4 మార్చి, 2012

శివ తాండవ కావ్య గుణములు..శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి



శివతాండవం పలికిన అయ్య నోట..  
కృష్ణ లీలలు..
అయ్య నోట వినాలని వుందని కోరారు..
అదేవిటో మీరూ చూడండి.
అయ్య శివతాండవం..
1961 లో శ్రీ పాద గోపాల కృష్ణ మూర్తి గారు ..
పీఠిక వ్రాసినారు.
 
శివతాండవం..
జర్మను భాషలొకి అనువాదమైంది..

హిందీలోకి ..
ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు..
నేను వానిని చూచినాను కూడా..
టువంటి గ్రంధాలు పరివర్తించటం కష్టం..
ఇటువంటి కార్యాల గౌరవం ..
ముఖ్యంగా శబ్దంపైన ఆధార పడుతుంది..
ఇంగ్లీషులోకి తెద్దామని..
 నేనే ఎన్నో సార్లు ప్రయత్నించినాను.
 కానీ..
 ఆ భాషాంతరీకరణం..
 నాకు ఎన్నడూ తృప్తి నిచ్చిందే లేదు..

అయ్యతొలిపలుకులు ..
 
రష్యన్ ఎంబసీ వారు కూడా..
శివతాండవాన్ని చదివించుకొని విన్నారు ..
అమితంగా ఆనందించారు.
 
రష్యన్ ఎంబసీ వారు..
అయ్యను అప్పట్లో సన్మానిస్తే..
అయ్య  రష్యన్ లోనే ఉపన్యసించి వారిని అబ్బురపరిచారు..
 
"శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానంలా..
దీన్ని ముద్రించి..
పెద్ద వెల పెట్టి ..
నాకు ఆర్థికంగా యేదైనా..
ఉపయోగపడేటట్లు చేయాలని.. 
శ్రీ ధన్ గారు.. సంకల్పించారు..
 
ణానుబంధాలు ..
మహా విచిత్రంగా వుంటాయి..
భౌతిక కారణాలతో ..
వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం కష్టం..!!"

 
ధన్ గారు వచ్చి ..
అయ్య పరిస్థితి చూసి..
ఒక మహా కవి నిస్సహాయుడుగా ..
నిలబడి పోవటమేమిటని ..??
తన స్వంత ధనంతో..
శివతాండవాన్ని ముద్రించి ఇచ్చారు.. 
బాపు గారు బొమ్మలు వేసారు..
కానీ ..
అవి ఎలా అమ్మాలి..??

 
ఎంతయినా ..
కొంత లౌకిక జ్ఞానం లేకపోతే ఎంత కష్టం..!!!
 

ఒకరి ముందు తలవంచటం ..
చేతులు కట్టుకు నిలబడటం వల్లనే ..
ఎందరో ఎన్నో పదవులు ..
అర్హత లేకపోయినా  ..
చిన్న వయసులోనే..
సాధించుకుంటున్నారు..!!!
 
ప్రాపంచిక వ్యవహారజ్ఞానం లేకపోయిన..
మేధో జీవి ఆత్మ కథ..
అయ్య కథ అవుతుందేమో..
అతడు గ్రహాంతర వాసిలా బిత్తరపోక తప్పదు..
 
సరే..
1961 లో ..
శ్రీపాద గోపాల కృష్నమూర్తి గారు పీఠిక రాస్తూ..
కృష్ణ లీలలు..
అయ్య నోట వినాలని వుందని కోరారు..
అదేవిటో మీరూ చూడండి..

 
శివ తాండవ కావ్య గుణములు..
శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి

సత్కావ్యమును..
పదే పదే చదివి ఆనందించడమే శోభ కానీ..,
 దానిని విశ్లేషించి ..
అందాలు చూప యత్నించడము శోభ కాదు. 

అయితే ..
శివతాండవ పునర్ముద్రణ చేయించే సందర్భములో మిత్రులు నేలనూతల  కృష్ణ మూర్తి గారు ..
కావ్య గుణ ప్రస్తావన చేయమని..
 నాకు పని పెట్టినారు. 

ఆ అవకాశాన్ని పురస్కరించౌకుని..
శివతాండవముతో..
 సంబంధము కల్పించుకున్న..
నా చాపల్యమును సహించి..
యీ నాలుగు మాటల తాత్పర్యమును..
గ్రహించండని మనవి..!!
 
తన భావాల్నీ..
ఉత్సాహాన్నీ ..
కరుణనూ..
జుగుప్సనూ ..
భయాన్నీ ..
హాసాన్నీ ..
చదువరులకు కూడా కలిగించాలని..
కవి కావ్య రచన చేస్తాడు...!!

ఏ భావాలు చదువరికి కలిగి..
వాటి ఫలితమైన ఆనందంతో..
అతని హృదయము సంతుష్టి చెందడాన్ని..
రసానందము పొందడమంటారు...!!

శివతాండవములో..
కవి ..
ఆ తాండవమును..
ఊహా రంగము మీద దర్శించిన ఆశ్చర్యాన్ని ..
మాటలతో ..
పదకవితలో ..
వర్ణిస్తే ..
మనం చదివి ఆశ్చర్య చకితుల మౌతాము ..!!

" అలలై బంగరు కలలై పగడపు బులుగుల వలె మబ్బులు విరిసినయవి " .. 

"చతురాననుడే సవదరించునట శర్వునకుత్తమ సర్ప విభూషలు.."..

"శ్రుతిబట్టుటకు భృంగమ్ములు గొంతులు సవదరించెనట.."

"సెలకన్నెలు కుచ్చెళులెల్లడ 
విచ్చల విడిగా దుసికిళ్ళాడగ 
నాకసమున పరుగిడెనట.."

" సంధ్యా బిబ్బోకవతి ..
నవకుసుంభరాగవసనము ధరించెనట .."
శివపూజకు..!! 

అర్ధేందూత్ఫుల్లకేశం..
అంటూ నంది దేవభాషలో 
నాంది నారంచించెనట..
వీటన్నిటితో ..
మన అపేక్ష కేంద్రీకృతమౌతుంది..

"తలపైని జదలేటి యలలు దాండవమాడ..
 నలల దోపుడుల గ్రొన్నెల పూవు గదలాడ.."



శివుడు ఆడనారంభించేటప్పటికి ..
మనకి వేరు ధ్యాస ఉండదు..
బుసలు గొని.. తలచుట్టు ..బారాడు భుజగములు ..

సాంధ్యకిమ్మీర ప్రభలు గూడే తనువూ.. 

యెముక పేరుల మర్మరమూ ..

బింబాధరంబు గదంబించు తాంబూలమూ 

పరుపులై పడు.. కల్ప పాద పంబుల పూలూ 


వెన్నెలలు..
పల పలని చిలికించినట్లు..

తెలిబూది పూత తెట్టలు గట్టినట్లు..


మంచు గుప్పలు గూర్చినట్లూ..
 
ఆడే..

శివుడూ కళ్ళకు కట్టే సరికి 
సద్యః పనిర్వృతి కలుగు తుంది 

ఆవేశముతో అవి అల్లే ..
తీగలతో పాకి ..
మొగిలిపూల తావులతో విహరించి ..
తొలుకారు మెఋపులతో దోబూచులాడి ..
అచ్చెరువు రూపుగొనినట్లు నిలుస్తాము. 

ఘల్లు ఘల్లుమని ..
కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రొగుతూనే వుంటాయి. 
కంఠహారాళి కదలి పోతూనే వుంటుంది. 
మనౌ లెక్కేమిటి.. ??
పరవశత్వమున శ్రీ పతియే చెమరుస్తాడు..
 
శివుడు 
లోకేశ్వరుడు..
విశ్వేశ్వరుడు..
సర్వేశ్వరుడు..

ఆయన నాట్యము 
నాట్యమునకే పరాకాష్ట..

తలపైన జదలేటి యలలు ..


మూడవకంటి కటిక నిప్పులు ..


మర్మరము సేయు యెముక పేరులు ..


పులితోలు హ్మొబట్టు..


క్రొన్నాగు మొలకట్టు..


బిరుదాడు పదకింకణులు..
నటరాజు ఆహార్యము...!!

అంగ ప్రత్యంగ ఉపాంగ చలనము 
తారహారముల కదలాట..
సుందర మంజీర కింకిణులూ ..
కుండల విలాసమూ..
చంచల హస్తాబినయమూ ..
నృత్తనృత్య తాండవ గతులూ ..
ఆయన ఆంగికము ..

జిగ జిగలాడే నక్షత్ర కలాపము ..

ఫక్కున నవ్వు కైలాస శిఖరములు..

ధిమి ..ధిమి ..ధ్వనులూరు.. గిరిగర్భములూ..

నాట్యములు వెలయించు నదులూ..

జలదాంగనలై వచ్చిన వియచ్చర న్యలూ..

ఆయన నాట్య రంగ ప్రసాధనము. 

షడ్జద్వయము నందించు..
వేణు మయూరములూ..


పంచమ మాలపించు పికమూ..
నిషాదమును తరుము..
 వెనకయ్య భృం హితమూ 
 ఆ నాట్యములోని స్వరనాదములు..

గంధర్వులు ..
అచ్చరలు ..
కిన్నరులూ ..
నిర్ఝరులూ..
దిక్పాలకులూ..
మునులూ..
శరజన్ముదూ ..
విఘ్నేశ్వరుడు ..
అమ్మవారు ..
బ్రహ్మ..
సరస్వతి..
శ్రీపతి ..
లక్ష్మి ..
చంద్రుడు..
సర్వ లోకాలూ ..
ఆ మహా నాట్యానికి ప్రేక్షకులు.. 

కవి గారి వ్యుత్పత్తి ..
తీర్చిన ఈ శివ తాండవములో
 పై సమ్మర్థము పూర్తిగా నిండుగా కాన వస్తుంది..
 
నారాయణాచార్యులు గారు ..
విజయ నగరాస్థాన విద్వద్వరేణ్యులు... 
తాతా చార్యుల వంశములోని వారు..
విజయ నగర సారస్వత విభూతి ..
వీరి రచనలో అక్కడక్కడ మెరుస్తూ..
ఇంపు గొలుపుతుంది. 

ఆంధ్ర వాఙయానికి ..
అభిసాప రూప మైన చంపూ పధ్ధతిని వీడి ..
ఈయన తెలుగు జిగిని చక్కగా వెలయించగల..
పద ఛందస్సును స్వీకరించుట..
ఈయన చేతన్యమును ప్రకాశింపజేయు దీపము.
 

శివతాండవమును విన్న తర్వాత..
వీరి నోట కృష్ణ లీలలు వినాలని వున్నది..నాకు ..
మీకూ లేదూ..??
మరొకమారు వినండి 
శివతాండవము.

శ్రీపాద గోపాల
కృష్ణ మూర్తి
19-7-1961

1 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల అవంతీ సుందరి దివి కేగి పోయింది..



