3 సెప్టెం, 2015

నేను పాడిన పుట్టపర్తి కృతులు.. వేదవతి ప్రభాకర్..



చిన్న కూనను పెంచి పెంచి పెద్ద చేస్తే..
అది ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది
పాటలు పాడుతుంది
మాటలు చెబుతుంది
యేం చేసినా అపురూపమే
తన ప్రాణం తన ఎదురుగా నిలిచినట్లు
తన ఆశలు ఊపిరి పోసుకున్నట్లు
తను ఒక్క క్షణం కనిపించకున్నా ఆదుర్దా..
ఆశరీరానికో మనసుకో గాయమైతే  
ఇక్కడ రక్తం స్రవిస్తుంది
ఆ బంగారం మరో ఇంటికి వెళ్ళిపోతుందంటే
యేమవుతుంది..??
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా..
అని దిగులు చెందుతుంది హృదయం
ఈ పాట రేడియోలో ప్రసారమవుతున్న రోజుల్లో 
పరవశించని  వారు లేరంటే అతిశయోక్తి కాదు
అసలీపాటను పాలగుమ్మిగారు 
వారి అమ్మాయి కోసం వ్రాసుకున్నారం ట 

నా పెళ్ళి నిశ్చయమైన తరువాత 
మా అయ్య పొందిన బాధ వర్ణనాతీతం..
నేనే చివరి బంధం మా అయ్యకు..
దీని బాధ్యత మీదే ..
అని మా అమ్మ పదే పదే మా అయ్యని హెచ్చరించి వెళ్ళిపోయింది..
మిగతా పిల్లలందరి గురించీ అయ్య పట్టించుకోనేలేదు..
అందుకని
అయ్య ఆ శ్రీనివాసుని  కప్పగించారు..
అమ్మ తన రామునికప్పగించింది..
అందుకే నేనీ రోజు సుఖంగా ఉన్నాను..

వేదవతి ప్రభాకర్ గారు
ఇదే కాదు ఎన్నో గీతాలకు ప్రాణం పోసారు
సాహిత్యం వల్ల గాత్రానికి గాత్రం వల్ల సంగీతానికి అద్భుతమైన మైత్రి కుదిరింది
అందుకే ఆ సృష్టి శాశ్వతమైంది


వేదవతి గారు కర్నాటక ప్రాంతం వారు
ప్రభాకర్ గారు అనంతపురం వారు కలెక్టర్ గా పదవి . . 
పుట్టపర్తి ఆరాధకులు

ఆకాశవాణిలో పాటలు పాడటమూ ..
ఇంట్లో భర్త అత్త మామలు 
పుట్టపర్తిని గురించి గొప్పగా చెప్పడమూ
ఆమె పుట్టపర్తి భక్తి రంజని కృతులను
 తాదాత్మ్యతచెంది పాడేందుకు దోహదమయ్యాయి..
ఆమె పాటలెంత మధురాలో 
ఆమె మాటలు కూడా అంతే మధురాలు

పుట్టపర్తి వారి కృతులు వేదవతి స్వరంలో 
యమునా తటిలో తిరిగెడి వాడట .. 
ఉప్పొంగకువె యమున
రాసము లప్పు డాడిరీ ..

ఇవి కొన్నే దొరకనివి చాలా వున్నాయి 
కడప రేడియో స్టేషన్ లోనూ 
అద్భుతమైన కృతులు న్నాయి 
కానీ 
అవి బయటికి వచ్చే మార్గమే తెలియటం లేదు 

వేదవతి గారు పాడిన ఇతర పాటలు 
ప్రియసఖీ శ్రీహరికి దయలేదు నా పైన 
శివ పాదములుంచ నేను .. 
పూవులేవి తేవే చెలి.. 
అమ్మ దొంగా నిన్ను నేను వేసే ప్రతి అడుగుకు పునాది మా అక్కయ్యదే.. 
ఎవరన్నా పుట్టపర్తిపై కృషి  చేస్తామంటే 
తనకు చేతనైనంత సహాయం చేయటం 
అక్కయ్య ఆనందం  .. 

30 ఆగ, 2015

ప్రేమయననేమి

1967 ప్రాంతాల్లో 
పుట్టపర్తి కంచి పీఠం వారి 
కామకోటి  ధర్మ ప్రచార పక్ష పత్రికకు 
సంపాదకత్వం వహించారు
అందులోని ఒక అంశమిది


28 ఆగ, 2015

ఊగిసలాటలో పుట్టపర్తి



ఆదికవి నన్నయ కాదు..పాల్కురికి! (14-Mar-2015)


