17 మార్చి, 2016

15 మార్చి, 2016

కృ ష్ణ గీతం

అది తుంగభద్రా తీరం..
అందులోకి స్నానమాచరించడానికి వెళుతున్నారు పరమాచార్య.
పుట్టపర్తి తో విశేషమైన అనుబంధం..
ఆత్మీయతా 
అక్కడికి వల వల ఏడుస్తూ వచ్చిందో స్త్రీ..
స్వామి వారి పాదాలపై పడింది
స్వమీ చెప్పండి
మా అమ్మ కెందుకిలా జరిగింది..
తుంగభద్రానదిలో నీళ్ళు మౌనంగా కదిలాయి

స్వామి యేమీ మాట్లాడలేదు
మౌనంగా తలేత్తి ఆకాశంవంక చూస్తూ
రెండుచేతులూ చూపించారు
మా అమ్మ కాన్సర్ తో భయంకరంగా చనిపోయిన రోజులు అవి..

శరణాగతి అంటే ఏమిటి
గజేంద్ర మోక్షం లో ఏనుగు మొసలితో పోరాడి పోరాడీలసిపోయి
ఎలా రక్షింపబడటం అనుకుని
ఇటువంటివాడైతే తనని కాపాడగలడని

ఎవ్వనిచే జనించు.. జగమెవ్వనిలోపలనుండు లీనమై
ఎవ్వనియందు డిందు .. పరమేశ్వరుడెవ్వడనాది మధ్య లయుడెవ్వడు
సర్వముదానెయైన వాడెవ్వడువాని నాత్మభవు.. నీశ్వరు
నే శరణంబు వేడెదన్..
అని ప్రార్థించింది

ఈ మొసలి నుంచీ కాపాడు అనికదా దాని ఆంతర్యం..
కానీ దానికి లభించింది కరినుంచీ ప్రాణాలుకాదు
ఏశ్వరునిలో లీనమైపోవడం

ఆయనలో ఐక్యమైతే ఎలా వుంటుందో దానికి తెలియదు
బతికితే హాయిగా మళ్ళీ తన భార్యలతో అడవిలో
శృంగారంలో మునిగిపోతుంది

పరమాత్మ దానినెందుకు అనుగ్రహించాడు
పూజలలో మునిగిపోయి కొందరు
లౌకికంలో మునిగిపోయి ఇంకొందరు
ఉన్నారే
వారినెవరినైనా ఉధ్ధరించవచ్చుకదా..
ఇలా పిలిస్తే నాకు వినబడుతుంది అని
ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ కావచ్చు

చావు తప్పదని తెలిసిన క్షణంలో
అంతవరకు తాను బ్రదికిన బ్రతుకు గుర్తుకురాదు..
సంభవిమ్హబోయే మరణం ఎంత భయానకమో
తరువాత తానేగతినొందుతాడో..
అన్నదే మనసు నావహిస్తుంది

వెనకనిలబడిన బంధు సమూహంకోసం
తన విలువైన సమయం ఎలా వృధా చేసుకొన్నదీతలచి విచారించటం తప్ప చేయగలిగిందేమీ లేదు..'

వామనుడై వచ్చి
పరమ భక్తుడైన బలి నుంచీ కేవలం మూడడుగులు కోరి
ఎవ్వని గరుణింప నిశ్చయించితిని.. వాని యఖిల విత్తంబునే నపహరింతు
వింధ్యావళికిచ్చిన సమాధానం
అంటే రాటు దేలుస్తాడన్నమాట..

పాల సముద్రంలో పడుకుంటాడంటారు..
తానున్నచోట పాలు వెల్లువలా వుండేటట్లు కృప చేస్తాడంటారు..
ఆవుల పాలు పితికాడంటారు.. 
పాలు వెన్న నెయ్యి దొంగిలించాడంటారు
ఇన్ని పాలు నైవేద్యం పెడితే పొంగిపోతాడంటారు
అటువంటివాడి కథ చెప్పినవాడికీ
విన్నవాడికీపాదములు పట్టినవాడికీ
తల్లిపాలు దొరక్కుండా చేశాడని లీలాశుకుడన్నాడు
అంటే
ఇక తల్లిపాలు తాగ నవసరంలేదనీ

ఇక పుట్టడనీ అర్థం.. 

