9 నవం, 2013
చిక్కని పూవువోలె నా పరువము వాడకుండ..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
8 నవం, 2013
పుట్టపర్తి ఆకాశవాణికి ఇచ్చినఅమూల్యమైన ఇంటర్వ్యూ
పండితవంశంలో పుట్టిన పుట్టపర్తి జీవితం నేటివారికి ఎంతో స్ఫూర్తిదాయకం
Part 1
1 lo 2 va part
2 lo okati
4part
లేబుళ్లు:
ఇంటర్వ్యూలు
,
వీడియోలు
7 నవం, 2013
తెరతీయగరాదా

చిన్నవయసులోనే త్యాగయ్య తండ్రి గతించాడు
అన్నదమ్ముల భాగపరిష్కారంలో
శ్రీరామ లక్షమణుల విగ్రహాలు లభించాయి
ఉంఛవృత్తిచేస్తూ జీవనం రామభక్తి సేవనం
సంగీత సాధనం ఆయన వ్యాపకాలు
అంతకు మించి రాజు కానుకలు పంపినా
ఆయన కన్నెత్తి చూడలేదు
అలాంటి వారుంటారా..
ఉంటారు..
త్యాగయ్య పరమభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ శిధిలావస్తలోనున్న త్యాగయ్య సమాధిని
కావేరీ నది ఒడ్డున గుర్తించింది.
తంజావూరు రాజుల ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా
తన అధీనంలోనికి తెచ్చుకొని
మద్రాసులోని తన ఇంటికి అమ్మి
ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించి గుడి కట్టించింది.
మంటపము పాకశాల..
ఈ ప్రయత్నంలో
తన సంపద ఆభరణాలు హరించుకు పోయాయి..
అలాంటి ప్రయత్నాలే
మనుషుల హృదయాలు పరవశింపచేస్తాయి.
1946 లో త్యాగయ్య చిత్ర నిర్మాణ సమయంలో
చిత్తూరు నాగయ్య గారు ఆమెను కలిశారు
ఆమె సలహాపై
త్యాగరాజనిలయం అనే సత్రం కూడా కట్టించారు..
త్యాగయ్యగారు తిరుపతి దేవుని దర్శనానికి వెళ్ళారు
తెరలు వేసేశారు
దర్శనం లేదన్నారు
ఎంతో ఆర్తితో వచ్చిన త్యాగయ్యకు నిరాశకలిగింది..
బిడ్డ తండ్రిని చూడడానికి వస్తే
తండ్రి తెరలు బిగించుకొని రేపురాపో అంటాడా..
అయితే వాడు తండ్రెలా అవుతాడు
బిడ్డ వస్తున్నాడనే వార్త అందగానే
వీధి తలుపు దగ్గర ఎదురు చూసేవాడే కదా నిజమైన తండ్రి..
రాధవస్తే ఇద్దరం కలిసి భోజనం చేస్తాం అని
నేను కాలేజ్ నుంచీ వచ్చే సమయానికి ఒంటిగంటకు
బయట నిలబడి..
నాకోసం ఎర్రటి ఎండలోకి చూసే వాడు నా తండ్రి..
కానీ
త్యాగయ్య తండ్రి తెరవెనక వున్నాడు ..కనపడడట
ఆయన హృదయం జ్వలించుకు పోయింది..
మామూలు పిల్లల్లా
నేను నీ కోసం వస్తే లోపలుండి బయటకు రావా..
నేనంటే నీకెప్పుడూ అంతే..
అంటూ దెబ్బలాడడు
కారణం
తెరవెనకనున్న ఆయన తండ్రి శరీరం కాదు శిలావిగ్రహం
ఆ తండ్రిని కేవలం మనో నేత్రంతోనే చూడాలి
ఆ నేత్రానికి లౌకిక దృష్టికాదు దివ్య దృష్టి కావాలి
లోపలున్న దేవుడు కనపడకున్నాడంటే
తనకళ్ళు ఆయనను చూడడానికి అనువుగా లేవు
అందుకే యీ కీర్తన..
నా కళ్ళను కప్పిన ద్వేషము అసూయ ఓర్వలేని తనము
అవి తీయి అప్పుడే నేను నిన్ను చూడగలను అని హృదయం పగులగొట్టుకున్నాడుత్యాగయ్య
తెరవెనుకనున్న శిల ద్రవించింది
వెంటనే తెరలు తొలగిపోయాయ్..