దేశీ తెలుగుకు గుడి కట్టిన సోమనాథుడిదే ఆ స్థానం
డిగ్రీ కోర్సుల్లోని తెలుగు సిలబస్‌లో సమూల మార్పులు
భాష-సాహిత్యంలో తెలంగాణ కవులకే అగ్ర పీఠం
ఈ సవరణలపై పరిశీలనకు రివ్యూ కమిటీ ఏర్పాటు
తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం
ఆంధ్ర కవుల పేర్లు పూర్తిగా తొలగింపుపై చర్చ
మరో సమావేశంలో నిర్ణయిస్తాం : వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌
హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఆది కవి నన్నయ కాదు.. పాల్కురికి సోమనాథుడని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బసవ పురాణం రచనతో దేశీ తెలుగు నుడికారానికి తొలి గుడి కట్టిన పాల్కురికి ని ప్రాచీన ఆదికవిగా గుర్తించింది. ఈమేరకు తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు బోధించే ఆధునిక తెలుగు భాష- సాహిత్యంలో మార్పులు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. శుక్రవారమిక్కడ జరిగిన మండలి సమావేశంలో ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. డిగ్రీలోని అన్ని జనరల్‌ కోర్సుల్లో సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఉన్న తెలుగు సిలబస్‌లో సమూల మార్పులు చేయాలని మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య ఎస్‌ మల్లేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తీర్మానించింది. అదే సమయంలో తెలుగు సాహిత్యాన్ని బీఏలో ఒక సబ్జెక్టుగా ఎంచుకునేవారు చదివే సిలబస్‌లోనూ మార్పులూచేర్పులూ చేయాలని నిశ్చయించింది. డిగ్రీ తెలుగు సిలబస్‌ రివ్యూ కమిటీని ఆచార్య మల్లేశ్‌ ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
డిగ్రీ స్థాయిలో ఏ కోర్సు తీసుకునేవారికైనా సెకండ్‌ లాంగ్వేజ్‌.. తెలుగు. ఈ సబ్జెక్టు సిలబస్‌ను చివరి సారిగా 2008-09 విద్యా సంవత్సరంలో సవరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపఽథ్యంలో ఇప్పు డు తిరిగి సిలబస్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ సంస్కృతి, ఆర్థిక, చారిత్రక అంశాలను పొందుపరచనున్నట్టు ప్రొఫెసర్‌ మల్లేశ్‌ తెలిపారు. ఈ సమయంలో ఆదికవిగా ఎవరిని పరిగణించాలనే చర్చ ముందుకొచ్చిందని చెప్పారు. నన్నయ అనువాద రచనలు చేస్తే.. పాల్కురికి సోమనాథుడు స్వతంత్ర కావ్యం రచించారని సమావేశం అభిప్రాయపడిందని చెప్పారు. కాబట్టి పాల్కురికి ని ప్రాచీన ఆదికవిగా తెలుగు పాఠ్యాంశాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
శ్రీశ్రీ, జాషువా మాటేమిటి?
డిగ్రీ మొదటి సంవత్సరం సిలబస్‌లో ప్రాచీన కవుల రచనలు ఉన్నాయి. నన్నయ, తిక్కన, సోమనాథుడు, తరిగొండ వెంగమాంబ తదితరుల సాహిత్యాన్ని చదువుతున్నారు. ఇప్పుడిక తెలంగాణ కవుల రచనలను మాత్రమే బోధించనున్నారు. ఆఽధునిక కవుల జాబితాలో గరిమెళ్ల, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి నారాయణాచార్యులు తదితర మహాకవుల రచనలు ఉన్నాయి. శ్రీశ్రీ, జాషువా కవుల రచనలు సిలబస్‌లో చేర్చాల్సిన ఆవశ్యకతపై కమిటీ చర్చించింది. డిగ్రీ సెకండియర్‌లో పాలగుమ్మి పద్మరాజు, కొలకలూరి ఇనాక్‌, పొట్లపల్లి తదితరుల రచనలు ఉన్నాయి. ఆధునిక కవుల్లో కుసుమ ధర్మన్న, పింగళి, కాటూరి, కాళోజీ, అందెశ్రీ, చెల్లూరి శ్రీనివాసమూర్తి వంటివారి సాహిత్యం ఉంది. ఇందులోంచి ఆంధ్ర కవుల రచనలు తొలగించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు మల్లేశ్‌ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో తొలగించాలా లేక 80శాతం తెలంగాణ కవుల రచనలు, 20శాతం ఆంధ్ర కవుల రచనలు చేర్చాలా అనేది మరో సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోనుంది. తెలుగు భాషను మెయిన్‌ సబ్జెక్టుగా బీఏ లిటరేచర్‌ కోర్సును తీసుకునే వారికి ‘తెలుగు సాహిత్యం’ సిలబస్‌ మార్చనున్నారు. ఆంధ్ర కవుల రచనలు తొలగించి తెలంగాణ కవుల సార్వస్వతాన్ని అందించనున్నారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో (తెలుగు సాహిత్యం) నాలుగో పేపర్‌గా ‘ఆంధ్ర భాషా చరిత్ర’ ఉంది. పూర్తిగా తొలగించి ‘తెలంగాణ భాషా చరిత్ర’గా మార్చనున్నారు.
సిలబస్‌ రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఆచార్య గోపి
మాజీ ఉప కులపతి, ప్రముఖ కవి ఆచార్య ఎన్‌ గోపిని సిలబస్‌ రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి నియమించింది. డిగ్రీ స్థాయి తెలుగు భాష- సాహిత్యంపై గల సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసేందుకుగాను మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య మల్లేశ్‌ శుక్రవారమిక్కడ సిలబస్‌ రివ్యూ కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీలో సభ్యులుగా నిత్యానందరావు, గోనానాయక్‌, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, కనకయ్య, బాల శ్రీనివాసమూర్తిని నియమించారు

23 ఆగ, 2015

మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu | తెలుగు పరిశోధన teluguthesis.com

మహాభారత విమర్శనము 2 Mahabharata Vimarshanam 2 | తెలుగు పరిశోధన teluguthesis.com

17 ఆగ, 2015

పుట్టపర్తి వారిని గురించి సామవేదం


ఇది పుట్టపర్తి స్వరం .. 
ఇది పదిల పరిచిన అక్కయ్యకు ఎన్ని జోతలో .. 
ఈ స్వరామృతాన్ని తనవద్ద దాచి 
మాలో  పరిపక్వత పాకానికి వచ్చిన తరువాత
 మాకు అందించిన
 శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు అన్నకు 
వేల వేల కృతజ్ఞతలు .. 
సామవేదం గారు ఎంత ఆర్ద్రంగా చెప్పారో చూడండి..