అమ్మ 1983 లో పోయింది..
దాంతో అయ్య మనసు ..జీవితం..

ఖాళీగా అయిపోయాయి..
 

సీతమ్మ వారి అగ్నిప్రవేశం తరువాత..
రామ చంద్రుడు వుండలేనట్లు..
ఎప్పుడూ ఏదో వెలితి..
ఆశాంతి..
 

కోట్లకు కోట్లు జపం..
పదమూడు సంవత్సరాల తులసీ మధనం..
విద్యార్థి దశలోనే ముగించిన గాయత్రి..
సాహిత్య ..సంగీత ..నాట్య ..కళలలోనూ సాధన..

దేన్నో అన్వేషిస్తూ..
పదునాల్గు భాషల్లోనూ వెదుకులాట..
 

ఇంకేం చేయాలి..
ఇంకా ఏదో చేయాలి..



ఒకవేపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న..
భక్త్యావేశాలు..
దాన్లోంచి వచ్చాయి..
ఒక పండరీ భాగవతం..
ఒక జనప్రియ రామాయణం..
ఒక పాద్యం..                                          

ఒక శ్రీనివాస ప్రబంధం..
ఒక శివతాండవం..
 



జనం..
ఆహా.. ఓహో.. అన్నారు..
అయ్య లోని జీవుడు తృప్తి చెందలేదు..

ఎంత జటిలం ..
జీవుని వేదన..
 

ఆయనకు కావలసినవి ..
మెప్పులు కాదు..సత్కారాలు కావు..
వాటినుంచే నడచి వచ్చినా.
దృష్టి వేనిపైనా.. నిలవలేదు..
 

అన్నిటి వెనకా నిలిచిందొక నేస్తం..
భగవంతునికీ ..మనకీ ..

దూరాన్ని కొలుద్దాం రా.. అన్నాడు..
సరే పదమంది..ఆమె
 

అన్నిటా సమ ఉజ్జీ..
సమ ఉజ్జీతో ఆట..

భలే పసందుగా ఉంటుంది..
 

తులసీ రామాయణంలో ..
భక్తి ప్రవాహంలో మునకలేస్తూ..
ఆ అనుభవాన్ని వివరించాలని వెళ్తే..
వాల్మీకి రామాయణంలోని రాముణ్ణి ..

దర్శనం గావించింది..
 

ఔరా .. అనుకున్నాడు అయ్య..
 

పంచకావ్యాలూ ..
పురాణాలూ..
గ్రంధాలలో ..
ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు..
 

హిమాలయాలకు వెళతాను..
ఆత్మార్పణ చేస్తాను..
సాధు సంతులను కలుస్తాను..
ఈ అశాంతిని చేదిస్తాను..
అనుకుని వెళ్ళారు అయ్య..
ఓపికగా ఎదురు చూసింది..
 

ఇంట్లోనూ నీ మనసే ..
అక్కడా నీ మనసే..
వెర్రివాడా...
అనుకుంది అమ్మ..
 

తిరిగి..
తిరిగి.. 
తేలిక పడ్డ మనసుతో ..
అయ్య తిరిగి వచ్చారు అమ్మ దగ్గరే..
అమ్మ చిరునవ్వు నవ్వింది..
 

సాహిత్య సరస్వతిని సృష్టించసాగారు.. అయ్య..
అక్షర మక్షయమై.. 

మళ్ళీ అమ్మే నిలిచింది ..అమ్మ..
 

అయ్య పూనిక అమ్మ..
అయ్య ధైర్యం అమ్మ
అయ్య మనో బలం అమ్మ..
 

ఇప్పుడు అమ్మ ..
మనసులో ఉంది..
బయటలేదు..
 

ఏ జన్మ ఋణానుబంధమో..
ఈ మితృత్వం..
ఆ నేస్తం..
తన స్టేషనులో దిగిపోయింది ..

మాట మాత్రమైనా చెప్పకుండానే..
 

అయ్య ఇప్పుడు యేం చేయాలి..??
తన రాబోయే మజిలీ యేమిటి..??
తన ప్రయాణం ఎన్నడు ముగుస్తుంది..??

ఈ జీవిత కాలంలో నడచిన నడక..

సరైనదేనా..??
అంతర్ముఖుడయ్యాడు అయ్య..


                                   ***

అయ్య ఎప్పుడూ టి వి చూడరు..
అమ్మ నిష్క్రమణ తరువాత ..

అప్పుడప్పుడూ చూసేవారు..
 

ఓ రోజు..
చిత్రలహరి..
 


ఇది తొలి రాత్రి..
రాత్రి కదలని రాత్రి..


నీవు నాకు ..
నేను నీకు..
చెప్పుకున్న కథల రాత్రి ..

ఊర్వశి రావే ..
ప్రేయసి రావే..



ఆ రాగంలోని తడి..
యే గాయాన్ని తడిమిందో..
ఆ గాయం ..
యే బాధను స్రవించిందో..


పాట బావుంది..
అనేసి లేచి వెళ్ళి పోయారు అయ్య..


22 ఫిబ్ర, 2012

సరస్వతీపుత్ర మహాకవి డా.పుట్టపర్తి నారాయణాచార్యులవారి ఆకాశవాణి కడప కేంద్రం ఇంటర్వూ

సరస్వతీపుత్ర..
మహాకవి..
డా.పుట్టపర్తి నారాయణాచార్యులవారిని..
అప్పట్లో ..
ఆకాశవాణి కడప కేంద్రం ఇంటర్వూ చేసింది..

