9 ఏప్రి, 2013

పుట్టపరి ప్రధమ వర్ధంతి సభ లో M. S . రెడ్డి ఏమన్నారంటే


పుట్టపరి ప్రధమ వర్ధంతి సభ లో M. S . రెడ్డి ఏమన్నారంటే 



అది పుట్ట పర్తి ప్రధమ వర్ధంతి సభ.
బీహార్ కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్
 పెండేకంటి వెంకటసుబ్బయ్య ముఖ్య అతిధి ,
సాహితీ పీఠం అధ్యక్షులు అంబటి గంగయ్యఅధ్యక్షులు నాటి రాష్ట్ర రెవెన్యూ మంత్రి 
డి.యల్.రవీంద్రా రెడ్డి,
రాష్త్ర చలన చిత్ర అభివృధ్ధి సంస్థ అధ్యక్షులు 
ఎం.ఎస్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అందరూ పుట్టపర్తి ని స్తుతించారు.
 గ్రంధాలను విశ్లేషించారు
 రాజన్న సాక్షాత్కారం లోని పద్యాలను
 గానం చేసి అలరించారు. 
అనంతరం ఎం.ఎస్.రెడ్డి గారు మాట్లాడారు.

నిర్మొహమాటంగా సూటిగా మాట్లాడటానికి 
పెట్టింది పేరు శ్రె ఎం.ఎస్.రెడ్డి గారు. 
ఆయన ప్రఖ్యాత నటుడు యన్.టీ.ఆర్ కే 
చెమటలు పట్టించిన వాడు. 
జమున సత్యభామాహంకారానికీ 
కారం తినిపించిన వాడు. 

ఆయన లేచి
ఇందరు సాహితీ సమరాంగణులిక్కడుండగా ఏమెరుగుదునని నన్ను పిలిచినారు..?
అన్నాడట..
ప్రొద్దుటూరుకు వచ్చి పుట్టపర్తి వంటి మహాకవిని గూర్చి మాట్లాడటం అంటే తిరుమలకు వెళ్ళి వేంకటేశ్వర మహాత్యం గురించి చెప్పినట్లుందని చమత్కరించారట..
జనం వారి మాటలను నవ్వుతూ ఆస్వాదించారట...










కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి