20 అక్టో, 2013

"వజ్జలగ్గ" జయవల్లభుని ప్రాకృత కావ్యానికి పుట్టపర్తి వ్యాఖ్య







                       వజ్జలగ్గ
        జయవల్లభుని ప్రాకృత రచన పుట్టపర్తి పరిశీలన..
సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ ; పుట్టపర్తి అనూరాధ


పూర్వము సంస్కృత భాష గ్రాంథిక భాషగాను
ప్రాకృత భాష వ్యావహారిక భాషగాను ఉండుట చేత 
సంస్కృత నాటకములు వ్రాసిన మహాకవులు 
ఉత్తమ పాత్రల మట్టుకే సంస్కృతము ఉపయోగించి 
తదితర పాత్రలకు ప్రాకృత భాష వాడేవారు.  

అశోకుడి కాలంలో ముద్రించబడిన శాసనాలు 
ప్రాకృత భాష లో రాయబడ్డాయి 
 "వజ్జాలగ్గం హాలుని గాథా సప్తశతి లాంటి ప్రాకృత గాథా సంకలనం. 
దీని రచయిత శ్వేతాంబర జైనుడయిన జయవల్లభుడు. 
ఈ వ్యాసంలో రామచంద్ర గారు 
ప్రస్తుత తెలుగు పదాలకు మూల రూపమైన 
౨౩ శబ్దాలను పరిచయం చేసి
వాటి సందర్భాన్ని తెలుపుతూ
పదాలు సంస్కృత తద్భవాలు అన్న వాదనను
పూర్వపక్షం చేస్తారు. 
వీటిలో కొన్ని పదాలు, “వింతర”,””,”ఆవట్టయే,”విసూరణంవగైరా.."
ప్రాకృత వాఙ్మయంలో రామకథ తిరుమల రామచంద్ర
"పుస్తకం" లో 
తిరుమల రామచంద్ర గారి పుస్తకాలని పరిచయం చేస్తూ 
రవి రాసిన మాటలు
"
వజ్జలగ్గ"
గోష్టియందొకానొక ప్రస్తావనమునదు పలుకు చాటువులకు 
వజ్జాలగ్గమని పేరట.
వజ్జయనగా పధ్ధతియని జయవల్లభుడే వ్యాఖ్యానించెను
లగ్గమనగా లగ్న శబ్ద భవమగునా..
అంటారు పుట్టపర్తి యీ వజ్జలగ్గ గురించి

అతి చిన్న వయసులోనే ప్రాకృత భాషల గురించి
ఆధికారికంగా చెప్పి అందరినీ పుట్టపర్తి ఆశ్చర్యపరిచారు
ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో
ప్రాకృత భాషల గురించి పుట్టపర్తి మాట్లాడుతున్నప్పుడు
ఉపన్యాసం ఐపోయాక
ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి
సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశా రట
పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి గారు
ఉద్యోదనుడు ప్రాకృత భాషలో రచించిన
కువలయమాల అనే రచనను అనువదించారు...
మరి యీ వజ్జ లగ్గ గురించి పుట్టపర్తి వారేం చెప్పారో చూడండి









11 అక్టో, 2013

పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో

జ్యోతిషము జోస్యం , 
భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా 
అనేకమంది విశ్వసించే విధానం. 
ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. 
జీవి జీవితంలో జరిగినది, 
జరుగుతున్నది, 
జరగబోయేదీ  
జననకాల గ్రహస్థితి ప్రకారము, 
శరీర లక్షణాలు, అర చేతులు, 
మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. 

ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. 
ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో 
ఇది కూడా ఉంది. 

మొట్టమొదటిగా 
జ్యోతిష్య శాస్త్రాన్ని 
గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు.  
హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో 
జన్మ సిద్దాంతం ఒకటి. 

జన్మసిద్దాంతం ప్రకారము  
పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం 
ప్రస్తుత జన్మలో ఉంటుంది. 
దానికి తగిన విధంగా, 
తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. 
అనగా అటువంటి గ్రహస్థితి లో జీవి జననం జరుగుతుంది. 
ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. 
కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు 
జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. 

ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.
హస్తసాముద్రికము, గోచారము,  
నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది 
మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.
 అని వీకీ పీడియా చెప్పింది  

"ఈ నిను జూచునప్డు నిలువెల్లను గన్నులు, సేవలో సుఖం
బానెడు నపుడు నిలువంతయు చేతులు, పల్కు పల్కి నీ
యానతి గోరునపుడు నిలువంతయు నోరులు, నీ స్తవంబునం
దేను రమించు నప్డు నిలువెల్లను కంఠము లీయరా ప్రభూ.. "


 
నా గత జన్మ యేమిటి
ఈ జన్మలో నా స్థితి యేమి
కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..
ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది..
నీవిచ్చే వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ,
ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అంటుంది అక్కయ్య..
ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు  పుట్టపర్తి లో ఉన్నాయి
జ్యోతిష్య పండితులు
పుట్టపర్తి పాండిత్యానికీ
'సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళ
లో భినివేశానికీ
ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి
శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది
 

తప్పకుండా వారు వారి గమ్యాన్ని చేరారని 
మేము వారి ప్రియ శిష్యులూ భావిస్తున్నాము
వారి నిర్యాణ సమయంలో దగ్గరున్న గోవిందు అనే శిష్యుడు
అయ్య ఇచ్చామరణం పొందినట్లు మాకనిపించిందమ్మా
వారి సహస్రారం నుంచీ ఆత్మ నిర్గమించిందనిమేము 

కనుగొన్నాము అని
వివరించాడు..
ముఖ్యంగా ఇంకో విషయం
పుట్టపర్తి అంత్య సమయంలో వారి ఆధ్యాత్మ శిష్యులు మాత్రమే 

చుట్టూ వుండటం..
భాగవతం దశమ స్కందం తీయమని 

బాబయ్య తదితరులకు చెప్పి వ్యాఖ్యానిస్తూ 
దాదాపు అరగంట గంట పాటు తెల్లవారి నాలుగ్గంటల నుంచీ.. 
ఏకాదశీ తిధి నాడు
శ్రీనివాసా
ని పడకపై ఒరిగిపోవటం
యేవో రహస్యాలను విప్పీ విప్పక చెప్పటం లేదూ..




పుట్టపర్తికి కంచి పరమాచార్యతో సాన్నిహిత్యం చాలా లోతైనది..
సంప్రదాయానికి నిర్వచనం స్వామి
యే బంధాలకూ లొంగని పుట్టపర్తి
వీరి కలయికే విచిత్రంగా వుంది కాదూ
 

నిజమే ..
ఆరోజుల్లోనూ అలానే వుండేది
కంచి స్వామి ఒకప్పుడు పెనుగొండ వెళ్ళారు
అప్పుడు పుట్టపర్తి తొమ్మిదేళ్ళ పసివాడు
ఆ పసివానివంక చూసి వాని నొసటి గీతలను చదివిన స్వామివారు
వీడు గొప్ప కీర్తిమంతుడౌతాడని చెప్పారు

తరువాత తల్లి వియోగాంలో మసలే పుట్టపర్తికి కుటుంబమ్నుంచీ నిరాదరణ.. కుంగదీసింది..
రెండవపెళ్ళి చేసుకున్న తండ్రి..
ఆమెకు పిల్లలు
మరలిన తండ్రి దృష్టి
పుట్టపర్తిని తీవ్ర నిరాశకు గురిచేశాయి

తిరుపతిలో విద్వాన్ చదువుతున్నరోజుల్లో
కంచి స్వామి తిరిగి మళ్ళీ పుట్టపర్తి ని పలకరించారు
పుట్టపర్తి చదివే 

సంస్కృత విద్యాలయానికి వెళ్ళారు స్వామి
అప్పుడు సంస్కృతంలో అష్టావధానం జరిగింది..
అప్పుడూ పుట్టపర్తి పాండిత్యం స్వామివారిని మురిపించింది..

తర్వాత సీను ప్రొద్దుటూరుకు చేరింది..
అప్పుడు పుట్టపర్తి వివాహితుడు
అక్కడి ఒక పాఠశాలలో పనిచేస్తున్నారు
అక్కడి పండితుల మధ్యా విపరీతమైన పోటీలు
కక్ష్యలు ఘర్షణ వాతావరణం..

ప్రొద్దుటూరుకీ పరమాచార్య విచ్చేశారు
స్వామివారికి ఆహ్వానం పలకడానికి ఎవరు అర్హులు..??
అందరూ వెనుకంజ వేశారు..
పుట్టపర్తి పొలిమేరలనుంచీ సంస్కృతంలో భహ్మాండమైన శ్లోకాలతో
స్వామివారిని ఆహ్వానించి కన్యకాపరమేశ్వరీ ఆలయానికి తీసుకురావటం జరిగింది..

అక్కడ కొద్ది రోజులు స్వామి బస చేశారు..
మన తెలుగు పండితులకు సంస్కృతమే అరకొరా తప్ప అన్య భాషా పరిచయమే లేకపాయె
కానీ నిజమైన శక్తి గలవారిని కిందకి లాగటం లోనూ
కుయుక్తులను ప్రదర్శించి తరిమేయడంలోనూ పాండిత్యమెక్కువ..

తమిళ సాహిత్యమూ
భక్తుల సాన్నిహిత్యమూ గల పుట్టపర్తి స్వఛ్చత స్వామిని తిరిగి దగ్గర చేసింది..
అప్పుడు పుట్టపర్తి అక్షర లక్షల గాయత్రి కొన్ని కోట్ల అష్టాక్షరీ చేసి వున్నారు..
అంతే కాదు..

ఇంకో ముఖ్య విషయం
అందరూ స్వామివారి ముందు సాగిల పడేవారు
కోర్కెలు విన్నవించే వారు..
తాము చాలా సంప్రదాయబధ్ధులమని ప్రదర్శనకు దిగేవారు ఎక్కువ

కానీ
నేనిన్ని కోట్ల సాధన చేసాను నాకు ఎందుకు ఏ ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు..
అని పదే పదే అడిగే శిష్యులు ఎవరుంటారు..
నాకు కృష్ణ దర్శనమెప్పుడవుతుందని సర్వమూ ఒడ్డి హిమాలయాలకు పరిగెత్తే వారు ఎవరుంటారు..

అందుకే ప్రతిష్టాత్మక  కంచి పీఠాధిపతి..
నడిచేదైవమని ప్రపంచమంతా పిలిచిన సన్యాసి..
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్య
పుట్టపర్తికి వాగ్దానం చేసారు..
నీకు అంత్య దశలో కృష్ణ దర్శనమౌతుంది..
అని..



 

 

 

 పుట్టపర్తి జాతకం వారి స్వహస్తాలతో

సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ : పుట్టపర్తి అనూరాధ 
 





 1947 ఫిబ్రవరి న శివతాండవం లోని శివాలాస్యం 
"భారతి"లో ప్రచురింపబడింది.
సేకరణ : శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ : పుట్టపర్తి అనూరాధ 











1 అక్టో, 2013

సహగామి







సత్యాహింసలు గాంధీజీ వ్రతాలు
సహాయ నిరాకరణ సత్యాగ్రహము ఆయన బలాలు
ఎంత దయాశీలి అయినా 
తనపై హత్యా ప్రయత్నం చేసిన వాని గురించి
చాలా ధైర్యం గల కుర్రాడని మెచ్చుకోగలడా
అనగలడా 
అదే గాంధీ తత్త్వం
మరోసారి తనపై జరిగిన హత్యాప్రయత్నంలో 
హేరాం అంటూ నేలకొరిగాడు మన జాతిపిత
ఈనాటికీ గాంధీజీని మనం స్మరించుకుంటున్నామంటే
ఆ రోజుల్లో గాంధీ ప్రభావం ప్రజపై ఎలాఉండేది 
ప్రతి ఒక్కడూ గాంధీజీ భావాలను మనసులోకి తీసుకునేవాడు
అంత కాకపోయినా
 అందులో పావు వంతైనా ఆచరించాలని భావించేవాడు
అలాంటి కాలంలో
పుట్టపర్తి నవయువకుడు
అనంతపురం కాలేజీలో అధ్యాపకుడు
అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు
ఆ కాలేజ్ ప్రిన్స్పల్ పేరు మీనన్
ఆయనగారికి ఆంగ్లాధికారులన్నా 
ఇంగ్లండ్ పేరు చెప్పినా అపారగౌరవం 
బహుశా గాడ్సే వంటి వాడేమో
గౌరవం ఉంటే ఉండవచ్చు
కీనీ సమయం దొరికినప్పుడల్లా 
ఆంగ్లేయులని తనివితీరా పొగటటం
గాంధీ మొదలైన నేతల్ని నోరారా తిట్టటం ఆయనకు పరిపాటి
అక్కడ ఉద్యోగం చేస్తున్న పుట్టపర్తి కది బాధాకరం
గాంధీ సత్యపాలన అహింస లు పుట్టపర్తిని వివశుణ్ణి చేస్తుంటాయి
మరి మీనన్ వాచాలత్వాన్ని ఎలా సహించటం
కానీ ఆయనను ఎదిరిస్తే ఉద్యోగానికి రాం రాం చెప్పాలి 
ఒక వైపు ఉద్యోగం మరోవైపు నలిగిపోతున్న మనసు 
కొన్నాళ్ళు ఓపిక పట్టిన పుట్టపర్తికి ఇక చాలు ననిపించింది
విసిగి విసిగి 
ఒకనాడు మీనన్ పై వాగ్యుధ్ధానికి దిగారు
మంచి జవాబు చెప్పారు
మీనన్ కోపంతో 
పై అధికారులకు చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తాను అన్నాడు 
అంత వ్యవధి ఎందుకూ 
ఇదిగో నా రాజీనామా
ఆత్మను చంపుకొని నీతో 
బ్రతకటం కన్నా ఆకలితో చావటం మేలు అని
రాజీనామా కాగితాన్ని 
మీనన్ ముఖాన కొట్టి వచ్చేశారు
అదీ దేశ భక్తి
గాంధీజీ బాటలో నడవాలనే సంకల్పం
జీవితాన్ని అమరత్వం వైపు నడిపించే ధైర్యం..
శభాష్ పుట్టపర్తీ 
నీలాంటి వాళ్ళు కొందరైనా గాంధీజీ సహవర్తులైనందుకు 
గాంధీ నిజంగా సంతోషపడతాడు..  






29 సెప్టెం, 2013

దళిత గోవిందం


మాల వాడల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఊరేగింపును తీసుకెళ్ళడానికి 
TTD నిర్ణయం తీసుకున్నప్పుడు 
శ్రీశైలం గారు వార్తలో  ఇలా స్పందించారు 




26 సెప్టెం, 2013

"వైష్ణవ జనతో"



 

 


మల్ల్ల్లాది కుటుంబం
 సంగీత సరస్వతి సేవకే ఆవిర్భవించింది
మల్లాది  శ్రీరామమూర్తి గారు గొప్ప సంగీత విద్వాంసులు 
                                         
                             




               
 ఆకాశవాణి మద్రాసు కేంద్రం  
 వారి హరికథా గానాన్ని ప్రసారం చేసేది.
 తర్వాత ఆకాశవాణి విజయ వాడ 
 వారి హరికథామృతానికి తన ఒడిని పడ్డింది..
వారి కుమారులైన మల్లాది సూరిబాబు గారు 
తండ్రి ఇచ్చిన సంస్కారాన్ని బలంగా పుణికి పుచ్చుకున్నారు.

సంగీత ప్రపంచంలో ప్రయాణిస్తూనే 
సంగీత శిక్షణ ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని 
లలిత సంగీత గతులతో ఎన్నో పాటలు 
లలిత సంగీత అభిమానుల గొంతులో అమృతంలా పోసారు..

దేశ దేశాలలో కచ్చేరీలు చేసి 
మన సంగీత వైభవాన్ని ఇనుమడింపజేసారు..
వారి పిల్లలే ప్రపంచ మల్లాది సోదరులుగా ప్రసిధ్ధిగాంచిన శ్రీరామప్రసాద్,రవి కుమార్ లు


వైష్ణవ జనతో అన్న సంగీత రూపకం 
విజయవాడ ఆకాశవాణి లో ప్రసారమైంది 
మహాత్మా గాంధీజీ కి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో 
అనే గుజరాతీ గీతాన్ని పుట్టపర్తి తెనిగించారు.
అక్టోబర్ లో ఈ సంగీత రూపకం పునః ప్రసారమైందట..

మొన్న మల్లాది సూరిబాబు గారు 
ఈ సంగీత రూపకం CD ని మా అక్కయ్యకు పంపిస్తూ 

పుట్టపర్తి వారి ఎంతో విశిష్టమైన అనువాదం అమ్మా ఇది. 
దీనిని ఓలేటి వెంకటేశ్వర్లు గారు పాడినారు. 
ఈ సంగీత రూపకం నుంచీ ఈ గీతాన్ని తీసుకొని 

మా పిల్లలు దేశ విదేశాలలో జరిగే తమ కచ్చేరీ   లలో దీనిని పాడాలనుకుంటున్నారమ్మా 
దీనిని మీకు పంపుతున్నాను అంటూ పంపారు.