11 మార్చి, 2016

పామిడి తురగపు పాదము

పామిడి తురగపు పాదము అన్న అన్నమయ్య ప్రయోగంపై జరుగుతున్న చర్చ చూచాను. అన్నమయ్య కీర్తనలకు వ్యాఖ్యాతగా పేర్గాంచిన కామిశెట్టి శ్రీనివాసులు గారిని ఒక మాట అడిగాను
ఇది వారు వెలిబుచ్చిన అభిప్రాయం
ప్రతిదీ వీడియో యేమిటి అనుకోకండి.. 
నాకొచ్చిన విద్య ఇదొక్కటే


8 మార్చి, 2016

ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి

శ్రీరంగాచార్యులు గారు పుట్టపర్తి గురించి చెప్పిన విశేషాలు..
పుట్టపర్తి ఏకవీర నవలలు కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి అనువదించారట..
ఈ రికార్డింగులో నాకు తోడ్పడిన మా అక్కయ్య నాగపద్మిని కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..
శ్రీరంగాచార్యులుగారు తెలంగాణాకు చెందిన పండితులు.. సాహితీవేత్తలు..
పుట్టపర్తి వారితో  అరవైలనుంచీ అనుబంధం కలిగినవారు
వారు పుట్టపర్తిని గూర్చి ఎన్నో విషయాలు నిర్భయంగా విశదంగా మాపై ఎంతో ప్రేమతో వినిపించారు
తమ సొంత పిల్లలాగే మమ్మల్ని చూసిన వారిని పిన్నయ్యా అని పిలవాలనిపించింది..
మా తండ్రిని గురించి ఇన్ని విషయాలు మాకందించిన వారు మాకు పినతండ్రి కాక మరేమవుతారు..


1 మార్చి, 2016

శిల్పాలలో నవరసాలు



శృంగారం హాస్యము కరుణ 
రౌద్రం వీరం భయానకం 
భీభత్సం అద్భుతం శాంతం..
ఇవీ నవరసాలు
నటులు నవరసాలు పలికించటం తెలుసు.. 
మరి శిలలు నవరసాలు పలికించటం విన్నారా.. 
ఈ నల్లని రాలలో .. ఏ కన్నులు దాగెనో .. ఈ బండల మాటున ఏ గుండెలు మొగెనో అన్నది సినిమా పాట 
 కదల లేని మెదల లేని ఆ శిలలు 
ఉలి అలికిడి వినగానే జల జలా భావాలను ప్రవహింప జేస్తాయి .. అని కవి వాక్కు 

'ఎట్లు పైకెత్తిరో..  ఏన్గు గున్నలకైన తలదిమ్ము గొలుపు 
ఈ శిలల బరువు '
అని బాల పుట్టపర్తి ఆశ్చర్యపడ్డారు..

'శిలలు ద్రవించి యేడ్చినవి.. '
కొడాలి సుబ్బారావు గారు 
శిలలకు మనసుంటుందని 
వాని హృదయమూ ద్రవిస్తుందని 
అవి కన్నీరు పెట్టుకుంటాయని చెబుతున్నారు

'ఉలి చేరాలకు చక్కిలింతలిడి ..
ఆయుః ప్రాణములు' శిల్పి పోస్తాడని 
పుట్టపర్తి తన పధ్నాలుగో యేట పెనుగొండలక్ష్మిలో వ్రాసుకుంటే.. 
అబ్బురపడ్డారు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ వంటి పెద్దలు. 

పుట్టపర్తి పెనుగొండలక్ష్మి లో 
ఇటువంటి అద్భుతమైన వర్ణన లున్నాయి  .. 

మనమూ కొన్ని వందల వేల సంవత్సరాలు 
శిలలై పడివుండి..
ఎవరో మహాత్ముడు మనపై పాదం మోపిన పుణ్యానికి .. మన కర్మ నశించి .. 
జన్మల నడక మొదలై..
ఇదిగో మనిషి వరకూ వచ్చామట..


మరి ఆ శిలల నవరసావిష్కరణ 
పుట్టపర్తి నోటి వెంట వింటే ఎలా వుంటుంది .. 
విజయ నగర సామాజిక చరిత్ర నుంచీ .. 




































విరుపాక్ష స్వామి గోపురములు


విఠలాలయం సమీపం లోనే రాతిరధం వుంది ..
ఇది ఒకే శిల
దీని చక్రాలు తిరుగుతాయి.. కదులుతాయి కూడా..