తండ్రి చేతులు చాచి కొడుకును ఆలింగనం చేసుకున్నాడు
కాదు కాదు
ఆ ఆలింగనాన్ని కన్నీళ్ళతో అనుభవించాడు త్యాగయ్య..
తెరతీయగరాదా లోని ॥తెర॥
తిరుపతి వేంకటరమణ మచ్చరమను ॥తెర॥
పరమపురుష ధర్మాదిమోక్షముల
పారదోలుచున్నది నాలోని ॥తెర॥
ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులురీతి యున్నది
హరిద్యానము సేయువేళ చిత్తము
అంత్యజువాడకు బోయినట్లున్నది ।।తెర॥
మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరు
గిడబడి చెఱచినట్లున్నది ॥తెర॥
వాగురయని తెలియక మృగ గణములు
వచ్చి తగులురీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సరమను ॥తెర॥
త్యాగయ్య తరువాత అలాంటి మనుషులు
ఆ భక్తి తీవ్రతా లేవనుకుంటారేమో
లోకంలో అన్యాయం అరాచకం ఎంత సహజంగా పెచ్చరిల్లుతూందో
అంతే సహజంగా భక్తీ స్వార్థ రహిత జీవనాలూ నడుస్తున్నాయి
అయితే వాటిని చూడడానికి మనకూ మరో దృష్టి కావాలి
పుట్టపర్తి మాతామహులు రేవా సంస్థానంలో ఉండేవారు
వీరు భక్తి రస ప్రధానమైన అనేక రచనలు చేసారు
వారో సారి తిరుపతికి వెళ్ళారు
గుడితలుపులు మూసిపొతున్నారు పూజారులు
దర్శనమిప్పించమని ప్రాధేయ పడ్డారీయన
ససేమిరా అన్నారు వాళ్ళు
దేవుని సన్నిధిలో నిత్యం వుండి వుండి
భక్తుదెవరో విరక్తుడెవడో తేడా పట్టలేక పోతున్నారు అర్చకులు
ఆశాభంగం తో వెంకటాచార్యులవారు
శ్రీనివాసుని ఉద్దేశించి
వేదాంత దేశికులవారి శ్లోకం చదివారు ఇలా
కానీ అందులో
త్యాగయ్యలా నా కళ్ళలోని మత్సరం తీయమన్న వేడుకోలు లేదు
భక్తి పండిన ఉక్రోషం
యేం శ్రీనివాసా ఐశ్వర్యం తో కళ్ళు మూసుకుపోయాయా..
విశిష్టాద్వైతం పూర్వపక్షంలో పడిపోతూ
శత్రువుల చేత ఓడింపబడే స్థితి నీకు వచ్చినప్పుడు నిన్నుధ్ధరించవలసిన వాడను నేనే కదా..
ఆ మాత్రం గుర్తించలేవా..
అని అంటూ ధ్వజస్థంభాన్ని ఢీకొన్నారట..
దెబ్బలాడే పిల్లలకు తండ్రిపై ప్రేమవుండదా..
అది ఆ పరమేశ్వరునికి తెలియదా..
అందుకే..వెంటనే వాకిళ్ళు తెరుచుకున్నాయి
యీ విషయాన్ని ''జీవితం అనుభవాలు ''
లతమాసపత్రికలో అక్టోబర్ 1967 18వ పుటలో ప్రస్తావించారు పుట్టపర్తి
భాషాపరశేషభోగిలో పుట్టపర్తి నాగపద్మిని యీ విషయాన్ని చెప్పింది..
లేబుళ్లు:
వ్యాసాలు
పరిశ్రమే నా ఊపిరి..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
6 నవం, 2013
ఆంగ్లేయులకు తాబేదారుగా పనిచేయటం ఇష్టంలేని అరవిందులు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
5 నవం, 2013
పండితాః సమదర్శినః
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
4 నవం, 2013
త్యాగరాజు-తెనుగు భాగవతము
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
3 నవం, 2013
పోతన్న మహా తపస్వి.
పుట్టపర్తి సాహితీ సర్వస్వం ముద్రింపబడుతూంది
ఆ పనిలో బిజీ గా వున్నాము
అందులో భాగవతోపన్యాసాలలో వచ్చిన కథ మీ కోసం..
పోతన్న భాగవతమున
రుక్మిణీ కల్యాణ ఘట్టములు వ్రాయుచుండెనట.
దానిలో
"హరికు ప్రేమబంధ మధికంబుగా కేశ
బంధ మధికమగుచు భామకమరె..."
