోత్రమే తన గోత్రం అంటం చక్కగా వుంది
దానిద్వారా  గురువుతో ఎంత 
 మానసిక బంధం ఏర్పరుచుకున్నారో తెలుస్తుంది.
ఆ బంధం గురువే వేస్తాడో లేక 
 ఆయన తపోబలమే శిష్యుడిని కట్టిపడేస్తుందో.. 
శిష్యుడే తన భక్తితో గురువును పొందుతాడో..
అదంతా అలౌకిక ప్రపంచం 
కానీ గురువుగా ఒకరిపై గురి కుదరటం
 అందరికీ సాధ్యం కాదు 
దానికి కూడా ప్రాప్తం ఉండాలి 
దానిలో ప్రయాణం అతి దుర్గమం
బయలుదేరి వెళ్ళినవారు 
తమ అనుభవాలను మనతో పంచుకోరు..
కావాలంటే నీవూ వచ్చి చూడు అంటారు..
అంత అతిలోకమైన భావ ప్రాప్తి పొందిన తరువాత 

ప్రపంచం వేపుచూస్తారా..