18 సెప్టెం, 2014
పూవుటెడంద..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
16 సెప్టెం, 2014
సరస్వతీ సం హారము శ్రీ కూర చిదంబరం గారి అభిమాన నవలా ..?
ఒక నాడు కథ నవలా రచయిత
శ్రీ కూర చిదంబరం గారు ఫోన్ చేసారు..
వారికి పుట్టపర్తి కన్నడం నుంచీ అనువదించిన
సరస్వతీ సం హా రం ప్రతి కావాలట
ఆయన రచన చేసే తొలి నాళ్ళలో
ఈ అనువాద నవల విపరీతంగా ఆకర్షించిందట..
తరువాత ఆ ప్రతికై ప్రయత్నిస్తూనే వున్నారు..
ఆయనకిప్పుడు డెభ్భైయ్యేళ్ళు..
వారి మాటల్లోనే వినండి..
'ఎవరీ కూర చిదంబరం'
నా అల్ప బుధ్ధి ప్రశ్న వేసింది..
వెంటనే గూగుల్ ను వెతికితే..
కూర చిదంబరం గారి వివరాలు దొరికాయి
ఆయన రాసిన కథలు అప్పటి లీడింగ్ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, పొలికేక వార పత్రికల్లో వచ్చాయి.
ఈ ప్రాంతంకు చెందిన సీనియర్లయిన కథా రచయితలు గర్ళకుర్తి సురమౌళి,
రాములు,
గూడూరిసీతారాంతోసహా,
డా.మలయశ్రీ,
తత్వవేత్త బి.ఎస్.రాములు,
తాడిగిరి పోతరాజులు
వీరికి సమకాలికులుగా చెప్పవచ్చును.
అప్పటి సమకాలీన సామాజిక జీవితాన్ని,
అణగారిన బతుకుల్లోని జీవన పోరాటాల్ని,
పేదరికాన్ని,
వారి కడగండ్లను నిశితంగా పరిశీలించి
కథలుగా మలిచి,
ఆయన చేసిన రచనలు చూస్తే,
మునిపల్లె రాజు,
పెద్దిభట్ల సుబ్బరామయ్య,
చాగంటి సోమయాజుల కథలు గుర్తుకు వస్తాయి.
చిదంబరం తన కథారచనను కొనసాగించి వుంటే. ఆయనకు ఎన్నెన్నో పురస్కారాలు దక్కియుండేవి.
అతి కష్టమైన సిఎ కోర్సు పూర్తి చేసి,
హైదరాబాద్ లో చార్టర్ అకౌంటెంట్ గా
బతుకు తెరువుకై జీవితంలో స్థిరపడ్డాక
ఆయన చాలా కాలం పాటు
సాహిత్య వ్యాసాంగాల జోలికి వెళ్ళినట్లు కనిపించలేదు.
వీరు ఆర్థిక వేత్తగా కొనసాగి
కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ల పై సెమినార్లు చర్చావేదికలు నిర్వహించారు.
వీరి భాషా శైలిని పరిశీలిస్తే
ఈయన నిరంతర అధ్యయనం మాత్రం విడవనట్లుగా ప్రస్ఫుటమవుతుంది.
రచనా వ్యాసాంగాలు కొనసాగించి వుంటే
ఆయన పుస్తక రచనలు ఎన్నో వచ్చియుండేవి.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may13/pustakaparichyam.html
మళ్ళీ నేను సరస్వతీ సం హారం లోనికెళ్ళాను..
ఎంతకూ ఈ అనువాద నవలలో యేం వుంది
'కథ చెప్పే వాళ్ళకు ఊకొట్టే వాళ్ళు కావాలి..'
అని పుట్టపర్తి వ్రాసిన వాక్యం జనాల్లోకి ఎంత చొచ్చుకుపోయిందో తెలిస్తే
ఆ కథనం ఎంత విజయం సాధించిందో అర్థమవుతుంది..
'పెళ్ళాన్నేం చేస్తావురా బాళప్పా..