యీ సమయమునకు సరిగా
వంటయింటిలో పొయ్యి దగ్గర నాడుకొనుచున్న
పోతన్న బిడ్డ ప్రొయ్యిలో బడినది.
ఆమె శ రీరమంతయు కమరునట్లు కాలినది
భార్య యా విషయమును పోతన్నకు దెలిపెను.
అతడు తన వ్రాత నుండి లేవనేలేదు.
వెంటనే మూడవ చరణము.
"పద్మనయన వలన ప్రమదంబు నిండార"
యని పూరించినాడు.
అంతలో
నా పిల్లకు దగిలిన గాయములన్నియు మాయమైపోయినవి
యేదో కట్టుకథ
పోతన్నకు బిడ్డయుండెనో లేదో మనమెరుగము.
'బాలకు +అమరె 'అను చోట కమరె అను అమంగళార్థము
పని గట్టుకొని యీడ్చినవే. తప్ప తోచునది గాదు.
నిష్కర్షగా నీ కథ యెవరో యజ్ఞుని కల్పనయని
దాని ముఖమే చెప్పుచున్నది.
కాని దీని నిట నెందుకు జెప్పితిననగా
జన సామాన్యమునకు
పోతన్న పైనున్న దృష్టి యిట్టిదని చూపుటకు
వారి తలపులలో
నాతడేదో నాల్గు ఛందస్సు ముక్కలు చప్పరించి
తోచినదెల్ల కవిత్వమని కలిపి కొట్టినవాడు గాడు.
మహా తపస్వి.
వశ్యవాక్కు
శాపానుగ్రహ దక్షుడు.
ఇంతయయ్యును పరమ సాత్వికుడు.
మరి యీ స్థితికాతడు వచ్చుటకెన్ని సంవత్సరములు బట్టినది
యేమో
ఒక్కటి మాత్రము నిజము.
ఆతడు పొందిన యీ సిధ్ధి
మూడునాళ్ళలో సాధించినది మాత్రము గాదు.
కామ క్రోధాదులతో
బాహ్యమైన సమాజముతో
యౌవ్వనముతో
పోతనామాత్యుదెంతయో బాధపడియుండును
గజేంద్ర మో క్ష ములో కరిరాజు యీ పద్యముల జెప్పెను
''కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో''
''వినుదట జీవుల మాటలు
చనుదట చనరాని చోట్ల శరణార్థులకో
యనుదట పిలచిన సర్వము
గనుదట సందేహమయ్యె కరుణావార్ధీ..''
యీ పద్యములు జెప్పినది గజరాజని మనమనుకొనుచున్నను
యీ భావములు పోతనామాత్యుడెన్ని సారులు
హృదయమున శంకించుకొన్నవే.
యే సాధకునికైనను యీ స్థితి తప్పదు.
కాని యింతలో అనుత్సాహము జెందక
నతడు ద్విగుణీకృతమైన పట్టుదలతో
జన్మ యంతయు సాధించెను.
సాధించి
భాగవతమునందలి సుతలాధీశ్వరుడైన యింద్రసేనుడన్నట్లు
''కంటి కంటి భవాబ్ధి దాటక గంటి, ముక్తి నిధానముల్
కంటి, నీ కరుణావలోకము కంటి, పాపము నీడ,
ముక్కంటి తామర చూలియున్, బొడగాన నట్టి మహాత్ము, నా
యింటికిన్ జనుదెంచి తీశ్వర యే కృతార్థత బొందినన్''
అని తృప్తిగ నానంద భాష్పములు రాల్చగలిగెను
.అతనికి
''హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుడు సంశయము పనిలేదా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు....''
అన్న భావము అడుగడుగునను భాసింపదొడగెను.
మన ప్రాచీనులది భల్లూకపు పట్టు
రక్తి విరక్తులలో నేది బట్టినను సరే.
వారు కడజూతురు.
నేటి మన యావేశములు సోడా పొంగులవంటివి.
చూచుచుండగనే పొంగినగ్త క్రుంగిపోవును.
మనకు గావలసిన ప్రతి చిన్న పనియు నెవడో
వీర భోగ వసంత రాయలు చేసిపెట్టవలయును.
యీ సోమరి తనమును సమర్థించుకొనుటకు
వేయి కారణములను ద్రవ్వెదము.
ఆ పనిలో బిజీ గా వున్నాము
అందులో భాగవతోపన్యాసాలలో వచ్చిన కథ మీ కోసం..
పోతన్న భాగవతమున
రుక్మిణీ కల్యాణ ఘట్టములు వ్రాయుచుండెనట.
