7 మే, 2013

'మహరాష్ట్ర వాఙ్మయ ప్రభావము''



ఈ ''మహరాష్ట్ర వాఙ్మయ ప్రభావము''లో 
ఎన్నెన్ని విషయాలో..
ప్రాకృత భాషాభేదములలో మహరాష్ట్రి ఒకటి..
నేటి మరాఠీ కి 
ఆ మహరాష్ట్రి ప్రాకృతమే మూలభాష..

హాల చక్రవర్తి ప్రాకృత గాధలను సేకరించి 

వానికొక రూపమిచ్చాడు..
అంతే గాదు ..
తాను కూడా స్వయంగా కొన్ని గాధలను వ్రాసాడు

ఆంధ్రుడైన హాలుడు 

నేటి మరాఠీకి మూలభాషయైన 
మహరాష్ట్రి యనబడే 
ప్రాకృత భాషా భేద రూప భాషలో రచనలు చేసాడు


ఈ విధముగా

మరాఠీ భాషకు పురుడు తీర్చిన ఘనత
మన తెలుగు వారిదేనట..
కొంతలో కొంత..

పాండురంగడక్కడ చాలా ప్రభ గలిగిన దేవుడు..

విద్యానగర ప్రభువైన కృష్ణదేవరాయని
 ఆ పాండురంగడు ఆకట్టుకొనెనట.

విఠలాలయమునకు పునాది వేయుటే

ఇందుకు సాక్ష్యమట..
కృష్ణదేవరాయనికి పాండురంగనిపై కన్నుపడుటకు
ఆనాటి ద్వైత భక్తులు కారణమట..

విద్యానగరమునకున్న ఈ అభిమానము ''పాండురంగమహాత్యమై''నదట..

పుట్టపర్తి గద్య రచనా శైలి..
చమత్కారాలు..
విరుపులూ..
వ్యంగ్యాలు..
చారిత్రకునిగా పుట్టపర్తికి ఎందుకు పెద్దపీటవేస్తారో అర్థమైంది..

ఒక తపస్సంపన్నుని దృష్టితో కూడ చరిత్రను చూచి

సమర్థ రామదాస స్వామి వంటి వారిని గురించి చెబుతూ..
'తనకు తగిన రాజు ఎవ్వడని ..?'
కాశి నుంచీ కన్యాకుమారి వరకూ చుట్టినాడట
''అప్పటికి విజయనగర వంశస్తుడైన
అళియరామరాయలు బ్రతికి వుండినా
వారికి ఈ రామరాయలపై ఎందుకు చూపు పడలేదో
బహుశః
ఆతపస్వి దృష్టికి విద్యానగరము కాలసర్ప దష్టమైపోవునని ముందే తోచెనేమో చెప్పలేము ''
అంటారు పుట్టపర్తి
మీరూ చదవండి..


ఇందులో ఏకవీరా దేవి ప్రస్తావన వుంది..


ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని 

ధులియా పట్టణం సమీపంలోని 
పంజహర్ నదీ తీరంలో వెలసివుంది. 

ఈ దేవత కేవలం మహారాష్ట్ర వాసులకే కాకుండా 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తుల మనస్సుల్లో కొలువైవుంది. 

ఏకవీరా దేవి 

ఏకవీరా దేవి 

ఆదిశక్తి ఏకవీర దేవి పరశురాముని తల్లిగా అందరికి సుపరిచితం.
 ఏకవీర, రేణుకా దేవిలు ప్రతిరూపమే ఆదిమాయ పార్వతీ దేవి.
 ఆమె అనేక దయ్యాలను సంహరించినట్టు పురాణాలు చెపుతున్నాయి.
 పౌరుషానికి ప్రతిరూపంగా పేరొందిన పరశురాముని తల్లిగాను, 
జమదగ్ని భార్య అని పురాణాలు చెపుతున్నాయి. 
రేణుకాదేవికి మరో పేరే ఏకవీరా దేవి. 





 
 










3 మే, 2013

షాజీ కావ్యాన్ని పుట్టపర్తి తన పందొమ్మిదవ యేట వ్రాసారు 
అప్పటికాయన తిరుపతిలోచదువుతున్న విద్యార్థి.
 రచనను పుట్టపర్తి నోటివెంట విని సమ్మోహితులైన తోటి విద్యార్థులు 
దీని ముద్రణకు కారకులయ్యారు. 

ఇందులో ఇంకో విశేషముంది
 అదేవిటంటే.. 
ముద్రణ అయిన మరుక్షణం ఇది నాటి ఇంటర్ మీడియట్ పాఠ్య గ్రంధమైంది 
రాసినవాడప్పటికి ఇంకా విద్యార్థియే.. 
 అంతటి అమూల్యమైన కావ్యాన్ని
 మీ ముందుకు భక్తి పూర్వకంగా తెస్తున్నది 
వారి ప్రియ పుత్రిక శ్రీమతి పుట్టపర్తి అనూరాధ


2 మే, 2013

నేననెడు భావమున ..


పూప వయస్సులో ..


పరసతులన్ ..


పోలాప్రగడ సత్యనారాయణమూర్తిగారి ప్రముఖుల పరిచయాల ''ఆరోజుల్లో"


 పోలాప్రగడ సత్యనారాయణ గారు
బాపట్ల నెల్లూరు ప్రాంతాలకి అయ్యతో కలిసి   సన్మానాలకు వెళ్ళినప్పుడు
వాళ్ళింట్లో దిగటం గుర్తు 
వారి భార్య రాజ్జలక్ష్మి గారూ గుర్తే
కానీ నా దురదృష్టం నా వయసు  పదేళ్ళలోపే 
లీలగా తప్ప ఏవీ గుర్తులేవు
ఈ పుస్తకాన్ని నాగక్కయ్య ఇచ్చింది.
పోలాప్రగడగారు మంచి కథకులు నవలలూ వ్రాసేవారు
వారి శ్రీమతీ పేరుపొందిన రచయిత్రి

ఇదిగో..  ఇదే ఆ రోజుల్లో .. 



ఇది పోలాప్రగడ పరిచయం 


పోలాప్రగడ సత్యనారాయణగారు
 "ఆ రోజుల్లో"
అంటూ ప్రముఖులతో తన పరిచయం తో పాటూ 
రక రకాల తమాషా సంగతులను వివరిస్తూ 
మనని యాభైయ్యేళ్ళ వెనక్కు తీసికెళ్ళారు 
ఇందులో పుట్టపర్తి వారి ప్రస్తావనా వుంది 

"ఆ రోజుల్లో ..
ఎందుకు వ్రాసారో ఆయనే చెబుతారు వినండి..




ఆ రోజుల్లో ఎలా వుండేది..?
టీవీలు లేవు రేడియోలే..
ఫ్రిజ్జులు లేవు కుండలోనీళ్ళే..
సెల్ ఫోన్లు లేవు ల్యాండ్ ఫోనే
గ్యాసు పొయ్యిలు లేవు కుంపట్లే..
ఇలా ఎన్నో ..

మరి ఈనాడో ..?
ఎన్ని సౌకర్యాలో ..
వాటితో పాటూ
మంటగలిసిన మానవతా విలువలను సభ్యతా సంస్కారాలనూ మనకు గుర్తు చేస్తారు పోలాప్రగడ 





ఇక పుట్టపర్తి గురించి ఆయనేం వ్రాసారంటే..