అయ్యగారి ..
అపురూపమైన గొంతు లోంచీ ..
వారి జీవిత విశేషాలను వినడం..
 ఓ అపూర్వ అనుభవం..

ఆ రోజులలో ..
అయ్య గారి ఉపన్యాసాలను..
విలువైన గ్రంధాలనూ..
అభాగ్యులమై చేజార్చుకున్నా..
ఈ చివరి జ్ఞాపకాన్ని మిగుల్చుకో గలిగాం..
మీరూ వినండి..

21 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులూ.. శిష్యులూ



ప్రతి ఇంట్లో ..
ఏవో..
కుటుంబ పరమైన గొడవలు..
ఆర్థిక పరమైన.. వాదనలు..
 


కానీ మా ఇంట్లో ..
అమ్మ ..అయ్యలకు..
పురాణ పరమైన గొడవలు..
అధ్యాత్మిక వాదనలు..
నమ్ముతారా..?
 
మధ్య లో భక్తులు 
అటో తాళం.. ఇటో తాళం..

హిమాలయాలకు పరిగెత్తి పోతే..
దేవుడు దొరుకుతాడా..?
ఇం
ట్లోదేవుడు లేడా..?
సంసారం వదిలేస్తే మోక్షమొస్తుందా..?
ఇవన్నీ సత్యాలే..
కానీ అయ్యప్రేమంతా..
వ్యాసునిపైనా ..
వాల్మీకి పైనా ..
కబీరుపైనా..
కాళిదాసుపైనా..
ఇహలోకంలో ఉన్నా ..
వారి మనసూ ..ఊహలూ ..
వాళ్ళకాలంలోనే విహరిస్తూంటాయి..మరి..
అదేమిటంటే ..
అరికాలి మంట నెత్తి కెక్కుతుంది..
 ఒకసారి..
రఘూత్తముడు అమ్మతో అన్నాడట..
 
"అమ్మా ..
మీది ఈ జన్మ బంధం ..
మాది జన్మ జన్మల బంధం.."
అమ్మ .."అట్లే కానీ లేవయ్యా "
అనేదిట నవ్వుతూ.
అమ్మకు ..
అయ్యకు ..
మధ్య శిష్యులు
పాపం మా అమ్మ..
ఎవరికీ రాని కష్టాలు అనుభవించింది..
అదీ ఈ కాలంలో..
ప్రవచనాలు చేసే వాళ్ళైతే..
ఎన్ని ఆధ్యాత్మిక బోధనలు చేసినా..
ఇంటికీ..
శిష్యులకూ..
తగినంత దూరాన్ని మైన్ టైన్ చేస్తారనుకుంటా..
అయ్యకది తెలియదు..
ఆయనతో పాటూ ..
ఆయన ఏది తింటే వాళ్ళూ ..
అదే తినాలి.. తాగాలి...
ఎన్ని రోజులైనా..
ఆయనకు తెలిసింది..
పుస్తకాలలో చెప్పింది..
ప్రాక్టికల్ గా తీసుకు రావాలనే..!!
అమాయక బాలుడు మా అయ్య.
కర్తవ్యం సినిమాలో అనుకుంటా..
ఒక చిన్న బాబు టీచరును అడుగుతాదు..
మీరు అపధ్ధం చెప్పవద్దని చెబుతారు..
సత్యమే చెప్పాలంటారు..
అదే సత్యం చెబితే..
మా అమ్మా నాన్నా ..
ఏదో తప్పు చేసి నట్లు కొడుతున్నారు ..
సత్యం పలకటం తప్పా టీచర్ ..?
మరి మహాత్మా గాంధీ సత్యమే పలికాడుగా..
అలాంటి స్వచ్చమైన మనసున్న వాడు అయ్య.
 
లేక పోతే శిష్యులను నెత్తిన పెట్టుకుని
ఈడొచ్చిన ఆడపిల్లలున్న ఇంట్లో ..
మా అమ్మ ఎలా చేసిందో..?
 
ఎవరైనా తప్పు చేస్తే ..
అవును నేను తప్పు చేసాను..
అని ఒప్పుకుంటారా..?
బు
కాయిస్తారు..!!
 
కానీ ..
అవును ..నేను తప్పు చేసాను..
మహా మహులే..
తప్పు నుంచీ తప్పుకో లేనప్పుడు..
నేనెలా తప్పుకో గలనూ..?
అని నిర్భీతిగా ..
తప్పుకు కూడా తల యెత్తి నిలిచే..
తత్వమున్నవాడు

ఒకసారి..
రఘూత్తమ రావ్ అమ్మతో అన్నాడు..
"మీది ఈ జన్మ బంధం..
మాది జన్మ జన్మ ల బంధం..
"సరే.. అలాగే కానీ లేవయ్యా.."
అంది అమ్మ నవ్వుతూ..

నియమ బధ్ధ జీవితమామెది..
నాది బైరాగి జీవితం ..
ఆమెకూ.. నాకూ ..పొత్తే కుదిరేది కాదు..
కానీ ..
తన సత్ప్రవర్తన అనే కుర్చీ  నుంచీ దిగకుండానే 
నా యొక్క దౌర్బల్యాలను..
క్షమించే తల్లి గుణం ..ఆమెలో గమనించాను.
 
ఒక సారి ..
విశ్వనాధా ..నేనూ ..
ఒకే సభలో మాట్లాడాలి..
ఆయన చెప్పినదంతా ..
నేను వెంట వెంటనే పూర్వ పక్షం చేస్తున్నాను..
ఆమే మా వాగ్వివాదానికి ముగింపు పలికింది.
అంతటి పాండిత్య ఖని నా భార్య.

