10 జన, 2012

మిత్రుడు మిగిల్చిన అనుభవాలు.. జ్ఞాపకాలు..



అయ్య ..
రామ చరిత మానస్ ..
పదమూడు సంవత్సరాలు పారాయణ చేసారట.
ఇప్పుడు ..

ఈ వ్యాసాలు చదువుతుంటే ..
కనుల నీరు కమ్మి ..
మనసు మూగవోయి..
అప్పుడే ఎందుకు పుట్టలేదా..
అన్న విచారం మనసును క్రుంగదీస్తూంది..
 
అయ్యతో వ్యక్తిగత పరిచయమున్న వారు..
వారి అనుభూతులను వివరిస్తూంటే ..
మా కన్నా వారే ఎంత అదృష్ట వంతులో కదా..
అన్న విచారమూ కలుగుతోంది..

మేము కూడా పూర్వ జన్మలో ..
ఎంతో పుణ్యం చేసి వుంటాం..
కనుకే 
అంతటి మహోన్నత వ్యక్తి కడుపున 
జన్మించి తరించాము..



అప్పుడు ..
మా వయసు ప్రలోభాలు.. 
చిన్నతనం .. 
కనులకు మబ్బులుగా కమ్మి..
అయ్య విశ్వరూపాన్ని గమనించలేకపోయాం..
 

కానీ ఇప్పుడు ..
మా సర్వ శక్తులనూ వత్తులుగా చేసి ..
దివ్వెలుగా ఆయన ధీరత్వం ముందు వెలగాలని..
మనసు తపించిపోతూవుంది.. 

                     మిత్రుడు మిగిల్చిన ..
                 అనుభవాలు జ్ఞాపకాలు
        డా. వి. రామమూర్తి "రేణు"MA,Dlit
                                      

వాగ్దేవీ స్థనద్వయామృతాన్ని..
కడుపార గ్రోలి ..
సుష్టుగా జీర్ణించుకుని..
తృప్తిగా త్రేంచిన ..
అసలైన సిసలైన ..
సరస్వతీ పుత్రుడు శ్రీమాన్ నారాయణాచార్యులు.


ఆయన సాహితీ స్వరూపం..
బహుముఖాల సానలు తీరిన భారత జాతి రత్నం... 

తౌర్యత్రిక విద్యకు మరో పేరు పుట్టపర్తి.
 


ప్రేమ ..మధుర భక్తి మందాకినిలో..
మునిగితేలిన మహితాత్ముడు..
ఆయనతో పరిచయమున్న ఏ సహృదయుదికైనా..
ఇది ఏమాత్రమూ పొగడ్త అనిపించదు..

 

  
శ్రీ నారాయణచార్యులతో నాకు గల పరిచయం..
ఆత్మీయత ..అనురాగాలు ..
ఈనాటివి కావు. 

 1945లో అనుకుంటా ..
ఓ పర్యాయం ఆయన గుంటూరు వచ్చారు..
ఏదో సభలో పాల్గొనటానికి. 

ఆ రోజుల్లో ..
నేను హిందూ కాలేజీలో 
హిందీ ఉపాధ్యాపకుడిగా వున్నా.. 


కీ.శే . శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ ..నేను ..
ఒకే ఇంట్లో ..
ప్రక్క ప్రక్క వాటాల్లో ..
అద్దెకు ఉంటున్నాం...


శ్రీ శర్మ నన్ను తన వెంట సభకు తీసికెళ్ళారు. 
అందులో ..
ఆయన తన శివతాండవంలోని కొన్ని భాగాలు..
సమాహిత చిత్తంతో ..
తన్ను తానే మరచినట్లు గానం చేసారు. 


నా మనస్సు మీద ఆనాడే..
ఆయన వ్యక్తిత్వం చెరగని ముద్ర వేసింది.
 
ఆ రాత్రి..
శ్రీ శర్మ గారింట ఆయనకు ఆతిధ్యం ..
ఆ రాత్రంతా.. 
సాహిత్య గోష్టితో గడిచింది. 
ఆయన వ్రాసిన సాక్షాత్కారం..
లఘు కావ్యం ప్రతిని నాకిచ్చారు .


అందులో భక్త శ్రేష్టుడు 
శ్రీ గోస్వామి తులసీదాసు భక్తి సాధన ..
అనితర సాధ్యంగా వర్ణించబడింది.

ఆశ్చర్యంతో తులసీదాసును గురించి 
మీకెలా తెలుసునని ప్రశ్నించా ..
ఆయన నిమీలిత నేత్రాలతో ..
శ్రీ రామ చరితమానసం..
 పదమూడేండ్లు పారాయణం చేసానయ్యా..
అనడంతో బిత్తర పోయాను .


ఆనాడే ..
మా ఇద్దరి హృదయాలు ఏకమయ్యాయి.
శ్రీ తులసీ దాసు సాధనా పధాన్ని ..
అంత హృద్యంగా ..,అనవద్యంగా..,
కావ్యరూపంలో ..

 
నాకు తెలిసినంతవరకూ ..
హిందీ కవి కూడా నిబధ్ధించలేదు. 


మహాకవి "నిరాలా" ..
తన తులసీదాసనే ..
హిందీ కావ్య ఖండికలో ..
తులసీ హృదయ పరివర్తనను మాత్రమే..
అద్భుతంగా వర్ణించాడు. 


ఆ మహా భక్తుని భక్తి సాధనను ..
పుట్టపర్తి భావించినట్లుగా
మరే కవీ వర్ణించలేదు. 


పదమూడేండ్లు మానసాన్ని మధించిన..
మేధామందరం సరస్వతీపుత్రుడు. 
శివకేశవ అభేదాన్ని ..
అడుగడుగునా భావించి..

బోర్కర్
స్వస్థ సుందరమైన..
అద్వయ దృష్టితో రచించబడ్డ తులసీ మానసాన్ని..
పుష్కర కాలానికి పైగా ..
పారాయణం చేసిన ..శ్రీ వైష్ణవుని నోట..
శివతాండవ దర్శన ధార ప్రవహించడం..
అబ్బురం కాదనిపించింది...




హరి హర నాధునకు ..
అక్షర దేవాయతనం నిర్మించిన తెలుగు గడ్డ మీద..
నారాయణాచార్యుల వంటి బ్రహ్మ దృష్టి గల 
వాఙ్మయ తపస్వి పుట్టడం ..
సాధారణం కాకపోయినా..
అసహజం కాదు. 


కనుకనే .. 
ప్రాతఃస్మరణీయులు ..
పరమ హంసావతంసులు..

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ శ్రీ చరణుల..
కామకోటి పరమాచార్యుల అనుగ్రహానికి.. భాజనులయ్యారు నారాయణాచార్యులు.

మామావరేర్కర్
  శ్రీమదప్పయ దీక్షితేంద్రులు ..
బిల్వ మంగళాచార్యుల వంటి..
స్వస్థసుందరమైన అద్వయ బ్రహ్మ దృష్టి ఆయనది.

శ్రీ నారాయణా చార్యులను గురించిన
స్మృతులెన్నెన్నో..
ఆయన తలంపుకు వచ్చినప్పుడల్లా 
గిలిగింతలు పెడుతుంటాయి ..

దినకర్.
 ఆయన తమ్ముడూ..
స్వస్థి సౌహార్ద్ర సంపదే ! 
అని వ్రాసిన జాబులెన్నింటిలోనో ..
నన్ను అనుజునిగా ..
సుహృదునిగా..
భావించి ..
ఏనాటిదో గదా ..
మన అనుబంధం..
అని ఆత్మీయతను వర్షించిన సన్నివేశాలు ..
మరపునకు రావు.

బనఫూల్
 పూజ్య పాదులు..
శ్రీ పరమాచార్యుల శ్రీ చరణాలవిందాల వద్ద ..
మేమిద్దరం గడపిన క్షణాలు ..
నేటికీ నాకు జీవన పాధేయాలుగా నిలిచాయి.

శ్రీశైల క్షేత్రంలో ..1968 లో ..
శివరాత్రినాడు.. 
శ్రీ పరతేశ్వరుని గర్భాలయంలో.. 
స్ఠిరలింగానికి ఎదురుగా ..
అచర లింగేశ్వర (కంచిస్వాముల ) సన్నిధిలో.. మేముభయులమూ అనుభవించిన..
ఆ దివ్యానుభూతిని 
నేటికీ స్మరించుకుంటాను.



దాదాపు 35 నిమిషాలు..
 శ్రీవారు కావించిన ..
దివ్యానుగ్రహ భాషణాన్ని..
"శ్రీశైల క్షేత్రం-శివరాత్రి" అనే ఉపన్యాసాన్ని ..
నేను రికార్డు చేసి చరితార్థుణ్ణయినాను.



శ్రీ నారాయణాచార్యుల ప్రతిభ ..
ఆంధ్ర రాష్ట్రపు టెల్లలను గూడ దాటి ..
ఆసేతు శీత నగ వ్యాప్తిని సంతరించుకుంది. 



Malayalaen Lexicon సంపాదకునిగా.. తిరువనంతపురంలో 
పేరు తెచ్చుకొన్న పుట్టపర్తిని ..
హిందీ మహా కవయిత్రి శ్రీ మహదేవి వర్మ..

