29 మే, 2013

శ్రీ శివ లీలా స్తవము






అవి 

పుట్టపర్తి చివరి రోజులు..
''శ్రీ శివలీలా స్తవాన్ని'' 
ఆ రోజుల్లో శిష్యునిగా భక్తునిగా 
ఇంటికి తరుచూ వచ్చే
లక్ష్మీ కాంతం శ్రేష్టి చేతిలో పెట్టారు
ప్రచురించమని 

పుట్టపర్తి వ్రాత అర్థం కాక
తిరిగి అడిగితే ఆగ్రహిస్తారేమో నన్న భయంతో 
కొన్నాళ్ళు..
సంస్కృత శ్లోకాను ..
అవీ శివ పార్వతుల శృంగార ప్రధానమైన వానిని
ప్రజలు యే విధంగా అర్థం చేసుకుంటారో నని కొన్నాళ్ళూ 
కాలయాపన చేసారు..

ఈలోగా 
పుట్టపర్తి పరలోక గతులయ్యారు.
తరువాత 
తన గురువు చివరి కోరిక తీర్చలేకపోయానన్న
బాధ లక్ష్మికాంతం శ్రేష్టిని ఆవరించింది
ఆయన తన ప్రెస్సుకు వచ్చిన 
బ్రహ్మశ్రీ అయిలావఝ్ఝుల రామకృష్ణ శాస్త్రి గారిని 
వనిని కాస్త అర్థం అయ్యేలా వ్రాసి ఇమ్మని అర్థించాడు

వానిని పరిశీలించిన ఆయన

పార్వతీ దేవి అంగాంగ వర్ణన 
ఒక్క ఆది శంకరులకే చెల్లింది..
మరి పుట్టపర్తి వారి ఈ శ్లోకాలను
ఏ విధంగా అర్థం చేసు కోవాలని ఆలోచించి
క్షేత్రయ్య అన్నమాచార్యులు 
జయదేవుడు నారాయణ తీర్థులూ 
భగవంతునిపై శృంగార కీర్తనలు చేసారు..

అనుకొని..

పుట్టపర్తి ఆధ్యాత్మిక సాధనావిశేషములను
 పూర్తిగా తెలిసిన వాడవటంచేత..
అట్టి వ్యతిరేక అనుకూల భావాలు
వారి వారి ప్రాక్తన జన్మార్జిత 
సుకృత దుష్కృత పరిణామ ఫలానుసారంగా 
ఏర్పడతాయని భావించి

ఎత్తివ్రాయడమే కాదు 

శ్లోకాలు చాలా ఇంపుగా వున్నాయి
వీనికి తాత్పర్యం కూడా వ్రాస్తాను అని అడిగారు
శ్రేష్టి  సంతోషంతో ఒప్పుకొని 
పుస్తకాన్ని ముద్రించారు
అదే ఇది..

మా తండ్రి 

కలను నెరవేర్చడంలో నేనూ పాత్రధారి నైనాను
వారి దివ్యాశీస్సులు నాకూ అందుతాయి 


ఒకసారి

లక్ష్మికాంతం శ్రేష్టితో ఫోన్ లో మాట్లాడాను
ఎంత సంతోషపడ్డారో చెప్పలేను
ఆరోజుల్లో 
చాలామంది మంత్రోపదేశం చేయమని
అయ్య అమ్మలను ప్రాణాచారం పడేవారు
కానీ
అందరికీ మంత్రం ఇచ్చేవారు కాదు..
కొందరికి ఏవో స్తోత్రాలు..చెప్పి పంపేవారు..
నీకు ఇదే సరిపోతుంది 
దీనినే త్రికరణ శుధ్ధిగా చేయి అనేవారు

కానీ కొందరు విడిచేవారు కాదు

పలురకాలుగా ఇబ్బంది పెట్టేవారు
అయ్యను నీడలా నుసరించి
వారికి సేవలు చేసి
పురాణానికి వెళ్ళే టప్పుడు
వెనుక భాగవతం పట్టుకుని నడిచీ
ఏవేవో చేసే వారు
వారి దృష్టిలో పుట్టపర్తి భగవత్స్వరూపుడే..

ఎవ్వరెన్ని చెప్పినా

వారే ఎన్ని చూచినా పట్టించుకొనే వారు కాదు.

అయ్య తప్పించుకోవటానికి 

'మీ అమ్మ దగ్గరికి పో..'
అని పంపే వారు..

అమ్మ 

ఇక తప్పక..
వారికి యేదో చెప్పి పంపేది..

అలా యెన్నో సంవత్సరాలు అనుసరించిన వాడే

నా గురుదేవులు
వ్యాసం వ్రాసిన రఘూత్తమ రావు..


రఘూత్తమ రావ్ ద్వారా 

ఏవేవో అనుభవాలను విన్న వారు మాకూ అయ్యను మంత్రోపదేశం చేయమని చెప్పు అని బ్రతిమాలేవారు..

ఒక్కో సారి అయ్య 

ఒరే .. నా ఆశ్రయం పొందితే ఉన్నవి కూడా పోతాయి
సర్వ భ్రష్టుదవవుతావు..
లెక్కలేనన్ని కష్టాలు చుట్టుముడతాయి..
అవి నీవు భరించలేవు..
పరమాత్మ నీ మానసిక శక్తిని పరీక్షించి వదులుతాడు..
ఎందుకీ బాధ..
''మీ అమ్మ దగ్గరికి పో..
ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతావు..''
అని చెప్పేవారు

అన్యాపదేశంగా 

నేను 
నారాయణ స్వరూపుడిని
మీ అమ్మ
లక్ష్మీ స్వరూపం 
అని చెప్పక చెప్పినట్లే కదా 
అని ఆనాటి భక్తులూ శిష్యులూ పరవశంతో అనుకొని
ఇంకా
ఇంకా
వెంటపడేవాళ్ళు.. 

అన్నట్లుగానే..

రఘూత్తమ రావ్
అయ్యను ఆశ్రయించిన కొన్నేళ్ళకే
ఆయన భార్య.
ఎదిగిన కొడుకూ
వయసొచ్చిన కూతురూ..
హటాత్తుగా కన్నుమూసారు..


ఈ విషయాలు చిన్నపిల్లలమైన మాకు 

బాధపడుతూ కాక
అదేదో ఒక తమాషా సంఘటనలాగా చెప్పేవాడు
 రఘోత్తమరావ్ సారు 

అమ్మను ఆశ్రయించి

అన్ని కష్టసుఖాలలో అమ్మకు చేదోడుగా వున్న
మా అన్నయ్య మాలేపాటి సుబ్రమణ్యం
చదివింది అయిదో క్లాసు అయినా
చిన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరి.. 
Oriental General Insurance కు 
Divisional Manager  స్థాయికి ఎదిగాడు..


''అయ్యకు చేతబడి విద్య కూడా తెలుసమ్మా..''
అని ఎంతో ఉద్వేగంగా చెప్పాడు లక్ష్మీకాంతం శ్రేష్టి..
''కానీ 
అయ్య వానినెప్పుడూ దుర్వినియోగం చేయలేదు..''
అన్నాడు కూడా..








Enter your message here.

25 మే, 2013

20 మే, 2013

పెద్దన్నవరూధిని - రోషభీషణ






తెలుగు పంచ మహా కావ్యాలలో

 ప్రథమ ప్రబంధం మను చరిత్ర. 

మార్కండ డే య పురాణంలోని ఒక చిన్న కథను 

తీసికొని 


తన అద్భుత కవితా ప్రావీణ్యంతో 


ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు 


వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు 

పెద్దన. 



ఒక వరణా తరంగిణిని, 

ఒక అరుణాస్పద పురాన్ని, 

ఒక ప్రవరుని 

ఒక వరూధినిని, 

ఒక స్వరోచిని, 

ఒక మనోరమను సృష్టించి 

పాఠకుల హృదయాలలో 

ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 

అయితే 

అందులోని ''తరుణి ననన్య కాంతను''

 అనే పద్యం గురించిన చరిత్రను చెబుతూ 

ఈ పద్యం పెద్దన్నది కాదని

 ''పద్యం బొక్కటి చెప్పి..'' లో పుట్టపర్తి వారు 

అంటున్నారు ..






''తరుణి ననన్య కాంత నతి దారుణ పుష్ప శిలెముఖ వ్యధా
భరవివశాంగి నంగభవు బారికి, నగ్గము సేసి, క్రూరుడై
యరిగె, మహీసురాధము దహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె కషాయదీధితిన్..'' 

పెద్దన్న గారు ఏమనుకొని యీ పద్యం వ్రాసినారో
నాటినుంచీ చాలామందిని యీ రచన వేధిస్తూ వుంది.
నా చిన్నతనంలో 
యీ పద్యం పెద్దన్న గారిది ఔననీ-కాదనీ 
యెన్నో వదోపవాదాలు జరిగాయి

ఇంతకూ యిందులో యేమి చెప్పినాడాయన..
ప్రవరుడు వరూధిని మీద బడితే త్రోసివేసినాడు
ఆవిడ .. తరుణి.. 
మంచి వయస్సులో వున్నదన్నమాట..

'అనన్య కాంత..'
అంతకుముందే మగవాని స్నేహమూ లేనిది..
'కన్నెరికపు రతి'యని 
పెద్దన్నగారే..వేరొకచోట సర్టిఫికెట్టు ఇచ్చినారు..

అటువంటి స్త్రీ 
యేకాంతంలో తనకు తానై వలచివస్తే
ఆమెను మన్మధుని బాణాలకు అగ్గము చేసిపోయినాడని 
ప్రవరునిపైన సూర్యునికి విపరీతమైన కోపము వచ్చిందట..

ఆ కోపంతో 
ఆయన ముఖమండలం యెర్రబారింది..
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి  వర్ణిస్తూ వున్నదీ పద్యం
పైగా .. 
ఇందులో ప్రవరునికి వాడిన విశేషణాలు దారుణంగా వున్నాయి

క్రూరుడు.. 
మహీసురాధముడు.. 
అహంకారి..  అని
ఆయనకు యిచ్చిన యోగ్యతా పత్రాలు

యీ పద్యం నిజంగా పెద్దన్న గారిదే అయితే
ఆయనకు వరూధినిపైన విపరీతమైన సానుభూతి యని 
అర్థమవుతూ వుంది.

అంటే 
ప్రవరుడు వరూధినిని పొంది వుండవలసిందన్నమాట..
నా చిన్నతనంలో
కొందరు 'ఆంగ్ల విద్యా వాసనావాసితులు'
 దీనికిట్లే అర్థం చెప్పి నైష్టికులను గేలిచేసేవారు..

నిజంగా 
పెద్దన్న గారి అభిప్రాయం కూడా అదే అయితే
ఆ లాలసతను చెప్పడానికి 
ఇంత పెద్ద కావ్యం వ్రాయవలసిన పనే లేదు..

పైగా .. 
కావ్యం కూడా కొత్త మలుపు తిరిగి వుండేది..
ఆయన అభిప్రాయం కావ్యరచన్లో 
'కర్మ నిష్టనూ.. '
'వైదిక శ్రధ్ధనూ ..'
సమర్థించడమే..

పైగా యీ పద్యంలో
 ''నభోమణీ' శబ్దం యేమీ బాగ లేదు..
యౌగికార్థం సరిపోదు
రూఢ్యార్థాన్ని  తీసికొని సూర్యుడనే అర్థం చెప్పుకోవలె..

పెద్దన్నగారికి
 ఇలా కక్కుర్తిగా శబ్దాన్ని వాడే దారిద్ర్యం లేదు..
ఇంతకూ యీ రచన ఆయన చేసి వుండడనేది నా అభిప్రాయం
మరి దీనికి బదులు వేరే పద్యం వుండేదో 


లేక ఆ వర్ణనే లేకుండా వుండేదో కూడా చెప్పలేము..
అలా వుండడానికిన్నీ వీలు లేదు కదా
కావ్య ధర్మాన్ని బట్టి 
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి యేదో ఒక రీతిగా వర్ణించవలసిందే..

ఇంతకూ 
పెద్దన్న యే ముహూర్తంలో దీనిని వ్రాసారో 
అప్పటినుంచీ యీ రచన చాలా గందరగోళంగానే వుంది.. 


15 మే, 2013

ఖైదీ ..


శ్రీరామ దర్శనము..DR.M.కులశేఖరరావు..







శ్రీరామ దర్శనము..DR.M.కులశేఖరరావు..

 పుట్టపర్తి వారి జనప్రియ  రామాయణము 
యధార్థానికి అమృత ప్రవాహము లాంటిది..
ఈ ప్రవాహములో దిగి ..
రసమును చవి చూచే శక్తి మనకుండవలెనే గానీ ..
దానివలన ..
మధురాతి మధురమైన అనుభూతి కలుగుతుందనటంలో 
సందేహం లేదు..

ఒకచోట పరతత్త్వ స్వరూపం దర్శనమిస్తే..
మరోచోట లక్ష్మణస్వామి విశేష శేష స్వభావం ప్రకటమవుతుంది..
ఇలా..
అరణ్య కాండలో 
శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు దర్శించిన ఘట్టాన్ని 
వివరిస్తున్నారు కులశేఖరరావు గారు

చివరగా..
శ్రీరామునికి సుగ్రీవుని వంటి మంచి చెలికాడు లభించుట 
పరమార్థమే అయినప్పటికీ
 ఆ భగవత్స్వరూపునికి 
ఉత్తమ భక్తుడు లభించిన విశేషమునే 
కవి ఉదాత్తంగా చెప్పి 
సందర్భానికి రమణీయార్థాన్ని కలిగించారు

ఒక మహాకావ్యానికి 
ఇంతకంటే మంచి ప్రయోజనం కానీ ఔత్కృష్ట్యం  కానీ 
ఉంటుందని నేననుకోను అంటూ ముగించారు..
మరి చదవటం మొదలెడదామా..