మల్లాది సూరిబాబుగారి సంతానం 
మలాదిసోదరులు మాట్లాడుతూ 
 ఇది ప్రతి కచేరీ లోనూ ఈ తెలుగు అనువాదాన్నే 
మేము పాడాలని అనుకుంటున్నామమ్మా ..
ఇంత మంచి సాహిత్యాన్ని 
తెలుగు వారు మరచిపోతున్నారు 
అని బాధేసింది.. 
అంటూ ఫోన్ లో మాట్లాడుతూఅన్నారట  

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మల్లాది సూరిబాబు గారి లేఖ


అక్తోబర్ లో ఈ సంగీత రూపకం పునః ప్రసారమైందట..



ఒకప్పుడు కచ్చేరీ చివరలో ఒక దేశభక్తి గీతం 
మన సంగీత విద్వాంసులు పాడే సంప్రదాయం ఉండేది..








పుట్టపర్తి అనువాదం 
 సంగీతం గానం: శ్రీ వోలేటి వేంకటేశ్వర్లు 
 సేకరణ           : పుట్టపర్తి నాగపద్మిని 

 ఇతరుల కష్టములెవ్వడెరుగునొ 

 అతడే వైష్ణవుడూ..
 అతడే వైష్ణవుడూ.. 

సతతము పరులకు సాయము చేయుచు

గతి తానేయని గర్వము పడడో
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..

సకల లోకముల సన్నుతి చేయును

అపనిందలచే అపచారము చేయడు
మనసున వాక్కున నిశ్చలుడెవ్వడో
యోగ్యురాలతని కన్న జననియే  
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..

సర్వము సమముగ ఎవ్వడెంచునో

ఆశవీడి పర స్త్రీ మాతగ చూచునో
నాలుక వీడిన అసత్యము పల్కడో
పరధనమునకై పాకులాడడో
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..

మోహము మాయము మనమున నుండవో

గృహ వైరాగ్యము దృఢముగ కుదురునో
రామ నామమున లీనుడై పోవునో
రాజిల్లు వాని లోక 
అతడే వైష్ణవుడూ
అతడే వైష్ణవుడూ..


కపట లోభముల కదలిచి
కామ క్రోధ శత్రుల 
తపనము జన్మము సర్వ జనులకు

అతడే వైష్ణవుడూ

అతడే వైష్ణవుడూ..


సర్వ శాస్త్రము


పాట వింటూ సాహిత్యం వ్రాయడానికి ప్రయత్నించాను కానీ కొన్ని పదాలు సరిగ్గా వినిపించలేదు

20 సెప్టెం, 2013

సీతమ్మ మాయమ్మ.. శ్రీరాముడు మాకు తండ్రి..


ఒకసారో పాటకచేరీ జరిగింది ప్రొద్దుటూరులో 

ఓ గాయని అద్భుతంగా పాడింది 
అంతే
 కచేరీ అనంతరం పుట్టపర్తి వారు చెమర్చిన కళ్ళతో లేచారు 
పాడినావిడను అభినందించడంతో పాటూ 
కనకా నీ చేతినున్న గాజులు తీసివ్వు అన్నారు 
 మా అమ్మ కనకవల్లి వెంటనే చేతి గాజులు తీసి 
గాయని పాదాల వద్ద పెట్టి వచ్చేసారు.

ఆ కాలంలో భర్త మాటలకు ఎదురాడటం అరుదు.
తరువాత 
ఏమయ్యా నారాయణాచార్యులూ 
నేను నా కూతురికి పెట్టిన  గాజులు 
మహా ధారాళంగా దానమిచ్చేశావే 
అని ఎత్తి పొడిచింది అత్తగారు
ఏం చెప్పాలో తెలియక నవ్వేశారు పుట్టపర్తి

అమ్మ 'తన కూతురు చేతులు బోసిపోయినందుకు బాధపడుతోందని'
 తెలిసి తానూ బాధ పడాలా ..?
తన భర్త చేసిన పనికి సంతోషించి  అభినందించాలో 
అర్థం కాని కనకవల్లి మిన్నకుండిపోయింది.