1983 లో ఆమె స్వర్గస్థురాలైన తరువాత..
 నా కలం మూగవోయింది. 
జీవచ్చవాన్నయ్యాను..
రుధ్ధ కంఠంతో తన గౌరవాన్ని ప్రకటించేవారు .. 

 

19 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల గాంధీజీ మహా ప్రస్థానం..


ఉన్నప్పుడు ప్రపంచం పలుకరించదు..
పోయినాక ..
ఆ పాద ముద్రలకు గుళ్ళు కడుతుంది..
ఇదే ప్రపంచ రీతి ....
అని నిర్వేదంలో మునిగి పోతారు అయ్య..

నా బాల్యంలో..
గాంధీజీ పెనుగొండ్ వచ్చారు...
షాకత్ అలీ ..
మహమ్మద్ అలీ వచ్చారు..
కొందరు పిల్లలతో నేనా సభకు వెళ్ళాను.పోలీసులు కొందరిపై లాఠీ ఛార్జ్ చేసారు.
భయపడ్డాను.

నా బంధువులొకరు సత్యాగ్రహం చేసి 
ఆస్పత్రిలో చేరారు. 
తర్వాత పొలమిచ్చారు.
గాంధీజీ ప్రసంగాలు హిందూ పత్రికలో చదివి..
ఆవేశ పడే వాళ్ళం.


ఒక సామాన్యునిగా ..
గాంధీజీ మరణాన్ని  జీర్ణం చేసుకోలేని..
మహమ్మద్ అలీ
వివశత ..వేదన ..
 
ఆ వార్త రేడియో లో విని..
అయ్య నేలపై పడి ..పొర్లిపోయి..
 విలపించారట అయ్య..
 
ఆయన జీవించి వున్నప్పుడు ..
పలుకరించక పోయిన లోకంపై..
 ఘౄణాత్మక మైన భావంతో..
"గాంధీజీ మహాప్రస్థానం" వ్రాసాను అన్నారు 
అయ్య

శిలలకు పూజలు చేసిన దేశమిది ..
చెట్లకు చుట్లు చుట్టిన మనుషులము మేము..
వేద పురాణేతిహాసములు..
మా సొత్తని పొంగిపోయాము..
చివరికి చేసినదేమిటి ..??
నీ వంటి మహాత్ముని పొట్టన బెట్టుకొన్నాము.. 

ఇవే కాక వీరేశలింగం పంతులు..
బాల గంగాధర తిలక్
విజయాంధ్రులు
వంటి వచన రచనలు తనదైన  జాతీయ స్ఫూర్తిని సరళ వ్యాఖ్యలతో చేసారు.
 
అయ్య ఏమంటారంటే..
ఈ అనేక భాషా ప్రభావాల వలన ..
రచనలో నేను పడ్డ బాధలు కొన్నున్నాయ్..

వళ్ళత్తోళ్
నేను ఏది వ్రాసినా ..
అంతకంటే బాగుండేది ఏదో..
 మనసులో మెదులుతుంది.
మళయాళంలో..
వళ్ళత్తోళ్ మహాకవి..
గాంధీజీని "ఏండ్రెగురునాధన్ "  అనే ఓ ఖండిక వ్రాసారు. 

అలాంటి ఒకదాన్ని ..
నా జీవితంలో వ్రాయలేక పోయానే..
అనుకుంటూ వుంటాను అని

పొద్దుటూరు చేరిన తరువాత ..
నేను జానపద శైలిలో..
 కాంగ్రెస్ చరిత్ర ఇరవై నోటు బుక్కుల నిండా రాసాను. 
కొన్ని చోట్ల రీడింగ్ ఇచ్చాను. 
షాకత్ అలీ ..
ముఖ్యంగా డయ్యర్ సేనాని దురాగతాలు. 
ఆ బుక్కులు అనంతపురం కాంగ్రెస్ ఆఫీస్ లో వుండేవి. వ్యక్తిగత ద్వేషాలు ఎక్కువగా వుండినందున..
అది బయటికి రాలేదు. 
నేను పట్టాభి గారిని అనుకరించి రాసాను. 

కల్లూరు సుబ్బారావ్ గారు..
 ప్రింట్ చేయిస్తామన్నారు...
1942 తర్వాత కాంగ్రెస్ కలుషితమైంది. 

తరువాత ఆ వ్రాత ప్రతులను చించేసాను. 
నా చేతులారా చించేసినవి..
 కాంగ్రెస్ చరిత్ర..
 అస్త సామ్రాజ్యం..
 హిందు ముస్లిం గలాటా ఇష్టం లేక..
 నేనే చించేసాను.
 
ప్రాజ్యములైన సంపదలు.. 
పర్వులు వెట్టిన చోటు లోక సం
పూజ్యములైన ధర్మ రణముల్ 
చెలరేగిన గడ్డ సాహితీ
రాజ్యములేలుకొన్న కవి రాజులు మెట్టిన భూమి; అస్త సా
మ్రాజ్యము దానికై కనుల రాల్తు నఖంపచ భాష్ప పూరముల్...
కాయము కాయమానమున 
కమ్మని కీర్తి కరాల మాలికా
క్షాయిక రక్తముల్ గడిగి 
చీకటి చిట్లిన తళ్ళి కోటలో
దాయల గెల్చి, భాగ్యముల్ గ్రావగ బూని
 అభాగ్యదష్టుడై పోయిన ,
 రామరాజు మన పూర్యుడు 
కోష్ణములా కథాంశమున్..

ఇలాంటి వ్యక్తీ కరణలున్న కావ్యం ..
అస్త సామ్రాజ్యం..
 జాతీయ ప్రేరణతో చాలా రచనలే చేసాను.
 
సాహిత్య ప్రభ ఆంధ్ర ప్రభ దినపత్రిక 16.12.1977


 

17 ఫిబ్ర, 2012

తన శివ తాండవం గురించి పుట్టపర్తి వారు.

అయ్య శివ తాండవం పై..
వఝ్ఝల రంగాచార్య గారు..
అధ్భుతమైన విశ్లేషణ చేసారు..
ఆయన ..
"పుట్టపర్తి వారి ఖండ కావ్యములు -పరిశీలన"

"శివ తాండవ ప్రత్యేకాధ్యయనము"
అనే సిధ్ధంత గ్రంధములు వ్రాసారు.
ఆయన కరీం నగర్ వాసి ప్రొఫెసర్..
 

"తాత్వికమైన దృష్టితో ఆలోచిస్తే.. 
శివ తాండవం ..
హరి హరా భేదాన్ని ..
అపూర్వమైన రీతిలో ఆవిష్కరించింది.
 

మంత్ర శాస్త్ర పరంగా ఆలోచిస్తే..
శివతాండవం..
నిత్య పారాయణ గ్రంధార్హతను కలిగి..

అధ్భుతమైన ..
ఆధ్యాత్మికానుభూతులు ప్రసాదిస్తుంది.
అందుకు ఈ రచయితే సాక్ష్యం.."
 

అని  తననే సాక్ష్యం గా చెప్పుకున్నారు..




ఇది 
సంగీత.. 
సాహిత్య ..
నాట్య ..
సమ్మేళనం గా..
కొనియాడ బడడమే కాక ..
న్యూరో పొయెట్రీ గా ..
విజ్ఞులు పేర్కొంటారు..

మహా కాల స్వరూపంగా..
మహా శ్వేత స్వరూపంగా ..
వర్ణించడం..
భౌతిక శాస్త్రంలో ప్రతిపాదించబడే..
బ్లాక్ హోల్ ను సంకేతిస్తూ వుంది..



దీనిలోనే మహా స్ఫోటం సంభవించి..
పునః సృష్టి ఏర్పడుతుందని..
భౌతిక తత్వ వేత్తలు అంటున్నారు.
ప్రమత్తునిలా శివుడు నర్తనం చేయటం ..
పరమాణు స్ఫోటముగా ..
ఇలా కావ్యం లో ..
నటరాజు వర్ణనం ..
లయ కాలాన్నీ ..
సృష్టి ఆవిర్భావాన్నీ..
సైతం సూచిస్తొందని డా. వఝ్ఝల రంగాచార్య గారు ప్రతిపాదించారు.


రంగా చార్యులు గారే కాదు ..
ప్రపంచ వ్యాప్తంగా ..
ఎందరో శివ తాండవం పై ..
పరిశోధన చేస్తున్నారు ..
చేస్తారు భవిష్యత్తులో కూడా..

ఎందుకంటే..
ఎందుకంటే..
ఎందుకంటే..
 

ఆయన తన ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు కూడా
నారాయణ మంత్రాన్ని జపించడం..
ఆయన  ఉచ్చ్వాస నిశ్శ్వాసాలలో  కూడా ..

నారాయణ మంత్రమే నిండి వుంది...
ఆయన జీవితం నిండా వున్నవి రెండే ..
ఒకటి సాధన..

 రెండు శోధన .. 


ఆజన్మాంతము ..
కటిక దారిద్ర్యమైనా ..
అనుభవించగలను..
కానీ ..
క్షణమైనను..
నాస్తికత్వమును భరించలేనన్నారు.




తనను క్షణమైనా విడువ లేని..
తన వాణి కోసం ..
ఆ పరమ శివుడు..
సృష్టి రహస్యాలు తేట తెల్ల మయ్యేటట్లు..
ఖచ్చితంగా నర్తిస్తాడు..
శివతాండవంలో..
కానీ ..

నారాయణమూర్తి ఆత్మ లో ఆత్మ గా ..
జీవించిన అయ్య పట్ల..
 ఆ లక్ష్మీ మాత ఎందుకు శీత కన్ను వేసిందో..??
ఎన్నడూ వీడని ప్రశ్న..
బహుశా లక్ష్మీ విష్ణువుల కలహంలో..
పంతానికి పోయిన ఆ లోక జనని ..
అయ్యను పట్టించు కోలేదని అనుకోవాలేమో..!!


అందుకు తగ్గట్టుగానే అయ్య..
లౌకిక విషయాలకు..
అంత ప్రాధాన్యతనిచ్చేవారు కాదు.!!
అది ధనము కానీయండీ..

 మరేదైనా కానీయండి..!!
ఆయనకు చివరి దశలో డబ్బు విలువ తెలిసింది..
నాకొక రెండు వేలొస్తే బాగుండును ..
ఏదైనా ఆశ్రమంలో పోయి వుంటాను అని బాధపడ్డారు..




ప్రొద్దుటూరులో ..
అగస్తీశ్వర స్వామికి ..
ఎక్కువగా ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడిని. 

నాకు సాహిత్యం పిచ్చితో పాటూ ..
ఈ భక్తి పిచ్చి కూడా ఎక్కువగా వుంది ..
నన్ను ఎరిగిన నా స్నేహితులందరికీ కూడా తెలిసి విషయమే ఇది. 