శ్రీ మహదేవి వర్మ
   
1953లో ..
ఉత్తర ప్రదేశ్ లో..
శీతాచల సానువుల్లో..
నైనిటాల్ లో నిర్వహించిన.. 




అఖిల భారత సాహితీ సమారాధకుల 
శిబిరానికి తీసికెళ్ళారు.
తెలుగు భాషకు సంబంధించిన ..
ఒక ప్రముఖ ప్రతినిధి కవిని కూడ ...
వెంట బెట్టుకు రమ్మని.. 
శ్రీమతి మహాదేవి వర్మ నన్ను కోరడంతో ..
నా నెచ్చెలిని వెంట తీసితెళ్ళాను.


ఆ ఉత్తమ మైన నిర్ణయాన్ని తీసికున్నందుకు..
15 రోజులు సాగిన ఆ సాహిత్య గోష్టుల తర్వాత..
నేనెంతో తృప్తి పడ్డాను.


మైధిలీ శర్ణ్ గుప్త 



 ఆ శిబిరానికి ..
భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దిగ్దంతులెందరో హాజరయ్యారు.


బనఫూల్..,
బోర్కర్.., 
మామావరేర్కర్..,
దినకర్.., 
మైధిలీ శర్ణ్ గుప్త..,
ఇలాచంద్ర జోషి ..
మొదలైన వారెందరో వచ్చారు.



చుక్కల్లో చంద్రుడిలాగ ..
అందరినీ తన శివతాండవంతో 
ఆకట్టుకున్నాడు పుట్టపర్తి. 
ఒకనాడైతే అందరం గుర్రాల మీద
Chinapeak అనే మంచు శిఖరానికెళ్ళాం..




అప్పుడు దినకర్ జీ ..
 "మహాకవీ ..యహ్ యోగ్య రంగ్ మంచ్ హై..
అపనీ శివ్ తాండవ్ కృతి గానేకేలియే..
  ఆయియే ..
హమే రసమగ్న బనాయియే.."

అని ఆహ్వానించారు




(మహాకవీ మీ శివతాండవ గానానికి అనువైన నాట్యశాల ఇది. లేవండి మమ్మల్ని రసాంబుధిలో తేల్చండి..)


ఆ నగాధిరాజ ప్రాంగణంలో ..
దాదాపు అరగంటసేపు సాగిన ఆ కావ్య గానం ..


శ్రీ నారాయణాచార్యుల సాహితీ వ్యక్తిత్వానికి..
అధ్బుతమైన మణికిరీటం..


అదే శిబిరకాలంలో చివర రోజులలో ..
ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రి ..
మహా పండితుడు సంపూర్ణానంద్ ..


శిబిరంలో పాల్గొన్న పండితుల నందరనూ..
తన వేసవి నిలయంలో 
(National Government House) లో 

మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. 

ఆయన కోరిక మేరకు ..
ఆ చోట చేరి కవులందరూ ..
తమ తమ భాషా కవితలను వినిపించారు.
వాటన్నిటినీ ..

శ్రీ సంపూర్ణానంద్ శిరః కంపంతో అభినందించారు. 
సంపూర్ణానంద్


కాగా..
శ్రీ నారాయణా చార్యులు 
శివ తాండవం లోని ..
"నందీ నాందీ" శ్లోకాలు గానం చేయగానే..
ఆయన సంతోషంతో ఊగిపోతూ..
"వాహ్ ..వాహ్.. కైసీ అద్భుత్ రచనాహై ..
చిత్త ప్రఫుల్ల హోగయా.. 
అని మౌఖికంగా తమ ఆనందం ప్రకటించారు. 
అలాంటిదీ శ్రీ పుట్టపర్తి వ్యక్తిత్వం.



నేడు ..
తన తీయని పవిత్ర స్మృతులను ..
మాత్రమే మనకు వదలి ..
నా నెచ్చెలి వెళ్ళి పోయాడు.


ఆ సరస్వతీ పుత్రుని ..
సంభావించి ..సన్మానించిన ..
సంస్థలు తమ ఉనికిని స్థార్థకం చేసుకున్నాయి. 
పైరవీలకు ..
ప్రలోభాలకు ...
మాత్రమే సంక్రమించే..
పెద్ద పెద్ద సమ్మానాలు.. 
అవార్డులూ ..

రాకపోవటంతో ..
ఆయన నిష్కలంక చంద్రుడైనాడు.
 
ఆ సంస్థల పక్షపాత పంకం..
ఆయన నంటుకోక పోవటం.. 
ఆయన అదృష్టమే.. 
"శివతాండవం.."
ఆయన అక్షర శరీరం. 
నిస్సంశయంగా ..
భర్తృహరి పలుకుల్లో ..
ఆయన రససిధ్ధ కవీశ్వరుడు..
అజరామర జీవి..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి