25 మార్చి, 2015

పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక సభావేదికమీద 
తన పక్కనే కూర్చొన్న కథా రచయితతో 
”ఏమప్పా! ఇన్నాళ్లుగా కథలు రాస్తున్నావుగదా? 
ఎంత సంపాదించావు?” అని ప్రశ్నిస్తే 
దానికి ఆ కథా రచయిత 
”పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం” 
అన్న సమాధానం ఇచ్చినట్లు చదువుతుంటాం. 

ఆ కథా రచయతని ”చిత్తూరు అయ్యవారు” అని కూడా అంటారు. ఎవరాయన

 సమాధానం మధురాంతకం రాజారాం
?http://piratla.blog.com/

రస నిష్ఠ

http://patrika.kinige.com/?p=3758


కనక ప్రసద్ గారికి క్షమాపణలతో తమరి వాక్యాలు ఉపయోగించుకున్నందుకు
మా అయ్య మీకర్థమైనంతగా మాకెప్పుడు అర్థమౌతారో అన్న దిగులుతో..
 http://patrika.kinige.com/?p=3758

24 మార్చి, 2015

He was a legend..


రాళ్ళ సీమ లో ఏముంది

1955 లో రాజమండ్రిలో  
మహాకవి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారి దర్శనం కోసం 
వారి ఇంటికి వెళ్ళారు పుట్టపర్తి
శాస్త్రి గారి శిష్యులు కొందరు.. 

రాయల సీమ రాళ్ళ సీమ అని
సంస్కృతి మృగ్యమని కించపరుస్తూ మాట్లాడారు..
 

శ్రీపాద వారు 
అబ్బాయ్ కవిత్వమేమైనా వ్రాశావా.. అన్నారు.
అంతటితో వినయానికి స్వస్తి చెప్పి
మహోధ్ధతితో క్రింది చాటువు చెప్పారు

"హేరాళం బిదె నాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారినిన్
జూచితిలెమ్ము.. చెప్పకుము
గొప్పల్.. విప్పుగా గౌతమీ
ధారావర్ధిత గోస్తనీ రస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్యంబుల ముందు తావక
పయః పానంబు శోభించునా.."


అంటూ ఆశుకవితను వినిపించిన తర్వాత
సంస్కృతంలో మరో రెండు శ్లోకాలు ఆశువుగా చెప్పారు
శ్రీపాద వారి శిష్యులు విస్తు పోయారు
శ్రీపాద కృష్ణమూర్తిగారు జరిగిన దానికి 

విచారం వ్యక్తం చేసి
అత్యంతానందంతో సత్కరించారు పుట్టపర్తి వారిని..