ప్రొడ్దుటూరులో ..
అగస్తీశ్వర స్వామికి ప్రదక్షిణలు
చేస్తూ ..చేస్తూ ..
ఎందుకు పుట్టిందో ..
ఒకానొక రోజు ..
ఆ ప్రేరణ..
ఆ ప్రేరణతో ..
నలభై అయిదు రోజుల్లోనే ఈ శివతాండవం ముగించడం జరిగింది. 

తరువాత ఈ కావ్యం ఇంత చిన్నగా ఉందే..
దీన్ని స్వరూపం కాస్త పెద్దగా చేద్దాం..
దీనికి కాయ పుష్టి నిద్దాం ..
అని మళ్ళీ ఎంతగానో ప్రయత్నించాను..

కానీ మళ్ళీ ఆ ప్రేరణ నాకు రాలేదు.
అందువల్ల ఉన్నంతే చాల్లే అనుకున్నాను..!!
ఒక్కొక్క దానికి ..
బ్రహ్మాండమైన అదృష్టంపడుతుందేమో ..
నని నా ఊహ ..!!

భారత దేశమంతా ..
నేను సంపాదించుకున్నటువంటి కీర్తికి ..
ప్రధాన మూల స్థంభం..
శివతాండవమేమోననిపిస్తుంది..!

కాళిదాసు జీవితమే తీసుకుందాం..
నాటకాలు రాశాడు ..
కావ్యాలు రాసాడు..
పాపం ..
అయినా ఆ మేఘదూతకు వచ్చినటువంటి ప్రశస్తి..
ఇంకే కావ్యానికీ రాలేదు. 

రఘు వంశం ..
కుమార సంభవం ..
మంచివే అంటాము..
కానీ మేఘదూత మాత్రం ..
అతని అసాధారణమైనటువంటి రచన ..
అని అనుకుంటూ ఉంటాం.
అందుకే మల్లి నాధుడే చెప్పినాడు..
మాఘే మేఘే గతం భూయః 
మాఘ కావ్యం తోనూ.. మేఘ సందేశం తోనూ..
నా జీవితం గడిచిపోయిందీ ..అని ..
ఆ మేఘ సందేశం అంతా ..
ఇన్నూటా యాభై శ్లోకాలే.. ఉండేది. 
ఆ ఇన్నూటా యాభై శ్లోకాలతోనే..
కాళిదాసు మహాకవి అయిపోయాడు..

శివకవులు రగడ చందస్సులో ఎక్కువగా వ్రాసారు.. శివతాండవం లో ..
ఆ చందస్సునే ఎక్కువగా వాడటం జరిగింది.
చాలా మంది..
ఏదో ఊరికే ఏదో మాట్లాడుతూ వుంటారు..
మాత్రా చందస్సులు.. రగడలూ.. వ్రాయడం..
ఉత్పల మాల.. చంపక మాల..
వ్రాసే దానికి చేసే పరిశ్రమ కంటే ..
తక్కువేమీ కాదు.
 
పైగా ..
ఆ పద్యాలు వ్రాసేవానికి..
ఒక అనుకూలం కూడా వుంది.
మాత్రాచందస్సును వ్రాసే టప్పుడు..
వాడి మార్గాన్ని వాడే మలుచుకోవలసి వుంటుంది.
ఇదొక కష్ట మైనటువంటి పని కూడా..
 
ఆ చందస్సులు రాసే టటువంటి వాడు..
ఎంత సమర్థుడుగా వుండవలెనో ..
అంతకంటే సమర్థుడుగా వున్నవాడే..
మాత్రా చందస్సును సమర్థంగా..
పుష్టికరంగా వ్రాయగలడు ..
అని చెప్పేందుకే ఈ మాత్రాచందస్సులో..
నేను రచనలు చేసినానేమో అనిపిస్తుంది.

తెలుగు అస్సలు తెలియని ఇతర రాష్ట్రాలలో పర్యటించినప్పుడు..
అక్కడి సాహితీ మిత్రులు ..
శివతాండవం చదవమనేవారు.
భాష మీకు అర్థం కాదు కదా ..
అంటే భాష అవసరం లేదు ..
మీ గళం..
ఆ లయానుబధ్ధమైన శైలీ..
మా కేదో దివ్యానుభూతిని కలిగిస్తుంది అనేవారు

14 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు అయ్యగా

అయ్య సాహిత్య జీవితాన్ని..
ఆధ్యాత్మిక జీవితాన్ని ..
ఇప్పటికి ఎన్నో పోస్ట్ లల్లో చెబుతున్నాను.
ఇప్పుడు ఒక కూతురుగా..

 అయ్యతో నా అనుబంధాన్నీ ప్రేమనూ చెప్తాను.
అవి నా జీవితంలోనే మధురానుభూతులు..
అంత గొప్ప అయ్యకు..
చిట్ట చివరి కూతురుగా పుట్టడం..
ఒక విధంగా అదృష్టమూ..
మరో విధంగా దురదృష్టమూ..
నేను చూసిన అయ్య ..
పూర్తిగా ఒక మహా పండితుడుగా..
సాహిత్య వేత్త గా..
సంగీత నిధి గా..
పరిపూర్ణత్వాన్ని పొందిన వ్యక్తి..
 