దానిలో
"హరికు ప్రేమబంధ మధికంబుగా కేశ
బంధ మధికమగుచు భామకమరె..."
యీ సమయమునకు సరిగా
వంటయింటిలో పొయ్యి దగ్గర నాడుకొనుచున్న
పోతన్న బిడ్డ ప్రొయ్యిలో బడినది.
ఆమె శ రీరమంతయు కమరునట్లు కాలినది
భార్య యా విషయమును పోతన్నకు దెలిపెను.
అతడు తన వ్రాత నుండి లేవనేలేదు.
వెంటనే మూడవ చరణము.
"పద్మనయన వలన ప్రమదంబు నిండార"
యని పూరించినాడు.
అంతలో
నా పిల్లకు దగిలిన గాయములన్నియు మాయమైపోయినవి
యేదో కట్టుకథ
పోతన్నకు బిడ్డయుండెనో లేదో మనమెరుగము.
'బాలకు +అమరె 'అను చోట కమరె అను అమంగళార్థము
పని గట్టుకొని యీడ్చినవే. తప్ప తోచునది గాదు.
నిష్కర్షగా నీ కథ యెవరో యజ్ఞుని కల్పనయని
దాని ముఖమే చెప్పుచున్నది.
కాని దీని నిట నెందుకు జెప్పితిననగా
జన సామాన్యమునకు
పోతన్న పైనున్న దృష్టి యిట్టిదని చూపుటకు
వారి తలపులలో
నాతడేదో నాల్గు ఛందస్సు ముక్కలు చప్పరించి
తోచినదెల్ల కవిత్వమని కలిపి కొట్టినవాడు గాడు.
మహా తపస్వి.
వశ్యవాక్కు
శాపానుగ్రహ దక్షుడు.
ఇంతయయ్యును పరమ సాత్వికుడు.
మరి యీ స్థితికాతడు వచ్చుటకెన్ని సంవత్సరములు బట్టినది
యేమో
ఒక్కటి మాత్రము నిజము.
ఆతడు పొందిన యీ సిధ్ధి
మూడునాళ్ళలో సాధించినది మాత్రము గాదు.
కామ క్రోధాదులతో
బాహ్యమైన సమాజముతో
యౌవ్వనముతో
పోతనామాత్యుదెంతయో బాధపడియుండును
గజేంద్ర మో క్ష ములో కరిరాజు యీ పద్యముల జెప్పెను
''కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో''
''వినుదట జీవుల మాటలు
చనుదట చనరాని చోట్ల శరణార్థులకో
యనుదట పిలచిన సర్వము
గనుదట సందేహమయ్యె కరుణావార్ధీ..''
యీ పద్యములు జెప్పినది గజరాజని మనమనుకొనుచున్నను
యీ భావములు పోతనామాత్యుడెన్ని సారులు
హృదయమున శంకించుకొన్నవే.
యే సాధకునికైనను యీ స్థితి తప్పదు.
కాని యింతలో అనుత్సాహము జెందక
నతడు ద్విగుణీకృతమైన పట్టుదలతో
జన్మ యంతయు సాధించెను.
సాధించి
భాగవతమునందలి సుతలాధీశ్వరుడైన యింద్రసేనుడన్నట్లు
''కంటి కంటి భవాబ్ధి దాటక గంటి, ముక్తి నిధానముల్
కంటి, నీ కరుణావలోకము కంటి, పాపము నీడ,
ముక్కంటి తామర చూలియున్, బొడగాన నట్టి మహాత్ము, నా
యింటికిన్ జనుదెంచి తీశ్వర యే కృతార్థత బొందినన్''
అని తృప్తిగ నానంద భాష్పములు రాల్చగలిగెను
.అతనికి
''హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుడు సంశయము పనిలేదా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు....''
అన్న భావము అడుగడుగునను భాసింపదొడగెను.
మన ప్రాచీనులది భల్లూకపు పట్టు
రక్తి విరక్తులలో నేది బట్టినను సరే.
వారు కడజూతురు.
నేటి మన యావేశములు సోడా పొంగులవంటివి.
చూచుచుండగనే పొంగినగ్త క్రుంగిపోవును.
మనకు గావలసిన ప్రతి చిన్న పనియు నెవడో
వీర భోగ వసంత రాయలు చేసిపెట్టవలయును.
యీ సోమరి తనమును సమర్థించుకొనుటకు
వేయి కారణములను ద్రవ్వెదము.
లేబుళ్లు:
వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)