గొంతుపిసికి బాయిలో యేస్తాను..'
నవల మొదలూ చివరా వచ్చే వాక్యమిది..
ప్రతి సమాజంలో మంచీ చెడూ రెండూ వుంటాయి
ప్రతిసారి మంచి వ్యక్తిత్వాలు విజయం సాధిస్తాయనే నమ్మకం యేమీ వుండదు.
నీచ స్వభావాలే ముందడుగు వేసి విజయాన్ని కైవశం చేసుకోవడమూ కద్దు
ఈ నవలలో గౌరమ్మ బాళప్పలు నీచ పాత్రలు
సాత్విక పాత్రలలో బ్రహ్మానంద శాస్త్రి అచ్చమ్మ సరస్వతి గణపతి అందరూ అసహాయులే
బాళరాజు సత్య సంధుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు
పుణ్యాత్ముడు
ఈ ముగింపు వాక్యాలతో
బాళప్పను పుణ్యాత్మునిగా చిత్రించినా నవల మొత్తం అతని పాత్ర ఎంత దుందుడుకుదో ఎంత అనాగరికమైనదో ఎంత కఠినమైనదో చిత్రించిన వైనం బీచీ అసమాన రచనా శైలికి తార్కాణంగా నిలుస్తుంది..
అలానే పుట్టపర్తి సరళ సుందర అనువాదమూ పూవుకు తావి అబ్బినట్లుగా అమరింది
తెలుగు పలుకుబడులను సమయోచితంగా వాడటం వలన భాష అందగించింది
అంతేకాక రచనలో అప్పటిసాంఘీక చిత్రం కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది..
'హంసరాజ్ రహబ్బర్ '
ఉర్దూభాషలో వ్రాసిన నవలను
'సంఘర్షణ' పేరుతో తెలుగులో అనువదించారట పుట్టపర్తి
ఇందులోని ప్రతిపాత్రా
బాహ్య జగత్తుతో ఆంతరిక జగత్తుతో పోటీ పడుతుంది
కొన్ని పాత్రలా సంఘర్షణలో నలిగిపో పరిస్థితిలో నరకమనుభవిస్తున్నాయ్
మూల రచయిత ధర్మధ్వజఛాయకు లొంగిపోయి కుముద పాత్రను బలవంతంగా చంపేశాడనీ..
ఒకవేళ తానే కనుక వ్రాసివుంటే
అలా చేసేవాణ్ణి కాదని అనువాదకుడు
ముందుమాటలో అన్నారు
అంటే అనువాదకుణ్ణి అంతగా కదిలించిన ఇతివృత్తం అనువాదంగా సైతం మరింతగా
పఠితలకు నచ్చి వుండాలి..
మరి పుట్టపర్తి ఉర్దూ నుంచీ అనువదించిన
ఈ సంఘర్షణ ఎలా దొరుకుతుందో..
7 సెప్టెం, 2014
సంగీత నృత్యాలపట్ల సామాన్యులకు ఆసక్తి కలిగించేదెట్లా..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
5 సెప్టెం, 2014
ఈ పిల్లి ఆ పాలు తాగదు..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి భావ లహరి
3 సెప్టెం, 2014
లయ తాండవం
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
31 ఆగ, 2014
ఆచెడు భావముల్గలచునప్పుడు..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
జీవన చిత్రాలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
29 ఆగ, 2014
నల్లకుంట రామాలయంలో.. T.K.V.రాఘవన్
ఇది T.K.V.రాఘవన్ గారు
నల్లకుంట రామాలయంలో2012 లో ఇచ్చిన ఉపన్యాసం..
ఇంకా ఈనాటి పలువురు పెద్దలతో పుట్టపర్తిని గురించి పలు చోట్ల మాట్లాడించాలని మా కోరిక..
ప్రొద్దుటూరులో సామవేదం షణ్ముఖ శర్మ గారు
సుమారు రెండు గంటలు మట్లాడారట..
విగ్రహ స్థాపన అప్పుడు
మరో చోట గరికపాటి వారు కూడా సుదీర్ఘంగా మాట్లాడినరు
కానీ వీడియోలు కానీ టేప్ చేసినట్లు కూడా
దాఖలాలు లేవు..
ఇది నాగపద్మిని స్వయంగా పూనుకొని ఏర్పాటుచేసిన సభ..
లేబుళ్లు:
వీడియోలు
28 ఆగ, 2014
సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య
గో తెలుగు.కాం లో పుట్టపర్తిని గురించిన వ్యాసం పడింది
శ్రీ చెరుకు రామ్మోహన రావ్ గారు ఎంతో ఆత్మీయంగా బదులిచ్చారు..
కడపలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నారు..
ఆయన facebookలో మెసేజ్ చేస్తూ
నీ అన్న కాని అన్న..
అని పోస్ట్ చేసారు..
నా హృదయం పులకించిపోయింది..
వారు వ్రాసిన వ్యాసంలో మెరుపులివి..
ఒక మహాకవిని..
పండితుడిని
పధ్నాలుగు భాషల దిట్ట
నాలుగు రూపాయల కోసం ఆశపడడం అవీ దొరకకపోవడం..
ప్చ్..
అందరూ పద్మశ్రీ వస్తే చాలని ఎదురుతెన్నులు చూస్తే..
దాని ద్వారా యేవైనా డబ్బులు వస్తాయని అనుకున్నారట..
కానీ ఒక కాగితం స్మృతి చిహ్నం ఇచ్చారట..
సహాయంకోసం శ్రీమతి ఇందిరా గాంధీ ని అడిగారట..
ఆమె కలెక్టర్ కు అప్లయ్ చేసుకోమన్నారట..
ఆ కలెక్టరూ స్కూల్ టీచర్లకు ఆ అర్హత లేదన్నారట..
యేమిటివన్నీ.
మంచి మంచి అవకాశాలను
చేజేతులా వదులుకొని..
మంచి ఉద్యోగాలను..
తృణమాత్రంగా వదిలేసి..
వాళ్ళనూ వీళ్ళనూ సహాయం కోసం అర్థించడం..
అవకాశం వచ్చినపుడు..
ఉద్యోగం కంటే స్వాభిమానం గొప్పది..
వాళ్ళకాళ్ళూ వీళ్ళకాళ్ళూ పట్టుకోవటం చిన్నతనం..
ఒకరికి పెట్టటమే కానీ
దేహీ అనటం ఎందుకు
భగవంతుడు ఇచ్చినది తినడానికీ తాగడానికీ సరిపోదా..
అన్న భావనలు.,
కుటుంబా వసరాలు మీద పడినప్పుడు
ఎవడైనా సహాయం చేస్తే బాగుండు నన్నతలంపు
అంటే డబ్బు ఆ అవసరాలకు సరిపడా వస్తే చాలు
ఎక్కువ వద్దు..
దాచుకోవడం
దాన్ని చూసి మురిసిపోవటం అంటే ఏహ్యత
ఈ వ్యక్తిత్వాలు ఈరోజుల్లో కనిపిస్తాయా..?
ఒక సంగీతవిద్వాంసుడు పాడితే..
చెమర్చిన కళ్ళతో భార్య చేతిగాజులు
ఆయన కాళ్ళ దగ్గర పెట్టే సుబుధ్ధులెవరండీ..
మా పెద్దక్కయ్య పెళ్లి చందాలెత్తి చేసారట
పిల్ల పెళ్ళికి చెం దాలెత్తడం పెళ్ళి చేయడం
అదేమీ తప్పుకాదు..
అలానే శిష్యులు పుట్టపర్తి కథ నడిపించారనుకోండి ..
సదానందీ శ్వరయ్య గారు వ్రాసిన ఈ వ్యాస భాగం ఇది
అవును సదానందం చెప్పినట్లు
పద్మశ్రీ తీసుకొని తప్పు చేసాను
అన్న వాక్యం వెంటాడు తూం ది ..
సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య
ప్రభుత్వము పద్మశ్రీ బిరుదునిచ్చిన సందర్భముగా మైదుకూరులో యువజనసాహితీ సంస్థ తరుపున 1973లో ఆచటి హైస్కూల్ ఆవరణలో
ఒక బహిరంగసభ జరిగింది.
ఆచార్యులవారికి సన్మానం,
కవి సుధాకర ఎస్. రాజన్న కవి అధ్యక్షత వహించగా
నేను వక్తను,
ఆ రోజుల్లో సహజ యవ్వనం కారణంగా ఆచార్యులవారుపద్మశ్రీ తీసుకొన్నందుకు ఆక్షేపించాను. ఆ బిరుదు సినీనటుడు రేలంగి వేంకటరామయ్యకు ఇచ్చిన తర్వాత ఇచ్చారు.
అంతకు మునుపే నారాయణాచార్యుల వారిని
రేడియో గుర్తించని నాడు,
శాసనమండలి,
సాహిత్యపరిషత్తులు తిరస్కరించిన నాడు కూడా
ప్రజలు,
సాహితీ పిపాసులు,
ప్రజల మనిషని గుర్తించారు.
హంగులతో అహంతో
కవులు గగనసీమలో విహరించే రోజుల్లో
ఆయన మానవత్వమున్న మనిషిగా
ప్రగతిపథంలో పయనించినారు.
కావున ఆచార్యులవారు
జనప్రియ రామాయణందే కాకుండా
సమాజగతిని నగ్నంగా చిత్రించగల
జనతారామాయణం వ్రాయుమని
మరొక గుడిగంటలు మ్రోగించి,
పురోగమనాన్ని వ్రాయమన్నాను.
స్వామికి ఏ రోజు సభలోను
అధ్యక్ష, ముఖ్య అతిధి, ముఖ్యోపన్యాసకులు అని సంభోదించేఅలవాటు లేదు.
సన్మానానికి జవాబిస్తూ ఇలా అన్నారు.
“వాడు సదానందం” చెప్పినట్లు
నేను పద్మశ్రీ తీసుకొని తప్పుచేసినాను.
ఇంకా MLCకి ప్రయత్నించాను.
రేడియోలో ఉద్యోగం ఇస్తామంటే ఆశపడ్డాను.
ఇవన్నీ పొరపాట్లే.
పద్మశ్రీ అంటే ఏదో కొంత డబ్బు ఇస్తారనుకున్నాను.
కాని డిల్లీలో ఒక కాగితం, స్మృతిచిహ్నం ఇచ్చారు.
ఈ మాటను నేను
శ్రీమతి ఇందిరాగాంధి గారిని అడిగాను.
ఆమె ఆర్ధిక సహాయానికి
మీ జిల్లా కలెక్టరుకు అప్లయ్ చేయమన్నారు.
కడపలో కలెక్టరు గారిని అడిగినాను.
ఆయన ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారు
Below poverty line క్రింద రారని చెప్పి
రిక్తహస్తాలు చూపించారు.
కానీ సదానంద చెప్పినట్లు
ఒకేరకమైన కవిత్వం నేను వ్రాయలేను.
వ్రాయను.
నేను వానివలె
ఏ committed Ideology కు చెందిన వాడిని కాను.
నా మనస్సు ఎలా స్పందిస్తే అలా వ్రాస్తాను.
ఇప్పటికే కొన్ని వందలపేజీల గేయసాహిత్యం, ప్రాచీనసాహిత్యం వ్రాశాను
‘ఎవరైన ప్రచురించి నాకు కొన్ని ప్రతులిస్తే సంతోషిస్తానన్నారు”
ఇదే ఆయన సిసలైన నిజాయితితో వెలిబుచ్చిన నిఖార్సయిన మనస్తత్వము
లేబుళ్లు:
జీవన చిత్రాలు
,
వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)