కానీ ..
ఒక విధంగా ..
అక్కయ్యలు అదృష్ట వంతులు..
వారు అయ్య క్రమ క్రమాభివృధ్ధినీ 

అయ్య సంఘర్షణనూ చూసిన వాళ్ళు..
అయ్య వేసిన ప్రతి అడుగు వెనక..
కష్ట సుఖాలను అనుభవించిన వాళ్ళు..
అయ్య హిమాలయాలకు పోయిన రోజులలో ..
అమ్మ ముగ్గురు పిల్లలను పెట్టుకుని ..
ఈ కఠిన జగత్తులో ఎలా ఈదిందీ..
తిరుచానూరులో ఉన్నప్పుడు..

అయ్య రాక కోసం డబ్బు కోసం ..
ఎలా ఎదురు చూసిందీ..
నా కంటే ఎక్కువ ..
వారి కన్నీరు చారికలు చెబుతాయి ..
ఆ ఎడబాటు లోని వేదనను..
ఒక అదృష్టమేమంటే..
అయ్య నారాయణ మంత్రాన్ని..
ఇప్పుడు అమ్మ
 ఎంత గట్టిగా పట్టుకున్నారో ..
ఇంట్లో అమ్మ రామాయణాన్నీ..
 రామయ్యనూ ..
అంత గట్టి గానూ తన పట్టులో బిగించింది..

అయ్యకు ఢిల్లీ లో పసిరికలు ..
జాబు లేదు జవాబు లేదు..

తన సంగీతమూ..
 తన సాహిత్యమూ..
 తన సాధనా ..
అయిన తరువాత ..
ఎప్పుడైనా గుర్తుకు వస్తే..
అప్పట్లో అమ్మ
భార్యా పిల్లలు అయ్యకు గుర్తుకు వస్తారు..
 
పంపితే డబ్బు పంపుతారు..
లేక పోతే లేదు..
అమ్మ ఆ రోజులలో..
 సంవత్సరాలు ..
సంవత్సరాలు ..
బొరుగులు తిని..
మంచినీళ్ళు తాగి బ్రతికిందట..
అన్నం గిన్నం పిల్లలకు పెట్టి..
ఒక రోజు..

ఈన యెప్పుడు వస్తారో ..
లేక డబ్బులు ఎప్పుడు పంపుతారో..
అని దిగులుగా ఆలోచిస్తూ వుందట..

అయ్యకు ఢిల్లీ లో పసిరికలు ..
జాబు లేదు ..
జవాబు లేదు..
తన సంగీతమూ..
 తన సాహిత్యమూ..
 తన సాధనా ..
అయిన తరువాత..
 ఎప్పుడైనా గుర్తుకు వస్తే..
భార్యా పిల్లలు అయ్యకు గుర్తుకు వస్తారు..
పంపితే ..డబ్బు పంపుతారు..
లేక పోతే లేదు..
 
ఒక రోజు తెల్ల వారు ఝాము ..
నాలుగూ నాలుగున్నర..
అమ్మ ముంగిటిలో కళ్ళాపి చల్లుతూ..
 దిగులుగా ఆలోచిస్తూ ఉంది.
ఈనకు పసిరికలు ..ఎలా ఉన్నారో ..?
అని.
ఇంతలో..
తెల్లని జుబ్బా ..
తెల్లని పొడవాటి గడ్డం..
ఒకాయన చీకట్లోంచీ నడచి వచ్చాడు..
అమ్మ దగ్గర ఆగాడు.
 
ఎందుకమ్మ దిగులు పడతావ్ ..?
ఆయన అక్కడ..
బాగానే ఉన్నాడు..
వస్తాడులే.. బాధ పడకు ..
అని చెప్పి
మళ్ళీ చీకటిలో కలిసి పోయాడు..
 
కాసేపటికి అమ్మ ఉలిక్కి పడింది.
ఎవరతను..
ఇంత తెల్ల వారి వేళ
నేను చెప్ప కుండానే
నా మనసు లోని విషయాన్ని గ్రహించి
స్వాంతన చెప్పి వెళ్ళి పోయాడు..
అసలు ఎవరబ్బా ..ఆయన..?
అని ..
అక్కడే ఉన్న ..
మా మూడవ అక్కయ్యను చూసి రమ్మని తరిమింది..
 
అప్పటికి అక్కయ్య ఏడేళ్ళ పిల్ల..
వెంటనే పరిగెత్తిన అక్కయ్యకు ..
ఆంత దూరం వెళ్ళినా..
ఆ తెల్ల బట్టలు..
తెల్లని గడ్డమూ 
ఆ అపురూపవ్యక్తి కనిపించలేదు..
ఇలాంటివి ఎన్నో..
మనం భగవన్నామం చేయాలంతే..
ఆయన మన వెంటే ఉంటాడు..
అంటుంది అమ్మ.

రాధమ్మ
నేను మా నాగక్కయ్యా ల టయానికి ..
ఇల్లు కొంత స్థిర పడింది..
అయ్య మానసికంగా జీవితంలోనూ కాస్త స్థిర పడ్డారు..
మా అమ్మ ముఖం లో నవ్వులొచ్చాయ్..
 
కానీ..
మనకా కష్టాల్లేవ్..
నేను అయ్య ముద్దుల కూతుర్ని..
నా ప్రతి మాటా ముద్దే..

ప్రతి చేష్టా ముద్దే..

కృష్ణుని రాధమ్మ పేరు నా కొచ్చింది.
అయ్య నా కోసం ఒక కీర్తన కూడా వ్రాసారు..
 ఏమమ్మ రాధా..
ఎన్నడు కరుణింతువమ్మ..
ఈ మాయా బంధమ్ముల
నెన్నడు వదిలింతువమ్మ..
నా ముందు తాళం వేస్తూ అయ్య ప్రేమగా పాడేవారది..